12, ఫిబ్రవరి 2024, సోమవారం

బాల్టిస్తాన్

 #బాల్టిస్తాన్ - మన దేశంలో ఉన్న ఈ ప్రాంతం పేరు ఎప్పుడైనా విన్నామా అసలు? ఇప్పుడు మన ప్రధాని మోదీగారి వల్ల ఈ ప్రాంతం మన స్వంతం కాబోతుంది.. దీనికి ప్రతి భారతీయుడు మద్దతు తెలపాలి... కొంచెం వివరంగా చెబుతారా!?

అలాగే... చదవండి మరి...


పాక్ ఆక్రమించిన లక్ష చదరపు కి.మీ. కాశ్మీర్ ఏమైంది?

(1.07 లక్షల చ.కి.మీ. = 2 కోట్ల 65 లక్షల ఎకరాలు) 


POK విస్తీర్ణం 13 వేల చ.కి.మీ. మాత్రమే. మిగతాది ఏమైంది!? తెలుసుకుందాం...


జమ్మూ కాశ్మీర్ మొత్తం విస్తీర్ణం:  2.22 లక్షల చ.కి.మీ.


భారత్ చేతిలో మిగిలింది: కేవలం 1.01 లక్షల చ.కి.మీ.


పాక్ ఆక్రమించింది:   1.07 లక్షల చ.కి.మీ.

చైనా ఆక్రమించింది: 0.33 లక్షల చ.కి.మీ.

(అత్త సొమ్ము అల్లుడు దానం లాగా, పాక్ చైనాకు గిఫ్ట్ గా ఇచ్చిన 14 వేల చ.కి.మీ. కలిపి)


* * * * * * * * * * * 


నిన్న "గిల్గిత్ బాల్టిస్తాన్" ను ఖాళీ చేయమని మోడీ పాకిస్తాన్ కు నోటీస్ ఇచ్చే వరకు మనలో చాలా మందికి అది మన (భారత) భూభాగం అనే తెలియదు.


మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సగం చానళ్లకు "బాల్టిస్తాన్", "బెలూచిస్తాన్" వేరు వేరు అని కూడా తెలీదు.


వార్త తెలిసిన వారికి కూడా దాని ప్రాముఖ్యత తెలియదు.


* * * * * * * * * * * 


పాకిస్తాన్ 1948 లో జమ్మూ కాశ్మీర్ పై దాడికి దిగి జమ్మూ కాశ్మీర్ లో సగం ఆక్రమించింది.


భారత పాలకుల లాగా బుద్ధి హీనులు కాదు కదా...


పాకిస్తాన్ వెంటనే ఆ ఆక్రమించిన భూమి లో 


 - 10% ని "ఆజాద్ కాశ్మీర్" గా ప్రకటించింది.


 - మరో 10% భూమిని చైనా కు 

బహుమతి ఇచ్చింది


 - 80% భూమిని "నార్తర్న్ ప్రావిన్స్" గా పేరు మార్చి పాకిస్తాన్ లో కలుపుకుంది. ఇదే "గిల్గిత్ & బాల్టిస్తాన్".


ఇందులో తెలివి చూడండి. 


ఎప్పుడైనా భారత్ ఈ భూమి గురించి అడిగితే చైనాకు కూడా వాటా ఇచ్చింది కనుక అది త్రైపాక్షిక వివాదం అవుతుంది.

చైనా పేరు రాగానే భారత్ భయ పడుతుంది.


అవసరం ఉన్నా లేక పోయినా "కాశ్మీర్" "కాశ్మీర్" అని లొల్లి చేస్తూ..., 


వివాదం కేవలం "కాశ్మీర్" పైనే ఉన్నట్టు.. 

"జమ్మూ భారత్ ది, ఆక్సాయ్ చిన్ చైనాది, గిల్గిత్ & బాల్టిస్తాన్ పాకిస్తాన్ ది".. 

వీటి పై వివాదం లేనట్టు..


సీన్ సెట్ చేసి పెట్టింది.


భారత రాజకీయ నాయకత్వానికి వివరాలు తెలుసుకునే ఓపిక ఎక్కడిది? 


ప్రతి ఏడూ ఎలక్షన్ ల మీదే దృష్టి.


1962 చైనా యుద్ధం లో చైనా 0.33 లక్షల చ.కి.మీ భూమిని ఆక్రమించు కుంది. (పాక్ బహుమతి గా ఇచ్చిన 0.14 లక్షల చ.కి.మీ తో కలిపి)


"చైనా తో ఏం కయ్యం పెట్టుకుంటాం లే. మనకు అంత సీన్ లేదు" అన్నట్టు భారత ప్రభుత్వాలూ వదిలేశాయి.


* * * * * * * * * * * 


ఈ ప్రాంతం ప్రాముఖ్యత ఏమిటంటే...


 - 5 దేశాలను కలిపే "వూఖాన్ కారిడార్".. 

(ఆసియా దేశాల మధ్య ఎప్పటికైనా రాబోయే రోడ్ / రైల్ / ఆయిల్ / గ్యాస్ కనిక్టివిటీ ఈ కారిడార్ లేకుండా సాధ్య పడదు). 


ఇది ఎవరి చేతిలో ఉంటే వారిని కాదని ముందుకు పోవటం ఇతరుల వల్ల కాదు. 


 - "భారత్ - ఆఫ్ఘాన్ రోడ్డు మార్గం".., 


 - చైనా నిర్మించ తలపెట్టిన CPEC 


ఈ ప్రాంతం లోకే వస్తాయి.


* * * * * * * * * * * 


కట్ చేస్తే, వాజ్ పేయీ ప్రభుత్వ హయాంలో భారత్ ఈ ప్రాంతం లో ఎలాంటి ప్రాజెక్ట్ లకూ లోన్లు ఇవ్వటానికి లేదని ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కు నోటీస్ ఇచ్చింది. అప్పటి లోన్ లు కొన్ని ఆపి ఆ ప్రాంతాన్ని తిరిగి వివాదాస్పదం చేయ గలిగింది.


ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం పాకిస్తాన్ కు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయమని నోటీస్ ఇవ్వటం వెనుకా వ్యూహాత్మక ప్రయోజనాలు చాలా ఉన్నాయి.


  - *కీలక నదులపై ఆధిపత్యం..* 


 - CPEC ను పూర్తిగా ఆప లేక పోయినా, దానిపై ఏదో ఒక విధమైన జాప్యం, వివాదం మొదలు పెట్టటం..


 - అదృష్టం బాగుంటే ఆ ప్రాంతాన్ని మళ్లీ మన ఆధీనం లోకి తీసుకోవటం..


 - అక్కడి ఖనిజ సంపద పై ఆధిపత్యం..


 - రానున్న రోడ్ / రైల్ / ఆయిల్ / గ్యాస్ కనెక్టివిటీ పై ఆధిపత్యం


అందులో కొన్ని.


* * * * * * * * * * * 


మన భారత ప్రజలకు మన ఆస్తిపై కాస్తైనా అవగాహన కల్పించటం మన కర్తవ్యం.


మోడీ ఏం చేస్తున్నాడు అనేవాళ్ళ కోసం...

అభివృద్ధి, ఆద్యాత్మికం, సాంస్కృతిక సాంప్రదాయలతో పాటు ధర్మం కోసం, దేశం కోసం పని చేస్తున్నాడు.

ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, ఉచితాల కోసం కాకుండా దేశ సరిహద్దుల రక్షణ కోసం పాటుపడుతున్నాడు.

దేశం సురక్షితంగా ఉంటేనే నీ సంపాదన, నీ బంగ్లా, నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. లేకుంటే ఎవడో పరాయి వాడి పాలవుతుంది.

అన్న వస్త్రాలు కు ఆశపడితే  

ఉన్న వస్త్రాలు పోయినట్టు.


సేకరణ 

జైశ్రీరామ్.

కామెంట్‌లు లేవు: