12, అక్టోబర్ 2022, బుధవారం

పరిపూర్ణలు

 పరిపూర్ణలు కాంచీ పరమాచార్య స్వామి ప్రముఖ వార్తా సంస్థలో పనిచేస్తున్న రఘురామన్ ఒకరోజు తనతో పశ్చిమ జర్మనీకి చెందిన ఇంధాలజీన్టునోకొడిని మహాస్వామి వారి వద్దకు దర్శనార్ధమై తనతో తోడోక్కని వచ్చారు... ఆ వచ్చిన ఇందాలజిస్ట్ కి భారతీయ అందాలు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలపై అమితమైన వ్యామోహం, స్వయంగా మంచి సంస్కృత పండితులు. శంకరుల అద్వైత సిద్ధాంతాన్ని అధ్యయనం చేశారు. శంకరులవారు చెప్పిన అపరోక్షానుభూతి పొందిన జీవన్ముక్తులను దర్శించాలనే ఉత్సుకతతో భారతదేశ పర్యటన ఆరంభించాడు. అతనికి కంచి మహాస్వామి అటువంటి మహాపురుషులని ఎవరో చెప్పారు.

స్వామివారాళోజెంతో ఉల్లాసంగా ఉన్నారు. అతడిగురించిన విషయాలన్నీ అడిగి తెలుసుకొన్నారు. పశ్చిమ జర్మనీ అభివృద్ధిగురించి గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. అతడి స్వంత విషయాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ దేశంలో అతడు మంచి స్థితిపరుడు. సుఖమయమైన జీవితాన్ని గడుపుతున్నారు. పేరు వసంతరాయ్ మార్చుకున్నారు. వారి ఇద్దరి కూతుర్లకు |అనిందిత పార్వతి అనే పేరుంచాడు.

అతడు స్వామివారిని ఆత్మతత్వంపై తన సాధనపై అనేక

ప్రశ్నలు చేశాడు. స్వామివారు ఒకప్పుడు చిరునప్పుతో, కొన్ని సార్లు ఒకటిరెండు మాటలతో సమాధానం చెబుతున్నారు. అతడు ఆ సమాధానాలకు మహదానందమగ్నుడవుతున్నాడు. తరువాత అందరితో చెప్పుకొన్నాడు. ఆరోజు అతడి చిరకాల వాంఛ ఈదేరిన శుభదినమనీ, కలలు పండిన రోజు అని.

వేయవలసిన ప్రశ్నలు అయిపోయాయేమో చాలాసేపు కనులు మూసుకొని మౌనంగా ఉండిపోయాడు. స్వామివారూ మౌన ముద్రాంకితులై ఉన్నారు. హఠాత్తుగా అతడు స్వామివారి ముందు సాష్టాంగంగా నమస్కరిస్తూ తాను స్వామి సన్నిధిలో కంచిలోనే స్థిరపడిపోతానని మారాము చేయసాగాడు.స్వామివారు మనోహరమైన చిఱుమందహాసం చేశారు. "ఆ దేశంలో ఎంతో సుఖమయమైన జీవితాన్ని కొనసాగిస్తున్నావు. బాగా ఉన్నదికదా జీవితం, అదంతా వదిలి ఏ వసతులూ లేని ఈ చిన్నపట్టణంలో ఎందుకు స్థిరవడదామను కొంటున్నారని ప్రశ్నించారు. అతడి సమాధానం ఈ రోజుకీ నా రెప్పలలో గింగురుమంటోంది. ఇప్పటికీ అతని హృదయం నుండి పొంగివచ్చిన మాటలు తలచుకొన్నప్పుడు నా శరీరం |

పులకాంకితమవుతూ ఉంటుంది. అతడెంతో ఆర్తితో అన్నాడు. "మరి అక్కడ తమవంటి పరిపూర్ణులైన మహాస్వామి లేరుకదా!!!

వారు పరిపూర్ణులనే విషయం పశ్చిమ జర్మనీవారు చెబితేకానీ మీకు అర్థంకాలేదా? అని ప్రశ్నించవచ్చు. శ్రీనీలంరాజు మురళీధర్ ఒక సంఘటన తెలిపారు. మద్రాస్ విశ్వవిద్యాలయం లో ఆచార్యులుగా ఉన్న రాఘవన్ గారు అనేకమంది విదేశీయుల తోపాటు శ్రీవారిని దర్శించేరు. ఆ విదేశీయుల సంభాషణలన్నీ చేర్చి ఒక గ్రంథంలో వ్రాశారు. స్వామివారిని ఆ గ్రంధాన్ని ఆవిష్కరించమన్నారట. స్వామివారు "ఏదో హిందూ ధర్మంపై  మిడిమిడి జ్ఞానం ఉన్న విదేశీయులతో, నా సంభాషణలన్నీ వ్రాసి నన్ను ఆవిష్కరించమంటున్నావే! ఇక్కడి మహాపండితులతో చేసిన శాస్త్రార్థాలుకదా పుస్తకంగా రావలసింది" అన్నారట. నిజమే! మన మనస్తత్వాలకు తెల్లవారిని చూస్తే ఆకర్షణ. అయితే ఆ స్వామివారి పరిపూర్ణత్వాన్ని అనుభవించినట్లున్న అతని కంఠధ్వని మమ్ములను కదిలించివేసింది.

అతఃపూర్వమే స్వామివారి పరిపూర్ణత్వం గురించిన పరోక్షం జ్ఞానము మాకున్నది. మహామహులు చందోలు శాస్త్రులుగారు, అవధానిస్వామి, కుప్పాలక్ష్మణావుదానులు వారనుభవించి మాకు చెప్పారు. ఏ కారణం చేతనో నేస్పష్టంగా చెప్పలేదుకానీ మహాస్వామి వారిపై మాకు వల్లమాలిన ఆకర్షణ వారులేని జీవితాల ను ఊహించలేము. వారేమైనా మాతో ఎల్లప్పుడూ మాట్లాడే వాడా? లేదే! వారి మనోసారమైన మందస్కిృతముఖారవిందము, కరుణాన్ని చిలకరించే చూపులు మా మనసుల్ని పట్టిలాగి వేసేవి

ఎ.రూంలు, పట్టుపరుపులు వదలి కాంచీపురం, ఉక్క పోతలో దోమల కాటుతో స్వామివారు తలుపులు మూసు కొని పడుకున్న మేనా ప్రక్కన కటికనేలపై పడుకొనేలా చేసేది. ఎందుకీ పడికాపులు? తెల్లవారుఝామున స్వామి సలకరింతగా ఒక చిరునవ్వు నవ్వుతారే, వెన్నెలలు విరిసినట్లు, మల్లెలు విచ్చినట్లు, అదిగో చిరునవ్వు కోసం చిరునవ్వే అక్కరలేదు. వారి శరీరంలో వచ్చిన చిఱుకదలిక మమ్ములను ఆనందాంబుధిలో ముంచివేసేది. ఎందుకీ ఆకర్షణ. స్వామివారు నిరంతరము 'ఆత్మతత్త్వంలో ఆనందస్థితిలో ఉండటం చేతనేమో! గోపి కలంటారు. "నీ మృదుగీతరవంబు వీనులన్ వెక్కసమైన వచ్చి తిమి వేగమె మోహమునొంది నాథ నీవెక్కడ పోయితో ఎఱుగమాక్రియ నిర్దయుడిందు కల్గునే"ఆ పరిపూర్ణమూర్తి 8-1-94న సిద్ధి పొందారు. మేము యధాప్రకారం జీవితాన్ని కొనసాగిస్తున్నాము. మహానుభావుడు పోతనగారు తన ప్రాణంలో ప్రాణం హృషీకేశుడు వెళ్ళిపోయినా అర్జునుడు జీవించి ఉన్న సందర్భంలో అర్జునినితో చెప్పిస్తారు. "పటుతర దేహలోభమున ప్రాణములున్నవి కూడబోక - దేహ జీవిస్తున్నాము. స్వామివారున్నప్పటికంటే ఇప్పుడే ఎక్కువ భౌతిక సుఖాలనుభవిస్తున్నామేమో? కనీసం కాంచీపురం లో పడుకోనక్కరలేదు కదా! అయితే వారి సన్నిధికి కూర్చున్న ప్పటి శాంతి, తృప్తి మాకెక్కడ లభిస్తుంది. ఏదో తెలియని వెలితి, శూన్యత్వం- అయినా నాకింకా ఎక్కడో మినుకు మినుకుమంటున్న ఆశ

"మక్కువ శాంతి సేయుటకు, మన్నన చేసి ప్రసన్నుడౌటకున్ జక్కన నా విభుండు గుణశాలి తిరోహితుడయ్యె" అంటారు నుండి మాయమయిన కృష్ణుని గురించి పోతనగారు. గోపికలు గోపికాగీతలు పాడగానే శ్రీహరి మనోజ్ఞాకారియై ఆకాంతా సమీపంలో పొడచూపాడు. | మహాస్వామి! ఏ గీతాలు పొడితే మళ్ళీ మాకు దర్శనమిచ్చి ఆ తృప్తిని శాంతిని కలగ చేస్తారు?అసలేమిటి ఈ స్వామి గొప్పదనం, శూన్యం నుండి పోదాలు సృజించి ఈయగలరా? ప్రకృతిని అద పెట్టగలరా? జరగబోయే విషయాలు కన్నులకు సరిగ వివరించగలరా? రోగుల రోగాలను చేతితో | తొలగించగలరా? మహదైశ్వర్యమును ప్రసాదించ స్వామివారు ఇవన్నీ చేయగలరని చెప్పేవారు లక్షలు ఉన్నారు. యోగులు ఆయనను యోగీశ్వరశరధున్నార ధార్మికులు ఆయనను మూర్తీభవించిన ధర్శమన్నారు. మంత్రవాదులు సర్వతంత్ర స్వతంత్రుడన్నారు. నైతికుతూ ఆయనను నైతిక సార్వభౌముడన్నారు. వేదాంతుల జీవన్ముక్తుదన్నారు.

లక్షలాది సామాన్య ప్రజ ఆయనను నడిచేదేముడున్నాడు. శ్రీ శివానందమూర్తిగారు "శ్రీకృష్ణుని తరువాత హైం సంస్కృతిని సమగ్రంగా అర్ధం చేసుకొని ఆచరణలో బోధించిన అతికొద్దిమంది మహా పురుషులలో కంతి : స్వామి వారొకరు" అంటారు. బంగాళా నాధువాపేరు | స్వామివారు త్రికాలములు ఎఱిగిన సర్వజ్ఞులంటున్నారు.ఈ విషయం శ్రీ త్యాగరాజన్ చెప్పారు. స్వామివారపుకు వేంకటాద్రి అగ్రహారంలో ఉన్నారట. మాధ్యాహ్నిక పూజ ముగించి అక్కడికి ఒక మైలు దూరంలో వున్న "సామియాన్ మేడు" గ్రామంలో ఉన్న తమ పూర్వ గురువుల అధిష్టానం వద్దకు భాషశాంతికై వెళ్లారు. స్వామివారు భాష్యం చూడటం మొదలుపెడితే అది గంటలతరబడి కొనసాగవచ్చు- పరి రకులంతా విశ్రాంతిగా పనులు ముగించుకొని నడుంవాలు స్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటలయింది. బంగాళా సాధువొకరు వచ్చి ఎంతో అధికారికంగా స్వామివారెక్కడ అని ప్రశ్నించారు. పరిచారకులు (త్యాగరాజన్) స్వామివారు ప్రక్కగ్రామానికి వెళ్ళారు. రావడానికి ఎంతసేపవుతుందో చెప్పడానికి వీలుకాదని మరుసటిరోజు ఉదయం దర్శనానికి. రమ్మన్నారు. సాధువు కోపంగా "నన్ను ఈ సమయానికి రమ్మని పిలిచి తీరా వస్తే పీఠంలో లేకపోవడం న్యాయమా" అని రంకెలు వేశాడు. త్యాగరాజన్కు ఆశ్చర్యం వేసింది. కోసం కూడా వచ్చింది. "ఎవరయ్యా నువ్వు ఎవరు నిన్ను ఆహ్వానం చారు. నువ్వేమైనా లార్డ్ సావ్వా? కాషాయం ధరించావు | గడ్డం వేరే పెంచుకొన్నావు. సాధువులకు ఇంత కోపమా???అష్టముంటే వేచివుండు. లేకపోతే పో! నీప్రతాపం నాపైన మయా! సర్వజ్ఞులాయన. అది అనుభవించవలసిన విషయం, తెలుసుకోవడానికి ప్రయత్నించు" అన్నాడట.


చూపవద్దు" అని తెగేసి చెప్పాడు, "నీతో నాకేమి పని? బంగాళా సాధువు మీరు చెప్పిన సమయానికి వచ్చి, మీరు లేనందున తిరిగి వెళ్ళిపోయాడ'ని వారి స్వామివారితో చెప్పు- అంటూ గట్టున వెనుతిరిగి చెఱుకు తోటలకు అడ్డంపడి వడివడిగా నడుస్తున్నాడు. త్యాగరాజస్క పోకడ అర్ధం కాలేదు. ఇంతలో పారావాదు పరుగెత్తుకొని వచ్చాడు. స్వామివారు చెఱుకుతోటలకు అడ్డుగా వడివడిగా వస్తున్నారని తెలియజేశారు. పరిచారకులు ఆశ్చర్యంగా స్వామి వారికి ఎదురు వెళ్ళారు. సాధువు స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు.


స్వామివారు చెఱుకుతోట గట్టుపై కూర్చొని అతనితో గంటకుపైగా మాట్లాడారు. అతడు ఆనంద భాష్పాలతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. స్వామివారు అతనిని సంపూర్ణంగా అనుగ్రహించి త్యాగరాజను పిలిచి "వీరిని జాగ్రత్తగా రైలు ఎక్కించిరా! ఈతడాహారం ఏమీ తీసుకోడు. దారిలో మంచి టీ ఇప్పించు. చేతిలో డబ్బు ఉంచుకొన్నావా?" అన్నారు.

దారిలో అంతా ఆనందాంబుధిలో ఓలలాడుతున్న సాధువు స్వామి వారి గుణానుకీర్తనలు చేశాడట. "స్వామివారి సమీప వర్తుడవై ఉన్నావే- వారిగురించి నీకేమి తెలుసు. సాధువులను గెంటడం మాత్రం తెలుసు. నాకు సమయం ఇచ్చారని చెబుతున్న సాయంత్రం వరకూ తిరిగి రారంటివే? ఆయన సత్యవాక్పరిపాలనలో రాముడంతటివాడు. స్వామివారి సేవ చేస్తున్నావు. అంచేత నీపై నాకు ప్రియం ఏర్పడింది. నీకో రహస్యం చెబుతున్నాను. ఈ స్వామి నడుస్తున్న పరబ్రహ్మ

తరువాత స్వామివారు ఆ సాధువు గురించి చెప్పారు. స్వామి) ఉత్తరదేశయాత్రలో ఈ సాధువు కలిశాడట. మంచి యోగి సాధకుడు, చాలాకాలం స్వామివారితో నడిచాడు. విడిపోనూ పునర్దర్శనంకై ప్రార్ధించాడు. స్వామివారు సరిగా 15సంగ తరువాత ఇదే సమయానికి పీఠం ఎక్కడుంటే అక్కడకు రమ్మన్నారట. తిధులు లెక్కపెట్టుకొని సరిగా ఆ సమయానికి: మఠానికి వచ్చాడు సాధువు. ఆ సాధువు వచ్చింది పెద్ద విశేషం కాదు. వారికి శ్రీవారి దర్శనమే పరమావధి కాబట్టి క్షణం క్షణం! అదే స్మరణతో సమయం లెక్కించుకొని వచ్చాడు. అయితే ఈ భక్తవత్సలుడు సమయానికి తన భక్తునికై ఎలా పరుగెత్తుకొచ్చారో. చూడండి.

ఈ విధంగా స్వామివారి పరిపూర్ణత్వం గురించి, సర్వజ్ఞత్వం గురించి అనేకసార్లు విని ఉన్నాము. దానిని అనుభవంలోనికి తెచ్చుకోమంటున్నాడే ఈ సాధువు, అదెలా సాధ్యం. ఇప్పుడు ఆలోచిస్తుంటే వారి సన్నిధిలో మేమనుభవించిన ఒకానొక శాంతి, ఆనందం, ఒకానొక పూర్ణత్వం ఆ పరిపూర్ణ స్వరూపుని లక్షణమేనని లీలగా ద్యోతకమవుతోంది.

ఏది తెలిస్తే అన్ని విషయాలు ఎరిగిన వాడవుతున్నాడో అట్టి విషయాన్ని అనుభవం లోనికి తెచ్చుకొని అదే అనుభవంలో ఓలలాడినవారు మహాస్వామి. దీనినేకదా శంకరులు తైత్తీరియ భాష్యంలో సర్వజ్ఞత్వం అన్నారు. శివునికి సర్వజ్ఞుడని పేరు. శంకరులకూ సర్వజ్ఞులని పేరు. నాకు అత్యంత ప్రియమైన మా చల్లా విశ్వనాథ శాస్త్రి గారు రాసిన వ్యాసం

కామెంట్‌లు లేవు: