11, జూన్ 2021, శుక్రవారం

వాతావరణ కాలుష్యం -అనారోగ్యమని

 యేనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతం అమృతేన సర్వం, యేన యజ్ఞం స్రాయతే సప్తహోతా తన్మేనః శివసంకల్పం. అని యజ్ఞం సప్త వ్యాహృతులతో కూడి వకే శక్తిగా విశ్వ వ్యాప్తంగా జీవులకు నీటిరూపమున అమృతత్వము అగును. యజ్ఞం ఏవక్కరి ప్రయోజనం కాదు అది సర్వ జనీనమైనది. ప్రకృతిని పర్యావరణం నుండి కాపాడి వృష్టి కారణము. వర్షం వలననే జీవ ఆధారము. వాతావరణ కాలుష్యం వలననే అనారోగ్యమని మనకు అనుభవమే. వాయుకాలుష్యం నీటి కాలుష్యం అన్నింటికన్నా ప్రమాదభరితమైనవి.మానవ జీవికి రెండునూ మూలమే.ఏదో కొందరికి ఉపాధి గురించి కర్మ కాండయని అసమర్ధల పనియనుట పొరపాటు. అజ్ఞానం కూడా. మానవ జీవనమునకు ఆహారము దాని జీర్ణమగుటకు ఏవిధమైన శక్తి కారణమెూ వాతావరణ కాలుష్య నివారణకు అదియును వకే కారణము.సృష్టి ఆదినుండి ప్రకృతి తనంత తాను యజ్ఞం చేయుచున్నది. మానవ మనుగడకు

ఏ స్వార్ధం లేకుండా పుష్పించి ఫసవంతమగుచువ్నవి. 

కొన్ని విష వాయువులను గాలిలో స్వఛ్చతకు ఓషధులు కారణము ఓషధులు యన్నియు వృక్ష రూపముగా కలిగియున్నవి. సమస్త వృక్ష సంపదను ప్రయెూగ శాలలో నిర్ణయించుట ఎప్పటికీ సాధ్యం కాదు. యింకను చాలా ఓషదులు వాటి లక్షణము నిర్ణయం కాలేదు. అది తెలుసుకొనుటకు యజ్ఞం. క్రతువు యనగా ఓషధులను వృత్తి చేయుట వర్షము కారణంగా సర్వ జనీనమైనది. క్రతువు మానవ జీవనమునకు సంబంధించినది. ఊరకనే సమిధలను మండించిన అది వాయు కాలుష్య మును నివారణ చేయదు. విష వాయువులను అనేకమైనవి వాతావరణంలో సమ్మిళితమై యువ్నవి. ఏది విష వాయువో తెలియకుండా మనం శ్వాస ద్వారా తీసుకొనుట జరుగుచున్నది. స్వచ్చమైన గాలి లేనియెడల మానవ వునికికి ప్రమాదం. తస్మాత్ జాగృత జాగృతః.జాతి నిర్వీర్యమైన మానవ వునికి కోల్పోయి మనుగడకు ప్రమాద భరితముగా మారును. మానవ వనరులను వృధా చేయకుండా ప్రకృతి సమతుల్యతను కాపాడుటకై యజ్ఞం మూలము. ఎన్నో వేల సంవత్సారాల మానవ జీవన పరి ణామమునకు యజ్ఞము మూలం.మనం తీసుకొనే ఆహారము కూడా జీవ యఙ్ఞం. దానివలన మానవ వునికి కాపాడుటకు గాని జీవ వి నాశనమునకు కాదని తెలియవలెను.యఙ్ఞం సమిష్టి అవసరము. ఏ వక్కరి గురించి కాదు. తెలుసుకుంటూనే వుందాం.ఆచరిస్తూనే వుందాం.

కామెంట్‌లు లేవు: