11, డిసెంబర్ 2020, శుక్రవారం

నేను* కథ

 ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన *నేను* కథ..


*భగద్గీత , వేదాంతం , మనకు బోధించేది ఏమిటి?*


*త్వమేవాహమ్‌*


కన్న తల్లి కడుపు లోంచి బయట పడి,

తొలి సారి ఊపిరి ని పీల్చిన క్షణం నుంచి, 

పుడమి తల్లి కడుపు లోకి చేరుకునేందుకు,

ఆఖరి సారి ఊపిరి ని విడిచి పెట్టడం దాకా సాగే ప్రస్థానం

 పేరే


 నేను = నేనే


ఈ నేను

ప్రాణ శక్తి అయిన "ఊపిరి" కి మారు పేరు.

ఊపిరి ఉన్నంత దాకా *నేను* అనే భావన కొనసాగుతూనే ఉంటుంది.

జనన మరణాల మధ్య కాలం లో సాగే జీవన స్రవంతి లో 

ఈ *నేను* ఎన్నెన్నో పోకడలు పోతుంది. 

మరెన్నో విన్యాసాలూ చేస్తుంది.

ఈ *నేను* లోంచే *నాది* అనే భావన పుడుతుంది.


ఈ *నాది* లోంచి  


1.నా వాళ్ళు, 

2.నా భార్య, 

3.నా పిల్లలు, 

4.నా కుటుంబం, 

5.నా ఆస్తి, 

6.నా ప్రతిభ, 

7.నా ప్రజ్ఞ, 

8.నా గొప్ప... 


అనేవి పుట్టు కొచ్చి 

చివరికి 

ఈ *నేను* అనే భావన

భూ మండలాన్ని కూడా మించి పోయి,

ఆకాశపు సరిహద్దు ను కూడా దాటి పోయి, 

నిలువెత్తు విశ్వ రూపాన్ని దాల్చి 


*అహం* గా ప్రజ్వరిల్లుతుంది.


*అహం* అనే మాయ పొర కమ్మేసిన స్థితి లో 


ఈ *నేను*  *నేనే సర్వాంతర్యామిని* 

అని విర్ర వీగుతుంది.

నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.


1. పంతాల తో 

2. పట్టింపుల తో, 

3. పగల తో

4. ప్రతీకారాల తో 


తన ప్రత్యర్థి ని సర్వ నాశనం చేయడానికీ సిద్ధ పడుతుంది.


1 .బాల్య, 

2.కౌమార, 

3.యౌవన, 

4.వార్ధక్య 

దశల దాకా విస్ఫు లింగ తేజం తో విజేత గా నిలిచిన

*నేను* అనే ప్రభ ఏదో ఒక నాడు మృత్యు స్పర్శ తో కుప్ప కూలి పోతుంది.

వంది మాగధులు ఎన్నో ప్రశంసలు చేసిన శరీరం కట్టె లా మిగులుతుంది.

సుందరీ మణులతో మదనోత్సవాలు జరుపు కొన్న దేహం నిస్తేజం గా పడి ఉంటుంది.

సుఖ భోగాల తో, అష్టైశ్వర్యాల తో తుల తూగిన *నేను* 

చుట్టూ చేరిన బంధు మిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువు గా మారుతుంది.

కడసారి చూపుల కోసం, 

కొన్ని ఘడియల పాటు ఆపి ఉంచిన విగత జీవి కి అంతిమ యాత్ర మొదలవుతుంది.

మరు భూమి లో చితి మంటల మధ్యే సర్వ బంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.

మొలకు చుట్టిన ఖరీదైన కౌపీనం తో సహా, మొత్తం గా కాలి బూడిద అవుతుంది.


*1.నేనే* శాసన కర్తను, 


 *2.నేనే* ఈ భూమండలానికి అధిపతిని, 


*3.నేనే* జగజ్జేతను... 

అని మహోన్నతం గా భావించిన


 *నేను* 


లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. 

రోజు మారుతుంది.


*ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన నేను* కథ 

అలా సమాప్త మవుతుంది.

అందుకే ఊపిరి ఆగక ముందే 


*నేను* 


గురించి తెలుసు కో అంటుంది భగవద్గీత.

చితి మంటలను చూస్తున్నప్పుడు కలిగేది,

శ్మశాన వైరాగ్యం మాత్రమే. 

అది శాశ్వతం కానే కాదు.


నేను గురించిన సంపూర్ణ మైన అవగాహన తో ఉన్నప్పుడే,

పరిపూర్ణమైన 'వైరాగ్య స్థితి' సాధ్యమవుతుంది.

వైరాగ్యం = (అంటే) అన్నీ వదిలేసు కోవడం కానే కాదు. 

దేని మీదా మోహాన్ని కలిగి ఉండక పోవడం.

తామరాకు మీద నీటి బొట్టు లా జీవించ గలగడం.

స్వర్గ నరకాలు ఎక్కడో లేవు. 

మన లోనే ఉన్నాయి.

మనిషి కి, ఆత్మ దృష్టి నశించి బాహ్య దృష్టి తో జీవించడమే (అంటే) = నరకం

అంతర్ముఖుడై నిత్య సత్య మైన ఆత్మ దృష్టి ని పొందగలగడం (అంటే) = స్వర్గం.


ఈ జీవన సత్యాన్ని తెలియ చేసేదే వేదాంతం.


1. నిజాయతీ గా,

2. నిస్వార్థం గా, 

3.సద్వర్తన తో,

4. సచ్ఛీలత తో 

5.భగవత్‌ ధ్యానం 

తో జీవించ మనేదే

*వేదాంతసారం*.


*అహం బ్రహ్మాస్మి* (అంటే) =

*అన్నీ నేనే*.

అనే స్థితి నుంచి

*త్వమేవాహమ్‌* (అంటే) = *నువ్వే నేను  అనే భావనను మనస్సు లో నిలుపుకోగల స్థితిని చేరుకోగలితేనే


*మానవ జన్మకు సార్థకత*


🙏సర్వే జనా సుఖినోభవంతు🙏

కామెంట్‌లు లేవు: