11, డిసెంబర్ 2020, శుక్రవారం

కాకి కధ

                  కాకి    కధ  

                      ➖➖➖

మన సమాజంలో రోజూ జరిగేదే✍️️



        నాపేరు "కాకి!" నాకది మనుషులు పెట్టిన పేరు.


     "అస్థిపంజరం" ఇది   మనుషులకు నేను పెట్టిన పేరు!.....   ఎందుకో ఈ కథ చివరలో మీకు అర్థమవుతుంది!


     నాకు నలుగురు పిల్లలు....అందులో రెండు      నా పక్క చెట్టు మీద    ఉండే కోయిలవి.         కోయిలకి గుడ్లు పెట్టడం మాత్రమే తెలుసు,  పిల్లలుగా మార్చడం తెలియదు. కానీ, మాకు గుడ్లు పెట్టడం,  వాటిని పొదగడం,బిడ్డలుగా మార్చటం మాత్రమే కాదు, వేరే తల్లిబిడ్డలను  మా బిడ్డలుగా      కంటికి రెప్పగా కాపాడడం  కూడా తెలుసు.....


        ఆ రోజు ఆదివారం జోరునవాన... సముద్రంలోవాయుగుండం అట ఎవరో ఇద్దరు చెట్టుకింద మాట్లాడుకుంటుంటే విన్నాను.


    పిల్లలేమో ఆకలో అంటున్నాయి. కర్మ కాకపోతే ఈరోజే చెత్తకుండీల్లో, డ్రైనేజ్ లో ఏమి దొరకని పరిస్థితి.         ఒకపక్క పిల్లల్ని చూస్తుంటే       కడుపు  తరుక్కు పోతుంది....


    "మనకు దెబ్బ తగిలితే ఓర్చుకునే శక్తి మన శరీరానికి ఉండొచ్చేమోగాని,మనం ప్రేమించే వాళ్లకి దెబ్బతగిలితే ఓర్చుకునే శక్తి     మన మనసుకి ఉండదు కదా..." అందుకే వాటికోసం ఏమైనా తేవడానికి గాల్లోకి ఎగిరాను....


   ఎదురుగాలికి ఎగరలేక రెక్కలు అలిసి పోతున్నాయి,   ఆకలికి         కేకలేస్తున్న పిల్లల పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు పెరిగిపోతున్నాయి,        వానచినుకులు విసిరిన రాళ్ళలా శరీరాన్ని తూట్లు చేస్తు న్నాయి.  కాసేపు   అలసట తీర్చుకుందా మని ఇంటిముందున్న   మామిడి చెట్టు మీద వాలాను...


       సరిగ్గా సమయం    మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలు ... నా అదృష్టం కొద్దీ     అప్పుడే ఆ ఇంట్లో     భోజనానికి కూర్చున్నారు ..   వాళ్లు తినే దాకా ఉంటే కనీసం    నాలుగు మెతుకులు  అయినా చేతులు   కడిగేసిన   కంచాలలో దొరక్క పోవా అని నా ఆశ!  ముందు  పచ్చడి , తరవాత కూర ,   ఆ తర్వాత సాంబారు చివరిగా పెరుగు ఇది వాళ్ల మెనూ!


   మొత్తం నలుగురు.   ఒకతను మాత్రం ముసలివాడు 70ఏళ్ళవరకుఉంటాయి.  పాపం అతని కంచంలోమాత్రం అన్నం ఎర్రటి రంగులో పచ్చడి మెతుకులు!


   'అమ్మా తాతయ్యకి కూరవే యొచ్చుగా' అని    ఆ పెద్దాయన పక్కనున్న     చిన్న పిల్లాడు అన్నాడు...


        వాడు అలా అనగానే ఆ పిల్లాడికి ఎదురుగా ఉన్న వాళ్ళ అమ్మ ..."ఏంట్రా వేసేది, నోరు మూసుకుని తిను ...తిండి పెట్టడమే ఎక్కువ!       దేవుడు    కొంత మందిని   తీసుకు పోకుండా    భూమికి భారంగా ఎందుకు ఉంచుతాడో   అర్థం కాదు!      కూరలు కావాలంట   కూరలు ఎక్కడి నుంచి వస్తాయి?"    అని అంది కళ్ళు పెద్దవి చేస్తూ...


    ఆమెని అలా చూసి ఆ సిచ్యుయేషన్తో సంబంధంలేని   నాకే   భయం వేసింది ఇంకా ఆ పిల్లోడెంత....?


      అక్కడ   అంత   జరుగుతున్నా   ఆ పిల్లవాడి నాన్న మాత్రం ఏమీ పట్టనట్టు 

"ఏవే ఇంకొంచెం సాంబార్ పోయి "అని పోయించుకుని  తింటున్నాడు.    వాడు అచ్చం బురదలో     పడుకునే   పందికి ముందు   రెండు కాళ్లు తీసేసి   చేతులు పెడితే ఎలా ఉంటుందో    సరిగ్గా  అలా ఉన్నాడు...


     పాపం ఆపెద్దాయనకి అన్నం కలుపు కోవడానికి కూడా చేతుల్లో బలం లేదు... అయినా సరే బాగా ఆకలేస్తుందేమో .. త్వరత్వరగా  అన్నం  కలుపుతున్నాడు- వణుకుతున్న చేతులతో...!    


     మొత్తానికి కలిపేసాడు, ఆత్రంగా ఒక ముద్దతీసి నోట్లోపెట్టుకున్నాడు. వెంటనే నీళ్లు తాగాడు.బాగా మంటగా ఉందను కుంటా కంట్లోనుంచి నీళ్ళొచ్చాయి. 


       మొఖం ఎర్రగా మారిపోయింది ...

ఎదురుగా ఉన్న నెయ్యి వైపు చూశాడు. కానీ ,    అడగడానికి  ధైర్యం చాలట్లేదు అనుకుంటా అలాగే ఉండిపోయాడు... 

అయ్యో !!   ఎంత దారుణం,      పాపం పెద్దాయన...


      వాళ్లు   తినడం    అయిపోయింది.. అందరూ లేచారు.  ఆ పెద్దాయన కూడా చెంబులో     నీళ్లు మొత్తం తాగేసి   లేచి బయటకు వచ్చి చుట్టూ చూశాడు ... .. అప్పుడు   ఆయనకి నేను   కనబడ్డాను, నా దగ్గరికి వచ్చి నా ముందు ఆ అన్నం పడేసాడు... ఒక్క క్షణం నా కంట్లో నీళ్లు తిరిగాయి....


   "పెద్దాయనా!!! నీఆకలి తీరకపోయినా నాఆకలి తీరుస్తున్నవు... నీ రుణం ఎలా గైనా   తీర్చుకుంటా"   అని    మనసులో అనుకొని...  నేను కొన్ని మెతుకులు  తిని, కొన్ని మెతుకులు గొంతున బట్టి   గూటికి చేరి పిల్లల ఆకలి తీర్చాను.


అక్కడితో అవలేదు...

సరిగ్గా  26 రోజుల తర్వాత  అనుకుంటా "ఎప్పటిలాగే వేట కోసం   ఏటి మీదుగా వెళ్తున్నా,"  ఏటి ఒడ్డున  ఎవరో, ఎవరికో పిండం పెడుతున్నారు ...         కాస్తంత  

తినడానికి ఏమైనా దొరక్కపోదా?? అని అక్కడ వాలాను... 


       ఎదురుగా     ఉన్న ఫోటోని   చూసి ఆశ్చర్యపోయాను.  అది    నా     పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు     అన్నం   పెట్టిన పెద్దాయనది....!"       ఒక్క క్షణం గుండె బరువెక్కింది, విషాదంతో రెక్కలు   దిగ జారిపోయాయి...


            "అయ్యా!! పిండం పెట్టి కాకుల్ని పిలవండి,  మీ నాన్నగారు వాటి రూపం లో వచ్చి తింటారు"   అని పూజారిగారు చెప్పారు-  ఒక పెద్ద కంచాన్ని పెద్దాయన కొడుక్కి ఇస్తూ... 


     ఆ కంచాన్ని చూడగానే నా ఆశ్చర్యం ఆకాశాన్నంటింది,    నల్లటి నా మొఖం తెల్లబారిపోయింది".. .  ఎందుకంటే ఆ కంచంలో   పంచభక్ష      పరమాన్నాలు ఉన్నాయి....


       వారు మనుషులు!     హుః  మీరేం మనుషులురా  బాబు ...   బ్రతికున్నంత కాలం బ్రతకడానికి పెట్టకుండా   చచ్చిన తర్వాత     బ్రతికించడం కోసం పెడుతు న్నారా??


    పోవడం కోసం కోరికలు కోరుకొని,  కాకి రూపంలో       రావడానికి       పూజలు చేస్తున్నారా??


    బ్రతికినంతకాలం రాబందుల్లా పీక్కు తిని,   మీరు   విసిరేసింది   తిన డానికి కాకుల్ని పిలుస్తున్నారా??


      ప్రాణం ఉన్నంత కాలం    పెద్దయిన కప్పుకోవడానికి   కండువ  కూడా   ఇవ్వ

కుండా  పోయాక  కట్టుకోడానికి      పట్టు పంచ పెట్టారా... ఛీ!!వీళ్ళ బతుకు మీద నా రెట్ట వెయ్య...


        పాపం ముసలాయన్ని బ్రతికినంత కాలం దినదినగండంగా బ్రతికేలా చేసి,   ఇప్పుడు ఏమీ తెలియని  అమాయకుడి లా    ఫోటోకి దండం పెడుతున్నాడు.... అసలు వీణ్ణి    నా ముక్కుతో     పొడిచి, పొడిచి చంపాలి...!


        ఏరా వెధవా!!   ఇంటి చెట్టు మీద వాలితే ఈసడించుకున్న కాకిలో  ఈరోజు నీనాన్నని చూసుకుంటున్నావా? కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా??


     ఎంగిలి మెతుకులు వేయడం కూడా అనవసరం అనుకున్నకాకి, పరమాన్నం తినడానికి కావాల్సి వచ్చిందా??


    అలా మనసులో వాడిని  తిడుతున్న ప్పుడు నాఆవేశం కట్టలు తెంచుకుంది! వెంటనే గాల్లోకి ఎగిరాను. చుట్టూ ఉన్న నా కాకుల  స్నేహితుల      దగ్గరికి   వెళ్లి జరిగిందంతాచెప్పి ఆపిండాన్ని ఎవరూ తినొద్దని చెప్పాను అందరూసరేనన్నారు


   గంటా,రెండు గంటలు అలా గంటలు గంటలు గడుస్తూనే ఉన్నాయి...పిండం తింటానికి ఒక్క కాకి కూడా రావట్లేదు... చుట్టూ ఉన్న   జనాల్లో      అనుమానం మొదలైంది...       "బ్రతికున్నంత కాలం ఆయన్ని బాగాచూసుకోలేదేమో అందుకే ఇప్పుడు తినడానికి రావట్లేదు!"    అని ఒకడు... "ఉన్నన్ని రోజులు బాధలు పెట్టి ఉంటారు అందుకే ఆయన  రావట్లేదు" అని ఇంకొకరు...        "నేను రోజూ చూసే వాడిని  అన్నం కూడా సరిగ్గా పెట్టేవాళ్లు కాదు,   అందుకే   ఇప్పుడు  రావట్లేదు" అని మరొకరు మాట్లాడుకోడం మొదలు పెట్టారు ...


       అది విని ఫోటో ముందు కూర్చున్న ముసలాయన కొడుక్కి  తల తీసేసినట్టు అనిపించింది.అలాగే ఉండిపోయాడు. కనీసం తను   చెప్పుకోలేని   పరిస్థితి... పరువు పోయినట్టు, ఏదో కోల్పోయినట్టు  బ్రతికున్నా   చచ్చినట్టు     అనిపిస్తోంది అతనికి ...

 

    నా బిడ్డల  ఆకలి తీర్చినందుకు    ఆ పెద్దాయన రుణం ఇలా తీర్చుకున్నాను..  ఈరోజు ఒక మంచి పని చేశా  అనిపించి గర్వంగా గాల్లోకి ఎగిరాను....


       రేయ్ మనిషీ! వింటున్నావా!!   నీకే చెప్పేది!!!


    " సెంటు     పీల్చితే    మంచి  వాసన వచ్చిందని    తాగితే బలం వస్తుందను కోవడం అమాయకత్వం!  


    అలాగే, డబ్బుఅనేది అవసరం తీర్చే వస్తువులు   ఇచ్చిందని ,         ప్రేమించే  మనుషుల్ని   కూడా   ఇస్తుంది      అను కోవడం మూర్ఖత్వం...


      అయినా "ప్రేమ ఇవ్వడానికి మనసు లేనప్పుడు,ప్రేమను తీసుకోడానికి హక్కు ఎలా పొందగలవు"..


    "డబ్బుతో  వస్తువులు  కొనుక్కోవచ్చు !వస్తువులు      కొనుక్కున్నట్టు     ప్రేమను కొనుక్కోలేవు"...రేయ్!మనిషీ అర్థమైందా


        "ఒక మనిషి గొప్పతనాన్ని   అతను చేసిన పనుల బట్టో,     మంచిని   బట్టో కాకుండా    అతనికున్న   డబ్బును బట్టి నిర్ణయించే    సమాజంలో     బతుకుతు న్నావ్  "....       త్వరగా    బయటపడరా మనిషీ!


    "ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్ట పడి తెచ్చుకున్న అవకాశం ,      ఓటమి తర్వాతవచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం" వృధాగాపోవు.


       "బాగా తిన్న తర్వాతే ఆకలినుండి, పూర్తిగా అనుభవించిన తర్వాతే   బాధ నుండి,     మొత్తం    భరించిన తర్వాతే బాధ్యత నుండి బయటపడగలం.... !వీటికి వేరే దార్లు లేవు, వెతక్కు....!"✍️️



   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏



🍀🌺🍀🌺🍀🌺 🍀🌺🍀🌺🍀

కామెంట్‌లు లేవు: