🕉 మన గుడి : నెం 1331
⚜ తమిళనాడు : కుంభకోణం
⚜ శ్రీ శ్వేత వినాయకర్ ఆలయం
💠 ఏదైనా కార్యం మొదలుపెట్టే సమయంలో ఖచ్చితంగా విఘ్నరాజైన వినాయకుడికి పూజ చేయాలి. లేదంటే ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తి కాదన్న విషయం మన పురాణాలు చెబుతాయి.
💠 పాల సముద్రపు నురుగుతో చేసిన " శ్రీ నురుగు గణపతి " విగ్రహం ప్రపంచంలో ఒకటే ఒకటి ఉంది.
ఆ విగ్రహం తమిళనాడులో శ్వేత వినాయకర్ పేరుతో పూజలు అందుకొంటూ ఉంది.
ఈ ఆలయాన్ని సంస్కృతంలో శ్వేత వినాయక దేవాలయం లేదా తమిళంలో వెల్లై వినాయక దేవాలయం అని కూడా పిలుస్తారు, దీని అర్థం "తెల్ల వినాయకుని ఆలయం".
🔆 స్థల పురాణం
💠 అమరత్వం కోసం అమృతాన్ని సంపాదించాలని దేవతలు, రాక్షసులు కలిసి సముద్ర మధనం చేసిన విషయం తెలిసిందే.
అయితే మొదట అమృతం బదులు హాలహలం వచ్చింది.
💠 ప్రసిద్ధ సముద్ర మథనం సమయంలో చాలా అడ్డంకులు వచాయి . నారద మహర్షి దేవతలు మరియు అసురులతో వారు ప్రారంభంలో గణేశుడికి ప్రార్థనలు చేయలేదని మరియు అందువల్ల వారు వివిధ అడ్డంకులను ఎదుర్కొంటున్నారని చెప్పారు.
💠 వెంటనే దేవతలు మరియు అసురులు సముద్రం నుండి నురుగును తీసివేసి, ఒక గణేశుడిని తయారు చేసి పూజించారు.
ఇందుకు గల కారణాలను అన్వేషిస్తే రాక్షసులతో పాటు దేవతలకు తాము చేసిన తప్పు తెలిసివచ్చింది.
💠 పరమశివుడి సూచన మేరకు సముద్ర నురగతో వినాయకుడి విగ్రహం చేసి దానిని పూజించారు.
దీంతో అటు పై నిర్విఘ్నంగా వారి కార్యం కొనసాగి చివరికి అమృతం దక్కించుకొన్నారు. అటు పై ఇంద్రుడు ఆ నురుగుతో తయారైన విగ్రహాన్ని తనతో పాటు స్వర్గానికి తీసుకువెళ్లి అక్కడ పూజించేవాడు.
💠 ఇలా కొన్నాళ్లపాటు కొనసాగిన తర్వాత అహల్య వల్ల తనకు గలిగిన శాప నివృత్తికోసం సముద్ర నురుగుతో తయారుచేసిన విగ్రహాన్ని భూమి పైకి తీసుకువచ్చి కొన్ని పవిత్ర ప్రదేశాల్లో ఉంచి పూజలు చేసేవాడు.
💠 ఈ క్రమంలోనే ఒకసారి ప్రస్తుతం కుంభకోణానికి ఇంద్రుడు ఆ నురుగుతో చేసిన ఆ శ్వేత వినాయకుడి విగ్రహాన్ని తీసుకొని వచ్చాడు.
ఇక్కడి పవిత్రతకు, వాతావరణానికి ముగ్దుడైన వినాయకుడు ఇక్కడే ఉండిపోవాలనుకొంటాడు.
ఇందుకోసం తన తండ్రి పరమశివుడి సహాయాన్ని కోరుతాడు.
దీంతో శివుడు ఒక చిన్నపిల్లాడి రూపంలో అక్కడికి వస్తాడు.
అదే సమయంలో ఇంద్రుడికి శివార్చనకు సమయం అవుతుంది.
దీంతో ఆ పిల్లవాడి చేతికి స్వేత వినాయకుడిని ఇచ్చి శివార్చనకు వెలుతాడు.
శివార్చన ముగించుకొని వచ్చేదాకా ఆ విగ్రహాన్ని కింద పెట్టకూడదని చెబుతాడు.
💠 అయితే ఇంద్రుడు అలా వెళ్లిన వెంటనే పిల్లవాడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు తన చేతిలో ఉన్న శ్వేత వినాయకుడిని అక్కడ ఉన్న బలిపీఠం కింద పెట్టి వెళ్లిపోయాడు.
తిరిగి వచ్చిన ఇంద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ విగ్రహం అక్కడి నుంచి ఒక్క ఇంచు కూడా కదలలేదు. అటుపై దేవ శిల్పిని రప్పించి రథం తయారు చేయిస్తాడు. ఆ రథం పై వినాయకుడు ఉన్న ప్రాంతంతో సహా వినాయకుడిని స్వర్గానికి తీసుకెళ్లాలని ప్రయత్నించి విఫలమవుతాడు.
💠 అదే సమయంలో అశరీరవాణి శ్వేత వినాయకుడు ఇక్కడే ఉండాలని భావిస్తున్నాడని చెబుతుంది.
దీంతో ఇంద్రుడు తన ప్రయత్నాన్ని విరమించుకొంటాడు.
అంతే కాకుండా ప్రతి వినాయక చవితికి ఇక్కడికి వచ్చి వినాయకుడిని పూజించాలని తద్వారా ప్రతి రోజూ పూజించిన ఫలితం లభిస్తుందని అశరీరవాని ఇంద్రుడికి సూచిస్తుంది. అందుకే ప్రతి వినాయక చవితికి ఇంద్రుడు ఇక్కడికి వచ్చి వినాయకుడిని పూజిస్తాడని భక్తులు నమ్ముతారు.
💠 ఇక్కడి విగ్రహానికి అభిషేకం చేయరు, పూలు, కుంకుమ, పసుపుతో అర్చన చేయరు. వస్త్రాలు కూడా కట్టరు.
అంటే ఏ విధంగానూ విగ్రహాన్ని తాకరు.
విగ్రహాన్ని తాకకుండా కేవలం పచ్చ కర్పూరం పొడిని విగ్రహం పైకి చల్లుతారు. సముద్ర నురుగుతో తయారు కావడం వల్ల ఆ విగ్రహాన్ని తాకరని చెబుతారు.
💠 శివుడు ప్రధాన దేవుడు మరియు కపర్దీశ్వరర్గా పూజించబడతాడు.
పార్వతి దేవిని పెరియనకై దేవత అని పిలుస్తారు. కావేరీ నది ఆలయం దగ్గర తిరుగుతుంది.
💠 ఆలయ సముదాయం 7.25 ఎకరాల విస్తీర్ణంలో 5 మండపాలతో ఉంది. తెల్ల గణేశుడి ముందు 6 అడుగుల ఎత్తులో నాలుగు రాతి స్తంభాలు ఉన్నాయి.
💠 ఎనిమిది చేతులతో అష్టభుజ మహాకాళి లేదా కాళి దేవత ఆలయంలో మరొక ముఖ్యమైన మూర్తి.
💠 దుర్వాస మహర్షి నిర్వహించిన యజ్ఞంలో పాల్గొన్న ఋషులు ప్రతిష్టించారని నమ్ముతున్న అనేక శివలింగాలు ఈ ఆలయంలో ఉన్నాయి.
💠 ఆలయం తూర్పు ముఖంగా ఉంది మరియు ఐదు అంతస్తుల గోపురం ఉంది.
💠 తెల్లని గణేశుడి గర్భగుడి పక్కన ఉన్న మండపాన్ని గాయత్రి మండపం అంటారు.
ఈ మండపంలో 24 సంక్లిష్టంగా చెక్కబడిన స్తంభాలు ఉన్నాయి.
ప్రతి స్తంభం గాయత్రీ మంత్రంలో ఒక అక్షరాన్ని సూచిస్తుంది.
💠 ఇక్కడ వినాయకుడు మహావిష్ణువు కళ్ల నుంచి పుట్టిన ఇంద్రదేవి కమలాంబల్, బ్రహ్మ వాక్కు నుంచి పుట్టిన బుద్ధి దేవిని వివాహం చేసుకొన్నారని స్థానిక కథనం. అందువల్లే ఇక్కడ స్వామిని సేవిస్తే వివాహ విషయంలో ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.
💠 ఈ శ్వేత వినాయక దేవాలయం కుంభకోణం బస్టాండు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రచన
©️ Santosh Kumar
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి