తెలుగు పండిత కవులు
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
26, జనవరి 2026, సోమవారం
మాఘ పురాణం - 9వ*
🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️
*🌷మంగళవారం 27 జనవరి 2026🌷*
_*మాఘ పురాణం - 9వ*
_*అధ్యాయము*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*27వ తేదీ మంగళవారం*
*వేకువఝామున*
*చదువు కొనుటకు*
``
మాఘ పురాణంలోని తొమ్మిదవ అధ్యాయం, గంగానది పవిత్రత, దాని జలాల శక్తి గురించి వివరిస్తుంది.
భగవంతుడి నుండి వచ్చిన గంగానది అన్ని పాపాలను తొలగిస్తుందని, దానిలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ అధ్యాయం గంగానది ప్రాముఖ్యత, దాని జలాల శక్తిని తెలియజేస్తుంది.
*గంగా జలం మహిమ*```
ఓ కార్తవీర్యార్జునా! శివపూజ గురించి శివ మహత్మ్యమును గురించి వివరించెదను వినుము. మొదటగా శ్రీరామచంద్రుడు రావణుని సంహరించుటకు సముద్రముపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్టించి శివుని ధ్యానించి, వారధి దాటి రావణుని సంహరించెను. అటులనే హనుమంతుడూ సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి, మహా బలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలు దేరే ముందు శివని పూజ చేసియే యుద్ధ రంగములో ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుకొనిరి. కనుక, పూజలలో శివపూజ పవిత్రమైనది.
అటులనే నదులలో గంగానది పరమ పవిత్రమైనది. ఎటులనగా, గంగాజలము విష్ణుపాదముల నుండి పుట్టినదియు, శివుని శిరస్సు నుండి ప్రవహించు నట్టిదియు అయినందుననే సర్వపాపహరమైనది. గంగా జలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకనూ గంగా జలము గురించి చెప్పబోవునది ఏమనగా యే నీళ్ళనుగాని, “గంగ గంగ గంగ” అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్ళు గంగా జలముతో సమానమయినవగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతి రూపము కనుక, మాఘమాసములో గంగ స్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచూ గంగా జల మహత్మ్యము గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను..
కొంత కాలము క్రిందట మగధ రాజ్యములో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు ఉండిరి. నలుగురికి నలుగురు కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్ని రోజులకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను, బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి, మోహించి, అతనిని సమీపించి చుట్టు ముట్టి మమ్మల్ని వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విధ్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించెను. అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచానివి కమ్మని శపించగా, ఆ విద్యార్థియూ, మీరుకూడ పిశాచులగుదురుకాక అని ప్రతి శాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే వుండి, అందరిని బాధించి, ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడుకొనుచుండిరి.
కొంతకాలమునకు ఒక సిద్దుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లి దండ్రులు, తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎట్లు పోవునని అడిగిరి. ఆ సిద్దుడు వారందరి చేత మాఘమాసములో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగి పోవునని చెప్పగా వారట్లు చేయుటచే అయిదుగురికి యధా రూపములు కలిగినవి.
ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్మ్యమే కారణము.
మాఘమాస నందు చేయు నదీ స్నానము మానవులకే కాక దేవతలకు, గంధర్వులకు కూడ పవిత్రమైనది.
ఒక మాఘమాసములో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానము అచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వము నశించి గంధర్వ లోకానికి వెళ్ళలేక పోయినది. ఆమెను విడిచి పెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంట చూసెను. ఆమె అందానికి, యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే యిద్దరూ కామక్రీడలలో తేలియాడుచుండగా, మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా, విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించు చుండిరి.
ఆ దృశ్యమును చూచి మండి పడుచు ‘తపస్వివై యుండి కూడా యిలా కామ తృష్ణ కలవాడవైనందున, నీకు కోతి ముఖము కలుగుగాక!’ అని విశ్వామిత్రుని, పాషాణమై పడి ఉండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు.
విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి, “విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛకామ వాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి, నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము”, అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి, విష్ణువును ధ్యానించి, కమండలముతో నీరు తెచ్చి, పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది, గంధర్వ లోకమునకు వెళ్ళిపోయెను.
పూర్వరూపము నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.```
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*మాఘపురాణం తొమ్మిదవ* *అధ్యాయము సంపూర్ణము*
*🌷సేకరణ🌷*
*న్యాయపతి నరసింహారావు*
ఔషధే చింతయే ద్విష్ణుం
🙏🏻 ఓం నమో నారాయణాయ నమః 🙏🏻
ఔషధే చింతయే ద్విష్ణుం
భోజనే చ జనార్ధనమ్ |
శయనే పద్మనాభం చ
వివాహే చ ప్రజాపతిమ్ ||
యుద్ధే చక్రధరం దేవం
ప్రవాసే చ ప్రజాపతిమ్ |
నారాయణం తనుత్యాగే
శ్రీధరం ప్రియసంగమే ||
దుస్స్వస్నే స్మర గోవిందం
సంకటే మధుసూదనమ్ |
కాననే నారసింహం చ
పావకే జలశాయినమ్ ||
జలమధ్యే వరాహం చ
పర్వతే రఘునందనమ్ |
గమనే వామనం చైవ
సర్వకాలేషు మాధవమ్ ||
షోడశైతాని నామాని
ప్రాతరుత్థాయ యః పఠేత్ |
సర్వపాప వినిర్ముక్తో
విష్ణు లోకే మహీయతే ||
ఔషధసేవనం బాచరించెడి వేళ
వినుతించ వలయును 'విష్ణు' నెపుడు
భోజనమ్మును తాను భుజియించు వేళలో
తలచ తగును 'జనార్దను'ని మదిని
శయనించు సమయాన సంతృప్తి తోడను
ప్రార్తించ వలయును 'పద్మనాభు'
ప్రార్థించవలె 'ప్రజాపతి' యంచు వినయాన
పరిణయ వేళందు భక్తితోడ
సమరంబు నందున 'చక్రధరా' యంచు
జపియించ వలయును జయము పొంద
పరదేశమున నుండ హరిని 'ప్రజాపతి'
యనుచు పలుకతగు న్నాత్మ యందు
తనువు నొదులు వేళ తా బల్క వలయును
'నారాయణా' యంచు నయము గాను
ప్రియసంగమమునందు ప్రియమార స్వామిని
'శ్రీధరా' యనుచును చెప్ప తగును
దుస్వప్నముల యందు దుఃఖించకను తాను
'గోవింద' యని మది కొలువతగును
సంకటసమయాల సద్భక్తి తోడను
'మధుసూద'ననతగు మదిని నరుడు
విపినంబునందున వెఱవక మనుజుండు
కోరి దల్చ తగును 'నారసింహు'
అగ్నిజ్వాలల మధ్య ననయంబు మదియందు
'జలశాయి' భజనమ్ము సల్ప తగును
పర్వతంబుల మధ్య 'పట్టాభిరఘురాము'
నెంచంగ వలయును నెపుడు నరుడు
గమనంబు నందున కల్కంగ నశ్రమ
భక్తి నెంచ తగును 'వామనుడి'ని
సర్వకాలములందు సర్వేశు "మాధవున్"
మదిదల్చ వలెనెప్డు మానవుండు
శుభము లిచ్చు "విష్ణు షోడశనామమ్ము "
లుదయ వేళ యందు చదివి తేని
సర్వ పాపరాశి సమసియున్ మనుజుండు
విష్ణునెలవు చేరు విమల మతిని.
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🕉️ *సోమవారం*🕉️
*🌹26జనవరి2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*భీష్మాష్టమి*
*స్వస్తి శ్రీ విశ్వావసు*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*
*మాఘమాసం - శుక్ల పక్షం*
*తిథి : అష్టమి* రా 09.17 వరకు ఉపరి నవమి
*వారం : సోమవారం* (ఇందువాసరే)
*నక్షత్రం : అశ్విని* మ 12.32 వరకు ఉపరి *భరణి*
*యోగం : సాధ్య* ప 09.11 వరకు ఉపరి *శుభ*
*కరణం : భద్ర* ఉ 10.16 *బవ* రా 09.17 ఉపరి *బాలువ*
*సాధారణ శుభ సమయాలు:*
*-ఈరోజు లేవు-*
అమృత కాలం : *శేషం ఉ 07.11 వరకు*
అభిజిత్ కాలం : *ప 11.57 - 12.43*
*వర్జ్యం : ఉ 08.43 - 10.15 & రా 09.35 - 11.05*
*దుర్ముహూర్తం : మ 12.43 - 01.28 & 02.59 - 03.44*
*రాహు కాలం : ఉ 08.04 - 09.30*
గుళికకాళం : *మ 01.45 - 03.10*
యమగండం : *ఉ 10.55 - 12.20*
సూర్యరాశి : *మకరం*
చంద్రరాశి : *మేషం*
సూర్యోదయం :*ఉ 06.49*
సూర్యాస్తమయం :*సా 06.08*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.40 - 08.56*
సంగవ కాలం : *08.56 - 11.12*
మధ్యాహ్న కాలం : *11.12 - 01.28*
అపరాహ్న కాలం : *మ 01.28 - 03.44*
*ఆబ్ధికం తిధి : మాఘ శుద్ధ అష్టమి*
సాయంకాలం : *సా 03.43 - 06.01*
ప్రదోష కాలం : *సా 06.01 - 08.32*
రాత్రి కాలం : *రా 08.32 - 11.55*
నిశీధి కాలం :*రా 11.55 - 12.45*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.58 - 05.49*
******************************
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*
*జ్ఞాత్వైతత్క్షణ భంగురం*
*సపది రే త్యాజ్యం మనో దూరతః*
🕉️ *ఓం నమః శివాయ*🕉️
🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🕉️🕉️🌹🌷
🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹
మాఘ పురాణం - 8వ*
🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️
*🌷 సోమవారం 26 జనవరి 2026🌷*
_*మాఘ పురాణం - 8వ*
_*అధ్యాయము*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*26వ తేదీ సోమవారం*
*వేకువఝామున*
*చదువు కొనుటకు*
```
మాఘ పురాణంలోని ఎనిమిదవ అధ్యాయం, శక్తిమత్తు గర్వంతో ఉన్న రాజు కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయుడు చేసిన జ్ఞానోపదేశాన్ని వివరిస్తుంది.
వినయం, సహనం, దయల ప్రాముఖ్యతను,
ఈ లోకము భ్రమేనని, నిజమైన ఆనందం భగవంతుడిలోనే ఉందని దత్తాత్రేయుడు బోధిస్తాడు.
కార్తవీర్యార్జునుడు వాటిని అనుసరించి గొప్ప గురువుగా మారతాడు.
ఈ కథ గర్వం మనకు ఎటువంటి మేలు చేయదని, వినయంతో ఇతరుల నుండి నేర్చుకుంటేనే జ్ఞానం, ఆనందం లభిస్తాయని చెబుతుంది. ```
*దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశము ఇచ్చుట*```
దత్తాత్రేయుడు బ్రహ్మా,విష్ణు,మహేశ్వరుల యొక్క అంశమున జన్మించాడు. అతడు కూడ లోక కళ్యాణముకొరకు ఘనకార్యములు చేసాడు.
త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు.
దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతీ యను నగరమును రాజధానిగా జేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి “గురువర్యా! మీ అనుగ్రహము వలన అనేక విషయాలు తెలుసుకొంటినీ, కాని మాఘమాసము యొక్క మహత్మ్యమును విని ఉండలేదు. కావున, మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించ వలసినదిగా కోరుచున్నాను” అని దత్తాత్రేయుని కోరెను.
దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను.
“భూపాలా! భరత ఖండములో ఉన్న పుణ్య నదులకు సమమైన నదులు ప్రపంచమునందు ఎచ్చటా లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ప్రతి ఒక్క సంవత్సరము ఒక్కొక్క రాశి యందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరం ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన యెడల దానివలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడ సాధ్యము కాదు. అందునా మాఘమాస మందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటయే కాక జన్మ రాహిత్యము కూడ కలుగును. గనుక, ఏ మానవుడైననూ మాఘమాసములో సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘ స్నానము చేసి, ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచ మహపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు” అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి తెలుపుచుచూ ఇంకనూ యీవిధముగా చెప్పుచున్నాడు..
“పూర్వ కాలమున గంగానదీ తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమను పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరులు వలెనున్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు, బంగారు నగలు, నాణేములు రాసుల కొలది ఉన్నవాడు. కొంత కాలమునకు హేమాంబరుడు చనిపోయెను, తండ్రి చనిపోగానే అతని కుమారులు ఇద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని, యిష్టము వచ్చినటుల పాడు చేయుచుండిరి. ఇద్దరు చెరొక ఉంపుడుకత్తెనూ చేరదీసి, కుల భ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించు చుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటివెంట నురుగలు గ్రక్కుచూ చనిపోయినాడు, ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమ దూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి, పెద్ద వానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవ వానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తునితో రెండోవాడు యిలా అన్నాడు..
“అయ్యా! మేము ఇద్దరూ ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒక విధముగానే పాపములు చేసియున్నాము. అయినా అతనికి నరకమును, నాకు స్వర్గమును యేల ప్రాప్తించును” అని అడిగెను.
ఆ మాటలకు చిత్రగుప్తుడు “ఓయీ వైశ్య పుత్రా! నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతి దినము యామెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని యింటికి వెళ్ళి వచ్చుచుండెడివాడవు. అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీశిరస్సుపై పడినవి. అందు వలన నీవు పవిత్రుడవు అయినావు మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు, ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహా పాపములు కూడ నశించును.
కాన విప్రుని చూచుట వలన నీకు మంచిఫలితమే కలిగినది. అదియునూ కాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రమును కూడా నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరము మీదపడినది. గనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను” అని చిత్రగుప్తుడు వివరించెను.
“ఆహా! ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా” అని వైశ్య కుమారుడు సంతసించి, దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను.```
*మృగ శృంగుని కథ!*```
గత అధ్యాయములో తెలిపిన విధంగా మరణించిన ముగ్గురు కన్యలను తిరిగి బ్రతికించుటకు గాను మృగశృంగుడు యముడు కోసం తప్పస్సు చేసిన విధానం యమలోక విశేషములు మృగశృంగుని పట్టుదల చేతను, యముని కటాక్షము చేతను ఆ మువ్వురు కన్యలు నిద్రనుండి మేల్కొనినటుల లేచి, వారు యమలోకము నందు చూసిన వింతలూ, విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి. యమలోక మందలి జీవులు తమ పాప పుణ్యములను బట్టి శిక్షలను అనుభవించు చున్నారు. ఒక్కొక్క పాపి తానూ చేసిన పాపకర్మలకెంతటి శిక్షలననుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి. ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింప జేయుదురు. సలసల కాగిన నూనెలో పడవేయుదురు. విష కీటకములున్న నూతిలో త్రోసి వేయుదురు. తలక్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంట పెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు. అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయింది.
అపుడా కన్యలు వారిని ఓదార్చి “మీరు భయపడకుడు. ఆ నరక బాధనుండి బైటపడు ఉపాయమొక్కటే యున్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసము నందు నదీ స్నానము చేయుట తనకు తోచిన దానములు, ధర్మములు, జప తపములు యిత్యాది పుణ్య కార్యములు చేయుట వలన అంతకు ముందు చేసియున్న పాపములు అన్నియు పటాపంచలై నశించుటయే గాక, స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును. గాన మాఘమాస స్నాన ఫలము అంత ప్రసిద్దమయినది.
మాఘమాసమందు నదీస్నానము ఆచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానము చేసిన కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగును. మాఘమాసము అంతయు పురాణ పఠనం చేసినను, లేక వినినను, శ్రీహరి దయకు పాత్రులగుదురు గాన మీరు భయపడవలసిన పనిలేదు. నరక బాధలనుండి బైటపడుట కంతకంటే సులభ మార్గము మరి ఒకటి లేదు” అని వారి తల్లిదండ్రులకు వివరించిరి.``
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*మాఘపురాణం ఎనిమిదవ* *అధ్యాయము సంపూర్ణము*
*🌷సేకరణ🌷*
*న్యాయపతి నరసింహారావు*
స్వామి వివేకానంద స్ఫూర్తి.... రోజుకో సూక్తి....
భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
స్వామి వివేకానంద స్ఫూర్తి.... రోజుకో సూక్తి....
సత్సంకల్పం, నిష్కాపట్యం మరియు అఖండప్రేమ అనేవి ప్రపంచాన్ని జయించగలవు. ఈ సుగుణాలు ఉన్న ఒక్క వ్యక్తి లక్షలకొద్ది కపటుల, పశుసమానుల కుతంత్రాలను వమ్ముచేయగలడు.
శుభ ఇందు వారే 🔱Happy Monday.
Swami Vivekananda’s Wisdom for
Daily Inspiration.
Good motives, sincerity, and infinite love can conquer the world. One single soul possessed of these virtues can destroy the dark designs of millions of hypocrites and brutes.
⚜️Meeku, mee kutuambaniki 77th REPUBLIC DAY SUBHAKANKSHALU.👩🎨
మహాభారతము
🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯
*సోమవారం 26 జనవరి 2026*
``
*ప్రతిరోజూ*
*సంపూర్ణ మహాభారతము*
సరళ వ్యావహారిక భాషలో!
1️⃣1️⃣6️⃣
*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``
*సంపూర్ణ మహాభారతము*
*116 వ రోజు*
*వన పర్వము పంచమాశ్వాసము*
*జీవుడియాత్ర*```
ఇక జీవుడు ఎలాంటి వాడో చెప్తాను. జీవుడు అనఘుడు, సనాతనుడు, శాశ్వతుడు. జీవునికి పాపం అంటదు. కర్మానుసారం శరీరాన్ని ధరిస్తూ ఉంటాడు. కొంత కాలానికి శరీరం జీర్ణమై మరణిస్తుంది కాని జీవుడు మరణించడు. శరీరాన్ని విడిచిన జీవుడు వేరు శరీరాన్ని ధరిస్తాడు.
ఆ శరీరంలో సుఖదుఃఖాలు అనుభవిస్తాడు. ఇలా జీవుడు ఎన్నో దేహబంధాలలో చిక్కుకుంటాడు. మహానుభావా! నీవు పాపపుణ్యముల వలన కలుగు దేహ బంధముల గురించి వివరిస్తాను. స్థిరమైన పుణ్యం చేసిన వాడికి దైవత్వం సిద్ధిస్తుంది. కొంత పాపం కొంత పుణ్యం చేసిన వాడికి మనుష్య జన్మ లభిస్తుంది. పాపములు మాత్రమే చేసే జనులు క్రిమి కీటకాదులుగా పుట్టుతూ మరణిస్తూ జన్మబంధాలలో చిక్కుకుంటారు. ఇలా కోరికలు అను సముద్రంలో కొట్టు మిట్టాడుతూ ఎన్నటికీ ఒడ్డుకు చేరుకో లేరు. ఇది ఎరిగిన వాడు పాపకార్యాలజోలికి వెళ్ళక ధర్మమార్గాన పయనిస్తాడు. మదమూ, అహంకారం విడిచి పుణ్యకార్యాలు చేస్తాడు. ధర్మాచరణ వలన మనసు నిర్మలమౌతుంది. కోరికలను విడిచి సుఖాలు ఎందుకూ పనికి రానివని గ్రహిస్తాడు. తపస్సు, ఇంద్రియ నిగ్రహం, సత్యం పలకడం మేలని గ్రహించి వాటిని ఆచరించి దైవత్వాన్ని పొందుతాడు.```
*ఇంద్రియ నిగ్రహం*```
కౌశికుడు ధర్మవ్యాధుని "ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటి? ఇంద్రియాలను నిగ్రహించకుంటే కలిగే పాపం ఏమిటి? ఇంద్రియాలను నిగ్రహించడం వలన కలిగే పుణ్యం ఏమిటి?" అని అడిగాడు.
ధర్మవ్యాధుడు కౌశికునితో “మనం మనసుతో విషయాలను గ్రహిస్తాము. మనస్సు ఎప్పుడూ కోరికలతో, కోపముతో నిండి ఉంటుంది. వాటి వలన లోభం ఏర్పడుతుంది. లోభంతో ఏర్పడిన విషయ వాంఛల వలన మానవుడు సదా సతమతమౌతుంటాడు. లోభికి కరుణ లోపించి పాపములతో కోరికలు తీర్చుకుంటాడు. మంచి మాటలు చెవికెక్కవు. దుర్మార్గులతో చెలిమి చేస్తాడు. చెప్పే మాటలకు చేసే పనికి పొంతన ఉండదు. అలాంటి వాడు దుఃఖంలో మునిగి తేలుతుంటాడు. కనుక మానవులు విషయ వాంఛలకు లొంగక జ్ఞానమార్గం అవలంభించి మోక్షప్రాప్తికి ప్రయత్నించడం ఉత్తమం" అన్నాడు.
"మహాత్మా! ఇంద్రియములను నిగ్రహించడం ఎలా? అని నన్ను అడిగారు. బ్రహ్మకోవిదులు చెప్పతగిన బ్రహ్మ విద్య గురించి నేను చెప్పకూడదు. కాని బ్రాహ్మణోత్తముడివి అడిగావు కనుక బ్రహ్మ కోవిదులకు నమస్కరించి చెప్తాను సావధానంగా విను. అనంతాకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి అనేవి పంచ భూతములు. మరలా భూమి నీటిలోను, గాలి అగ్ని లోను, అగ్ని వాయువులోను, వాయువు ఆకాశంలోను లీనమౌతాయి. మొదట ఆకాశానికి హద్దులు లేని అనంతాకాశం. అంతా చీకటి, శూన్యము. ఆ ఆకాశంలో నుండి ప్రచండ వాయువు, ఉధృతమైన గాలి ఆగాలిలోని ధాతు సంయోగంతో నీరు పుడుతుంది. ఆ నీరు ఘనీభవించి మంచుఖండాలు, ధూళి మేఘాలు ఏర్పడతాయి. అవి శిలా రూపం చెంది భూమి ఏర్పడుతుంది. మరలా అదే క్రమంలో ప్రళయ కాలంలో సముద్రాలన్నీ ఏకమై భూమి జలమయమౌతుంది. అనావృష్టి ప్రారంభమై ఎండలు అధికమై ఆ ప్రంచండాగ్నికి నీరు ఆవిరై వాయు రూపం పొంది ఆకాశంలో లయమౌతుంది. చెవితో వినడం, నాలుకతో రుచి చూడటం, కంటితో చూడటం, ముక్కుతో వాసన చూడటం పంచేద్రియాలు చేసే పనులు. అంటే పంచ భూతముల గుణములైన శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధాలు ఇంద్రియవిషయాలు. పంచేద్రియములకు మూలం మనసు. మనసు ఆరవది, బుద్ధి, అహంకారం మనసుకు తోడు మొత్తం ఎనిమిది. సత్వ, రజో, తమో గుణాలు మానవులకు సహజం. ఈ భూత ప్రపంచం అవ్యక్తము నుండి సృష్టింపబడి అవ్యక్తంలో లీనమౌతాయి. అవ్యక్తమనగా వ్యక్తముకానిది. కాని పంచేద్రియాలకు ఈ అవ్యక్త రూపం దైనందిన కార్యాలలో గోచరమౌతూ ఉంటుంది. అది నిరాకారమైన మనో భావనలో వివిధ రూపాలలో గోచరమౌతుంది. మానవులు పంచ గుణాలకు వశుడై భోగలాలసుడౌతున్నాడు. మానవుడు పంచేద్రియాలను అదుపులో పెట్టుకుని జీవిస్తూ జ్ఞాన సముపార్జన చేయాలి. జ్ఞానం కలిగిన వాడు అన్ని భూతాలలో తనను చూసుకుంటాడు. విషయవాంఛల నుండి మనసుని మళ్ళించడమే తపస్సు, వైరాగ్యం. ఇంద్రియముల నివారించిన స్వర్గం ఇంద్రియములకు లొంగి పోయిన నరకం. కోరికలతో సతమమయ్యే మనసును అదుపులో పెట్టుకోవడమే మోక్షం. దేహం రథమైతే ఇంద్రియాలే గుర్రాలు ఆత్మ సారథి, ధైర్యం పగ్గాలు. మానవుడు మనసును నిగ్రహించి ధైర్యమనే పగ్గాలతో ఇంద్రియాలనే గుర్రాలను అదుపు చేస్తూ మోక్షమనే గమ్యాన్ని చేరాలి. ఇంద్రియము పోవు చోటుకు మనసు పోతుంది కనుక ఇంద్రియములను అదుపు చేస్తూ జ్ఞాన యోగి సాగాలి.```
*(సశేషం)*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
సీతారామ కల్యాణము
సీతారామ కల్యాణము
జానక్యాః కమలామలాంజలీ పుటే
యాః పద్మరాగాయితాః
న్యస్తా రాఘవ మస్తకే చ
విలసత్కున్ద ప్రసూనాయితాః
స్రస్తా శ్శ్యామలకాయకాన్తి కలితా
యా ఇంద్రనీలాయితాః
ముక్తా స్తా శ్శుభదా భవన్తు
భవతాం శ్రీరామవైవాహికాః
శ్రీరామచంద్రుడు సీతామహాసతిన్
బరిణయం బాడెడి భవ్యవేళ
కాంతులీనెడి సీత కమలాంజలి పుటిని
బద్మరాగము భాతి పరిఢవిల్లి
మహానీయు రాముని మస్తకంబున నుండ
కుంద విరుల భంగి నందగించి
నీలమేఘచ్ఛాయ నెగడు శ్రీరాముని
తనువుపై జారెడి తరుణమందు
నింద్రనీలపుకాంతుల నినుమడించి
మోదమును గూర్చు చుండెడి ముక్తసేస
మిగుల శోభను వర్తిల్లి మించి సొగసు
ననయ శుభముల నిడుగాక నందఱికిని
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
దశరథుని అస్థానమున
26-01-2026
11) దశరథుని అస్థానమున
దృష్టి
జయంతుడు
విజయుడు
సిద్ధార్థుడు
అర్థసాధకుడు
అశోకుడు
మంత్రపాలుడు
సుమంత్రుడు అను ఎనిమిది మంది మంత్రులు గలరు.
12)దశరథుని ఆస్థానమున వసిష్ఠుడు వామదేవుడు అను ప్రధాన పురోహితులునూ ఇంకనూ జాబాలి మొదలగు పురోహితులునూ గలరు.
13)విభండకమహర్షి తనయుడు ఋశ్యశృంగుడు.
14)శాంత భర్త ఋశ్యశృంగుడు
15)సంతానము కొఱకై దశరథచక్రవర్తి పుత్రకామేష్టి యాగమును నిర్వహించెను.
*శ్రీరామచంద్రమూర్తీ ! నీవేగలవు తండ్రీ !*
🙏🙏🙏🙏
25, జనవరి 2026, ఆదివారం
భీష్మాష్టమి
🕉️ *రేపు భీష్మాష్టమి* 🕉️
రేపు భీష్మతర్పణ విధి. తల్లిదండ్రులు ఉన్నా సరే తప్పకుండా ఇవ్వాలి.
1) తల్లిదండ్రులు ఉన్నవారు కూడా ఈ తర్పణను ఇవ్వవలెను..
2) తండ్రి లేని వాళ్లు దక్షిణ దిశగా తిరిగి అపసవ్యంగా తిలలతో ఇస్తారు..
3) (జీవ పితరులు) తండ్రి ఉన్నవాళ్లు సవ్యముగా దేవతీర్ధము ద్వారా తూర్పు ముఖముగా యవలతో అక్షతలుతో ఇవ్వవలెను.
4) స్త్రీలు మటుకు తర్పణం ఇవ్వరాదు
5) సర్వులు ఆబాల గోపాలం ఇవ్వవచ్చని ఉన్నది.
6) భీష్మాష్టమి రోజు భీష్మునికి శ్రాద్ధము విధిగా జరిపిస్తే సంతానం లేని వారికి తప్పక సంతతి కలుగుతుంది అని భీష్మ ప్రతిజ్ఞ దేవతల అనుగ్రహం లభిస్తుందని పూర్వం నుంచి చెబుతున్న పెద్దల వాక్కు..
ఈ విధంగా యమ భీష్ములకు తర్పణము చేస్తే తప్పక వారి సంవత్సర ఆ క్షణం వరకు చేసిన పాపములు నశిస్తాయి. అని శాస్త్రవచనము.
సత్సంగం
*సత్సంగం* 🚩
*సుశీలో మాతృపుణ్యేన, పితృపుణ్యేన బుద్ధిమాన్,*
*ధార్మికో పూర్వపుణ్యేన, స్వీయపుణ్యేన భాగ్యవాన్*
*అందరికీ వారి పిల్లలు చక్కగా, నలుగురు మెచ్చుకునేలా ఉండాలనే కోరిక ఉంటుంది. అది సహజం కూడాను. కానీపిల్లలు బాగుండాలంటే, తల్లితండ్రులు కూడా ఎలా ఉండాలో చెప్తోంది ఈ శ్లోకం.*
*భావం: ఇది ఒక సుభాషితం, అంటే చక్కని సూక్తి. "తల్లి చేసుకున్న పుణ్యం వలన పిల్లలు మంచి శీలవంతులవుతారు. తండ్రి చేసిన పుణ్యం వలన చక్కటి బుద్ధిమంతులవుతారు. గతంలోనూ, గతజన్మల్లోనూ చేసుకున్న పుణ్యం ఫలితంగా ధర్మాత్ములవుతారు. తాను స్వయంగా చేసుకున్న పుణ్యవిశేష ఫలితంగా భాగ్యవంతులవుతారు."*
*పిల్లలు అంటే భావితరానికి వారసులు. వారు సౌశీల్యంతో ఉంటే, భావి సమాజంలో సంస్కృతీ, సంప్రదాయాలు బావుంటాయి. సమాజంలో గౌరవాదరాలు పొందుతారు.*
*తల్లి పెంపకంలో సౌశీల్యమూ, సహనమూ గురించి తెలుసుకుంటే, తండ్రి పెంపకంలో బుద్ధీ, వివేకం నేర్చుకుంటారు పిల్లలు. ఆ తరువాత తన వివేకం, విచక్షణలతో ధర్మాధర్మ విశ్లేషణ చేసి ధర్మకార్యాలు చేయగలుగుతారు.*
*'ఉత్తమం స్వార్జితం విత్తం' అని ధర్మశాస్త్రం చెప్తోంది కదా, ఆ విధంగా ధర్మార్జన చేసి భాగ్యవంతులవుతారు.*
*కనుక పిల్లలు సౌశీల్యంతో, బుద్ధిమంతులై, ధర్మపరులై, భాగ్యవంతులు కావాలంటే, ముందు తల్లితండ్రులు పుణ్యకార్యాలు చెయ్యాలి, ధార్మిక వర్తన అలవరచుకోవాలి.*
*ఇటువంటి సూక్తులు విని ఆచరిస్తే, వ్యష్టి, సమష్టి జీవితాలు బాగుంటాయి. వ్యష్టి అంటే వ్యక్తిగత, సమష్టి అంటే సామాజిక.*
*కనుక మనం నలుగురూ మెచ్చుకునే మార్గంలో నడుద్దాం, మన పిల్లలనూ అదే మార్గంలో నడిపిద్దాం. భావితరాలకు చక్కని సమాజాన్ని సిద్ధం చేద్దాం.*
*జై భారత్*🚩
ఔషధే చింతయే ద్విష్ణుం
🙏🏻 ఓం నమో నారాయణాయ నమః 🙏🏻
ఔషధే చింతయే ద్విష్ణుం
భోజనే చ జనార్ధనమ్ |
శయనే పద్మనాభం చ
వివాహే చ ప్రజాపతిమ్ ||
యుద్ధే చక్రధరం దేవం
ప్రవాసే చ ప్రజాపతిమ్ |
నారాయణం తనుత్యాగే
శ్రీధరం ప్రియసంగమే ||
దుస్స్వస్నే స్మర గోవిందం
సంకటే మధుసూదనమ్ |
కాననే నారసింహం చ
పావకే జలశాయినమ్ ||
జలమధ్యే వరాహం చ
పర్వతే రఘునందనమ్ |
గమనే వామనం చైవ
సర్వకాలేషు మాధవమ్ ||
షోడశైతాని నామాని
ప్రాతరుత్థాయ యః పఠేత్ |
సర్వపాప వినిర్ముక్తో
విష్ణు లోకే మహీయతే ||
ఔషధసేవనం బాచరించెడి వేళ
వినుతించ వలయును 'విష్ణు' నెపుడు
భోజనమ్మును తాను భుజియించు వేళలో
తలచ తగును 'జనార్దను'ని మదిని
శయనించు సమయాన సంతృప్తి తోడను
ప్రార్తించ వలయును 'పద్మనాభు'
ప్రార్థించవలె 'ప్రజాపతి' యంచు వినయాన
పరిణయ వేళందు భక్తితోడ
సమరంబు నందున 'చక్రధరా' యంచు
జపియించ వలయును జయము పొంద
పరదేశమున నుండ హరిని 'ప్రజాపతి'
యనుచు పలుకతగు న్నాత్మ యందు
తనువు నొదులు వేళ తా బల్క వలయును
'నారాయణా' యంచు నయము గాను
ప్రియసంగమమునందు ప్రియమార స్వామిని
'శ్రీధరా' యనుచును చెప్ప తగును
దుస్వప్నముల యందు దుఃఖించకను తాను
'గోవింద' యని మది కొలువతగును
సంకటసమయాల సద్భక్తి తోడను
'మధుసూద'ననతగు మదిని నరుడు
విపినంబునందున వెఱవక మనుజుండు
కోరి దల్చ తగును 'నారసింహు'
అగ్నిజ్వాలల మధ్య ననయంబు మదియందు
'జలశాయి' భజనమ్ము సల్ప తగును
పర్వతంబుల మధ్య 'పట్టాభిరఘురాము'
నెంచంగ వలయును నెపుడు నరుడు
గమనంబు నందున కల్కంగ నశ్రమ
భక్తి నెంచ తగును 'వామనుడి'ని
సర్వకాలములందు సర్వేశు "మాధవున్"
మదిదల్చ వలెనెప్డు మానవుండు
శుభము లిచ్చు "విష్ణు షోడశనామమ్ము "
లుదయ వేళ యందు చదివి తేని
సర్వ పాపరాశి సమసియున్ మనుజుండు
విష్ణునెలవు చేరు విమల మతిని.
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
24, జనవరి 2026, శనివారం
దానం అదొక యోగం.
దానం అదొక యోగం.... ఎంత సిరులు ఉన్న, ఆస్తులు ఉన్న, మేడలు ఉన్న, భూములు ఉన్న, దాన గుణము లేకపోతే మానవ జన్మ సున్నా.
అందుకనే పెద్దలు అంటారు
వంద మందిలో ఒక శూరుడు జన్మిస్తాడు....
వెయ్యి మందిలో ఒక పండితుడు జన్మిస్తాడు....
లక్ష మందిలో ఒక వక్త జన్మిస్తాడు...
కానీ కోటి మందిలో ఒక దానవుడు జన్మిస్తాడు....
💐 దానం చేయాలన్న మొదట దాన గుణం కలిగి ఉండాలి... ఆ తర్వాత దానిపై శ్రద్ధ ఉండాలి, ఆపై తాను చేసే దానం పై యోగ్యత కలిగి... జ్ఞానం కలిగి ఉండాలి.
🙏 భర్తృహరి అంటాడు
దానము వల్ల చేతులు ప్రకాశిస్తాయని....
🌷 మనుషులకే కాదు ప్రకృతిలో వృక్ష ,పశుపక్షాదుల ,జీవజాలానికి సేవ చేయడం కూడా దానమేఅని కూడా అంటారు
దానం లోని రకాలు
ధర్మం, అర్థం, భయం, కామం, కారుణ్యం.
🌹అసూయ లేకుండా ఇచ్చేదానం..... ధర్మదానం
🌹 యాచకులు ప్రశంసిస్తే.... అర్థదానం
🌹 దానం చేయకపోతే ఏం చేస్తారో అనే భయంతో ఇచ్చేదానం... భయ దానం
🌹 ఇష్టమైన వ్యక్తికి ఇస్తే... దానిని కామదానం
🌹 పేదవాడికి జాలితో ఇచ్చేది... కారుణ్య దానం
నీ శక్తి కొద్ది తోటి వారికి ఎంతోకొంత ఇవ్వటంలో ఎంతో ఆనందం ఉంటుంది...
👏 నీతి..... చాలామంది అనుకుంటారు తీసుకోవడంలో ఆనందం ఉంటుందని.... అది సరైనది కాదు ఇవ్వటంలోని ఆనందము , పరమానందము ఉంటుంది.
దానం చేసే వాడి చెయ్యి ఎప్పుడూ పై చేయి గానే ఉంటుంది....
🙏 ధన్యవాదములు.....
Venkateswara Rao
ఇదినిజం
*“క్షమించాలి ఇదినిజం..!”*
అది యూరప్,అమెరికా వాళ్ళ అసహాయత..!ఇది మన అనంతమైన అజ్ఞానం!✅ అదేమిటో తెలుసుకుందాం.
*1. తాజా ఆహారం అందుబాటులో లేక, వండుకోవడానికి సమయం కేటాయించుకో లేక, ఎప్పుడో నెలల క్రితం చేసిన రుబ్బిన పిండిని కేన్ లో వేసుకుని నిలవ పెట్టీ పెట్టీ దానితో రోజూ Pan కేకుల్నీ, ఆర్నెల్ల క్రితం చేసిన పిజ్జాలమీద, బంకలు సాగే కూరలు వేసుకుని తినాల్సిన ఖర్మపట్టడం అమెరికా, యూరప్ వాళ్ళ నిస్సహాయత..!
👉 56 రకాల భోజన వంటకాలను పక్కనపెట్టి ఎవడో ఏనాడో వండి పెట్టిన రొట్టెని కాలవలో పారెయ్యకుండా, ఫ్రిజ్ లో మురగబెట్టి పెట్టీ మోడ్రన్ స్టైల్ పేరుతో ఆ పిజ్జాల్ని వేడిచేసి ₹. 400 / - పెట్టి మరీ తినడం, ‘మన అజ్ఞానం..!!’
-క్షమించాలి ఇదినిజం..!!!✅
*2. ఎనిమిది నెలలు ఎముకలు కొరికే చలి తట్టుకోలేక, కోట్లూ సూట్లూ వేసుకోవడం ‘వారి నిస్సహాయత..!’
👉వేసవి వేడిలో చెమటలతో ఉక్కపోసి వళ్ళంతా జిడ్డుజిడ్డుగా అతుక్కుంటూ చిర్రెత్తిపోతున్నా కూడా పెళ్లి రోజు వెర్రిగా కోట్లూ సూట్లూ వేసుకుని తిరగడం ‘మన అజ్ఞానం..!!’
-క్షమించాలి ఇదినిజం…!!!✅
*3. తాజా భోజనం వండేవాళ్ళు లేక ఫ్రిజ్ వాడడం, అమెరికా, యూరోప్ వాళ్ళ నిస్సహాయత..!
👉 ప్రతిరోజూ తాజా కూరగాయలు వస్తున్నా, వారం రోజులు కూరగాయలు ఫ్రీజ్ లో కుక్కి కుక్కి అవి మురుగుతున్నవాటిని వండుకు తినడం, ‘మన అజ్ఞానం..!!’
-క్షమించాలి ఇదినిజం..!!!✅
*4 . ఔషధ మొక్కల జ్ఞానం లేక, మూలికలతో పరిచయం లేక,
వారు జీవ జంతువుల మాంసం తో కెమికల్స్ తో ఏవేవో మందులు తయారు చేయడం, వాటి సైడ్ ఎఫెక్ట్స్ కి వేరేవేరే రోగాల పాలవ్వడం ‘వారి నిస్సహాయత..!’
👉 మరి ఆయుర్వేదం లాంటి గొప్ప చికిత్సా విధానం తెలిసినప్పటికీ, పట్టించుకోకుండా... కెమికల్ మందులు ఉపయోగించడం, సైడ్ ఎఫెక్ట్ లతో కొత్తరోగాలు తెలిసితెలిసి తెచ్చుకోవడం.. ‘మన అజ్ఞానం..!!
-క్షమించాలి ఇదినిజం..!!!✅
*5. సరిపడ ధాన్యం లేక పంటలు పండక పళ్ళూ కాయలూ దొరకకా పాముల్ని, కప్పల్నీ, కుక్కల్ని, నక్కల్ని కూడా చంపి తినడం.. ‘వాళ్ళ నిస్సహాయత...!’
👉 మరి 1600 రకాల ఆహార ధాన్యాలు లభిస్తున్నా వాళ్ళల్లా తినడానికి ప్రయత్నించడం ‘మన అజ్ఞానం..!!’
-క్షమించాలి ఇదినిజం!!!✅
*6. కొబ్బరి నీళ్ళూ, మామిడి రసాలు, బత్తాయి పళ్ళూ, సపోటా, అంబలి, చల్ల, మజ్జిగ, పాలు మొదలైనవి లేకపోవడం లేదా తెలియకపోవడం వల్ల పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు తాగడం ‘వారి నిస్సహాయత...!’
👉 అవన్నీ కాక ఎన్నో రకాల ప్రాకృతిక పానీయాలు అందుబాటులో ఉన్నా... పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు అనే విషాన్ని తాగడం ఆధునికంగా అభివృద్ది చెందామని భావించండం ‘మన అజ్ఞానం..!!’
-క్షమించాలి ఇదినిజం!!!✅
*7. వాళ్ళ పంపుల్లో నీళ్ళు గడ్డకడుతుంటే టాయిలెట్ కి వెళ్ళిన తరవాత కడుక్కోలేక టిష్యూ పేపర్లతో తుడుచుకొని (PMతో)తిరగడం,
చలి వలన స్నానం చెయ్యలేక సెంటేసుకుని పడుకోవడం..
‘వాళ్ళ నిస్సహాయత...!’
👉 సుబ్బరంగా మనకు నీళ్ళొస్తున్నా కడుక్కోకుండా తుడుచుకొని, సెంటేసుకుని (PM)తో తిరగడం .. ‘మన అజ్ఞానం..!!’
-క్షమించాలి ఇదినిజం!!!✅
*8. ఎలాంటి ముందుచూపూ లేక, మరుగుదొడ్ల నీళ్ళని నదుల్లో కలుపుకోవడం మళ్ళీ వాటినే శుభ్రం చేసుకుని తాగడం ‘వాళ్ళ బుద్దిహీనత!
👉 అన్నీ తెలిసి తెలిసి వాళ్ళని గుడ్డిగా అనుసరించి అదే అభివృద్ది అనుకుని మనం కూడా మన నదుల్ని మురికి కూపాలు చేసుకుని మంచినీటి కోసం ఏడవడం ‘మన అజ్ఞానం!!
-క్షమించాలి ఇదినిజం!!!✅
*9. తోటలూ మొక్కలూ లేక ఎక్కడో ఎవరి దగ్గరో బానిసలా బతికడం కాయలూ పళ్ళూ కొనుక్కు తెచ్చుకోవడం. సరియైన కుటుంబ వ్యవస్థ లేకపోవటం వల్ల, నా అనే వాళ్ళు లేక, అశాంతిగా ఒంటరిగా జీవించడం ‘వాళ్ళ నిస్సహాయత...!
👉 చక్కగా పల్లెల్లో ఫాం హౌసుల్లాంటి ఇళ్ళల్లో, చక్కని ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో, పెరట్లో బోలెడన్ని మొక్కలేసుకుని, చెట్టుకి పండిన కాయలూ పళ్ళూ తిన్నన్ని తిని పక్కవాళ్ళకిచ్చి సంతోషంగా, అందరితో కష్ట సుఖాలను పంచుకుంటూ, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించే మనం...
ఆ అమెరికా, యూరోప్ వారిని అనుకరించడం... ఇలా కొట్టుకు చస్తూ, ఏడుస్తూ బతకడం... ‘మన అజ్ఞానం!!
-క్షమించాలి ఇదినిజం!!!✅
*10. చెట్లు పెంచుకోవడానికి ఏ ఎరువెయ్యాలో తెలియక రసాయనిక మందులేసుకోవడం కడుపులో ఎసిడిటీలు, కేన్సర్లూ తెచ్చుకోవడం ’వాళ్ళ నిస్సహాయత...!
👉 ఇంట్లో వుండే ఎద్దులూ, ఆవులు, గేదెలు, కోళ్ళు, మేకల మల మూత్రాలను బయో ఫెర్టిలైజర్స్ గా, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ గా వాడుకుంటూ హాయిగా ఆరోగ్యంగా బతికిన మనం...
వాటిని వదిలి అమెరికా, యూరోప్ వాళ్ళ మోజులో పడి వాళ్ళని అనుసరించి, మనం కూడా
ఆ క్రిమిసంహారక మందులే వాడుతూ, ఇమ్యూనిటీ నాశనం చేసుకుంటూ ఆ రోగాలే తెచ్చుకోడం ‘మన అజ్ఞానం!!
-క్షమించాలి ఇదినిజం!!!✅
*11. ఒక్కోసారి ఆరునెలల పాటు వాళ్లకు సూర్యుడు కూడా కనిపించడు కనక వాషింగ్ మెషిన్ లో ఉతికేసిన బట్టలు సూర్యరశ్మిలో ఎండబెట్టే అవకాశం లెక డ్రైయ్యర్లో ఆరబెట్టుకుంటూ వాటికున్న ఎరోబిక్ ఎనరోబిక్ బాక్టీరియాల్లో కొన్ని చావకపోయినా హానికరమైన కెమికల్స్ వేసుకుని బతకడం ‘వాళ్ళ నిస్సహాయత...!
👉 హాయిగా ఎంతో ఆరోగ్యాన్నిచ్చే సూర్యరశ్మి నిండుగా వున్నా వాషింగ్ మెషిన్లో ఉతికిన బట్టల్ని అందులోనే ఆరబెట్టుకోవడం మన బుద్దిహీనత ‘మన అజ్ఞానం!!
-క్షమించాలి ఇదినిజం!!!✅
*12. గడ్డకట్టేసిన నీటితో స్నానం చెయ్యలేక శానిటైజేషన్ పేరుతో మురికి చేతులపైనే పురుగులమందులు జల్లుకుంటూ...
అవే బట్టలతో ఇల్లంతా తిరగడం, మంచాల మీద పడుకోవడం... వాటివల్ల మాటిమాటికీ రోగాలు తెచ్చుకోవడం మందులు మింగడం ‘వాళ్ళ నిస్సహాయత...!
👉హాయిగా నీళ్ళొస్తున్నా స్నానం చెయ్యకుండా స్టైల్ పేరుతో కుక్కకంపు కొట్టే సెంట్లు కొట్టుకుంటూ తిరగడం ‘మన అనంతమైన అజ్ఞానం!! -మరోసారి మళ్ళీ క్షమించాలి. ఇదినిజం!!!✅
*13. దూరంగా నిలబడి ఆహ్వానించడం, నమస్కరించడం,
చెప్పులు వేసుకుని ఏ ఇంట్లోకి వెళ్ళక పోవడం,
కాళ్ళు చేతులూ కడుక్కోవడానికి బకెట్ తో నీళ్ళివ్వడం మన సంస్కారం. మన పెద్దలు మనకు నేర్పిన అత్యుత్తమ సంస్కారం. దాన్ని వదిలేసి ఇవ్వాళ ఏడవడం ‘మన అజ్ఞానం.!!
-క్షమించాలి ఇదినిజం!!!✅
*14. విపరీతమైన చలికి తట్టుకోలేక ఇంటాబయటా అవే సాక్స్ అవే బూట్లతో తిరగడం ‘వాళ్ళ నిస్సహాయత.
👉ఇంట్లోకి వచ్చేముందు చెప్పులు గుమ్మం బయటే వదిలెయ్యడం, బయట తిరిగిన బట్టల్ని బాత్ రూములొ తడిపేసి స్నానం చేసి ఇంట్లోకి రావడం మన పద్దతి. అలాంటి పద్దతుల్ని చాదస్తం పేరుతో... ఆలోచన లేకుండా వదులుకోవడం ‘మన అజ్ఞానం!!
-క్షమించాలి ఇదినిజం!!!✅
మనం ఎంతో ఆత్మీయత గుండెల్లో పొంగితే కానీ చేతులు పట్టుకోలేం, హత్తుకుని కౌగిలించుకోలేం. తల మీదో బుగ్గల మీదో ముద్దులు పెట్టుకోలేం కానీ అవి అమెరికా వాళ్ళకి అత్యంత సహజం..
కానీ నేడు దాన్ని వద్దంటోంది ప్రపంచ ఆరోగ్య మానవాళి... అంతా
భారతీయుల్ని చూసి క్వారంటైన్ జ్ఞానం నేర్చుకుంటోంది, నేర్చుకోమంటోంది.
కనీసం ఇప్పటికైనా మనం మన మడి ఆచారాలను మళ్ళీ పాటించడం ప్రారంభించకుంటే అది ‘మన అజ్ఞానం!!
-క్షమించాలి ఇదినిజం!!!✅
జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ అజ్ఞానం అంతా వాళ్ళని చూసి మనకుగా మనం తెచ్చిపెట్టుకున్న అజ్ఞానం...
మన బానిస మనస్తత్వ అజ్ఞానం...
విదేశీ వ్యామోహ అజ్ఞానం...
కరోనా లాంటి వైరస్ లను కొంపమీదకు తెచ్చిపెట్టుకునే అజ్ఞానం...
అమెరికాలో యాపిల్ ఫోన్ అంత మంచిఫోన్ మరొకటి లేదు.
అన్నది ఎంత నిజమో...
అమెరికా, యూరోపియన్ ప్రజలు తినేంత అనారోగ్యకరమైన ఆహారం...
వాళ్ళ కున్నన్ని ఆర్టిఫిషల్ అలవాట్లు కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేవు. అన్నది కూడా అంతే నిజం..!
ఆధునీకరణ, ఫ్యాషన్, మొదలగు పేర్లతో ఋషులు మనకు అందించిన
దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా...
ప్రాకృతిక జీవనాన్ని వదిలేసుకోవడం మన అజ్ఞానం!
🙏 *క్షమించాలి ఇదినిజం*🙏
కావున*వేటిని స్వీకరించాలో వాటినే స్వీకరిద్దాం...!కానీ గుడ్డిగా...మోజుతో
వెర్రిగా...అనాలోచనతో...అనుకరిస్తే...
పోతాం!
ఏం వచ్చి పోతాం? కరోనా లాంటివి వచ్చి పోతాం!. ✍️
. *రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పుదాం
➖▪️➖

