15, అక్టోబర్ 2024, మంగళవారం

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - శరదృతువు - ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం  -  త్రయోదశి - పూర్వాభాద్ర -‌‌ భౌమ వాసరే* (15.10.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మనస్సు, మేఘం

 మనస్సు, మేఘం రెండూ ఒక్కటే.

మేఘం తనలోని బరువు మోయ లేక వర్షం రూపంలో జల్లులు కురిపిస్తుంది.

మనస్సు తనలోని బాధను అణుచుకోలేక కన్నీటి రూపంలో నీరుని కారుస్తుంది.సంస్కారం అనేది పుట్టుకతో రాదు. తల్లితండ్రుల పెంపకం, గురువుల బోధన, సమాజంతీరు,మనం చేసుకొనే స్నేహితుల వలనే సంస్కారం అలవడుతుంది."

"ఆవేశం అదుపు తప్పితే వివాదం.

వేగం అదుపు తప్పితే ప్రమాదం.

అహంకారం అదుపు తప్పితే పతనం"🙏Good Morning 🙏శుభోదయం 🙏🏻

మంగళవారం*🍁 🌹 *15, అక్టోబర్, 2024*🌹

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     🍁 *మంగళవారం*🍁

🌹 *15, అక్టోబర్, 2024*🌹

      *ధృగ్గణిత పంచాంగం*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - శరత్ఋతౌః*

*ఆశ్వీయుజ మాసం - శుక్లపక్షం*


*తిథి     : త్రయోదశి* రా 12.19 వరకు ఉపరి *చతుర్ధశి*

*వారం:మంగళవారం*( భౌమవాసరే )

*నక్షత్రం  : పూర్వాభాద్ర* రా 10.08 వరకు ఉపరి *ఉత్తరాభాద్ర*


*యోగం  : వృద్ధి* మ 02.15 వరకు ఉపరి *ధృవ*

*కరణం  : కౌలువ* మ 02.03 *తైతుల* రా 12.19 ఉపరి *గరజి*


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 11.00 - 01.00 సా 05.00 - 06.00*

అమృత కాలం:*మ 03.00 - 04.26*

అభిజిత్ కాలం  : *ప 11.29 - 12.16*


*వర్జ్యం          : ఉ 06.26 - 07.51*

*దుర్ముహూర్తం  : ఉ 08.21 - 09.08 రా 10.40 - 11.29*

*రాహు కాలం :మ 02.49 - 04.18*

గుళికకాళం      : *మ 11.53 - 01.21*

యమగండం    :  *ఉ 08.56 - 10.25*

సూర్యరాశి : *కన్య* 

చంద్రరాశి : *కుంభం/మీనం*

సూర్యోదయం :*ఉ 06.00* 

సూర్యాస్తమయం :*సా 05.46*

*ప్రయాణశూల  : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 06.00 - 08.21*

సంగవ కాలం    :    *08.21 - 10.42*

మధ్యాహ్న కాలం :*10.42 - 01.04*

అపరాహ్న కాలం :*మ 01.04 - 03.25*

*ఆబ్ధికం తిధి      : ఆశ్వీయుజ శుద్ధ త్రయోదశి*

సాయంకాలం  :  *సా 03.25 - 05.46*

ప్రదోష కాలం   :  *సా 05.46 - 08.13*

రాత్రి కాలం     :  *రా 08.13 - 11.29*

నిశీధి కాలం     :*రా 11.29 - 12.18*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.22 - 05.11*

________________________________

         🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

      

🌹 🙏 *అంజని పుత్ర స్తోత్రం..!!*🍁


ఉష్ట్ర వాహన హనుమంత

ఊహాతీతా హనుమంత

జయ బజరంగబలి 

జయజయ జయ బజరంగబలి

     

           🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

14, అక్టోబర్ 2024, సోమవారం

మొబైలు వాడని తల్లి కావాలి*

  *మొబైలు వాడని తల్లి కావాలి*


ఈ సంఘటన మీ హృదయాలను కదల్చివేయగలదు. 


అది ఒక పాఠశాలలోని ఐదవ తరగతి గది. విద్యార్థులందరు పది సంవత్సర వయస్సుగల పిల్లలే. ఏమీ తెలియని చిన్నారి దశ. ఇప్పుడిప్పుడే కొద్దిగా లోకం పోకడకు అలవాటు పడుతున్నారు. ఆ తరగతి ఉపాధ్యాయిని వాళ్ళందరికి మీ మీ తల్లులను మీరు ఎలా ఎలా ఇష్టపడుతున్నారు అని కాగితంలో ఒక చిన్న ఫేరా వ్రాయమని పురమాయించారు. 


అందరూ వాళ్ళకు తోచిన విధంగా వ్రాయడం మొదలుపెట్టారు. ఒక విద్యార్థిని వ్రాసిన కథనం ఇదిగో.


*నాకు ఎప్పుడూ నాతో బాటే ఉండే ఆఫ్ లైన్ (offline) అమ్మ కావాలి. మా అమ్మ ఎల్లవేళలా ఆన్ లైన్ (online) లోనే ఉంటున్నారు. నాతో మెలిగే సమయం కన్నా వారు మొబైలుతోటే ఎక్కువ సమయం వెచ్చిస్తారు. నేనూ ఒక మొబైలులా పుట్టి ఉంటే ఎంచక్కా మా అమ్మకు తోడుగా ఉండేదాన్నో. తను ఎక్కడికి వెళ్ళినా తనతో బాటే నన్ను తీసుకెళ్ళేది కదా*. 


*అందువలన నాకు ఈ మొబైలు వాడకాలు, సాంకేతిక పరిజ్ఞానం లేని నిరక్షరాస్యులైన అమ్మనే కావాలి. అంటే ఎల్లకాలం నాతోనే గడిపే ఆఫ్ లైన్ అమ్మ అన్నట్టు*. 


*మా ఎప్పుడూ జీన్సులు, టీ షర్టులు, చూడిదార్లు, లెగ్గింగులు, నైటీలు ధరించకూడదు. చోటూ వాళ్ళ అమ్మలాగా ఎల్లవేళలా ఎంతో హుందాగా కనబడే చీరలోనే కనబడాలి. నా ఒడిలో తల బెట్టి నన్ను ఎప్పుడూ ముద్దులతో ముంచెత్తాలి*. 


*మొబైలు వాడని అమ్మలే వారి వారి కుటుంబానిపై, తండ్రిపై, పిల్లలపై ఎక్కువ సమయాన్ని కేటాయించగలరు*.


*ఆఫ్ లైను తల్లైతే ఇంట్లో ఎటువంటి వివాదాలు, తగాదాలు తలెత్తవు. అమ్మలు చాలా ఓర్పుతో ఉంటారు కాబట్టి ఇలాంటి కలహాలను ప్రోత్సహించరు. అందరికీ అందుబాటులో ఉంటూనే వారి కార్యక్రమాలను కూడా ఎంతో నేర్పుతో కొనసాగించగలరు*.


*మా ఇంట్లో ఎప్పుడెప్పుడు కరెంటు పోతుందానని ఎదురుచూస్తూనే ఉంటాను. ఎందుకంటే కరెంటు పోతే వైఫై పనిచేయదు కాబట్టి ఇక మొబైలును పక్కన బెట్టి మా అందరితోనూ పిచ్చాపాటి మాట్లాడడమే*. 


*ఆఫ్ లైన్ అమ్మ అయితే నాకు ఎంచక్కా పడుకొనే ముందు రామాయణ మహాభారత కథలు చెప్పగలదు కదా. అవి వింటూ నేను నిద్రలోకి జారిపోయేదాన్ని. కాని ఇప్పుడైతే పరుపు మీద పడుకొంటేనే చాలు ఇక విడియో గేమ్స్ ఆడుకోవడమే. నాకైతే ఇవన్నీ రోత రోతగా ఉందన్నట్టు*. 


ఆ విద్యార్థిని  ఇంత పెద్ద వ్యాసం వ్రాయడాన్ని గమనించి ఉపాధ్యాయిని తరగతిలో అందరికి వినబడేటట్టు దాన్ని చదివారు. విద్యార్థులు అందరూ అది విని, చిన్న పిల్లలు కదా, ఘొల్లున ఏడ్వడం మొదలెట్టారు. అందరిని ఆ వ్యాసం అంతలా కదిలించింది. 


అమ్మలందరికీ విన్నపం ఏంటంటే, మీరందరు ప్రస్తుత తరానికి చెందినవారే. ఎంతో చదువుకొని, సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో నిత్యనూతనంగా మెలిగేవాళ్ళే. కాని మీ చిన్నారి పిల్లల గురించి ఆలోచించండి. వారు ఎలా మీ లాలింపుల గురించి ఎదురుచూస్తున్నారో. ఈ రోజుల్లో చరవాణి వాడిని యువతీయువకులు కనబడరు, నిజమే. కాని అదే జీవితం కాదు, లోకం కాకూడదు. మీ కుటుంబానికి కూడా మీరు సమయాన్ని కేటాయించాలి. మీ పిల్లలే భావిభారత పౌరులు. వాళ్ళందరిని చక్కదిద్దే బృహత్తర కార్యక్రమం మీ పైనే ఉంది. మీ ఆలనాపాలనలు వారికి ఎంతో ముఖ్యం. వారందరిని ఈ చిన్నారి దశలోనే తీర్చిదిద్దాలి. ఒక్కసారి పెరిగిన తర్వాత వారు మీపై ఎక్కువ ఆధారపడరు కదా. 


మీరే వారందరికి స్ఫూర్తినిచ్చి వారి భవిష్యత్తుకు చక్కటి పూలబాట వేయాలి. తల్లులే కాదు, తండ్రులకు కూడా ఈ గురుతర బాధ్యతలు వర్తిస్తాయి సుమా. 


కుటుంబ వ్యవస్థ క్షీణించకుండా పిల్లలందరూ అస్తవ్యస్తంగా మెలగకుండా ఉండడానికి తల్లిదండ్రులు వారి వారి బాధ్యతలను గుర్తించి కుటుంబాలను చక్కదిద్దుకుంటారని ఆశిస్తూ ఈ సందేశం అందరికీ అంకితం.

సోమవారం*🕉️ 🌹 *14, అక్టోబర్, 2024*🌹

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🕉️ *సోమవారం*🕉️

🌹 *14, అక్టోబర్, 2024*🌹

      *ధృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - శరత్ఋతౌః*

*ఆశ్వీయుజ మాసం - శుక్లపక్షం*


*తిథి     : ఏకాదశి* ఉ 06.41 *ద్వాదశి* రా 03.42 తె వరకు

*వారం: సోమవారం*(ఇందువాసరే)

*నక్షత్రం  : శతభిషం* రా 12.43 వరకు ఉపరి *పూర్వాభాద్ర*


*యోగం  : గండ* సా 06.01 వరకు ఉపరి *వృద్ధి*

*కరణం  : భద్ర* ఉ 06.41 *బవ* సా 05.15 ఉపరి 

*బాలువ* రా 03.42 తె ఆపైన *కౌలువ*


*సాధారణ శుభ సమయాలు* 

 *ఉ 06.00 - 07.00 సా 04.00 - 06.00*

అమృత కాలం  :*సా 06.09 - 07.37*

అభిజిత్ కాలం  :*ప 11.30 - 12.17*


*వర్జ్యం          : ఉ 09.25 - 10.52*

*దుర్ముహూర్తం  : మ 12.17 - 01.04 & 02.38 - 03.25*

*రాహు కాలం : ఉ 07.28 - 08.56*

గుళికకాళం      : *మ 01.22 - 02.50*

యమగండం    : *ఉ 10.25 - 11.53*

సూర్యరాశి : *కన్య* 

చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం :*ఉ 06.00* 

సూర్యాస్తమయం :*సా 05.47*

*ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 06.00 - 08.21*

సంగవ కాలం   :      *08.21 - 10.42*

మధ్యాహ్న కాలం :*10.42 - 01.04*

అపరాహ్న కాలం:*మ 01.04 - 03.25*

*ఆబ్ధికం తిధి:ఆశ్వీయుజ శుద్ధ ద్వాదశి*

సాయంకాలం :  *సా 03.25 - 05.47*

ప్రదోష కాలం   :  *సా 05.47 - 08.13*

రాత్రి కాలం      :  *రా 08.13 - 11.29*

నిశీధి కాలం     :*రా 11.29 - 12.18*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.22 - 05.11*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*

  

    🕉️ *శ్రీ శివ తాండవ స్తోత్రం*🕉️


జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణా మణిప్రభా

కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే 

మదాన్ధ సిన్ధుర స్ఫురత్త్వ గుత్తరీయ మేదురే

మనో వినోద మద్భుతం బిభర్తు భూత భర్తరి 


🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

జమునకుc గ్రింది భాగమునc జల్లదనంబట జూచితే కవీ!*

 *జమునకుc గ్రింది భాగమునc జల్లదనంబట జూచితే కవీ!*

ఈ సమస్యకు నాపూరణ. 



అమలిన భక్తి భావముల నార్ధ్రత పైకొన తన్మయత్వమున్


సుమముల నెంచి నన్నిటను సుందర మూర్తుల మోములన్నిటిన్


కమలపు సామ్యమున్ దెలిపి  కావ్యము లల్లరె గొప్పదైన కం


జమునకుc గ్రింది భాగమునc జల్లదనంబట జూచితే కవీ!


అల్వాల లక్ష్మణ మూర్తి.

హైందవం వర్ధిల్లాలి 28*

 *హైందవం వర్ధిల్లాలి 28*


సభ్యులకు నమస్కారములు.


*మహిళా గౌరవం.  అశ్లీలతలకు తావివ్వని విధంగా సముచిత, సమున్నత స్థానం స్త్రీల కివ్వాలి, గౌరవించాలి* :-  

సృష్టిలో సమాన భాగస్తురాలు స్త్రీ అను విషయము జగద్విదితమే. స్త్రీమూలకమే ఈమానవ సృష్టి అనునది కూడా విశ్వ సత్యమే.*వారిని గౌరవించడం మానవ లక్షణం*. ఎవరి విషయంలో నైనా మర్యాదలు పాటించాలి అను అంశము *ముఖ్యంగా* స్త్రీల విషయము వచ్చినప్పుడు *ఈ యువతరాన్ని (30 ల లోపు) మినహాయించి*   మిగతా వారు హైందవ ధర్మములు, సంస్కృతి,  సంప్రదాయములు తెలిసిన వారెవరైనా పురాణ, ఇతిహాస గ్రంథాలను, అందులోని  సన్నివేశాలను మననం చేసుకుంటారు. బృహత్సంహిత లోని ఒక చరణం పరిశీలిద్దాము. *గుణాదికాస్తా మనునాత్ర చోక్తం, ధార్ ష్ట్యేన పుంభీః ప్రమదా నిరస్థాః*. అర్థం:- స్త్రీలు పురుషులకంటే ఏ మాత్రము తక్కువ కారు, సరికదా ఒక్కొక్క దగ్గర వారు పురుషుల కంటే శక్తిమంతులు, గొప్పవారు కూడా. ఇతిహాస గ్రంథాలలోనే మరియొక మాట గూడా గమనించాము. స్త్రీని అవమానించిన రావణుడు, ధృతరాష్ట్రుడు సమూలంగా నశించారు. యుగాలు మారినా వారి అపకీర్తి మాసిపోలేదు. *ఈ కలియుగపు  ఆల్ఫాయుష్కులు స్త్రీలనవమానించి మనుగడ సాగించగలరా.* చట్టపు కబంధ (ఎంత దూరమైనా వెళ్లగల) హస్తాలు, విధిగా కాలం విధించే  ప్రతిక్రియల వలన దుర్గతులు తప్పవు, ఇది తథ్యము. 


ప్రస్తుత జెట్ మరియు రాకెట్ యుగంలో ఇంకా మను స్మృతులు, సంహితలు అవసరమా అని యువతరం చమత్కరిస్తూ, హేళనచేస్తూ ఉంటుంది.  మంచి ఎక్కడున్నా, ఎవరు చెప్పినా  స్వీకరిద్దామని  గత వ్యాసాలలో  యోచనచేశాము.


*సమాజం స్త్రీల  రక్షణ మరియు గౌరవార్థం కొన్ని మార్గ దర్శక సూత్రాలు  పాటించాలి*. సమాజమంటే పురుష సమాజమే కాదు స్త్రీ సమాజం కూడా. కళాశాలలో రాగింగ్ సంస్కృతికి స్వస్తి చెప్పాలి. గృహాలలో అత్త  మామలు కోడళ్లను, కొడుకులు కోడళ్ళు అత్తమామలను, తల్లి  తండ్రులను క్షోభ పెట్టరాదు. పెద్దవారు చిన్నవారి పట్ల ప్రేమాభిమానాలు, చిన్న వారు పెద్ద వారి పట్ల భక్తి గౌరవాభిమానాలు చూపెట్టాలి. పట్నాలు, నగరాలకు వచ్చిన, వస్తున్న గ్రామీణ అమాయక యువతులను కాపు కాసి, మభ్య పెట్టి గల్లంతు చేసే దుష్టులను, దుండగులను చట్టానికి అప్పజెప్పాలి. ఆడపిల్లలను మాయం చేసేవారు, వేశ్యా గృహాలకు తరలించే  నీతి తప్పిన మూఠాలున్న, ఇటువంటి   సమాజంలో ఇంకా ఎన్నెన్నో అరాచకాలు. *ఇంకా వివరమైన సోదాహరణ ప్రయత్నము కూడదనిపిస్తుంది*. 


ఇవన్నీ తెలువని వారెవరు ఇంత పొడిగింపు అవసరమా అని సభ్యులకు తలంపు రావచ్చును. తరం మారుతున్నది. పెద్ద తరం (50 నుండి 80) వారికి ఇవన్నీ అనుభవేకవేద్యమే, కాని యువతరం (15 నుండి 50 వరకు)  వారికి గూడా ఈ సమాజ, సహజ బాధ్యతలు తెలిసి ఉండాలి.


హిందూ సమాజం ముఖ్యంగా భారతీయ సమాజం నిస్సత్తువగా, నిర్లిప్తంగా, అచేతనంగా ఉండవద్దు, ఆ భావనలను ఇప్పటికైనా త్రుంచివేయాలి. *కనీసం ఇతర మతస్తుల ఏకీ భావం చూసైనా నేర్చుకుందాము*.ఆ జాతిలో ఏ  ఒక్కరికీ అపకారం, అన్యాయం జరిగినా  *ఆ జనాలు*  గుంపులు గుంపులుగా వచ్చి చేరుతారు, *వారిని ఆదుకుంటారు*.   ఇతర జాతులు హిందువులను  హింసించినా దోపిడి, దౌర్జన్యం  చేసినా  హిందు ఆడపిల్లలపై, గృహిణులపై అఘాయిత్యాలు చేసినా హిందువులు  వెంటనే స్పందించాలికదా.  చేవ, చైతన్యం, స్పందన లేని మతం హిందు మత మొక్కటే అను అపప్రథ విశ్వ మంతా వ్యాపించకముందే ముందే  మేల్కొందాము. హిందువులలో విద్యాధికులు, ,మేధావులు

అధికారులు, సమాజ సంస్కర్తలు, ప్రజా నాయకులు, మహిళా సంఘాలు ఇంకా ఎన్నెన్నో సాంఘిక స్పృహ కల్గిన బృందాలు, సంస్థలు దేశభక్తిని  నింపేవి దేశ ప్రజను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాయి కూడా. *వీటన్నిటి కర్తవ్యం నిరంతరం సమాజమును ఎప్పటికప్పుడు గమనిస్తూ, అమాయకులను ఆపదల నుండి రక్షించు చర్యలు చేపడ్తూ ఉండాలి. బలహీనులైన వారిని  స్త్రీ మరియు పురుష బేధం లేకుండా ఆదుకోవాలి.* కావున  *ఐక్యతతో* మన హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి. 


ధన్యవాదములు.

*(సశేషం)*

మూడు నియమాలు -2, Mudu Niyamaalu


 

శివ మహిమ

 శివ  మహిమ-- ధూర్జటి !


             మ:  తన యిల్లా లఖిలైక  మాత ,  తన  సంతానంబు  భూతవ్రజం ,


                     బను లాపంబులు  వేదముల్ , తన  విహారాగారముల్  మౌనిహృ


                      ద్వనజంబుల్ , తన  సేవకుల్  కమలజాత  శ్రీధరుల్గాఁ  జెలం


                       గిన  దేవోత్తము  నమ్మహాత్ముఁ  దరమే  కీర్తింపఁగా   నేరికిన్ ?


                             శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యము- అవతారిక -10 వపద్యము:  మహాకవి  ధూర్జటి .


                                     శ్రీ కృష్ణరాయ సార్వ భౌముని భువన విజయమునలంకరించిన యష్టదిగ్గజ కవులలో  నొకడు ధూర్జటి!


పరశివ తత్వము ననుసరించెడి శైవుడు. అయిన నేమి యతడు మానసికముగా నద్వైతి. శివకేశవుల యెడ నారాధనా భావముగలవాడు. శ్రీ కాళహస్తీశ్వర శతకము. శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యము  ఇతని రచనలు. రెండును పరమేశ్వరాంకితములే!

ఇదియాతని స్వతంత్రతకు నిదర్శము. రాయల కొలువున నున్నను రాచరికమును తూర్పారబట్టిన ఘనుడు ధూర్జటి.


                 " రాజుల్ మత్తులు  వారిసేవ  నరకప్రాయంబు"- అంటూ రాజసేవ యెంత  దుర్భరమైనదో వివరించినాడు.


                ప్రస్తుత పద్యము శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యమున  అవతారిక లోనిది. తన గ్రంధమునకు కృతిపతియగు పరమశివుని

గూర్చి సభక్తికముగా చేసిన విన్నపమిది.  స్వామీ  సర్వశక్తి సమన్వితుడవే , నిన్నేమని ప్రస్తుతించనయ్యా! అదినాతరమా! అంటూ

పరమ శివునకు గల ప్రత్యేకతలను  యీవిధముగా ప్రకటించుచున్నాడు.


             తనయిల్లా లఖిలైకమాత !  లోకమాత  యైన  జగజ్జననినియగు  పార్వతీమాత  నీకు భార్య. 


                  లోకంలో  అందరూ అనేమాట - "యిల్లాలివల్ల యింటికి పేరని'  పార్వతి జగజ్జనని . 'ఆకీట బ్రహ్మ పర్యంతం' యీసృష్టకంతకూ

ఆమెయే జనని ,అంటే విశ్వజనని."యాదేవీ సర్వ భూతేషు ప్రాణరూపేణ సంస్థితా  నమస్తస్యై  నమస్తస్యై  నమస్తస్యై నమోనమః" అంటున్నాయి పురాణాలు. కాబట్టి సర్వలోక సంరక్షణాభారమును మోసేతల్లి నీయిల్లాలు. ముగురమ్మల మూలపుటమ్మ. ఆయమ్మకు అనుశాసకుడవీవు స్వామీ ! నీవైభవమేమని చెప్పను?


                     ఇక  నీ సంతానమా  సర్వ భూత సముదాయము. ఇక్కడ భూతమనగా పిశాచమని భావింపరాదు. ప్రకృతిని నడిపించు శక్తులుగా  భావించాలి. ఫలితార్ధం . సర్వప్రకృతిని శాసింపగల వారు నీసంతానం.తద్వారా ప్రకృతియంతా నీవశంస్వామీ!

నీకు గనక కోపంవస్తే లోకాలన్నీ  మాయమే! 


         "  అనులాపంబులు   వేదముల్"-        


   నీ నోట పలికే మాటలన్నీ  వేదములే!  నీవు వేద ప్రచోదకుడవు. నీయనుగ్రహము వలననే వేద విజ్ఙానమంతా  లోకంలో వ్యాపిస్తోంది. శబ్దానికి అనుశాసనం ముఖ్యం. అంటే నియమం. అదివ్యాకరణంవల్ల కలుగుతుంది. ఆవ్యాకరణం మాహేశ్వర ప్రోక్తం. సంస్కృత వ్యాకరణమంతా  మాహేశ్వర సూత్రముల ననుసరించియే నడుస్తుంది. 


                          "తన విహారాగారముల్  మౌనిహృద్వనజంబుల్:"  నీవు నిరంతరం  మహామునుల హృదయకమలాలలో విహరిస్తూఉంటావు స్వామీ! నిన్ను దర్శించాలంటే మునులకే సాధ్యం మావంటి వారికది యెలా సాధ్యమౌతుంది? మాలో సద్భక్తిని గలిగించు. మమ్ము గూడా మునులను చేయి మాహృదయాలలోగూడ విహరించు. అంతవరకూ నీదర్శనం మాకుసాధ్యమా?స్వామీ!


                 తన సేవకుల్  కమలజాత  శ్రీధరుల్"- ఇక  నీ సేవకులా  బ్ర హ్మ , విష్ణువులు.వారు సామాన్యులా? సకలజగత్ సృష్టికర్త బ్రహ్మ. సకల లోక పోషకుడు విష్ణువు.వీరిద్దరూ నీసేవకులు. నీయాజ్ఙకులోబడి సృష్టి బ్రహ్మ నిర్వహిస్తే , నీయానతో పరిపోషణ విష్ణువు కొనసాగిస్తాడు. అంతా నీవశం.


                           ఇలాంటి సర్వ శక్తి సమన్వితుడవైన నిన్ను  యేమని వినుతించ గలను? స్వామీ!


                                        నేనశక్తుడను. స్వామీ నమస్కారమయ్యా! పరమేశ్వరా! నమస్కారము!


                                                                      అంటున్నాడు ధూర్జటి!


                                                      ఓం  నమః  శివాయ!  ఓం నమః  శివాయ!


                                                                             స్వస్తి!🙏🙏🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

45. " మహాదర్శనము

 45. " మహాదర్శనము "--నలభై ఐదవ భాగము-- దేహము దేవాయతనమైనది


45. నలభై ఐదవ భాగము--   దేహము దేవాయతనమైనది 



        ఆచార్యులు కనురెప్ప పాటు కాలము అలాగే అవాక్కై నిలుచున్నారు . వారు మౌనముగా నున్ననూ , వారి విప్పారితములైన కన్నులు , పైకిలేచిన కనుబొమలూ , తెరుచుకున్న నోరూ వారి ఆశ్చర్యమును తెలుపుచునవి . మరలా అంతలోనే సహజావస్థకు వస్తూ , " సర్వ దేవతలనూ పిలుచుకొని వచ్చిన కుమారునికి అర్ఘ్య పాద్యాదులకు సర్వమునూ సిద్ధము చేయండి . నేను ఇప్పుడే వస్తాను" అని బచ్చలింటి వైపుకు వెళ్ళినారు . దేవి ఆలాపిని కుమారునికి ఒక కృష్ణాజినమును ఇచ్చి కూర్చోబెట్టి , తాను అర్ఘ్యపాద్యాదులను సిద్ధపరచుటకు వెళ్ళినది . మైత్రేయి కూడా అత్త వెంటనే వెళ్లినది .


       " సర్వదేవతలనూ పిలుచుకొని వచ్చినాడు " అన్న ఆచార్యుల మాట కుమారునికి అర్థము కాలేదు . ’ ఇంకేమిలే , వారే వస్తారు , అదేమిటో చెప్పెదరు ’ అని ఎక్కడో మనసుతో కూర్చున్నాడు . 


         అతను కూర్చున్న వెంటనే వెనుకటి వృత్తి అతడిని ఆవరించి ఎక్కడికో లాగుకు వెళ్ళింది . ఎవరో వచ్చి , ’ కావలెనంటే భవిష్యమును చెప్పెదను . ఆచార్యుల మాటకు అర్థమును చెప్పెదను ’ అన్నారు . " నువ్వు ఎవరు ? " అని అడిగితే , " నేనే నీ మనసు . మనస్సర్వము ,  ఇక పైన ఏమి కావాలన్ననూ నువ్వు పుస్తకము తీసి చదువునట్లే చూసుకోవచ్చు . ఏ అడ్డమూ ఉండదు . నీకు కాల పురుషుని దర్శనమైనందు వలన నీకు ఇతరుల వలె దేశ కాల వర్తమానముల అడ్డము లేదు ." అన్నారు . కుమారుని కుతూహలము రేకెత్తలేదు , ఆచార్యుల వాక్కుకు వ్యాఖ్యానము అవసరము లేదు , అలాగే , మైత్రేయి యొక్క భవిష్యత్తులో ఆసక్తి కలుగలేదు . ఆచార్యదంపతులు ఆవేళకు అటు ఇటు నుండి వచ్చినారు . ఆచార్యులు చేతులు తుడుచుకుంటూ వచ్చి , భార్యను అడిగి నీరు తీసుకొని శుద్ధాచమనము చేసినారు . ఆమె తాను తెచ్చిన పాద్య , అర్ఘ్య , ఆచమనములను కుమారునికి ఇచ్చినారు . కుమారుడు ఎందుకు , ఏమి అని అడుగకుండానే వారి అర్పణలను అనుజ్ఞయని  గ్రహించినాడు . ఇంకొకసారి పాలు , పండ్లు ఇచ్చినారు . ఎప్పటివలె అయితే కుమారుడు వద్దనవలసినది . అయితే ఇప్పుడు ఆ ఫలహారమును ఆదరముతో స్వీకరించినాడు . అంతా అయిన తరువాత ఆచార్యుడు కుమారుని వద్ద వేరొక కృష్ణాజినము పైన కూర్చున్నాడు . ఆచార్యాణీ , మైత్రేయీ అక్కడే ఒక్కొక్క ఆసనములను వేసుకొని కూర్చున్నారు . 


ఆచార్యులే మొదట మాట్లాడినారు  వారి మాటలో వారి సంతోషము వ్యక్తమగుచున్నది . 


" ఏమిటయ్యా యాజ్ఞవల్క్యా, ఇప్పుడు నిన్ను కుమారా అన వలెనా,  ఆచార్యా అనవలెనా ? "


కుమారునికి గాభరా అయినది . " ఇంకా స్నాతక వ్రతము కాలేదే ? "


         " స్నాతక వ్రతము క్రమముగా విద్యా గ్రహణాదులను చేసినవాడికి . కానీ యాజ్ఞవల్క్యా , సర్వ దేవతా సాన్నిధ్యమును పొందిన నీకు స్నాతక వ్రతము వలన ప్రయోజనమేమి ? నువ్వు పుట్టినపుడే నువ్వు ఇలాగవుతావని మాకు తెలిసి యుండినది . అదీకాక, నిన్ను సమర్చించే కాలమూ ఒకటి వస్తుందని మాకు నమ్మకము కూడా ఉండినది . అందువలననే , దైవ యోగము వలన నువ్వు వైశంపాయనుల ఆశ్రమము నుండీ వచ్చినపుడు , మేము అన్యశిష్యుడిని పరిగ్రహించము అని అన్నది . ఇప్పుడు నీకు ఆదిత్యుడు గురువైనందు వలన ఏమేమయినదో , చూచితివా ? మేము అనేక వర్షముల కాలము గురుసేవ కష్టమును అనుభవించి నేర్చిన పంచాత్మ సంక్రమణ విద్య నీకు పదునైదు దినములలోనే కరగతమైనది . బ్రహ్మ విద్యా సంప్రదాయములన్నిటా బహు విస్తారమయినదీ , ఇహములో నానా ఫలములను ఇచ్చునదీ , అన్నిటి కన్నా ఎక్కువగా సర్వజ్ఞ పదవిని ఇచ్చునదీ అయిన ఈ విద్యను నీవలె సాధించినవారు ఇంతవరకూ ఎవ్వరూలేరు . ఇకముందు మేము ఏదైనా తెలుసుకోవలె నంటే నీనుండీ తెలుసుకొను నట్లయినది . అంటే , నువ్వు మాస్థాయిని చేరినావు . మేము ఆచార్యులు అయితే , నువ్వు అత్యాచార్యుడవైనావు . అన్నిటికన్నా మిక్కిలిగా , నీకు గుణమంటే కుతూహలము లేదు . రేపు ఏమి జరుగుతుందో అన్నది ఈ దినమే తెలుసుకోవలె నన్న ఆత్రము లేదు . ఇది సర్వజ్ఞత్వపు గుర్తు . భలే , అద్భుతముగా సాధించినావు , భలే ! భలే! " 


      కుమారుడు లేచి వారికి నమస్కారము చేసినాడు . " తమరు అనుజ్ఞ ఇచ్చినదంతా విన్నాను . కానీ నాకు ఏమీ అర్థము కాలేదు . దయచేసి నాకు అర్థమగునట్లు అనుజ్ఞ కావలెను  . " 



        ఆచార్యుడు తన సంతోషమును ప్రకటముగా చూపిస్తూ అన్నాడు , " నీ ఈ వినయము శ్రేయస్సాధనము . నీకైనా, ఎవరికైనా , పరమ విభూషణము . నీ ఈ వినయమునకు వశము కాని వారెవరు ? కాబట్టి నీకు అర్థం కాలేదన్నావు కదా, ఒక్కొక్కటీ విడమరచి చెప్పెదను , విను . మేము అనేక వర్షముల కాలము గురుసేవ కష్టమును అనుభవించి నేర్చిన పంచాత్మ సంక్రమణ విద్య నీకు పదునైదు దినములలోనే కరగతమైనది అన్నాను , అది అబద్ధము కాదు .  కానీ మీకెలా తెలిసింది అంటావేమో , చూడు , పంచాత్మ సంక్రమణ విద్యను సాధించినవానికి కాకపోతే ఇతరులకు పంచభూత దర్శనము కాదు . నీకు పంచభూత దర్శనమైనది అనుదానిని నీ కన్నుల ప్రశాంత తేజస్సు చెప్పుచున్నది . అలాగ ఆ భూత దర్శనము కాకుండా ఈ ప్రపంచ దృశ్యపు నానాత్వము చెరిగిపోదు . ఈ దృశ్య నానాత్వము చెరిగిపోకుంటే , ఇంద్రియ లోలత్వము , ఇంద్రియ సహజమైన చాపల్యము తప్పవు . అవి తప్పకపోతే మనసు శాంత సంకల్పము కాదు . మనసు శాంత సంకల్పము కాకపోతే దేవతలు ఆ దేహమున వచ్చి విలసిల్లరు . దేవతలు విలసిల్లని దేహము దేవాయతనము కాదు . దేహము దేవాయతనము కాకుంటే, కాల పురుషుడు ప్రసన్నము కాడు . ఆతడు ప్రసన్నుడు కాకుంటే, చింత , కలవరము , కుతూహలము , ఆత్రము , తొందరపాటు తప్పవు . తెలిసిందా ? "                


" ఇప్పుడు నాలో ఇదంతా జరిగినదంటారా ? "


       " అయినది అనుదానిని నువ్వు చూసుకోలేదు . ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆకుల చాటున కనుమరుగైన ఫలముల వలె నున్నవి . నీకు కాల పురుషుని దర్శనము కాలేదా ? "


       కుమారుడు ఒప్పుకున్నాడు . ఆచార్యుడు కొనసాగించెను," అయ్యా, ఆ దేవతల ఆట ఏమని చెప్పేది ? నీకు కావలసినదంతా అయింది . అయితే అయినట్టు నీకింకా బోధ కాలేదు . ఆ దినము నువ్వూ నేనూ కూర్చున్నపుడు పంచాత్మ సంక్రమణ విద్యను ఆదిత్యుడు నీకు అనుగ్రహించినాడు . మెట్టు మెట్టుగా ఆ దినము నీకు ఈ ఐదు కోశములూ దారినిచ్చినవి . నీకది జ్ఞాపకమున్నది కదా ? "


        కుమారుడు ఔనన్నాడు . దాని తర్వాత ఏమేమి నడచినదో చూడు . నీకు పంచభూతముల దర్శనమైనది కదా ? , భూతభూతములకూ వేరే వేరే గతులున్నవి అన్నది తెలిసింది కదా ? ఆ గతులలో దేనికీ దొరకక, ఆకాశము వరకూ వెళ్ళి అక్కడ ప్రాణ దర్శనము చేసి వచ్చినావు కదా ?  ఈ ప్రపంచములో శబ్దమంతయూ ఆహతముగా ఉన్నపుడు , పరమాకాశములో అనాహతమైన ఓంకారమును దర్శించినావు. ఇంతటి అదృష్టము ఎవరికి కలుగును ? ఇప్పుడు నీకేమయినదో తెలుసా ? దృశ్యముగా నున్నదంతా శ్రావ్యమై , శ్రావ్యముగా ఉన్నదంతా ఒకే ఒక ప్రణవపు సంకేతమైనది యని బోధయగుచున్నది కదా ? నువ్వు కావాలన్నా , వద్దన్నా , నీకు కలిగిన ప్రణవ దర్శనపు ఫలము నిన్ను వదలలేదు . కాదా ? "


కుమారుడు ఔనని ఒప్పుకున్నాడు . 


" ఇప్పుడు చెప్పు , దృశ్య నానాత్వము ఇంకా ఉందా ? "


        కుమారుడు తన అనుభవమును అబద్ధమనుటెలా ? తాను అనుభవిస్తున్నదానిని కాదని చెప్పుటెలా ? ఆచార్యుడు తనకైన అనుభవమును , తనకు కలుగుతున్న బోధను అద్దములో కాదుకదా , కళ్ళారా చూచినదానికన్నా ఎక్కువగా వర్ణిస్తున్నది చూచి ఆశ్చర్యమైనది . మరుక్షణమే ఆ ఆశ్చర్యము తిరోధానమై మనసు అంది " ఇదేమీ ఆశ్చర్యము కాదు . ఆచార్యులు జ్ఞాన చక్షువులున్నవారు . అటువంటివారికి ఏ అడ్డమూ లేక, వెనుక ముందు ఉన్న వాటిని మాత్రమే కాదు , దేశాంతర , దేహాంతర కాలాంతరములలో జరిగినదానిని చూచి చెప్పగల శక్తి ఉంటుంది . నీకు కూడా ఆ శక్తి ఉంది . దానిని ఉపయోగించమని నేను అప్పుడే చెప్పితిని , నువ్వు వద్దంటే నేను ఊరకున్నాను . "


       ఆచార్యుడు మరలా అడిగినాడు , " ఈ దృశ్య నానాత్వము చెరగి పోయి నందువల్లనే ఇప్పుడు నీ ఇంద్రియములు స్థిరమైనాయి . ఇప్పుడు ’ ఈ ఇంద్రియములు వేరు వేరు కాదు . అన్నీ ఒకటే ’ యంటే నువ్వు ఔను అనే స్థితికి వచ్చినావు . చూచుటకు కళ్ళే అవసరము లేదు , కాలితో కూడా చూడవచ్చును అంటే , నువ్వు చూడకున్ననూ ’ అది సాధ్యమే ’ అను స్థాయికి వచ్చినావు . దాని వలన గోళకమే దృక్ అన్న భ్రాంతి అణగి , దృక్ , దృశ్యము , దర్శనము అన్న త్రిపుటము అణగిపోయినది . దాని ఫలమేమిటో తెలుసా ? మనసు ఇంద్రియములలో పారి బయటికి వస్తున్నది తప్పినందువల్ల , బయటికి వెళ్ళుట అను ఆలోచనయే తప్పిపోయి , మనసు శాంత కల్పమైనది . " 


  " చిత్తము , "


        " మనస్సు శాంత కల్పమగుచున్నపుడు బుద్ధి కర్తృత్వ రహితమై  , తన చేష్టలను వదలినది . దాని వలన లోకములో నీవలన కార్యములు చేయించుటకు దేవతలే రావలసి వచ్చినది . అనగానేమి ? నీ దేహములోనున్న ప్రాణమండలము ప్రాణముగా నుండుట తప్పి , అగ్నీషోమీయ మండలమైనది . అగ్ని కుండము నుండీ విస్ఫులింగములు వెదజల్లునట్లే , కావలెనన్నపుడు , ఆవశ్యకత వచ్చినపుడు అక్కడ దేవతలు సిద్ధమై తమ తమ కార్యములను లోపములు లేకుండా నిర్వహించునట్లాయెను . దానివలన నీదేహము దేవాయతనమైనది . సరియా ? "


" వింటున్నాను , సరియే  " 


       " ఇదంతా అయినదానికి గుర్తుగా నీకు కాలపురుషుని దర్శనమైనది . కాల పురుషుని దర్శన ఫలముగా నువ్వు సర్వజ్ఞుడైనావు . సర్వజ్ఞ చిత్తము నీలో ఏర్పడింది . నీ చింత, ఆందోళన వంటివన్నీ అస్తమించినాయి , తప్పా ఒప్పా ? "


     కుమారుడు ఒప్పే అన్నాడు . ఆ ’ ఒప్పు ’ అన్న రెండు అక్షరముల మాటలోనే ఆచార్యుడు చెప్పిన సర్వమూ తన అనుభవమునకు వచ్చినది యన్నది అతడు ఒప్పుకొను నట్లుండినది . 


       " ఈ చింత , ఆందోళన వంటివి నీ దేహపు లోపల ఉండిఉంటే , నీకు కూడ  మాకు లాగే ఎన్నో సంవత్సరములు పట్టేది . కానీ దేవతలు గొప్ప మనసుతో వారి కృపాఫలము నీకిచ్చి , ఇదంతా ఒకే పక్షములో అగునట్లు చేసినారు . ఆ పక్షములో కూడా నువ్వు బహిర్ముఖుడవు కాలేదు . దేహము వైపు నీ గమనమే లేదు . దేహము తన సుఖదుఃఖములను , మూత్ర పురీషములను గురించి ఏమనుటకూ అవకాశము దొరకలేదు . ఆ దేహమునకు , చంకలో బిడ్డను ఎత్తుకొనుటే చాలయిపోయిన తల్లి వలె , దేవతల వైపుకు తిరిగి , దేవతలతో సంభాషణ జరుపుతున్న నిన్ను తట్టుకొనుటే చాలయిపోయింది . అదీకాక, అధికారము చూపతగిన నువ్వు మిత్రుడి వలె వ్యవహరించి , అన్నమయ కోశమును పూజాదులతో గౌరవించినందు వలన , అది ’ నీ పని నేను  చేయను ’ అని మొండికేసి పట్టు పట్టుటకూ సాధ్యము కాలేదు . ఇప్పుడు నువ్వు జాగృత్తికి వచ్చి ఈ దేహములో వ్యాపారము చేస్తున్న దానికి గుర్తుగా , దేహమును నిర్మించిన భూతములన్నీ శుద్ధియయిన దానికి గుర్తుగా, నీ దేహములో మనోహరమైన కమల గంధము ఉత్పన్నమైనది . " 


      కుమారుడు మౌనముగా వారు చెప్పినదంతా ఒప్పుకున్నాడు . ఆచార్యుడు అన్నాడు : " ఇప్పుడు చెప్పు , నువ్వు సర్వజ్ఞుడవు కాకున్నా , సర్వజ్ఞ కల్పుడవైనావు . అలాగనిన ఏమిటా ? విను . శాంత కల్పమై నిర్విషయమైన మనసు అంతర్ముఖమైనపుడు తానున్నానా , లేనా అని అర్థము కానట్లు , నిద్రించినట్లు ఉండును . మనసు ఈ అవస్థలో ఉన్నపుడు ఏదైనా తెలుసుకోవలెను అనిపిస్తే , ఆ సంకల్పము దేవ కార్యార్థమై వచ్చినందు వలన , దేవతలు పరుగెత్తి వచ్చి , అక్కడ ఆ జ్ఞానము కలుగుటకు కావలసిన అనుకూలములను కల్పిస్తారు . ఇప్పుడు చూడు , నిన్ను ఇక్కడికి పిలుచుకురాలేదా ? కాబట్టి , అలాగ ’ ఇప్పుడు నేను సర్వజ్ఞుడనో కాదో ’ యని చూచుకోవలసిన అగత్యమే లేదు కాబట్టి నువ్వు ఆ విషయములో ఉదాసీనుడవైనావు . అయితే , అక్కడున్న సామగ్రి అంతా చూచినాక , ’ ఇంటిని చూడగా ఇల్లాలెటువంటిదో తెలియునట్లు ’ ఆ దేహి యొక్క యోగ్యత అవగతమగును . కాబట్టి, ఇప్పుడు నీకున్నవి రెండు దారులు . నిన్ను నువ్వే పరీక్ష చేసుకొనుట , లేదా నన్ను నమ్ముట. ఈ రెండింటిలో ఏదైనా ఒకదానిని పట్టుకో . కుమారుడు యోచించినాడు . : ’ సర్వజ్ఞుడనని నన్ను అందరూ పొగుడుటవలన , నాకు కలుగు పురుషార్థము ఏమిటి ? నన్ను నేను పరీక్ష చేసుకుంటే మాత్రం కలిగేదేమి ? కాబట్టి , ఆచార్యుల మాట చాలు . అంతేగాక , వారు అబద్ధము చెప్పి సాధించేదేముంది ? అని విచారము చేసుకొని , " తమరి మాటే చాలు , పరీక్ష అవసరము లేదు " అన్నాడు . 


" అయితే సరే . ఇప్పుడు చెప్పు , ఇంతటి నిన్ను మేము మా సమానుడవంటే తప్పేమి ? " 


కుమారుడు ఆ మాటకు ఉత్తరమునివ్వలేదు . నవ్వుతూ తలవంచినాడు . 


       " నువ్వు స్నాతకుడవు కాలేదని ఒక కుంటి సాకు వెదకుతున్నావు . అదిలోకపు పద్దతి . దానిని విడు , నీ ముందరి దారి గురించి చెప్పు . ఇప్పుడు నువ్వు మరలా ఆదిత్యుని గూర్చి తపస్సు చేయి . అతని వలన ఏమి కాగలదు అనునది నువ్వూ నిర్ణయించుకోగలవు , నాకూ తెలుసు . కాబట్టి దాని విషయమై నేను ఏమీ చెప్పను . ఆదిత్యుని అనుగ్రహమైన తరువాత కొంత కాలము గృహస్థుడవై సుఖముగా ఉండు . ముందేమవుతుందో చూద్దాము . " 


" తమరి అనుజ్ఞ. ఆదిత్యోపాసనను చేస్తూనే ఉన్నాను . వదలలేదు . ఇకముందు దానిని బలపరచెదను . " 


       " చూడు , మరచిపోయినాను . బుడిలుల కుమారుడు కాత్యాయనుడు కూతురి పెళ్ళికి కాలాతీతమగుచున్నది ; వచ్చు మాఘాదిపంచకములో వివాహమగునట్లు ప్రయత్నము చేయవలెను అని మీ తండ్రి దగ్గర ప్రస్తావించినాడట. వారు నాకు సమాచారము పంపినారు . ఏమి సమాధానము పంపించేది ? " 


" తమరు అప్పుడే అనుజ్ఞ ఇచ్చినట్లు మొదట ఆదిత్యానుగ్రహ సంపాదన. అనంతరము వివాహము ." 


" సరే కానిమ్ము " 

Janardhana Sharma

44. " మహాదర్శనము

 44. " మహాదర్శనము "--నలభై నాలుగవ భాగము --మైత్రేయి


44. నలభై నాలుగవ భాగము---  మైత్రేయి



         కుమారుడు మైత్రేయి గురించి వినియున్నాడు . ఈమె బ్రహ్మవాదిని కావలెనని ఆలాపిని దేవికి కోరిక . ఎక్కడో ఒకచోట , పెళ్ళిచేసుకొని ఆకుచాటు పిందెవలె ఉండనీ అని ఆమె తల్లిదండ్రుల ఇష్టము. అయినా తమ్ముడు అక్కగారి మాటంటే బహుళముగా గౌరవించెడి వాడు కాబట్టి స్వతంత్రించలేదు . అతడి భార్య కూడా భర్తమాటకు ఎదురాడునట్టిది కాదు కాబట్టి ఆమె కూడా పెళ్ళి చేసే తీరవలెను అని మొండికేయలేదు . ఇలాగ మైత్రేయికి , తల్లిదండ్రులు కూతురికి వివాహము జరిపించు వయసు దాటిపోయినది . బంధువులు కూడా ఆలాపిని మాత మనసు తెలిసినవారు కాబట్టి వయసు మీరిన ఆడపిల్ల ఇంట్లో ఉన్నదని ఆక్షేపించలేదు . మైత్రేయికి కూడా వివాహపు విషయములో అంత ఆసక్తి లేదు . 


         మైత్రేయి చాలా మంచి అమ్మాయి . కొండెక్కించి పొగడవలసినంత రూపవతి కాకున్ననూ పెదవి విరచునట్లు కూడా లేదు . ముఖములోని సౌమ్యత మనసులోని శాంతికి గుర్తుగా కనిపిస్తుండుటచే ఆమె సౌందర్య లావణ్యములు అంతగా గమనములోకి రావు . ఆమె తెలుపే అయిననూ ఆ తెలుపు గోడకు వేసిన సున్నపు తెలుపు కాదు . ఆ ముఖానికి పసుపు రాస్తే , పసుపు , తెలుపూ రెండూ కలసి ఏదో మనోహరముగా కనిపిస్తుంది . కనులలో చాంచల్యము లేక , స్థిరమైన దేనినో వెతుకుట కోసమే పుట్టినవి అన్నట్లున్నాయి . ఆ విశాలమైన వదనములో పైన కురులూ , కింద కనుబొమలూ పొందికగా ఉండి జీవన లక్ష్యమును రాసి పెట్టి నట్లుంటుంది ఆ ముఖము . నాసికా దండము చక్కగా ఉండి అంతఃకరణపు సరళతనూ , ముక్కుసూటి తనమునూ ప్రతిబింబించునట్లున్నవి . బుగ్గలు మరీ కోమలముగా ఉండి బాలభావమును ప్రతిబింబించునట్లేమీ లేవు , అలాగని తమ బిగిని పోగొట్టుకొని వేలాడుతూ వయసు మీరిన ప్రౌఢత్వము చూపునట్లేమీ లేవు . 


          వక్షస్థలము మాత్రము ఎత్తుగా ఉండి ఆ దేహపు యౌవనపు ప్రాదుర్భావమును సూచిస్తున్నది . దేహానికి యౌవనము వచ్చి బాల్య  , కౌమారపు హెచ్చుతగ్గులు వదలినట్లుంది . ఆమె నిలుచున్న భావము , ప్రౌఢ యొక్క స్థిర భావమూ కాదు , యౌవనపు పదార్పణ చేస్తున్న పదారేళ్ళ చంచల భావమూ కాదు . మొత్తానికి చూస్తే , శరీరముకన్నా మనసు ఎక్కువగా పెరిగినట్లున్న గుర్తులు కొట్టవచ్చినట్లు కనిపిస్తాయి . మనోహరములైన పువ్వులను పూసిననూ దానివలన గర్వమును రానివ్వని చెట్టు వలె , ఆమె తాను యౌవనవతి నన్న లక్ష్యమే లేని దాని వలె నిగర్వియై ఉన్నది . 


         కూమారునికి ఆశ్చర్యము. " ఏడు దినములుగా  కూర్చున్నచోటే కూర్చున్నారు " అని విన్నది నమ్మలేక పోయినాడు . జాగృత్తులోని ఒక్కనిమిష కాలములో , కలలోని ఏడెనిమిది దినములంత దీర్ఘమైన కాలమును అనుభవించుట మామూలే , కానీ దానికి విపరీతముగా , జాగృత్తులోని ఏడు దినములను సవితృదేవునితో మాట్లాడుచూ గడిపితినంటే నమ్ముట ఎలా ?  


" మీకు ఆకలి కాలేదా ? " మైత్రేయి అడిగినది . 


" ఇప్పుడవుతున్నది " 


" అలాగయితే పాలు తీసుకోండి " మైత్రేయి పాలతో నిండిన చిన్న చెంబును ముందు పెట్టింది . 


" బ్రాహ్మణ దేహము , స్నానము లేదు "


" ఆకలి ఎక్కువగా ఉందా ? తక్కువగా ఉందా ? "


" ఎక్కువగా ఉందనే చెప్పవలెను . మేరువును తిని సముద్రాన్ని తాగవలె నన్నట్లుంది "


" అలాగయితే నా మాట వినండి , మంత్ర స్నానము చేసి పాలు తాగండి . అది సరే , ఒక మాట . మీరు నిద్రలో ఉంటిరా ? "


" లేదు "


" అలాగైతే ఏడు దినములు మెలకువగా ఉండి ఎలా కన్నులు మూసుకున్నారు ? "


         కుమారుడు ఒక ఘడియ అనుభవమును చెప్పుటయా వద్దా అని ఆలోచించినాడు . మైత్రేయి బ్రహ్మవాదిని యవగలదని అతడికి తెలుసు . మెడ చూసినాడు  అక్కడ మంగళసూత్రము లేదు . సరే , చెరగు మాటున యజ్ఞసూత్రము ఉండవలెను ." ఇటువంటిదాని దగ్గర దాచిపెట్ట వలసిన అవసరము లేదు " అనుకొని తన అనుభవమును చెప్పినాడు . 


       మైత్రేయి అదంతా ఒళ్ళంతా చెవులు చేసుకొని విన్నది . చివరికి చిన్నగా నవ్వి , " మీయంతటి వారికే దేహాభిమానము పోలేదన్న తరువాత , అదెంత భద్రముగా ఉండవలెను , ఆ అభిమానము ! "  అన్నది .


యాజ్ఞవల్క్యునికి ఆమె మాట విని సంకోచము వంటి బిడియమైనది , " అదేమిటి ? అలాగంటావు ? " అని అడిగినాడు . 


        మైత్రేయి అన్నది , " మీరు ఉండినది దేవతా సాన్నిధ్యములో . అంతేకాక , ఉన్నచోటినుండీ లేవలేదు . శరీరమున్ననూ కూర్చుండుట తప్ప ఇంకేమీ చేయలేదు . ఇటువంటప్పుడు మీకు మైల అన్న భ్రాంతి ఎలా వచ్చింది ? నేను బ్రాహ్మణుడిని అంటే , బ్రాహ్మణాభిమానము తల్లిదండ్రుల నుండీ వచ్చిన దేహమును అనుసరించి వచ్చినది . కాబట్టి అలాగ అన్నాను." 


        మైత్రేయి వాదన యాజ్ఞవల్క్యుని మనసుకు నచ్చింది . " నువ్వు చెప్పినది సరిగ్గా ఉంది . బ్రాహ్మణుడు అగ్ని వలెనే ఎల్లపుడూ శుచియైననూ లౌకికాగ్నిని సంస్కారముతో వైదికాగ్నిగా చేసినట్లు చేయవలెను . కానీ ఇంతవరకూ దేవతా సాన్నిధ్యములో ఉండుట చేత ఇప్పుడు సంస్కారము అవసరములేదు : పాలు ఇవ్వు . త్రాగి ఆలాపినీ దేవి వారి దర్శనార్థము నేనూ వస్తాను " అన్నాడు .


         పాలు బాగా ఎర్రగా కాగి రుచిగా నుండినవి . వైశ్వానరుని తృప్తి పరచి యాజ్ఞవల్క్యుడు మైత్రేయితో పాటూ దేవివారి దర్శనార్థమై బయలుదేరినాడు . ఇటు  ఒక మడి వస్త్రాన్ని కట్టుకొని , ఒక ఉత్తరీయమును కప్పుకొని వెళుతున్న యాజ్ఞవల్క్యుడు , అటు అతనికి సమీపముననే చీరతో ఒళ్ళంతా కప్పుకొని పైన ఒక ఉత్తరీయమును కప్పుకొని వెళుతున్న మైత్రేయి. ఇద్దరూ వెళుతుంటే ఆశ్రమపు వీథి అంతా నిండినట్లున్నది . 


       కొంత దూరము వెళుతుండగా , మైత్రేయి ఏదో గంధమును ఆఘ్రాణించినట్లు ముక్కు పుటాలను వెడల్పు చేసి చూస్తున్నది . ఆమె వాసన ఎగబీల్చు ధ్వని అన్యమనస్కుడైన యాజ్ఞవల్క్యుని గమనమునకు వచ్చి , అతడు ఏమిటని అడిగినాడు . 


మైత్రేయి అడిగినది , " ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కమలముల చెరువుందా ? "


" నాకు తెలిసి ఎక్కడా లేదు "


" మరి , ఎక్కడినుండీ ఈ పద్మ గంధము వస్తున్నది ? "


యాజ్ఞవల్క్యుడు నిలచి చూచినాడు . ఔను , పద్మ గంధము వస్తున్నది . ఇంకా పరీక్షగా చూసి నవ్వుతూ , ’ ఔను , వస్తున్నది ’ అన్నాడు . 


" ఎక్కడి నుండీ ? తెలుసా ? "


" అదంతా ఋషిమూలము , నదీమూలముల వలె అన్వేషణ చేయరాదు . " 


" అంటే , మీ ఒంటినుండే ? " 


" ఒకవేళ ఔనన్నాననుకో , నా ముల్లె ఏమీపోదుగా ? " 


మైత్రేయి ఉన్నపాటునే నిలచిపోయింది , " నిజంగానా ? " అడిగింది . 


యాజ్ఞవల్క్యుడు తలాడించాడు . ’ ఔను ’ అని నోటితో చెప్పలేదు , అంతే ! 


మైత్రేయి సంతోషపడింది . " యోగులు , ఇది భూతజయపు ఆరంభము అంటారు . పృథ్వి పక్వమైనదాని గుర్తుగా ఈ సువాసన వస్తుందంట ! " అన్నది . 


యాజ్ఞవల్క్యుడు తానూ అలాగే విన్నానని అన్నాడు . 


      దారిలో మరలా ఎవరూ ఒకరినొకరు మాట్లాడించలేదు . మైత్రేయికి , " ఇటువంటివాడితో ఎల్లపుడూ చర్చిస్తూ ఉంటే ? " అని యోచన. యాజ్ఞవల్క్యునికి , " ఇలాగ ఉపచారము చేయు వారొకరుంటే నేనెంత తపస్సు చేయవచ్చునో " అని యోచన. 


       దేవి ఇంటి తలవాకిటికి వచ్చి మేనకోడలిని నిరీక్షిస్తూ నిలుచున్నది . అంతలో వారిద్దరూ మలుపు తిరిగి కంటికి కనబడ్డారు . ఆమెకు , " వీరిద్దరూ దంపతులైతే ! " అనిపించింది . వెంటనే , " నేనే ఈమెను బ్రహ్మవాదిని కమ్మని ప్రేరేపించినదానను . ఇప్పుడు ఈ వయసైన తర్వాత వివాహమంటే నవ్వుతారు " అనుకున్నది . దానితోపాటు , ’ యాజ్ఞవల్క్యునికి కన్య ఒకతె నిర్ణయింపబడినది కదా ! ఇంకేమిటి , మనసే ఇటువంటి తగని సంబంధాలను కల్పిస్తుంది , ఆకాశమునకు నిచ్చెన వేసే యోచనయే తప్ప ఈ ప్రారబ్ధానికి వేరే పనిలేదా ? ’ అనుకున్నది . ఆవేళకు వారిద్దరూ వచ్చినారు . 


        కుమారుడు ప్రణామము చేసినాడు . అత్తకు కోడలు , అతడి శరీరమంతా సుగంధాయమైనది సైగతోనే తెలిపింది . అయినా ఆమెకు హాస్య ప్రవృత్తి ముంచుకొచ్చి , " ఏమిటమ్మా ! అందరూ అన్నట్టే అయింది . ఆడది బ్రహ్మ విద్య దారిలో నున్న విఘ్నము అన్న మాట నిజము చేసినావు . పదునైదు దినములనుండీ లోకపు సంగతే పట్టక కనులు మూసుకొని కూర్చున్న వాడిని బహిర్ముఖుడిగా చేసి, అది చాలదన్నట్టు పట్టి తెచ్చినావే ! " అన్నది .


       మైత్రేయి కూడా హాస్యమును ఒప్పుకుంటూ , " అదేమి పెద్ద విషయములే , అలాగ విఘ్నముగా మారునది కావలెనన్న, విఘ్నమును దాటించునది కూడా కాగలదు . వీరు ఏడు దినములనుండీ సమాధిలో నున్నది తెలుసు , నువ్వు పదునైదు దినములంటావే ? " అన్నది.


        " ఔను , ఈ దినము చవితి . పోయిన శుద్ధ చవితి నాడు కన్నులు మూసి కూర్చున్నాడు ఈ పుణ్యాత్ముడు ! రెండు దినములు , పాలను పిల్లవాళ్ళతో పంపించినాను . వారు పిలచి , అరిచి , ’ ఏమిచేసినా యాజ్ఞవల్క్యుడు కళ్ళే తెరచుట లేదు , కావాలని అలాగే కూర్చున్నాడు " అన్నారు . ఇలాగ కాదని , మరుసటి దినము నుండీ నేనే పాలు తీసుకొని వెళ్ళుచుంటిని . నువ్వు వచ్చినది దశమినాడు . ద్వాదశినుండీ నువ్వు తీసుకొని వెళ్ళుచున్నావు . " 


          యాజ్ఞవల్క్యుడు ఏమో అడుగవలెనని తలయెత్తినాడు. ఆమె నవ్వుతూ అన్నది : " ఇది నాకేమీ కొత్తది కాదు . మా వారు ఎక్కడికో వెళ్ళినారు అని నేను అప్పుడపుడు చెపుతుంటాను కదా ? అదేమనుకున్నావు ? వారు కూడా నీవలెనే సమాధిలో కూర్చుంటారు . అప్పుడు ఒళ్ళంతా కళ్ళుగా వారిని కాపలా కాయుట అభ్యాసమై పోయినది . అందుకే నీ స్థితిని తెలుసుకొని , ఎవరివల్లా నీకు ఇబ్బంది , ఆటంకము కాకూడదని , ఎవరూ ఆవైపుకు వెళ్ళకూడదు అని విధాయకము చేసి నేనే నీకు పాలు తెస్తుంటిని . ఏమే ? నీకు నేను చెప్పలేదేమే ? వారుగా కనులు తెరిచి పాలు తీసుకుంటే సరే , నువ్వు అరిచి పిలచీ లేపవద్దు అని ? " 


         " ఈపూట కూడా నువ్వు చెప్పినట్లే చేసినాను అత్తమ్మా , అడుగు ! నేనుగా వారిని పిలవలేదు . ఏదో ఒక ఘడియ నిలుచొని ఉందామా అనిపించి నిలుచున్నా. అంతలో వారే కనులు తెరచినారు "


" సరే , మనసులోని భారము దిగిపోయింది . ఏమి, యాజ్ఞవల్క్యా ? పంచాత్మ సంక్రమణ విద్యను సాధించినావా ? " 


" అదింకా నాకు సరిగ్గా తెలీదు , కానీ ...." 


       " చింతించవద్దు. అమ్మాయి కూడా బ్రహ్మవాదిని అగును . ఈ దినము కాకపోతే రేపైనా ఈ అనుభవములన్నిటినీ పొందగలదు . అమ్మాయి ఉందని చింత లేదు , చెప్పు . " 


       " నేను పంచాత్మ సంక్రమణ విద్యను సాధించవలెను అనే కూర్చున్నాను . అయితే , నాకు గుర్తున్నంతవరకూ , నాకయినది పంచ భూత దర్శనాదులు ." అని అతడు ఆమెకు క్లుప్తముగా తనకయిన అనుభవమునంతా చెప్పినాడు . 


       ఆమెకు యాజ్ఞవల్క్యుని పతికి చూపించవలెనని ఆశ కలిగింది . అయితే వారు ఇప్పుడే విశ్రాంతికి వెళ్ళినారు . వారిని లేపితే ఏమో  లేపకుంటే ఏమో అని ఆలోచన. ఏమి చేయవలెనో తోచక ఆమె ఇలాగే సతమతమవుచుండగా పక్క గది తలుపు తెరుచుకుంది . ఉద్ధాలకులే స్వయముగా బయటికి వచ్చినారు . " ఓహో ! యాజ్ఞవల్క్యుడా ! " అని ఆశ్చర్యముతో అలాగే నిలుచున్నారు . 


ఆలాపినికి అది ఆశ్చర్యమైనది . వారు ఆశ్చర్య చకితులగుటను ఆమె ఎప్పుడూ కలలో కూడా చూచియుండలేదు . 




Janardhana Sharma

కొడుకుల్ పుట్ట రటంచు

 శు భో ద యం🙏


కొడుకుల్ పుట్ట రటంచు నేడ్తు రవివేకుల్ 

జీవన భ్రాంతులై

కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్

వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్!

చెడునే మోక్షపదంబ పుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా!


పిల్లలు లేకపోతే నరకం అన్నది నిజం కాదు.

వేదోక్త కర్మలు చేసేవారు, జ్ఞాన సంపాదన చేసేవారు ధార్మికంగా బతికి శాస్త్రోక్త పద్ధతిలో విధి నిషేధాలు పాటిస్తూ... సాధన చేసేవారూ, పిల్లలున్నా, 

లేకున్నా వారి వారి సత్కర్మల వాళ్ళ ఉద్ధారం అవుతారు.


పాపులు, దుష్కర్మలు చేసినవారు, వారికి పుణ్యం లేకపోతే వారి పిల్లల పుణ్యం తోనో, వారి పిల్లలు ఇచ్చిన ధర్మోదకాలతోనో, శ్రాద్ధ కర్మల తోనో, పిండ ప్రదానాల తోనో ఉద్ధారం అయ్యే అవకాశం వుంది. అంతే తప్ప పిల్లలు లేరని నరకం లేదు.


మనకు భగవద్భక్తి లేక సాధన చేయక పోతే దానికి తోడు పితరుల సద్గతి కోసం పాటుపడే పిల్లలు లేకపోతే నరకమే. 


తన జ్ఞానం వల్లనే, తను చేసిన విహిత కార్యాల వల్లనే, సాధన వల్లనే...

సద్గతి అదే శాస్త్రం...


శాస్త్రం 12 రకాల పుత్రుల గురించి చర్చిస్తుంది...


పుత్రులు ఆరు రకాలు.


1. ఔరసుడు, 

2. దత్తకుడు, 

3. కృత్రిముడు, 

4. గూఢోత్పన్నుడు, 

5. అపవిధ్ధుడు, 

6. క్షేత్రజుడు. 


వీరికి రాజ్యములో కాని ఆస్తిలో కాని భాగం ఉంటుంది. 


ఇంకొక రకమైన పుత్రులు ఆరుగురు ఉన్నారు. వారు...


1. కానీనుడు, 

2. సహోఢుడు, 

3. క్రీతుడు, 

4. పౌనర్భవుడు, 

5. స్వయందత్తుడు, 

6. జ్ఞాతుడు. 


వీరు కూడా పుత్ర సమానులే కాని, 

వీరికి రాజ్యాధికారము కాని, 

ఆస్తిలో భాగము కాని లేదు. 


మనుమడు, 

కూతురు,

కొడుకు కూడా పుత్రుల లెక్కలోకి వస్తారు. 


అందుకే మన తర్పణ విధులలో ఇటు తండ్రి వైపు మూడు తరాల వారికి, 

అటు తల్లి వైపు మూడు తరాల వారికి పిండాలు పెడతాము, తర్పణాలు వదులుతాము. 


కాబట్టి ఒకరికి...

కొడుకు లేడు.

అని బాధ పడ వలదు.


యోగ్యులైన కూతురు కొడుకులు తర్పణాలు విడిచినా...

అవి ఆ తండ్రికి అందుతాయి.


ఈ ప్రాపంచిక జీవనమును జీవన ప్రవృత్తి నను సరించి ఆలోచింతురు. 


తమకు పరలోకమున ఉత్తమ,గతులు లభించుటకు...

పుత్రులు కావలయు నను కొందరు... 


తమకు పుత్రులు కలగని వారు...

అయ్యో మాకు పుత్రులు కలుగ లేదు, 


మాకు ఎట్లు ఉత్తమ,గతులు కలుగును.

అని ఏడ్చు  చుందురు. 


కౌరవ రాజగు ధృతరాష్ట్రునకు నూరుమంది...

పుత్రులు కలిగినను వారి మూలమున అతడు...

ఏ ఉత్తమ లోకములు పొంద గలిగెను? 


బ్రహ్మచారిగనే యుండి సంతతి యే లేకున్న శుకునకు దుర్గతి ఏమయిన కలిగెనా?


కనుక పుత్రులు లేని వానికి మోక్షపదము లభించక పోదు...


పుత్రులు కల వారికి ఉత్తమ,గతులు కాని మోక్షము కాని సిధ్ధించక పోవచ్చును.


పుత్రులు లేని వారికి,ని అవి రెండు ను సిద్దించనూ వచ్చును.


కావున కొడుకులు లేరు.

అని ఎవరూ బాధ పడ వలదు.


మన పుణ్యం మనం సంపాదించు కోవాలి.

మన ఉద్ధారం కోసం...

మనమే పాటు పడాలి.


మనకు ఆ వేంకటేశుని దయవలన 

ఉత్తమ సాధన చేసే అవకాశం సద్వినియోగమై మనం  ఉత్తమ,గతులు సాధించు గాక...


ఉధ్ధరేధాత్మనాత్మానాం


ఎవరి ఆత్మను వారే ఉధ్ధరించుకోవాలి.


సేకరణ!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - శరదృతువు - ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం  -  ఏకాదశి & ద్వాదశి - శతభిషం -‌‌ ఇందు వాసరే* (14.10.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

సుఖంగా జీవించండి

 నచ్చినవి వండుకొని సుఖంగా జీవించండి 😊



*“క్షమించాలి ఇదినిజం..!”*

                


👉అది యూరప్,అమెరికా వాళ్ళ అసహాయత..!

ఇది మన అనంతమైన అజ్ఞానం!✅

 


*1.  తాజా ఆహారం అందుబాటులో లేక,    వండుకోవడానికి సమయం కేటాయించుకో లేక,    ఎప్పుడో నెలల క్రితం చేసిన రుబ్బిన పిండిని కేన్ లో వేసుకుని నిలవ పెట్టీ పెట్టీ    దానితో రోజూ Pan కేకుల్నీ, ఆర్నెల్ల క్రితం చేసిన పిజ్జాలమీద,    బంకలు సాగే కూరలు వేసుకుని తినాల్సిన  ఖర్మపట్టడం అమెరికా, యూరప్  వాళ్ళ నిస్సహాయత..!


👉 56 రకాల భోజన వంటకాలను పక్కనపెట్టి     ఎవడో ఏనాడో వండి పెట్టిన    రొట్టెని కాలవలో పారెయ్యకుండా,  ఫ్రిజ్  లో మురగబెట్టి పెట్టీ మోడ్రన్ స్టైల్ పేరుతో ఆ పిజ్జాల్ని వేడిచేసి ₹. 400 / - పెట్టి  మరీ తినడం, ‘మన అజ్ఞానం..!!’

          -క్షమించాలి ఇదినిజం..!!!✅



*2. ఎనిమిది నెలలు ఎముకలు కొరికే చలి తట్టుకోలేక,   కోట్లూ సూట్లూ వేసుకోవడం ‘వారి నిస్సహాయత..!’


👉వేసవి వేడిలో చెమటలతో ఉక్కపోసి వళ్ళంతా జిడ్డుజిడ్డుగా అతుక్కుంటూ చిర్రెత్తిపోతున్నా కూడా పెళ్లి రోజు       వెర్రిగా    కోట్లూ సూట్లూ వేసుకుని  తిరగడం ‘మన అజ్ఞానం..!!’

        -క్షమించాలి ఇదినిజం…!!!✅



*3. తాజా భోజనం    వండేవాళ్ళు లేక ఫ్రిజ్ వాడడం,   అమెరికా, యూరోప్ వాళ్ళ నిస్సహాయత..!


👉 ప్రతిరోజూ తాజా కూరగాయలు వస్తున్నా, వారం రోజులు కూరగాయలు ఫ్రీజ్ లో     కుక్కి కుక్కి   అవి  మురుగుతున్నవాటిని వండుకు తినడం, ‘మన అజ్ఞానం..!!’

       -క్షమించాలి ఇదినిజం..!!!✅



*4 . ఔషధ మొక్కల జ్ఞానం లేక, మూలికలతో పరిచయం లేక, 

వారు జీవ జంతువుల మాంసం తో కెమికల్స్ తో     ఏవేవో మందులు తయారు చేయడం,  వాటి సైడ్ ఎఫెక్ట్స్ కి  వేరేవేరే రోగాల పాలవ్వడం ‘వారి నిస్సహాయత..!’


👉 మరి ఆయుర్వేదం లాంటి గొప్ప చికిత్సా విధానం     తెలిసినప్పటికీ, పట్టించుకోకుండా...         కెమికల్  మందులు ఉపయోగించడం, సైడ్ ఎఫెక్ట్ లతో కొత్తరోగాలు తెలిసితెలిసి తెచ్చుకోవడం..   ‘మన అజ్ఞానం..!!

         -క్షమించాలి ఇదినిజం..!!!✅



*5. సరిపడ ధాన్యం లేక    పంటలు పండక   పళ్ళూ కాయలూ  దొరకకా  పాముల్ని, కప్పల్నీ, కుక్కల్ని, నక్కల్ని కూడా చంపి తినడం.. ‘వాళ్ళ నిస్సహాయత...!’


👉 మరి 1600 రకాల ఆహార ధాన్యాలు లభిస్తున్నా    వాళ్ళల్లా తినడానికి ప్రయత్నించడం ‘మన అజ్ఞానం..!!’

       -క్షమించాలి ఇదినిజం!!!✅



*6. కొబ్బరి నీళ్ళూ,  మామిడి రసాలు, బత్తాయి పళ్ళూ, సపోటా, అంబలి, చల్ల, మజ్జిగ, పాలు మొదలైనవి లేకపోవడం లేదా తెలియకపోవడం వల్ల పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు తాగడం ‘వారి నిస్సహాయత...!’

👉 అవన్నీ కాక ఎన్నో రకాల ప్రాకృతిక పానీయాలు అందుబాటులో ఉన్నా... పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు అనే విషాన్ని తాగడం ఆధునికంగా అభివృద్ది చెందామని భావించండం ‘మన అజ్ఞానం..!!’

          -క్షమించాలి ఇదినిజం!!!✅



*7. వాళ్ళ పంపుల్లో నీళ్ళు గడ్డకడుతుంటే టాయిలెట్ కి వెళ్ళిన  తరవాత కడుక్కోలేక టిష్యూ పేపర్లతో తుడుచుకొని (PMతో)తిరగడం, 

చలి వలన స్నానం చెయ్యలేక సెంటేసుకుని పడుకోవడం.. 

 ‘వాళ్ళ నిస్సహాయత...!’

👉 సుబ్బరంగా మనకు నీళ్ళొస్తున్నా కడుక్కోకుండా  తుడుచుకొని, సెంటేసుకుని (PM)తో తిరగడం .. ‘మన అజ్ఞానం..!!’

        -క్షమించాలి ఇదినిజం!!!✅



*8. ఎలాంటి ముందుచూపూ లేక, మరుగుదొడ్ల నీళ్ళని నదుల్లో  కలుపుకోవడం మళ్ళీ వాటినే శుభ్రం చేసుకుని తాగడం ‘వాళ్ళ బుద్దిహీనత!

👉 అన్నీ తెలిసి తెలిసి వాళ్ళని గుడ్డిగా అనుసరించి అదే అభివృద్ది అనుకుని మనం కూడా మన నదుల్ని మురికి కూపాలు చేసుకుని మంచినీటి కోసం ఏడవడం ‘మన అజ్ఞానం!!

         -క్షమించాలి ఇదినిజం!!!✅



*9. తోటలూ మొక్కలూ లేక ఎక్కడో ఎవరి దగ్గరో బానిసలా బతికడం కాయలూ పళ్ళూ కొనుక్కు తెచ్చుకోవడం. సరియైన కుటుంబ వ్యవస్థ లేకపోవటం వల్ల, నా అనే వాళ్ళు లేక, అశాంతిగా ఒంటరిగా జీవించడం ‘వాళ్ళ నిస్సహాయత...!

👉 చక్కగా పల్లెల్లో ఫాం హౌసుల్లాంటి ఇళ్ళల్లో, చక్కని ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో,  పెరట్లో బోలెడన్ని మొక్కలేసుకుని, చెట్టుకి పండిన కాయలూ పళ్ళూ తిన్నన్ని తిని పక్కవాళ్ళకిచ్చి సంతోషంగా, అందరితో కష్ట సుఖాలను పంచుకుంటూ, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించే మనం...

ఆ అమెరికా, యూరోప్ వారిని అనుకరించడం... ఇలా కొట్టుకు చస్తూ, ఏడుస్తూ బతకడం... ‘మన అజ్ఞానం!!

         -క్షమించాలి ఇదినిజం!!!✅



*10. చెట్లు పెంచుకోవడానికి   ఏ ఎరువెయ్యాలో తెలియక రసాయనిక మందులేసుకోవడం కడుపులో ఎసిడిటీలు, కేన్సర్లూ  తెచ్చుకోవడం ’వాళ్ళ నిస్సహాయత...!

👉 ఇంట్లో వుండే ఎద్దులూ, ఆవులు, గేదెలు, కోళ్ళు, మేకల మల మూత్రాలను బయో ఫెర్టిలైజర్స్ గా, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ గా వాడుకుంటూ హాయిగా ఆరోగ్యంగా బతికిన మనం...

వాటిని వదిలి అమెరికా, యూరోప్ వాళ్ళ మోజులో పడి వాళ్ళని అనుసరించి, మనం కూడా 

ఆ క్రిమిసంహారక మందులే వాడుతూ, ఇమ్యూనిటీ నాశనం చేసుకుంటూ ఆ రోగాలే తెచ్చుకోడం ‘మన అజ్ఞానం!!

          -క్షమించాలి ఇదినిజం!!!✅


*11. ఒక్కోసారి ఆరునెలల పాటు వాళ్లకు సూర్యుడు కూడా కనిపించడు కనక వాషింగ్ మెషిన్ లో ఉతికేసిన బట్టలు సూర్యరశ్మిలో ఎండబెట్టే అవకాశం లెక డ్రైయ్యర్లో ఆరబెట్టుకుంటూ వాటికున్న ఎరోబిక్ ఎనరోబిక్ బాక్టీరియాల్లో కొన్ని చావకపోయినా హానికరమైన కెమికల్స్ వేసుకుని బతకడం ‘వాళ్ళ నిస్సహాయత...!

👉 హాయిగా ఎంతో ఆరోగ్యాన్నిచ్చే సూర్యరశ్మి నిండుగా వున్నా వాషింగ్ మెషిన్లో ఉతికిన బట్టల్ని అందులోనే ఆరబెట్టుకోవడం మన బుద్దిహీనత ‘మన అజ్ఞానం!!

         -క్షమించాలి ఇదినిజం!!!✅


*12. గడ్డకట్టేసిన నీటితో  స్నానం చెయ్యలేక శానిటైజేషన్ పేరుతో మురికి చేతులపైనే పురుగులమందులు జల్లుకుంటూ...

అవే బట్టలతో ఇల్లంతా తిరగడం, మంచాల మీద పడుకోవడం... వాటివల్ల మాటిమాటికీ రోగాలు తెచ్చుకోవడం మందులు మింగడం ‘వాళ్ళ నిస్సహాయత...!

👉హాయిగా నీళ్ళొస్తున్నా స్నానం చెయ్యకుండా స్టైల్ పేరుతో కుక్కకంపు కొట్టే సెంట్లు కొట్టుకుంటూ తిరగడం ‘మన అనంతమైన అజ్ఞానం!! -మరోసారి మళ్ళీ క్షమించాలి. ఇదినిజం!!!✅


*13. దూరంగా నిలబడి ఆహ్వానించడం, నమస్కరించడం, 

చెప్పులు వేసుకుని ఏ ఇంట్లోకి వెళ్ళక పోవడం,

కాళ్ళు చేతులూ కడుక్కోవడానికి బకెట్ తో నీళ్ళివ్వడం మన సంస్కారం.  మన పెద్దలు మనకు నేర్పిన అత్యుత్తమ సంస్కారం. దాన్ని వదిలేసి ఇవ్వాళ ఏడవడం ‘మన అజ్ఞానం.!!      

         -క్షమించాలి ఇదినిజం!!!✅


*14. విపరీతమైన చలికి తట్టుకోలేక ఇంటాబయటా అవే సాక్స్ అవే బూట్లతో తిరగడం ‘వాళ్ళ నిస్సహాయత.

👉ఇంట్లోకి వచ్చేముందు చెప్పులు గుమ్మం బయటే వదిలెయ్యడం, బయట తిరిగిన బట్టల్ని బాత్ రూములొ  తడిపేసి స్నానం చేసి ఇంట్లోకి రావడం మన పద్దతి. అలాంటి పద్దతుల్ని చాదస్తం పేరుతో... ఆలోచన లేకుండా వదులుకోవడం ‘మన అజ్ఞానం!!

      -క్షమించాలి ఇదినిజం!!!✅


 

మనం ఎంతో ఆత్మీయత గుండెల్లో పొంగితే కానీ చేతులు పట్టుకోలేం, హత్తుకుని కౌగిలించుకోలేం. తల మీదో బుగ్గల మీదో ముద్దులు పెట్టుకోలేం కానీ అవి అమెరికా వాళ్ళకి అత్యంత సహజం..

కానీ నేడు దాన్ని వద్దంటోంది ప్రపంచ ఆరోగ్య మానవాళి... అంతా 

భారతీయుల్ని చూసి  క్వారంటైన్ జ్ఞానం నేర్చుకుంటోంది, నేర్చుకోమంటోంది.


కనీసం ఇప్పటికైనా మనం మన మడి ఆచారాలను మళ్ళీ పాటించడం ప్రారంభించకుంటే అది ‘మన అజ్ఞానం!!

       -క్షమించాలి ఇదినిజం!!!✅


జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ అజ్ఞానం అంతా వాళ్ళని చూసి మనకుగా మనం తెచ్చిపెట్టుకున్న అజ్ఞానం...

 

మన బానిస మనస్తత్వ అజ్ఞానం...


విదేశీ వ్యామోహ అజ్ఞానం...


కరోనా లాంటి వైరస్ లను కొంపమీదకు తెచ్చిపెట్టుకునే అజ్ఞానం...


అమెరికాలో యాపిల్ ఫోన్ అంత మంచిఫోన్ మరొకటి లేదు.

అన్నది ఎంత నిజమో...


అమెరికా, యూరోపియన్ ప్రజలు తినేంత అనారోగ్యకరమైన ఆహారం...

వాళ్ళ కున్నన్ని ఆర్టిఫిషల్ అలవాట్లు కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేవు. అన్నది కూడా అంతే నిజం..!


ఆధునీకరణ, ఫ్యాషన్, మొదలగు పేర్లతో ఋషులు మనకు అందించిన

దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా...

ప్రాకృతిక జీవనాన్ని  వదిలేసుకోవడం మన అజ్ఞానం!

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

 

Bottom LIne.

*వేటిని స్వీకరించాలో వాటినే స్వీకరిద్దాం...!


కానీ గుడ్డిగా...

మోజుతో...

వెర్రిగా...

అనాలోచనతో...

అనుకరిస్తే...

పోతాం! 


ఏం వచ్చి పోతాం?


కరోనా లాంటివి వచ్చి పోతాం!. 


🙏🙇🙏🙇🙏🙇🙏

శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి

 శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి

శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన

పాదారవిందశతకం

🙏🌸🙏🙏🙏🌸🙏

 

శ్లోకము:-

చిరాద్దృశ్యా హంసైః కథమపి సదా హంససులభం నిరస్యంతీ జాడ్యం నియత జడమధ్యైక శరణమ్ |

అదోషవ్యాసంగాత్ సతతమపి దోషాప్తిమలినం పయోజం కామాక్ష్యాః పరిహసతి పాదాబ్జయుగలీ ||30||

 

 

భావము:

యతులకు ఉపాస్యం అయిన దేవీ చరణములు పద్మాలను నిరసిస్తున్నాయి. పద్మాలు హంస సులభాలు. దేవీ చరణములు సులభాలు కాదు. పద్మాల్య్ జడయుక్తాలు. దేవీ చరణాలు జడ రహితాలు - నిర్ధోషాలు. పద్మాలు ఎలాగూ దేవీ చరణములకు సరిపోవు. శ్రీ చరణాలు విశిష్టములు.

 

*********

 

అమ్మ చరణములను తాబేటి పెంకుతో పోలుస్తూ *కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాంవితా* అని లలితా నామాలలో చెప్పిన వశిన్యాది దేవతల అభిప్రాయాన్ని శ్రీ శంకరులు వ్యతిరేకిస్తూ..... అమ్మ పాద వైభవం తెలియ చేస్తున్న *సౌందర్యలహరి* శ్లోక భావాన్ని కొద్దిగా తెలుసుకుందాం....

 

పదం తే కీర్తీనాం - ప్రపద మపదం దేవి విపదాం

కథం నీతం సద్భిః - కఠినకమఠీకర్పరతులాం||

కథం వా పాణిభ్యా ముపయమనకాలే పురభిదా

యదాదాయ న్యస్తం - దృషది దయమానేన మనసా ||88||

**********************************

*భావము:*

అమ్మా..నిన్ను ఆశ్రయించిన వారికి సత్కీర్తులను కలిగించుచు, సకల ఆపదలను తొలగించుచు, మంచికి పుట్టిల్లుగా,చెడులు అనేవి దరిచేరలేని శుభవాకిళ్లుగా వెలుగొందుచుండేవి, నీ పాదముల పైభాగాన ఉండు నీ మీగాల్లు, అటువంటి నీ పాదమును నీ వివాహ వేళ, రాతియందు వధువు పాదము పెట్టించుట అను ఒక తంతుయందు దయాపూర్ణమైన మనసు కల నీ భర్తయైన శివుడు తన చేతితో నీ పాదములు పట్టుకుని రాతియండు ఉంచుటకు ( వధువుచే సన్నికల్లు తొక్కించుట) చాల సందేహించినాడు.ఎందుకనగా అతి మృధులమైన నీ పాదములు ఆ కఠిన రాతి స్పర్శ తో ఎక్కడ కందిపోవునో అని.మరి అంత సున్నితమైన ఆ సుకుమార పాదాన్ని, ఆ పాదంపై నున్న మీగాలుని ( అరికాలు పై భాగం) కొందరు సత్కవులు ( లలితలో వశిన్యాది దేవతలు) కఠినంగా ఉండే ఆడ తాబేలు వీపు చిప్పతో ఉపమానం చెబుతూ ఎలా వర్ణించగలిగారమ్మా!

{ లలితాసహస్రంలో *కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాంవితా* అని అమ్మకు ఒక నామం.దీనికి తాబేటి చిప్పను జయించినటువంటి ప్రపదం ( అరికాలి పై భాగం)తో శోభిల్లుదానా అని అమ్మను వశిన్యాది దేవతలు వర్ణించారు. దానినే ఇక్కడ శ్రీ శంకరులు అంత మృధువైన నీ పాదములను అలా వర్ణించుట సరికాదని నిష్కర్షగా చెప్పినారు. ఇక్కడ శ్రీ శంకరులకు అమ్మమీద ఉన్న అమిత మాతృభావ లాలిత్య భక్తి మనకు కనబడుతుంది. నాతల్లి యొక్క అంత మృధుపాదాలు పట్టుకుని అంత కఠినంగా వర్ణిస్తారా...అసలు ఆ మాట అనడానికి వారికి ( వశిన్యాది దేవతలు) మనసెలావచ్చిందని ఆదిశంకరులు కరుణతో విలవిలలాడిపోయారు.అదికదా భక్తి అంటే. అమ్మ మీగాళ్లు అంత మృధువుగా ఉన్నవి.}

 

🔱 ఆ తల్లి 

పాదపద్మములకు నమస్కరిస్తూ 🔱 🙏🌸🌸🌸🌸🌸🙏

పంచాంగం 14.10.2024 Monday,

 ఈ రోజు పంచాంగం 14.10.2024 Monday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస శుక్ల పక్ష ఏకాదశి తదుపరి ద్వాదశి తిధి ఇందు వాసర: శతభిషా నక్షత్రం గండ యోగ: భద్ర తదుపరి బవ తదుపరి బాలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


ఏకాదశి ఉదయం 06:40 వరకు తదుపరి ద్వాదశి రాత్రి 03:40 వరకు.

శతభషం  రాత్రి 12:39 వరకు .


సూర్యోదయం : 06:12

సూర్యాస్తమయం : 05:52


వర్జ్యం : పగలు 09:22 నుండి 10:49 వరకు.


దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:25 నుండి 01:12 వరకు తదుపరి మధ్యాహ్నం 02:45 నుండి 03:32 వరకు.


అమృతఘడియలు : సాయంత్రం 06:06  నుండీ రాత్రి 07:33  వరకు.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.


యమగండం: పగలు 10:30 నుండి 12:00  వరకు.



శుభోదయ:, నమస్కార:

Panchang


అది నువ్వె

 https://youtu.be/Mw8lY7QznKc?si=e35r25QE0UUp1MF2

https://youtu.be/FX42rgTU_9Y?si=_17LveyZ5BlKZ6sM


13, అక్టోబర్ 2024, ఆదివారం

శ్రీ ఆది శంకరాచార్య చరితము40

 *శ్రీ ఆది శంకరాచార్య చరితము40 వ భాగము*

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


*గంధర్వోపాసకులు:*


గంధర్వోపాసకులు శ్రీ శంకరా చార్యులను తమ మతములో కలుపుకొన నెంచి, సమీపించి, 'యతీశ్వరా! విశ్వావసుడనే గంధర్వుడు మాకు ప్రభువై దైవముగా నున్నాడు. ఆతడు గంధర్వులకు దేవుడు. అట్టి వానిని మేము సదా భక్తిశ్రద్ధలతోపూజించు వారలము.ఆదేవుని అనుగ్రహంతో మేము  అందరము గానమందలి నాదబిందు కళాత్మకమైన విజ్ఞానం తో ఆరితేరిన విద్వాంసులమై యున్నా ము. దీనివలన మేమం దరము కృతార్థులమై ముక్తిని బడయుచుంటిమి. తామును మావలెనే గాంధర్వ విద్య యందు కళాపూర్ణులై ముక్తిని పొందుడు’ అని కోరిరి. 


అంతట శ్రీ శంకరాచార్యులు, 'భక్తులారా! మీ పలుకులు వేదములకు వ్యతిరేకముగ నున్నవి. ఇదిమీకు న్యాయమేనా?పరమాత్మ శబ్దాదులకు అతీతమై ప్రకాశించుచున్నదని వేదమున తెలుపబడినది. మీ గాంధర్వ విద్య శబ్దముతో గూడియున్నది. అందు వలన ఇది పరబ్రహ్మ విద్య కానేరదు. పరబ్రహ్మ ఎట్టివాడుగ నున్నాడో వినుడు. ఆతడు నిత్యుడు, అవ్యయుడు, ఆది మధ్యాంతములు లేని వాడు, నిశ్చయుడు, శబ్ద స్పర్శ రూప రస గంధ రహితుడు, మహత్తత్త్వము కన్నా పరమైనవాడు. అట్టి పరమాత్మను తెలిసి కొనినవాడే ముక్తుడు కాగలడు. కావున మీరందరు నాద బిందు కళాతీత మగు పరాత్పరు ని ఉపాసించుడు. అందు వలన తప్పక ముక్తి లభించును' అని ఉపదేశించగా గంధర్వ ఉపాసకులందరు శ్రీ శంకరాచార్యులను ఆశ్ర యించి శిష్యులయ్యారు. అద్వైత జ్ఞానమును ఆర్జించుకొని నిత్యానంద మును పొందిరి. అటు తరువాత భేతాళోపాస కులు చితాభస్మము (స్మశాన భస్మము) ను ధరించి శ్రీశంకరపాదులను సమీపించి నమస్కారములు చేసిరి.


*భేతాళ మతస్థులు:*


శ్రీశంకరపాదుల యెదుట తమ మతమును ప్రతిష్ఠింప జేయ నెంచి భేతాళ మతస్థులు, 'శ్రీ ఆచార్య వర్యా! మేమం దరము భేతాళుడు మొదలైన భూతములను ఉపాసించుచు లోకము లను మా యధీనమందు ఉంచుకొనుటకు తగిన సమర్ధుల మైతిమి. కావున తాము కూడ మావలెనే ఉపాసించిన లోకములు మీ యధీన మందుండ గలవు' అని తెలియజేసిరి.


శ్రీ శంకరులది విని, ‘భక్తు లారా! మీరందరు బ్రాహ్మణులు గదా! మీరిట్టి నీచమైన ఉపాసనలు చేయకూడదని శాస్త్రములు వచించుచున్నవి. సత్కర్మలకట్టి భూతములు ఆటంక ములు కలుగ జేయుచు న్నవి. సత్కర్మాచరణకు ముందుగా *'అపసర్పన్తు యే భూతా యే భూతా భూమి సంస్థితాః।*

*తేభూతా విఘ్నకర్తారస్తే నశ్యన్తు శివాజ్ఞయా*' (భూమి మీద ఏ భూతములు గలవో అవన్నియు దూరముగా నుండు గాక, సత్కర్మలు చేయుటకు ఏభూతము లు విఘ్నములు కలుగ చేయుచున్నవో అవి అన్నియు శివుని ఆజ్ఞచే నశించు గాక) అని వచించెదరు. అప్పుడు అవన్నియు దూరముగ తప్పు కొనును. ఇది శాస్త్ర ప్రమాణము. సత్కర్మల నాచరించని వారు పరమపదమును పొంద జాలరు. కావున నింద్యమైన మీ నీచ ఆచారములను వెంటనే వదలుడు. మీ మీ విధికర్మలను ఆచరిస్తూ ఆత్మతత్త్వము  తెలిసికొని జ్ఞానులు కండు. జ్ఞానము నలవరచు కొనడమే మోక్షము' అని బోధించెను.


అంతట వారు శ్రీశంకరా చార్యులు తత్త్వ రహస్యమును వినిపించుట తో శ్రీ శంకరపాదులకు నమస్క రించి ఆశ్రయించారు. ఉత్తమ దేవతలను ఆరాధించుకొనుచు అద్వైతతత్త్వ జ్ఞానము నార్జించుకొని ముక్తిని బడసిరి.


అంతటితో శ్రీ శంకరా చార్యస్వామి విశ్వప్రేమ ను అనేకమంది మీద కనబరచి దురాచారములను రూపు మాపి కృతార్థులయి యచ్చోటు వీడి పశ్చిమ సముద్రమునకు ప్రయాణమైనారు.


*గోకర్ణ క్షేత్రము:*


బహుమతములలోని లోపములను తెలియ జెప్పి శాస్త్రసమ్మతం గాని మతములను విడిచి పెట్టించి తరించు విధానము గల అద్వైతమత విశిష్టతను బోధించి యావద్భారతము సంచా రము జేసి కాశీపట్టణం జేరుకొన్నారు.


అచ్చట అనేక మతములను కాదని తత్త్వ రహస్యమును వెల్లడించి ప్రేమతో సరియైన మార్గమున త్రిప్పి తద్వారా అద్వైత మత స్థాపన జేసి పశ్చిమతీర ప్రాంతములకు ప్రయాణమై మార్గమధ్యమందు అనేక దేశములు దాటి కొలది దినములకు గోకర్ణ క్షేత్రం జేరు కొన్నారు. వెళ్ళీ వెళ్ళడంతో అందున్న పరమశివుని దర్శించారు.


శ్రీ శంకరాచార్యుల దర్శనం కొరకు వేలాది జనం శివాలయానికి వెళ్ళి వారిని దర్శించారు. ఆనాడా శివాలయంచూడ ముచ్చటైనది. తీరికసమయములలోఆలయంలో శిష్యులకు వేదాంత తత్త్వబోధ చేసే వారు. పురవాసులు వచ్చి వినేవారు. హరదత్తు డను శివభక్తుడు బాగుగ విద్యలు నేర్చినవాడు. శ్రీ శంకరులిచ్చు ఉపన్యాస ములు కడు శ్రద్ధతో విని శ్రీశంకరులు కేవలం అవతార పురుషులని నిశ్చయించు కొన్నాడు. అప్పటికి తన గురువైన నీలకంఠాచార్యుని కంటె గొప్ప వాడు లేడని తలంచేవాడు. శ్రీశంకర పాదుల శక్తిసామర్ధ్యము లు చూచుటతో అతని తలంపు తారుమారైనది. రెండురోజులు శ్రీశంకర దేశికేంద్రుల తత్త్వబోధ విని తన గురువులకు ఆ విషయం విన్నవించు కొనుటకు చాల కుతూహలం కలిగి గురువులను సమీపించి,'సద్గురువర్యా వందనములు! మన శివాలయమున యతీశ్వరులొకరు మహా శిష్యగణంతో అరుదెంచి యున్నవారు. లోకంలో ఎందరెందరినో జయించారట! అపజయమనునది ఆయనెఱుగరట! మండమిశ్రుడు మొదలైన దిగ్గజములు వాదమందు విజయం సాధించలేక నిర్వీర్యులై, జగద్గురువులకు శిష్యులై సేవిస్తు న్నారు. శ్రీ ఆచార్య స్వామి శిష్యులకు వేదాంతవిజ్ఞాన బోధలు చేయుచుండ నేనచ్చోట కొలదిసేపుండి విని యున్నాను.


అద్వైత మత ప్రచారమే వారి ముఖ్యాశయమట.


దేశ మందుగల మతములలో నుండే లోపములను పూర్ణమైన ప్రేమతో సవరించి నిజతత్త్వమును సాకల్య ముగ బోధించడమే వారి అవతారాశయమట! ఆ ఆశయమును దేశమం దంతట ప్రచారం చేసి విజయపతాకమును చేపట్టి కుమతములను ఖండించి మన ప్రాంతం మిగిలియున్నదని దీనిని గూడ ఆ విధముగ ఉద్దరించిన వారి కోరిక నిర్విఘ్నముగ, సంపూర్తి యగునని వచ్చియున్నారట! వాదమందు మిమ్ములను గూడ జయించ వలెనన్న ఆకాంక్షతో మన పురమందు బసచేసి యున్నారు' అని మెల్లగ హరదత్తుడు తన గురు దేవులకు వ్యక్తం చేశాడు.


శిష్యుని పలుకులు ములుకులై హృదయాం తరాళమందు గాఢముగ నాటుకొనగా నీలకంఠాచార్యు లొకించుక సేపు మౌనం వహించి పిమ్మట, 'శిష్యా! నా శక్తిసామర్థ్యములు నీవెఱుగవా? ఆసన్న్యాసి సముద్రమును ఎండగట్ట గలడనుకో! ఆదిత్యుని అనేక మారులు ఆకాశము నుండి అవనీతలమునకు దింప గలడనుకో! ఈ భూమినంతను ఒక్క పర్యాయం చాపచుట్ట వలె చుట్టగలడనుకో! ఇంకను ఏలాటి ఘన కార్యములనైనను చేయ గలడనుకో! నన్ను మాత్రం జయించడం కల్ల! క్షణంలో అతణ్ణి ఓడించడం స్థిరం! నా చాకచక్యం, నా ప్రజ్ఞ ఆ సన్న్యాసి చవి చూచును. నీకనుమాన మేల?' అని లోన గల పిరికితనమును వ్యక్తం చేయక హేలగాపలికాడు. లోనికేగి, ‘అదేమియో చూచెదను గాక!' అని మనస్సులో తలచి చక్కగా ద్వాదశ స్థానము లలోను విభూతిరేఖలను ధరించి, రుద్రాక్ష మాలలను అలంకరించుకొని, సాక్షాత్ శివునివలె తయారై, శిష్యులను వెంటబెట్టుకొని బయలు దేరి శ్రీశంకరాచార్యుల కడకు పోవుచుండెను. శ్రీ ఆచార్యస్వామిని సమీ పించి చేరువన కూర్చుం డెను.


*నీలకంఠుడు:*


నీలకంఠుడు జగద్గురువులతో వాదించుటకు  ఉద్యుక్తుడైనటుల సురేశ్వరాచార్యుడు గ్రహించాడు. తన చాతుర్యం వాదంలో చూపించెదనని, నీల కంఠునితో శ్రీసురేశ్వరా చార్యుడు వాదించుటకు జగద్గురువులనర్ధించాడు.  అందులకు శ్రీ శంకరపాదు లంగీకరించగా తయారుగ నుండెను. నీలకంఠాచార్యులు దానిని కనిపెట్టి, 'ఓయీ! నీవు నాతో వాదించ నాయత్తపడు చున్నట్లు కన్పట్టుచున్నావు! అలనాడు నీవు, నీ భార్య శ్రీశంకరులతో వాదించి ఓడిపోయి నటుల నేనెఱుగనా? నీ ప్రజ్ఞ అందు వ్యక్తమైనది గదా! స్వయంగా ఆచార్యస్వామితో వాదించ నుద్యుక్తుండనై వచ్చితిని. మధ్య నీతో  నాకేల?' అని సురేశ్వరా చార్యుని తిరస్కరించి శ్రీ ఆచార్యపాదులవైపు తిరిగి వాదమునకు సిద్ధముగా నున్నటుల వ్యక్తపరిచాడు. అందు లకు సర్వసిద్ధముగ నున్న జగద్గురువులు తన యభి మతమును వ్యక్తంచేయగా నీలకంఠా చార్యులు, 'శంకరా చార్యా! బ్రహ్మసూత్రములకు నేను ఇదివరకే భాష్యమును రచించి యుంటిని. శివతత్త్వమే మానవులకు శరణ్యమని సిద్దాంతం జేసినాడ' అని ప్రారంభించునంత శ్రీ శంకరాచార్యులు నీల కంఠాచార్యునికి గల ప్రభావమును సంపూర్తిగా వ్యక్తం చేయువరకు వేచియుండిరి. అంత వరకు వెడలగ్రక్కిన విషయములను పట్టు కొని ఒక్కొక్కదానినే తుత్తునియలు గావించిరి. అట్లు ఛేదించుట గమనించి పక్షములు తెగి న పక్షివలె నీలకంఠుడు కూలబడియెను. పట్టు దలవహించి వితండ వాదమునకు నడుం బిగించ  సమకట్టెను. 'యతివర్యా! తత్త్వమ స్యాది మహావాక్యములు జీవబ్రహ్మైక్యమునే ప్రతి పాదించుచున్నవని పలుకుచున్నారు. తాము కూడ అట్టిభావము స్థిర మైనదిగా భావించుచున్నారు. కాని అదెంత మాత్రము సమంజసము గనున్నటు లొప్పుటలేదు. లోకములో చీకటి, వెలుగులున్నవి. ఆ రెండి టికి విరుద్ధ భావములు సహజముగ నున్నవే కదా! ఆ రెండింటికి భేదము లేదనడం ఎట్లు పొసగును?అదేవిధముగ జీవేశ్వరులు ఒకే ధర్మము గలవారు కాదు గనుక వారిరువురకు భేదమే సత్యము. జీవేశ్వరులకు భేదములేదనుట పొసగు నది కాదు.


'శంకరాచార్యా! జీవేశ్వరులకు భేదం లేదని ఒప్పించుటకు ఎన్నెన్నో యుక్తులు పన్ని ప్రయత్నించెదరు. అందు ‘బింబము-ప్రతిబింబము' అనుసామ్యంచెప్పుదురు. బింబము లేకుండ ప్రతిబింబ ముండదు. బింబము వంటివాడు ఈశ్వరుడు. ప్రతిబింబ మువలె జీవుడున్నాడని యందురు. అంత మాత్ర మున బింబ ప్రతిబింబ సామ్యంతో జీవేశ్వరులకు భేదములేదని ఒప్పించుట సమంజసము కానేరదు. ఏలయన సూర్యునకుండే గుణము లు ప్రతిబింబమునకు లేవుగదా! అందువలన గుణభేదం ఏర్పడినం దున వైరుధ్యము ప్రత్యక్ష మగుచున్నది. ఇందు సామ్యం ఎట్లు సమర్ధ నీయము? కనుకనే వ్యోమశివుడు మొదలైన మహా మహులందరు దానిని మిథ్య యని స్థిరపరిచినారు. కావున మీరందరు పలుకునది ప్రమాణరహితం. ఇది యును గాక, బింబము సత్యము, ప్రతిబింబము అసత్యమేగదా! ప్రతి బింబము బింబము యొక్క ఛాయమాత్రమే అయియున్నది. ఛాయ లెన్నటికి సత్యములు కానేరవు. జీవుడు పరమాత్మ యొక్క ప్రతిబింబమని అంగీక రించిన అది సత్యము ఎన్నటికీ కాదు. పరమాత్మకు ఉపాధి లేదు. ఉపాధి లేనప్పుడు పరమాత్మకు ఛాయ యెట్లు కలుగును? ఒకవేళ ఉన్నదని ఒప్పుకొనిన ప్రతిబింబ మునకు సత్యత్వమే యుండదు. కనుక జీవుడు మిథ్యావస్తువే యగుచున్నది. జీవుడే లేనప్పుడు తేడా లేదనడం ఎన్నటికీ సాధ్యం కానిమాట. అట్లయినచో బంధము లేదు, మోక్షము లేదు. మరియొక విషయము - 'జీవునకు బ్రహ్మకు ఉపాధులు లేవు, అవి కల్పితము' లనుచు న్నారు. ఆ ఉపాధులు నశిస్తే 'జీవుడే బ్రహ్మ' అని అంటారు వేదాంతులు. జీవేశ్వరులలో ఈశ్వరుని వలె జీవుడుండుట లేదు. ఈశ్వరునకు సర్వజ్ఞత్వ మున్నది.


జీవుడు మూఢుడు, పైగా అల్పజ్ఞానంతో నున్న వాడు.


అందువలన వారిరువురి ధర్మముల లోను తేడాలు స్పష్టముగ నున్నవి. మరియు ఆవులకు గుఱ్ఱములకు ధర్మాలలో తేడాలున్నవి. ఆ ధర్మములను కాదను టకు ఎట్లు వీలు లేదో జీవేశ్వరులకు చిన్న, పెద్ద అను తేడాలున్నవి. అట్లు కాదనుట ఎవరికీ శక్యం కాదు. 'నేనుపరమాత్మను కాను' అనేది కూడ ప్రత్యక్ష ప్రమాణం కలదియే. దీనిని కూడ కాదనుటకు వీలు లేదు. కనుక భేదం లేదని వాదించడం భ్రాంతి కాక మరేమున్నది? 

 

లోకమంతా 'నేను, నీవు' 'వాడు, వీడు' అనే భావంతో మునిగి యున్నది. ఇది నా భార్య, వీడు నా కుమారుడు, ఈతడు నా మిత్రుడు అనుచున్నారు. నాకు, వీనికి భేదము లేదనుచున్నారు. భేదము లేకుండ అభేదము రాదు. అప్పుడు కూడ రెండు ఉండి ఉండ వలెను. నేనే వాడు, వాడే నేను అన్నప్పుడు భేదం లేకున్నను ఇద్దరు కనబడుచున్నారు. 'నేను బ్రహ్మను' అనినప్పుడు 'నేను' అనువాడొకడు, ‘బ్రహ్మ’ అనువాడొకడై తీరుచున్నది. కనుక అద్వైతమనునది శుద్ధ అబద్ధమైంది. గనుక ద్వైతమే స్థిరం' అని నీలకంఠుడు తనలో నున్నదంతయు వెలువ రించెను.


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ ఆది శంకరాచార్య చరితము 40వ భాగముసమాప్తము* 

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

*శ్రీ ఆది శంకరాచార్య చరితము 39,

 *శ్రీ ఆది శంకరాచార్య చరితము 39,వ భాగము*

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️


*పరమాణు వాదులు:*


పరమాణువాద మత స్థులలో ధీరశివుడను వాడు పెద్ద. ఆయన శంకరులను సమీపించి, 'స్వామీ! నమస్కారములు! పరమేశ్వరుడు లోకములన్నింటికి కర్తయై వెలయు చున్నాడు. అంతవరకు అందరికి సమ్మతమే. నిత్యత్వంగల భూమ్యాది పరమాణు వుల సంయోగము వలన లోకములు సృష్టింప బడుచున్నవి. ఎప్పుడా పరమాణువు లు వియోగము జెందునో ఆనాడు ప్రళయము సంభవించుచున్నది. కాని పరాత్పరుడు తాను నిమిత్త మాత్రుడై, సాక్షీభూతుడై ఉన్నాడు’ అని వివరించాడు.


ధీరశివుని మత విధాన మును విని, 'ధీరశివా! నీవన్నదంతా వేద విరుద్ధమైనది. సమస్త ము పరమేశ్వరుడి నుండియే పుట్టు చున్నది. ఆయన సృష్టించనిది ఏమియు లేదు. లోకముల కాయన తండ్రి యని వేదము తెలియ జేయు చున్నది. గౌతమ ముని చే తెలుపబడినన్యాయ విద్యను అనుసరించిన వారు నక్కలై పుట్టెదరు. కనుక అట్టివన్నియు విడనాడి అద్వైతతత్త్వ మునాశ్రయించి ముక్తు లు కండు. అందులకు సద్గురువుల నాశ్రయిం చవలెను' అని శ్రీ శంకరాచార్యస్వామి తెలుపగా ధీరశివుడు మొదలైన పరమాణు వాద మతము వారందరు తమ మతమును వీడి శ్రీ శంకరపాదులకు శిష్యులై అద్వైతతత్త్వ జ్ఞానార్జన జేయుచు సుఖముగ నుండిరి.

ఆ మరునాడు బ్రాహ్మీ ముహూర్తమున లేచి, త్రివేణీ సంగమంలో స్నానాదులొనర్చి, శ్రీ శంకరపాదులు శిష్య సమేతముగా బయలు దేరి వారము దినములకు కాశీక్షేత్రం జేరు కొన్నారు.


*కర్మవాదులు:*


ప్రయాగ పట్టణము నుండి కాశీ జేరుకొని శ్రీశంకరాచార్య స్వామి మూడు మాసములు అద్వైత మత ప్రచార ముజేసిరి.శ్రీ శంకర పాదుల ఆగమనముతో కాశీ పట్టణం కళకళలాడి నది. పురజనులు తండోపతండములుగ వచ్చి జగద్గురువుల దర్శనం చేసికొని పద్మపాదాదియతులను దర్శించి ఆశీర్వచన ములు పొంది పోవు చుండిరి. పూర్వ పరిచయం గలవారు శ్రీశంకరాచార్యుల దివ్య తేజంచూచి అబ్బుర పడి అమితానంద భరితులైరి. శ్రీ ఆచార్య స్వామి దేశమందనేక మతములను నిరాక రించి అద్వైత మతము నకు పట్టాభిషేకము జేసి వచ్చినారని కాశీ పురమందు, చుట్టుపట్ల గల కర్మవాదులందరు ఒకచో సమావేశమై ఎట్లైనను కర్మమతము నకు ప్రముఖస్థాన మిప్పించ వలెనని నిర్ణయించు కొనిరి.

కర్మవాదులందరు శ్రీ శంకరపాదులకు యధా విధిగ నమస్కారములర్పించి తమతమ స్థానములయందు ఆసీను లయ్యారు. అందొకరులేచి, ఆచార్య స్వామీ! కర్మ చేయనిదే ఏమీలేదు. సృష్టిస్థితు లకు కర్మ వల్లనే గదా కారణమగు చున్నది. మంచికర్మలు చేయుట వలన మంచి జన్మలు, చెడు కర్మలాచరించి నందువలన నీచజన్మలు కలుగు చున్నవి. జనకమహారాజు మొదలయిన వారు అందరు సత్కర్మలాచ రించుట వలననే గదా జ్ఞానులై ముక్తిని బడసి యున్నారు. ముముక్షు వులందరు కర్మలు చేయవలెనని, దాని వలన సుఖం కలుగు నని, ఆ సుఖమే మోక్షమని నిర్ణయిం చారు గదా!” అని తెలియజేసెను.


కర్మోపాసకుల పలుకు లాలకించి శ్రీ శంకరా చార్యులు, 'కర్మోపాసకుడా! “యస్యైతత్ కర్మ” అని శ్రుతి తెలుపుచున్నది. జగత్తు పుట్టినదనిన అందులకు కారణము బ్రహ్మే, అది సుస్పష్టము. కర్మ జడమై యుండ,జడము సృష్టికి కారణమెట్ల గును? మూఢులయిన వారుమాత్రం జడమగు కర్మనాశ్రయించి జనన మరణరూప సంసార సాగరమందు బడుచు న్నారు' అని సూక్తులతో పలుక కర్మవాదులం దరూ శ్రీశంకరులకు శిష్యులై కర్మమతమును విడనాడి అద్వైత విద్య నాశ్రయించారు.


*చంద్ర మతస్థులు*:


శివభూషణుడను పేరు గల చంద్రమత గురువు శిష్యులతో శ్రీశంకరాచార్యుల కడకు జేరి, 'యతీశ్వరా! నమస్కార ములు! పూర్ణిమ మొదలగు పుణ్య తిథులలో భక్తిశ్రద్ధలతో చంద్రుని ఆరాధించెదరు. లోకములన్నిటికి ప్రకాశమును కలుగ జేయు చున్నాడు చంద్రుడు. ఆయన ప్రత్యేక మండలము గలిగినవాడై లోకములకు కూడ పాలకుడై అలరారుచున్నాడు. అందువలన చంద్రుడు అందరికి పూజనీయు డయ్యాడు. ఆతడే ముక్తి నిచ్చువాడు. అందుచే మేమందరం ఆయన్నే ఉపాసించు చున్నాము. తాముకూడ మావలెనే చంద్రుని పూజించి ధన్యులు కండు!' అని తన మత విధానమును వివరించెను.


శ్రీశంకరాచార్యులు ఆ పద్దతిని విని, 'శివ భూషణా! అనిత్యమైన వాళ్ళను ఉపాసించిన నిత్యమైన మోక్షం ఎట్లా కలుగును? అదెన్నటికి సాధ్యం కాని పని. కొన్ని కర్మలు చేసిన చంద్ర మండల నివాసం కలుగును. ఆ పుణ్యం తరిగిన వెంటనే తిరిగి భూ లోకమందు జన్మించడం సత్యం. ‘ధూమో రాత్రి స్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్ | తత్ర చాంద్రమానం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే' అని శ్రీకృష్ణ భగవానుడువచించాడు. అనగా పొగ, రాత్రి, కృష్ణపక్షము, ఆరునెల లతోగూడిన దక్షిణాయ నము, ఏ మార్గమున గలవో ఆ మార్గమున వెడలి, సకామ కర్మయోగి చంద్ర సంబంధ మైన ప్రకాశమును పొంది, మరల వెనుకకు వచ్చుచున్నాడు. అనగా భూమండ లమున జన్మించుచున్నాడు. పైగా చంద్రుడు దేవతలకు అన్నమని చెప్పుచున్నది. అట్టి వాణ్ణి ఎట్లు సేవించినను ముక్తి రానేరదు. ఒక్క చంద్రలోక ప్రాప్తి మినహాగా చంద్రోపాస కునకు లభ్య మయ్యేది మరియొకటి కానరాదు. కనుక ఇంతటితో మీ మూఢత్వమును విడనాడి జ్ఞానమును ఆర్జించుకొని ముక్తులు కండు! జ్ఞానమే ముక్తికి మార్గము' అని బోధించారు.


శివభూషణాదులు శ్రీ జగద్గురువుల తత్త్వ బోధను విని తమ మతమును  విడనాడి శ్రీశంకరపాదులకు శిష్యులై అద్వైతతత్త్వ జ్ఞానార్జన చేయుచు సుఖముగ నుండిరి.


పిమ్మట కుజుడు మొదలైన గ్రహోపాసకు లు శ్రీశంకరపాదులతో వాదించ వచ్చి యున్నారు.


*కుజాది గ్రహోపాసకులు*


గ్రహములు తొమ్మిది. అందు మొదట రవి చంద్రులను ఉపాసిం చువారు శంకరులతో వాదించి అద్వైతు లయ్యారు.మిగిలినవారు కుజ, రాహు, గురు, శని, బుధ, కేతు, శుక్ర మతములవారున్నారు. వారందరు శ్రీశంకరా చార్యులను దర్శించి, 'స్వామీ! అనేక నమస్కారరములు! అంగారకుడు మొదలయిన గ్రహములను ఉపాసిం చిన ముక్తి కలుగునని వేదమందు వచించ బడియున్నది. మేమం దరము అంగారకాది గ్రహోపాసకులము. మా ఉపాసనలతో తప్పక మాకు ముక్తి కలుగు చున్నది. కావున ముక్తిని పొందగోరు వారు మావలె శ్రద్ధతో కుజాది గ్రహములను ఉపాసించవలెను అన్నారు.


శ్రీ శంకరదేశికేంద్రులు కుజాది గ్రహోపాసకుల ఆశయము విని, ‘భక్తులారా! గ్రహాల నుపాసించిన ముక్తి లభింపదు. అట్టి ఉపాసన గ్రహపీడలను వదల్చుకొనుటకు ఉపకరించును. తత్త్వజ్ఞానం వల్లనే ముక్తి కలుగుచున్నదని 'సదేవ’ మొదలగు వాక్యములు ప్రమాణ ములుగ నున్నవి. కావున నవగ్రహోపాస నలు విడనాడి ఆత్మ తత్త్వ జ్ఞానమునకై పాటుపడుడు!' అని బోధించారు. అంతట గ్రహోపాసకులందరు శ్రీశంకరపాదుల మాటల యందు గౌరవముంచి శ్రీజగద్గురువులకు శిష్యులై ఆత్మతత్త్వము నాశ్రయించి జ్ఞానులై సుఖమును పొందిరి. పిమ్మట క్షపణకుడను వాడు శ్రీశంకరపాదుల శిష్య గణమందు వేచి యున్నవాడు, శ్రీ శంకరాచార్యస్వామి వారి పరీక్షకు సిద్ధ పడెను.


*క్షపణకుడు శిష్యుడగుట:*


ఆరుమాసముల క్రితం శ్రీశంకరాచార్యులఆజ్ఞకు బద్ధుడై గోలయంత్ర తురీయ యంత్రములను ధరించిన క్షపణకుడను కాలమతస్థుడు ఉండ బట్టలేక శ్రీజగద్గురువుల కడ కరుదెంచి, నమస్కరించి, 'స్వామీ! చిరకాలము నుండి మీకడ నుండిపోతిని. నన్ను పరీక్షింతు నంటిరి. కాని మీకడ సుఖముగ నుంటిని. నన్ను మన్నించి నా మతవిధానము వినుడు!' అనగా శ్రీశంకరపాదులంగీక రించి వివరించమనిరి.


'పరాత్పరా! కాలమే పరబ్రహ్మమని మేము నమ్మియున్నారము. ముక్తికోరువారు మా కాలదేవుణ్ణి ఉపాసించవలెను. ఆయన మాకు ముక్తి నిచ్చుచున్నాడు. తామును మావలెనే కాలదేవుని ఉపాసిం చుడు!' అని క్షపణ కుడు వివరించెను.


వాని మాటల కాశ్చర్య పడి శ్రీశంకరాచార్యులు 'కాలముగూడ పరబ్రహ్మము నుండియే ఉత్పన్నమైనది. పుట్టిన దెప్పుడును నిత్యము కాదు. కనుక దాని నుపాసించ తగదు. కాలోపాసన వలన ముక్తి రాదు. ఇకనైన నీ బుద్ధి మార్చుకొని అద్వైత మతము నాశ్రయించుము! అదియే నీకు ముక్తి నిచ్చును' అని బోధించారు. 

క్షపణకుడు తక్షణం తన మతమును విడిచి శంకరులకు శిష్యుడై అద్వైతము నాశ్రయిం చాడు.


*పితృమతస్థులు:*


సత్యకర్మ మొదలయిన పితృ మతస్థులు తమ మత విధానమును తెలిపి శ్రీశంకరులను ఒప్పించుటకు వచ్చి నమస్కరించారు. 'స్వామీ! పితృ దేవతలు ఎల్లపుడు ముక్తులయి ఉన్నవారు. వాళ్ళను సేవించుట వలన ధర్మాదులు లభించి ముక్తి కలుగు చున్నది. వారలకు నిత్యము పితృ తర్పణ ములు వదలుచుండ వలెను. శ్రాద్ధాదులు శ్రద్ధతో పెట్టవలెను. అట్లుచేసిన గృహస్థులు ముక్తులగుచున్నారు. పితృలోకము చంద్ర మండలమునకు పైగా నున్నది. 


చాంద్రమానమును బట్టి ప్రతీ అమావాస్య పితృదేవతలకు మధ్యాహ్న కాలము అగును. మానవమానం ప్రకారము పితృదేవత లకు ఒక దినము అచున్నది. అమావాస్యనాడు పితృదేవతలకు భోజన మిడిన వాళ్ళు ప్రతీ దినము భోజనము చేసినట్లగును. మన మట్లుచేసిన పితృదేవత తలు నిత్య తృప్తులగుదురు. ప్రతీ అమావాస్య నాడు పిండపితృ యజ్ఞము లాచరించి వలసి యున్నది. కావున పితృదేవతో పాసన చేసినవారు తప్పకుండ ముక్తిని పొందెదరు" అని వివరించారు పితృ మతస్థులు.


శ్రీ శంకరాచార్యస్వామి అది విని 'కర్మలు చేయుట వలన ముక్తి రాదని వేదం వచించు చున్నది. అందువలన మీరాడిన మాటలలో సత్యం దూరమైనది. ఆత్మతత్త్వ జ్ఞానమే ముక్తిని ఇచ్చునని పరమ ప్రమాణమై యుండ కర్మ చేయడం వలన ముక్తి కలుగు ననుటకు ఆస్కార మెక్కడ? కర్మాచరణ ద్వారా చిత్తశుద్ధి మాత్రమే కలుగు చున్నది. చిత్తశుద్ధి గలిగినవాడు సద్గురువుల నాశ్రయించి తత్త్వ విచారణ చేయవలసి యున్నది. దానివలన ముక్తి తప్పక సిద్దించును' అని బోధించారు. అంతట సత్యశర్మాదు లందరు తమతమమతములను విడనాడి శ్రీశంకరా చార్యులనుశరణుజొచ్చి శిష్యులై జ్ఞానమార్గము నవలంబించిరి.


*గరుడ శేష భక్తులు:*


గరుడ శేష భక్తులు శ్రీశంకరుల జూడ వచ్చారు. అందు కుజ్వలీటుడు ఆదిశేషుని భక్తుడు. శంఖపాదుడు గరుడభక్తుడు. వారిరువురు వారివారి మతస్థులలో గురువులై యున్నారు. వారిరువురు శ్రీశంకరపాదులను జేరి నమస్కరించి ‘యతీశ్వరా! మా మనవి చిత్తగింపుడు! ఆదిశేషుడు శ్రీ పరమే శ్వరునకు సర్వదా శయ్యాసుఖమును కలుగజేయు చున్నాడు. అందువల్ల మేమందరం  ఆదిశేషుని ఉపాసించు చున్నాము' అన్నాడు కుజ్వలీటుడు. 


'పరమేశ్వరునకు నిత్యం వాహన సౌఖ్యమును కలుగ జేయుచున్న గరుత్మం తుని పరమభక్తితో సేవించుచుందుము' అని శంఖపాదుడు వివరించాడు.


వారిరువురి విధానము లను విని, 'ఓయీ! భక్తులారా! శయ్యను, వాహనమును ఉపాసించిన ముక్తిరానేరదు. మీకు ముక్తి కావలెనన్న పరాత్పరునే సేవించుడు ఆ దేవదేవుని దయకు పాత్రులు కండు. ఆయన దయ వలన తత్త్వ జ్ఞానార్జన ప్రాప్త మగును. తద్వారా ముక్తిని పొందుడు' అని శ్రీ శంకరాచార్యులు తెలియజెప్పిరి. అంతట వారిరువురు సంత సించి జగద్గురువులు వచించిన విధానము ననుసరించుటకు నిశ్చయం చేసికొని శ్రీశంకరాచార్యుల నాశ్రయించి శిష్యులై నారు.


*సిద్ధోపాసకులు:*


'స్వామీ! నమస్కార ములు! మేమందరం సిద్ధుల అనుగ్రహంతో మంత్రాలను పొంది యున్నాము. శ్రీశైలము మొదలైన దివ్య స్థలములలో సత్యనాధుడు మొదలయిన అనేకమంది సిద్ధులు ఉంటున్నారు. వారు అందరు మంత్రసిద్ధి ప్రభావం వలన చిరకాలము నుండి అట్లనే ఉండిపోయారు. మేముకూడ వారివలెనే చిరకాలము నుండి జీవించుచున్నాము. అనేకవిద్యలు అంజనా దులు మా యధీన మైనవి. మమ్ములను కాదనువారికి శక్తి చాలదు. కనుక తాము కూడ మా వలెనే సిద్ధులై ప్రసిద్ధికెక్కుడు' అని తమ ఉపాసనా విధానమును విశద పరిచారు.


శ్రీ శంకరపాదులు సిద్ధుల ప్రజ్ఞ విన్నారు. 'సిద్దోపాసకులారా! విచిత్రవేషములు దాల్చుటవలన ఆడంబ రమే మిగులును. అజ్ఞానముతో మాట లాడుట యుక్తము కాదు. వేషాదుల వలన ద్రవ్యార్జనకు అనువుగా నుండిన నుండవచ్చు. అట్టి ద్రవ్యము పాప భూయిష్టమగును. ఆ ద్రవ్యమనుభవించిన వాడు పాపి యగును. ఈ శరీరములు సర్వ దుఃఖములకు నిలయ ములు. ఎంత కాలం జీవించిన నేమి ఫలము ఉన్నది? చిరజీవికి ఆత్మ సుఖం లేనప్పుడు జన్మ సార్ధకము కానేరదు. కావున తరుణో పాయము పొందుటకు జ్ఞాన మార్గమును అవలం బించుడు. తద్వారా ముక్తిని బడయుడు' అని తెలియజెప్పగా సిద్దులు శంకరసూక్తులు మనమున నాటి వారి మతమును విడచి శ్రీ శంకరపాదులకు శిష్యులై కృతార్ధు లయ్యారు.


*కాలడి శంకర కైలాస శంకర*

*శ్రీ ఆది శంకరాచార్య చరితము39 వ భాగముసమాప్తము*

🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗

రక్త , జిగట విరేచనాలు

 రక్త , జిగట విరేచనాలు కొరకు  - 


       ఉశిరిక ఆకులు 50 గ్రాములు , మెంతులు 3 గ్రాములు అరలీటరు మంచి నీటిలో వేసి పావులీటరు కషాయం అయ్యేవరకు మరిగించి వడపోసి ఆ కషాయాన్ని సగం సగం రెండుపూటలా తాగుతూ ఉంటే ఎంతోకాలం నుంచి బాధపెడుతున్న రక్త , లేదా జిగట విరేచనాల సమస్య అతి సులువుగా హరించి పొతుంది .


  

   మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  

  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

పండ్లు - వాటిలోని ఔషధోపయోగాలు - 2 .

 పండ్లు - వాటిలోని ఔషధోపయోగాలు - 2 .


 * అరటిపండు -


         అరటిపండులో పొటాషియం , మాంసకృత్తులు ఎక్కువుగా ఉండటం వలన ఇది తీసుకోగానే నీరసం , వికారం తగ్గి ఉత్సాహం వస్తుంది. గుండె పనితీరు క్రమబద్దం అవుతుంది. ఒక పెద్ద అరటిపండు తింటే 150 కేలరీల శక్తి వస్తుంది. అరటిపండు తినడం వలన జీర్ణశక్తి పనితీరు కూడా మెరుగవుతుంది. గుండెనొప్పి నివారించవచ్చు. రక్తహీనతతో బాధపడేవారు అరటిపండు తింటే ఇందులో ఐరన్ ఉండటం వలన హిమోగ్లోబిన్ శాతం పెరుగును .


 * మామిడిపండు -


        మామిడిపండు శరీరపుష్టిని కలిగించును. వేగముగా శక్తిని ప్రసాదించును. మామిడిపళ్ళలో A , B , C , D విటమిన్లు కూడా ఉన్నాయి. మామిడి పండ్లలో ఉండే కెరొటిన్ శరీరంలో చేరాక విటమిన్ A గా మారును . మామిడికాయలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది. రెండింటిని తినడం వలన ఐరన్ , విటమిన్ C లను పొందవచ్చు. ఇతర ఖనిజ లవణాలు మాత్రం మామిడికాయ , మామిడిపండు రెండింటిలోనూ సమపాళ్లలో ఉంటాయి.


 * సీతాఫలం -


        శీతాకాలం ప్రారంభంలో కడుపులో నులిపురుగులు ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఈ సీజన్లోనే సీతాఫలాలు లభిస్తాయి. ఇవి తీసుకోవడం వలన నులిపురుగులు పోతాయి . సీతాఫలాలు కడుపులోని క్రిములను బయటకు నెట్టివేస్తుంటే సీతాఫలాలు తినటం వలన పురుగులు వచ్చాయి అనుకుంటాము. ఇది కేవలం భ్రమ మాత్రమే . సీతాఫలానికి జ్వరాన్ని తగ్గించే గుణం ఉన్నది. సీతాఫలం వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం ఉన్నది. రక్తవిరేచనాలకు ఇది మంచి మందుగా పనిచేస్తుంది .


 * దానిమ్మ పండు. -


       రక్తహీనతతో బాధపడేవారు రోజూ దానిమ్మపండు తినడంగాని లేదా దానిమ్మపండు రసం తాగడం గాని చేయాలి . ఆహారాన్ని జీర్ణం చేయడంలో దానిమ్మ ఒక ఔషధముగా పనిచేయును . అంతేకాకుండా కీళ్లనొప్పులు , ఉబ్బసం , కఫాలను పోగొట్టును . శరీరంలో మంట, జ్వరం , గుండెజబ్బులు , గొంతుకు సంబంధించిన సమస్యలకు ఇది చాలా మంచిది . అరుగుదల సరిగా లేనివారు దానిమ్మని తినటం అలవర్చుకోవాలి.


          తరవాతి పోస్టులో మరికొన్ని పండ్లలో గల ఔషధగుణాలు వివరిస్తాను. 


  

   మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  

  గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

ప్రతిభావంతులేమో

 ✊✊


*బోల్ ఇండియా బోల్ - చేదు నిజాలు*


రైతులు పొలంలో - రైతుల కొడుకులు సైన్యంలో మరణిస్తారు,

కానీ

నాయకులు దేశంలో, వారి సంతానం విదేశాల్లో, సౌఖ్యాలు పొందుతారు.


*చేదు నిజం ఏమంటే*, ఈ దేశ వాసులమైన మనం ఇక్కడ పి.హెచ్.డి, గ్రాడ్యుయేషన్, మెడిసిన్, ఇంజనీరింగ్ చదివిన వాళ్లం,

టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకు ఓటు వేసి, నేతలుగా ఎన్నుకొని, వారి నుండి మన బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటుంటాం. *ఆలోచించండి*.


రాజకీయ నేతలు కావాలనుకొనే వాళ్ళు ఐదు సంవత్సరాలు సైన్యంలో ఖచ్చితంగా పనిచేసి తీరాలన్న నిబంధన పెడితే,

దేశంలో 80 శాతం ఉత్పాతాలు (దరిద్రాలు) వాటంతట అవే సర్దుకుంటాయి.


*25 - 30 సంవత్సరాల పాటు ఉద్యోగాలు చేసిన వాళ్లకు పెన్షన్ఉండదు*.

కానీ,

ఐదేళ్లు రాజకీయ నేతగా పదవి వెలగబెడితే మాత్రం *జీవితాంతం పెన్షన్, ఇతర సదుపాయాలు* ఇస్తున్నారు.

ఇలా ఎందుకు ఇవ్వాలి? 


నాయకులపైకి చెప్పులో, కోడి గుడ్లో, నల్ల సిరానో, విసిరితే ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేస్తారు.

కానీ,

భారతీయ సైన్యం పై రాళ్ల దాడి చేసే వాళ్లకు మాత్రం మినహాయింపు ఇస్తారు. ఎందుకు?


రైతుల సరుకుల వాహనాలపై తోలు వలిచి టోల్ వసూలు చేస్తున్నారు.

కాని,

మంత్రి మహాశయుల వాహనాలకు అదేమీ ఉండదు.

*రైతు తినేది దొంగ సొమ్మా?*

 *నేతలు తినేది కష్టార్జితమా?* ఇదేమి న్యాయం.


*విద్యలో రాజకీయం 100%*

*రాజకీయంలో విద్య 00%*

ఆహా ఎంత గొప్ప విధానం మన ఈ దేశంలో.

ఇందుకేనేమో *రాజకీయం అంతా చెత్త తో నిండిపోయింది*.


దేశంలోని ప్రతిభావంతులేమో

వలస పక్షులు అవుతున్నారు.


దేశంలోని ధర్మాసుపత్రుల్లో పరిస్థితులు మారాలంటే, నేతల పిల్లలకు 

వారి రోగాలకు చికిత్సలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి.

అప్పుడే పరిస్థితులలో మార్పు చూస్తాం.


*₹399 కి అపరిమిత కాల్స్* డేటా దొరుకుతుంటే ప్రజాప్రతినిధులకు నెలసరి *₹15000 టెలిఫోన్ బత్తా ఎందుకు?*


*ప్రజల చర్మం వలిచి పన్నులు వసూలు చేసే కోట్ల రూపాయలను ఇలా వృధాగా ఖర్చుచేయడం అవసరమా?*

అందరూ ఆలోచించాలి. మతం గురించి రాజకీయ నాయకులు రెచ్చగొడితే పేద వర్ణ ప్రజలు రెచ్చిపోయి సాటి మనిషిని దూరం పెట్టి, మతంలో మృగాలా మారిపోతున్నారు. కానీ అది రాజకీయ ఎత్తుగడ తెలుసుకోలేకపోతున్నాడు.


దయచేసి మన దేశంలోని ఇలాంటి *దరిద్ర వ్యవస్థ* గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయండి.

సేకరణ

ఆకవరం దామోదరాచారి

ఆదివారం*🌞 🌹 *13, అక్టోబర్, 2024*🌹

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🌞 *ఆదివారం*🌞

🌹 *13, అక్టోబర్, 2024*🌹       

      *దృగ్గణిత పంచాంగం*                


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - శరత్ఋతౌః*

*ఆశ్వీయుజ మాసం - శుక్లపక్షం*


*తిథి     : దశమి* ఉ 09.08 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం: ఆదివారం* ( భానువాసరే )

*నక్షత్రం  : ధనిష్ఠ* రా 02.51 వరకు ఉపరి *శతభిషం*


*యోగం  : శూల* రా 09.26 వరకు ఉపరి *గండ*

*కరణం  : గరజి* ఉ 09.08 *వణజి* రా 07.59 ఉపరి *భద్ర*


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 07.00-08.00 &11.00-12.00 మ 02.30-04.00*

అమృత కాలం:*సా 05.09 - 06.39*

అభిజిత్ కాలం  : *ప 11.30 - 12.17*


*వర్జ్యం          : ఉ 08.11 - 09.41*

*దుర్ముహూర్తం:సా 04.13 - 05.00*

*రాహు కాలం: సా 04.19 - 05.47*

గుళికకాళం      : *మ 02.50 - 04.19*

యమగండం    : *ప 11.53 - 01.22*

సూర్యరాశి : *కన్య* 

చంద్రరాశి : *మకరం/కుంభం*

సూర్యోదయం :*ఉ 05.59* 

సూర్యాస్తమయం :*సా 05.47*

*ప్రయాణశూల  : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 05.59 - 08.21*

సంగవ కాలం  :      *08.21 - 10.43*

మధ్యాహ్న కాలం :*10.43 - 01.04*

అపరాహ్న కాలం:*మ 01.04 - 03.26*

*ఆబ్ధికం తిధి: ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశి*

సాయంకాలం :  *సా 03.26 - 05.47*

ప్రదోష కాలం   :  *సా 05.47 - 08.14*

రాత్రి కాలం     :  *రా 08.14 - 11.29*

నిశీధి కాలం    :*రా 11.28 - 12.18*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.22 - 05.11*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🌞 *శ్రీ సూర్య నారాయణ దండకం...!!*🙏


శ్రీసూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ!!(2సార్లు)


ఆత్మరక్షా నమః: పాపశిక్షా నమోవిశ్వకర్తా నమో విశ్వభర్తా

నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథాధినాథా 

మహాభూతభేదంబులున్ నీవయై బ్రోచు మెల్లపుడున్ భాస్కరాహస్కరా!!


    🌞 *ఓం సూర్యాయ నమః*🌞


🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌹🌞🌞🌹🌷🌹

శాఖాహారం అమృతాహారం

 శాఖాహారం  అమృతాహారం.


భారత దేశం పుణ్య భూమి అంటారు .!!

మరి అటువంటి భారత దేశాన్ని

పుణ్య భూమి గానే ఉంచుదా ము.


ఇది ఖచ్చితం గా చదవండి.


 మాంసాహారం మృతాహారం


జార్జి బెర్నర్డ్ షా అన్నారు,

నీ పొట్ట శ్మశానం కాదు అని.


వివరణ చూద్దాం.


(1)  జంతువులు,పక్షులు,జల చరాలు, అన్ని కూడా మనలాగే నొప్పి ఉన్న ప్రాణులే.

మనకి ఎలా అయితే పెన్సెలు చెక్కి నప్పుడు వ్రేలు కోసుకుంటే వారం పది  రోజులు,(అలాగే ఇతరత్రా)

వరకు కట్టు వేస్తామూ.

అదే జంతువులని పీక           కోస్తున్నప్పుడు అది భూమిపై గిల గిల కొట్టు కుంటున్నప్పు డు అది ఎంత బాదపడు తుంది,,  

 మైడియర్  ఫ్రెండ్స్   ఒక్కసారి ఆలోచిద్దాం . మరి ఆబాద ఎవరికి చెందుతుంది.


పెంచిన వారికి,అమ్మే వారికి,కొన్న వారికి,వండే వారికి,తిన్న వారికి . చేరి ఇంట్లో,వొంట్లో కస్టాలు.


2  ఈ మాంసము తినడం ఎక్క డ నుండి మానవుడి కి             వచ్చింది అంటే,

ఆది మానవుడు నుండివచ్చింది.                        ఆది  మానవుడు ఎలా ఉండేవాడో అందరికి తెలుసు,జంతువు లాగే ఉండేవాడు.

మరి ఈనాడు  అన్నీ అలవాట్లు మార్చుకుని జీవిస్తున్నాడు.

మరి జంతువుల తిండి ఎందుకు మారలేదు.


3   మన పురాణాలు లో ప్రతి భగవంతుడి వెనుక ఒక జంతువు లేక పక్షి ఉంటుంది.

అంటే భగవంతుడు జంతువు లో కుడా ఉన్నాడు ,మమ్మల్ని పూజించి నట్లే వాటిని కుడా పూజించండి అని.


మరి మన వాళ్లు దేవుడి తో పాటు వాటిని పూజిస్తారు,మళ్లి

వాటిని చంపి తింటారు.

ఎందుకు.   !!  

                  

అలాగే

దశావతారం లో భగ వంతుడు నేనే  ఆ అవతారాల్లో ఉన్నాను అని చూపించేడు.


4  మాంసం తిన్న  జంతువు క్రూరత్వం తో ఉంటుంది. వాటి  దగ్గరకు మచ్చిక అయితేనే వెళ్ల గలం.

ఉదా; పిల్లి,కుక్క,నక్క,పులి,సింహం.


అదే ఆవు,మేక,గొర్రె,ఏ నుగు,ఇంకా ఎన్నో వీటి దగ్గరకు మనం వెళ్లగలము.


  ఇంకా అంటారు మాంసం బలమని

మరి పై జంతువులన్నిటి కి బలము ఎలా వచ్చింది.!!


అలాగే మాంసం తిన్న జంతువుల కి కోరలు , గోళ్ళూఉంటాయి.


ఆవులు  మిగతా వాటికి దంతాలు ,గిట్టలు ఉంటాయి.

మరి మన పళ్ళు,గోళ్ళూ  ఎలా ఉన్నాయి.


అలాగే

మనిషి బ్రతకడం కోసం ఆహారం కావాలి కాని మాంసం అవసరం లేదు,


నాలుక మీద ఒక్క క్షణం ఉండే రుచి కోసం ప్రాణం తీయడం అవసరమా.


ఈ రోజు ఎన్నో రకాలయిన veg లు దొరుకు తున్నాయి.

పన్నీరు,మష్రూమ్,మీల్ మేకర్

బేబీ కార్న్, ఇతరత్రా. 


అలాగే ఇంకో ఆసక్తి కరవిషయం

ఒక kg మాంసం తయారీ కి 10     or  15 వేల లీటర్ల నీరు అవసరం పడుతుంది.

అదే కాయగూరల కి 500 లీటర్ల   

         నీరు పడుతుంది.


ప్రాణం విలువ, ప్రాణం ఉన్న వాళ్ళకే తెలుసు..


జై హింద్.

12, అక్టోబర్ 2024, శనివారం

Panchaang


 

జగదంబను రుక్మిణి వేడుట!

 శు భో ద యం 🙏

జగదంబను రుక్మిణి వేడుట! 


            ఉ:  నమ్మితి  నామనంబున  సనాతనులైన  యుమామహేశులన్  


                 మిమ్ము , పురాణ దంపతుల  మేలుభజింతు గదమ్మ ! మేటి   పె


                ద్దమ్మ !  దయాంబురాసివి గదమ్మ!  హరిం బతిసేయుమమ్మ!  నిన్


                నమ్మిన  వారి  కెన్నటికి  నాశము  లేదు గదమ్మ!    యీశ్వరీ !


                    శ్రీ భాగవతము- దశమస్కంధము- 1741 పద్యం:  బమ్మెఱపోతన;


                               తెలుగు వారి  పుణ్యాల పేటి  శ్రీ మహాభాగవత గ్రంధము. ఇది 18 పురాణములకు  మించిన నహాపురాణముగా

ప్రసిధ్ధి గాంచినది. శ్రీకృష్ణ పరమాత్ముడే నాయకుడుగా వెలసిన యీగ్రంధమున  నతని లీలా వినోదములే యనేక రసవద్ఘట్టములుగా , తీరిచి దిద్ద బడినవి. రక్తికి , భక్తికి , ముక్తికి ,యీగ్రంధము మూలమై యాంధ్ర సాహిత్యమున కొక వెలలేని యలంకారమై భాసించు చున్నది. భాగవతమునందలి  రసవద్ఘట్టములలో  రుక్మణీకళ్యాణము  ప్రముఖమైనది. 


                                 పెండ్లి కుమార్తెయగు  రుక్మణి  శిశుపాలుని  వరింప నిష్టపడక  తాను మనసిచ్చిన కృష్ణ పరమాత్మకు తనహృదయమును నివేదించి  యతనిని దోడ్కొని వచ్చుటకు అగ్నిద్సోతనుడను బ్రహ్మణ వర్యుని  ద్వారకకు పంపినది.తడవైనది యతడురాడాయెను.ముహూర్తము దరియు చున్నది.  గౌరీ పూజయు ,ప్రారంభమైనది. డోలాయమాన చిత్తయగు రుక్మిణి  సర్వమునకు  ఆపరమేశ్వరిపైననే భారముంచి  ఆజగ దంబ  నిట్లని ప్రస్తుతింప సాగినది. 


                   పోతన కవి చాతుర్యమంతము  పద్యము యెత్తుగడలోనే ప్రదర్శించినాడు."  నమ్మితి నామనంబున  సనాతనులైన  యుమామహేశులన్ మిమ్ము"- అమ్మా!  నేను  మిమ్మల్నే నమ్ము కొన్నాను. మీరు సనాతన దంపతులు. మీకన్న నాకు దిక్కెవ్వరు?అనుచున్నది. ఆమాటతో భారమంతయు పార్వతీ పరమేశ్వరులపై నుంచినట్లయినది.


                      పార్వతీ పరమేశ్వరులనే  గోరనేల? వారును ప్రేమ జంటలే !వారినిగూడ పెద్దలు వారించినారు. అయినను వారిరువురు సతీపతులైనారు. ఎన్ని యుగములైనదో వారిదాంపత్య మారంభమై,కావున వారు పురాణదంపతులు. అట్టి దంపతులదీవెనలే పెండ్లికుమార్తెకు కావలసినది. నచ్చినవరుతో కళ్యాణము ఆడుదానికి ఒక అమూల్యమైన వరముగదా! ఆవరము నీయగల

శక్తి శివ పార్వతులకేగలదు. కాబట్టే రుక్మిణి వారినాశ్రయించుట. గౌరీ పూజలోని ఆంతర్యమిదే !


                                     మిమ్ము పురాణదంపతుల  మేలుభజింతు గదమ్మ" ఆది దంపతులగు మిమ్ము  నెల్లవేళల పూజింతునుగదా!

నాచేపూజలందెడు మీరే నాకోర్కెదీర్పవలె. వేరెవ్వరు దీర్పగలరు.? 


                    మేట్టి  పెద్దమ్మ!  అమ్మలకు  అమ్మలున్నారు కాని  మేటియైన పెద్దమ్మల నెక్కడ గాంచగలము. ఆతల్లి పార్వతియే!" ఆకీట,

బ్రహ్మపర్యంతం ,ఆమెయే జనని. జగజ్జనని. కావున నందరకు పెద్దమ్మ ఆమెయే! పెద్దలే పిల్లలకోరికలు దీర్చాలి. లేకున్న వారి పెద్దరికమునకే అవమానము.


                     "దయాంబురాశివి గదమ్మ" ఆమె దయా సముద్ర. సువిశాలమై  అగాధమై  యనంతమైన  సముద్రముతో  నామెదయకు పోలిక. ఆహా! యెంత చక్కని యుపమానము.భక్తులయెడ  తరుగని దయగలది యాతల్లి.కావున ఆమెదయకు నోచుకొన్నవారి కోరికలు దీరక పోవునా?


                 చివరకు చెప్పుచున్నది అసలుమాట."హరింబతిసేయుమమ్మ" శ్రీకృష్ణుని నాకు భర్తగా చేయవమ్మా! యెవరు కాదన్నాసరే,నీవు అవునంటే చాలు మావివాహం జరిగితీరుతుంది. అమ్మా! నేవలచిన కృష్ణుని  భర్తగా ననుగ్రహించు.


                       నిన్  నమ్మిన వారి కెన్నటికి  నాశము లేదుగదమ్మ  యీశ్వరీ!"- నిను నమ్మిన వారు చెడగా నేనెక్కడా చూడలేదమ్మా!

కాన నాకోరిక ఫలింప జేసి  మానమ్మకము నిలబెట్టు మని రుక్మిణి  గౌరీ ప్రార్ధనము!


                           చక్కని నుడికారముతో  బహు చక్కని భావజాలముతో  రుక్మిణి కోరిక  ఫలించు రీతిగా  గౌరీ ప్రార్ధనా ఘట్టమును

కేవల మొకేయొక్కపద్యమున సయుక్తికముగ, సముచితముగ  రచియించిన పోతన మహాకవికి సాటి యగువారెవ్వరు? 


                                                       స్వస్తి!!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷