7, ఏప్రిల్ 2025, సోమవారం

కసాయి తల్లి....*

 *కవిత శీర్షిక:*

     *కసాయి తల్లి....*


మాజీ ప్రియుడి మోజులో పడి తన కామ కేళికి అడ్డుగా ఉన్నారని ప్రియుడి ఆజ్ఞను అమలు చేసింది.....

దైవం లాంటి ముగ్గురి పసి బిడ్డలను కడతేర్చిన ఓ కసాయి తల్లి....

కనీసం కన్నీరైనా పెట్టని పాషాణపు హృదయురాలు....

కంటేనే అమ్మ అని అంటే ఎలా? అని, 

మన సి.నా.రే అన్నట్టు. కన్న పేగు చచ్చి, కామ వాంచ పెరిగి, బిడ్డలకు విషమిచ్చి చంపింది. 

ఇది మాతృ ప్రేమకే మహా కళంకం....

ఆ ముగ్గురి పిల్లల మృతదేహాలను చూసి కన్నతండ్రి మనసు తల్లడిల్లింది, మాతృమూర్తులు, మానవతావాదులు, కవులు, గాయకులు మౌనంగా ఉంటున్నారే తప్ప తలలు ఎత్తి ఖండించ లేకపోతున్నారు....

వద్దమ్మా వద్దు, ఏ బిడ్డలకు ఇలాంటి తల్లి వద్దు, ఇలాంటి గతి ఏ బిడ్డలకు రావద్దు...

మోజు తీరాక నీ మాజీ ప్రియుడు నీ ఆస్తి అంతా హస్తగతం చేసుకొని, నిన్ను ఒంటరి చేయడమో, ఈ లోకం నుండి పంపించమో ఖాయం...

మాతృమూర్తులారా, మాతృ ప్రేమలను కాపాడండి, మానవజాతి మనుగడకు ప్రాణం పోయండి....


 *గరిడేపల్లి శోభనాద్రి, కవి, ఖమ్మం, T G. చరవాణి: 8897785495*

సీతారాముల కళ్యాణము*

 *****************************

*సీతారాముల కళ్యాణము*

*చూచెదము రారండి జనులార*

*****************************

సీస పద్యము.

శ్రీరాముడు వరుడు శ్రేయస్కరము

గను

    సీతమ్మ వధువు సౌశీల్యవతిగ

చైత్ర మాసము,అభిజిత్ సుము హూర్తము

     శుక్లపక్ష నవమి శుభ ఘడియలు

కళ్యాణము జరిగె కమనీయముగ

దేవ

   తలు,ఋషుల్ దీవించె తనివితీర

ముల్లోకములు మెచ్చెముచ్చటగా

ను,హ

     ర్షించె భూసురులు,వర్షించె 

     మేఘ

తే.గీ.

మాల చక్కగాసకల ప్రామాణికంబు

గాను,శోభాయమానంబుగాను పెండ్లి

జరిగె భూలోకమంతటా యరుగు లాక

స సమమూ పందిరీ తోడ సందడిగను.

2.తే.గీ.

నిండు సత్య వాక్పరిపాలకుండు 

నిజము,

హితము ఏకపత్నీవ్రతుం తోడు

నిజము,

కూర్మి పితృవాక్పరీపాలకుండు

నిజము,

మంచి జనుల పాలిట దైవ మతడు

నిజము.

3.ఆ.వె.

రాము డంత మంచి రాజు భూ

మండల

మందు లేడు, మరియు మంచి పాల

కుండు,ప్రజలహితము కూర్మి 

వాంఛించెడీ

చక్రవర్తి ఇతడె జగతి నందు.

4.తే.గీ.

రామ శ్రీరామ జయరామ రక్ష!రక్ష!

రామ దశరధ తనయుడారక్ష!రక్ష!

రామ కౌసల్య కొమరుడా రక్ష!రక్ష!

రామ జానకీ నాధుడా రక్ష!రక్ష!

5.కందము.

శ్రీరామ జయ జయ మనో

హరా సకల సద్గుణాభి హాసా రామా

శ్రీరామ మమ్ము బ్రోవుము

ఓ రామా చక్కగాను ఓరిమి

తోడన్!

*****************************

రచన.దామర్ల నాగేశ్వరరావు.

           9908568099.

విల్లా నెం.24.

     గోల్డెన్ పామ్స్ ,మోడి కాంప్లెక్స్.

లింగమయ్య విగ్రహం వద్ద

రామాలయం వద్ద

అమీన్ పూర్ 

హైదరాబాద్-502032.

*****************************

శ్రీరాముని చరితం

 శీర్షిక :  శ్రీరాముని చరితం


సుతుల కోసం చేసేను

దశరధుడు పుత్రకామేష్టి యాగం

ఆ యాగ ఫలంగా

రామ లక్ష్మణ భరత శతృఘనుల జననం!


నలుగురు మాతల ప్రియపుత్రులై

అల్లారు ముద్దుగా పెరిగిరి

అన్ని విద్యల్లో అరితేరిరి

గురువుల ఆజ్ఞలను నెరవేర్చిరి!


విశ్వామిత్రుని యాగ సంరక్షణకై

దశరధుని ఆనాతి మేరకు

రామ లక్ష్మణులు కానల కేగిరి

రాక్షసి తాటకిని సంహరించిరి!


జనకుని సీతా స్వయంవరం

రామ లక్ష్మణుల ఆగమనం

విశ్వామిత్రుని ఆశీస్సుల ఫలం

రాముడు విరిసెను శివధనుస్సును వేగిరం!


జరిగెను సీతారాముల కళ్యాణం

విరిసెను జగతిన సంతసం

తండ్రి ఆజ్ఞ పాలనకై

సీతా సామేతంగా అడవుల కేగిరి రామ లక్ష్మణులు సత్వరం!


రావణునిచే సీతాపహరణం

రామునిచే రావణ సంహారం

అయోధ్య కు శ్రీరామ పట్టాభిషేకం

ఇదియే మారుతి గానామృత శ్రీరాముని చరితం!


*************************-**********-**

రచన :

ఆళ్ల నాగేశ్వరరావు

కవి... రచయిత... ఆర్టీసీ కండక్టర్

నాజరుపేట

తెనాలి....522201

గుంటూరు.... జిల్లా

ఆంధ్రప్రదేశ్.... రాష్ట్రము

చరవాణి '7416638823


************************************


హామీ పత్రం :


ప్రజాశక్తి సంపాదకులకు నమస్సులు!


ఆర్యా!


చిన్నారి శీర్షికలో ప్రచురణ కొరకు పంపుచున్న

పై బాలగేయం నా స్వీయరచనేనని, ఇది ద

పునరుత్పత్తి

 పునరుత్పత్తి!!!

     డా ప్రతాప్ కౌటిళ్యా.


అర్థం కానిదేదైనా 

తికమకగానే ఉంటుంది!!?


అర్థం కానిదేదైనా 

అస్పష్టంగానే ఉంటుంది!!?


అది భాష అయినా భావమైనా 

భావోద్వేగమైన ఏదైనా!!?


అర్థం కానిదేదైనా 

జ్ఞాపకంగా మారదు!!!


జ్ఞాపకం గా మారకుంటే ప్రతిభ లేదని కాదు 

దాని పునరుత్పత్తి ఉండదు.!!!


నీకు అర్థమైన  దాన్నే 

నీ మెదడు అంగీకరిస్తుంది!!

జ్ఞాపకం గా మారుస్తుంది.!!


అది భాష అయినా భావమైన 

భావోద్వేగమైన ఏదైనా!!!?


అర్థం చేసుకోవడానికి ఏది 

అడ్డు కాకుంటే 

ప్రజ్ఞా ప్రతిభా కావాలి!!!!!!?

కానీ 


జ్ఞాపకంగా మారాలంటే 

మెదడు ఆజ్ఞ కావాలి అది ప్రజ్ఞా కాదు ప్రతిభా కాదు.


కేవలం పునరుత్పత్తి!!!?


డా ప్రతాప్ కౌటిళ్యా 👏

ఇంటింటా శ్రీ‌రామాయ‌ణ*

 *ఇంటింటా శ్రీ‌రామాయ‌ణ*

*దివ్య‌క‌థా పారాయ‌ణం*

          *9 వ రోజు*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*శ్రీరామ పట్టాభిషేక మ‌హోత్స‌వం*


 శ్రీ సీతా ల‌క్ష్మ ణ స‌మేతంగా శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి అయోధ్య‌లో అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచి ప్ర‌జ‌లు సంబ‌రాల‌లో మునిగితేలుతున్నారు.

శ్రీరామ పట్టాభిషేకానికి సుముహూర్తం నిశ్చయమయ్యింది. సుగ్రీవాజ్ఞతో జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, ఋషభుడు సుషేణుడు, గవయుడు, నలుడు నదీనద సముద్ర జలాలు తెచ్చారు. వసిష్ఠ మహర్షి ఋత్విక్కులతో కలిసి సీతారాములను రత్న సింహాసనంపై కూర్చుండబెట్టారు. వసిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు, తరువాత ఋత్విక్కులు, బ్రాహ్మ ణులు, కన్యలు, యోధులు వారిని పుణ్యనదీ జలాలతో అభిషేకించారు. వారితోబాటే లోకపాలకులు, దేవతలు శ్రీరామచంద్రుడిని అభిషేకించారు. వాయుదేవుడు స్వయంగా బంగారు తామరపూల మాలికను రాముని మెడలో వేశాడు.  వేద వేత్తలు మంత్ర పఠనం సాగిస్తున్నారు. శ్రీ  సీతారామచంద్రమూర్తి కీ జై అంటూ జనం జేజేలు పలుకుతుండగా,ర‌త్న కిరీటాన్ని వ‌శిష్ఠుల‌వారు రాముడి శిర‌స్సుపై అలంక‌రింప చేశారు .

 దేవతలు పుష్ప వర్షం కురిపించారు. రాముడు బ్రాహ్మణులకు అనేక దానాలు చేశాడు. సుగ్రీవ, విభీషణ, జాంబవంతాది మహావీరులకు అనేక బహుమతులిచ్చి సత్కరించాడు.

శ్రీరాముడు సీతకు నవరత్నాలూ పొదిగిన ఒక ముత్యాల దండను ఇచ్చాడు. అప్పుడు సీత ,శ్రీరామచంద్రుని ఇంగితం గుర్తించి ఒకజత గొప్ప విలువైన వస్త్రాలూ, గొప్ప ఆభరణాలూ హనుమంతునకిచ్చింది. అంతటితో తృప్తి తీరక ,ఆమె తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసి చేతబట్టుకొని ఒకసారి రాముడినీ, మరొకసారి వానరుల్నీ చూడసాగింది. సీత మనసు తెలిసికొన్న శ్రీ రాముడు "జానకీ! బలమూ, పరాక్రమమూ, బుద్ధీ ఉండి, నీకు అమితానందం కలిగించినవారికి ఆ ముత్యాలసరం ఇమ్ము" అన్నాడు. అన్న మరుక్షణంలోనే దాన్ని సీతమ్మతల్లి హనుమంతుని చేతిలో పెట్టింది. హారంతో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల మబ్బులా ప్రకాశించాడు. రాముని వ‌ద్ద‌ సెలవు తీసికొని విభీషణుడు లంకకు, వానరులు కిష్కింధకు తరలిపోయారు.

యువరాజుగా ఉండమ‌ని రాముడు,లక్ష్మణుడిని కోరాడు. ల‌క్ష్మ‌ణుడు  అందుకు సమ్మతించలేదు. భరతునకు యువరాజ్యాభిషేకం చేశాడు రాముడు. తరువాత శ్రీరాముడు అశ్వమేధం, పౌండరీకం, మరెన్నో క్రతువులు చేశాడు. లక్ష్మణుడు తనకు సాయపడుతూ ఉండగా రాముడు జనమనోభిరాముడై రాజ్యపాలన చేశాడు. శ్రీరాముని రాజ్యంలో జనులు సుఖసంతోషాలతో ఉన్నారు.

ప్రజలు  ధర్మపరాయణులై ఉండేవారు. ఎవ‌రి నోట విన్నా  రామ‌, రామ , రామ అన్న మాట త‌ప్ప మ‌రో మాట లేదు.

 ******

                *ఉత్తర కాండ*

******

శ్రీ రామ పట్టాభిషేకం తరువాత అయోధ్యలో అంతటా సుఖ సంతోషాలు వెల్లివిరిసాయి. శ్రీ రాముని పాలనలో ప్రజలు ఏ కష్టం లేకుండా సుఖంగా జీవనం సాగించేవారు. ఇలా ఉండగా ఒక రోజు రాముడు ఏకాంతసమయంలో సీతను చేరి" దేవీ! నీవు తల్లివి కాబోతున్నావు. నీ మనస్సులో ఏమైనా కోరిక ఉంటే చెప్పు. " అని అడిగాడు. అందుకు సీత " నాధా, గంగా తీరంలో ఉన్న ముని ఆశ్రమాలలో పళ్ళు, కందమూలాలు ఆరగిస్తూ ఒక్కరోజు గడపాలని ఉంది. ": అంటుంది. అందుకు సరే నంటాడు రాముడు. కానీ సీత కోరిక వినగానే  రాముడు   బాధపడతాడు.

*సీత గురించిన నింద*

 ఒక రోజు  రాముడు తన పరిపాలన ఎలా సాగుతున్నదో తెలుసుకోవడానికసన్నిహితుడైన భద్రునితో" భద్రా! నా పరిపాలన ఎలావున్నది? ప్రజలకు ఎలాంటి సమస్యలూ లేవుగదా? నిజం చెప్పు.?" అని అడుగుతాడు. అందుకు భద్రుడు" మహారాజా! సత్యసంధుడివైన నీకు నిజం చెప్తున్నాను. ప్రజలు నీ పరాక్రమాలను, రావణ సంహారాన్ని వేనోళ్ల పొగడుతున్నారు. అయితే, రావణ చెరలో కొన్నాళ్ళు ఉన్న సీతమ్మను తిరిగి మీరు భార్యగా స్వీకరించడం గురించి మాత్రం రక రకాలుగా చెప్పుకొంటున్నారు. ఇలా అంటున్నందుకు నన్ను మన్నించండి" అన్నాడు. రాముడు సరేనని వారినందరిని పంపించి విషాదచిత్తుడై తమ్ముళ్ళను పిలిపిస్తాడు. వారు రావడంతోనే రాముని వదనం చూసి నిశ్చేష్టులవుతారు. రాముడు వారిని కూర్చోమని జరిగిన సంగతి అంతా వివరిస్తాడు. " లక్ష్మణా! సూర్య చంద్రులు, అగ్ని,ఇంద్రాది దేవతలు కూడా ఆమె సౌశీల్యాన్ని శ్లాఘించారు. కానీ అయోధ్యలో ఇంకా అపవాదు తొలగలేదు. జనం తమ తప్పు తెలుసుకునే వరకు , ఆమెను పరిత్యజించడం తప్ప వేరు మార్గం కనపడడం లేదు. కొద్ది సమయం కిందటే సీత తనకు ముని ఆశ్రమాలు చూడాలని కోరికగా ఉన్నదని కోరగా ఆమెకు సరే అని అనుమతిచ్చాను. నువ్వు మారు మాటాడక ఆమెను గంగానదీ తీరంలోని ఆశ్రమాల వద్ద వదిలిరా. ఇది నా ఆజ్ఞ" అంటాడు.

*సీతమ్మను*

 *ముని ఆశ్రమాలవద్ద*

 *వదిలిన లక్ష్మణుడు*

రాముడి ఆదేశం మేరకు, లక్ష్మణుడు మారుమాటాడక ఉదయాన్నే రథం సిద్ధం చేసి సీతమ్మవారిని ముని ఆశ్రమాల వద్ద వదలి  వస్తాడు.ముని బాలకుల ద్వారా ఈసంగతి తెలుసుకొన్న వాల్మీకి ఆమెను తన ఆశ్రమానికి తీసుకొని వచ్చి" అమ్మాయీ! నీవు జనకుని కూతురువు. దశరధుని కోడలివి. రాముని ఇల్లాలువు. నీవు అతి పవిత్రురాలివి. నేను నా తపశ్శక్తితో సర్వం గ్రహించాను. నీవు నిశ్చింతగా ఉండు. ఇక్కడి మునిసతులందరూ నిన్ను కన్న కూతురివలె చూసుకొంటారు. అని పలికాడు.  అక్కడ కొంతకాలానికి జానకీ దేవి ఇద్దరు బాలలకు జన్మనిస్తుంది. వారు లవ కుశలనే పేరుతో దినదిన ప్రవర్దమానులౌతూ అటు వేద విద్యలోనూ, ఇటు క్షాత్ర విద్యల్లోనూ తిరుగులేని బాలురుగా ప్రకాశిస్తుంటారు.

*అశ్వమేథయాగం*

రాముడు  అశ్వమేథయాగం తలపెట్టాడు.  ఆ యాగ సమయంలోనే సీతామాత పాతివ్రత్యాన్ని సామాన్యులకు తెలియజేయాలని వాల్మీకి మహర్షి నిర్ణయించుకుని అక్కడకు శిష్యసమేతంగా విచ్చేసాడు. వాల్మీకి లవకుశలను కూర్చోపెట్టుకొని" చిరంజీవులారా! మీకు నేర్పిన రామాయణాన్ని రాజమార్గాల్లోనూ, ముని వాసాల్లోనూ, యజ్ఞవాటిక దగ్గర రాముని మందర శ్రావ్యంగా, శ్రుతి బద్ధంగా మధురంగా ఆలపించండి అని చెప్పాడు. వారు రామాయణ గానం చేశారు. రాముడు కూడా విని ఆనందించాడు. మరునాడు సభకు చేరిన వాల్మీకి, సీతమ్మ పరమ సాధ్వి అని,లోకనిందకు భయపడి రాముడు ఆమెను పరిత్యజించాడని, ఇందులో ఏదైనా అసత్యం ఉంటే నా వేల ఏళ్ల తపస్సు వ్యర్థమైపోవుగాక అని పలికాడు. వెంటనే రామచంద్రమూర్తి లేచి లోకానికి మీవంటి మహర్షులు సత్యం తెలిపే రోజువస్తుందనే తాను వేచి చూస్తున్నానని చెప్పాడు.

మునీంద్రా! దివ్యజ్ఞాన సంపన్నులైన తమ వాక్యములు సత్యభూషణములు. నా దేవేరి శీలమును గురించి నాకు ఏమాత్రమూ సందేహము లేదు. ఆమె మహా సాధ్వి అని నాకు తెలియును. మరి లోకులకు కూడా తెలియడం అవసరమని నేనట్లు నడుచుకోవలసి వచ్చింది అని అన్నాడు. వాల్మీకి మహర్షి తన తపో నిష్టతో సీతమ్మవారిని అక్కడికి వచ్చేలా చేశాడు.

.సీత కాషాయాంబరాలు ధరించి  సభా మందిరంలో ప్రత్యక్షమైంది." నేను రాముడ్ని తప్ప అన్యుల్ని తలచనిదాననే అయితే భూదేవి నా ప్రవేశానికి వీలుగా దారి తీయుగాక. త్రికరణ శుద్ధిగా నేనెప్పుడూ రాముని పూజించేదానను అయితే భూదేవి నా ప్రవేశానికి మార్గం చూపుగాక అని ప్రార్ధించింది. సీతా దేవి ప్రార్థన ముగించీ ముగించగానే భూమి బద్దలు అయింది. నాగరాజులు మోస్తున్న దివ్య సింహాసనమొకటి పైకి వచ్చింది. భూమాత రెండు చేతులతో సీతను తీసుకొని పక్కన కూర్చోపెట్టుకొంది. ఆకాశం నుంచి పూల వాన కురుస్తుండగా సింహాసనం పాతాళంలోకి దిగిపోగా అక్కడ ఏమీ జరగనట్టు మళ్ళీ మామూలుగా అయిపోయింది.

సభాసదులు దీనులై విలపిస్తూ రాముడి వంక చూడసాగారు. రాముడి దుఃఖానికి అంతే లేదు. "నా కన్నుల ముందే నా భార్య మాయమయింది. లంకలో నుంచి తీసుకొని వచ్చిన ఆమెను భూమినుండి తెచ్చుకొనలేనా? భూదేవీ! అత్తగారివైన నిన్ను మర్యాదగా అడుగుతున్నాను. తక్షణం సీతను తెచ్చి ఈయకుంటే జగత్ప్రళయం సృష్టిస్తాను." అన్నాడు. 

అప్పుడు బ్రహ్మ వారించి "రామా ! ఇది నీకు తగదు. నిన్ను స్వర్గధామంలో తప్పక కలుసుకొంటుంది. నీ చరిత్ర ఇతిహాసంగా ఉండిపోతుంది.  మీ అవతరణ కార్యం పరిసమాప్తమవుతున్నది అని చెప్పాడు.

*లక్ష్మణునికి ధర్మ సంకటం*

కాలం భారంగా నడుస్తున్నది. ఒక నాడు ఒక ముని వచ్చి రాముడిని చూడాలని లక్ష్మణుడిని కోరాడు. రామాజ్ఞతో లక్ష్మణుడు ఆ మునిని రాముడి మందిరంలోకి ప్రవేశపెట్టాడు. వచ్చిన ముని కాలపురుషుడు. " రామా! మనం మాటాడే విషయాలు పరమ రహస్యాలు. ఇతరులు ఎవరూ వినరాదు.వారికి తెలియరాదు. ఒక వేళ అలా మన మాటల మధ్యలో ఎవరైనా ప్రవేశించినా  మన మాటలు విన్నా వారికి నువ్వు మరణదండన శిక్ష విధిస్తానని మాట ఇస్తేనే, నీతో ముచ్చటిస్తాను" అన్నాడు. రాముడు సరేనని లక్ష్మణుడిని ద్వారం వద్ద కాపలాగా ఉండమన్నాడు. ఆ తరువాత ఆ వచ్చిన ముని ఇలా అన్నాడు," రామ చంద్రా! నేను మునిని కాదు. కాల పురుషుడిని. నీవు ఈ లోకానికి వచ్చిన కార్యం ఎప్పుడో నెరవేరింది. బ్రహ్మ మిమ్మలను, తిరిగి పుణ్యలోకాలకు వచ్చి ఈ జగత్తును పరిపాలించమని కోరాడు. " అన్నాడు. 

దీనికి రాముడు నవ్వి " కాలపురుషా! నిజమే, భూలోకానికి వచ్చిన పని ఎప్పుడో ముగిసింది. ముల్లోకాలను రక్షించడమే నా బాధ్యత. నా స్వస్థానానికే రావడానికి నేను సిద్ధమౌతున్నాను." అన్నాడు. ఇలా వీరు సంభాషించుకొంటున్న వేళ దుర్వాసుడు రాముడి దర్శనానికి వచ్చాడు. లక్ష్మణుడు లోపలికి వెళ్లడం కుదరదన్నాడు. కాస్త ఓపికపట్టి ముని వెళ్లిన తర్వాత వెళ్లవచ్చన్నాడు.. ముక్కోపి అయిన దుర్వాసుడు "ఓరీ! ఈ.. రామ దర్శనానికి నేను వేచివుండాలా? తక్షణం నేను రాముడ్ని కలవాలి. లేకుంటే నీ దేశం, వంశం , మీ అన్నదమ్ములు నాశనం కావాలని శపిస్తాను " అన్నాడు. దుర్వాసుని కోపం ఎంత ముప్పు కలిగిస్తుందో ఎరిగిన వాడైన లక్ష్మణుడు, తన వంశం దేశం నాశనమయ్యే కంటే ,తాను రాముడి ఆజ్ఞను ధిక్కరించి తానొక్కడూ మరణశిక్ష పొందడమే మేలని తలచి వెంటనే , దుర్వాసుడు బయట వేచి ఉన్న విషయం చెప్పేందుకు లోపలకు వెళ్లాడు. అలా లక్ష్మణుడు, యముడు– రాముడు మధ్య సాగుతున్న సంభాషణకు అంతరాయం కలిగిస్తూ " అన్నా! నీకోసం దుర్వాసుల వారు వచ్చారు" అని అన్నాడు. కాలపురుషుడు, ఇదేమిటి; మనం మాట్లాడుకునేటపుడు మధ్యలో ఎవరూ రావద్దని షరతు విధించాను కదా అని రాముడివైపు చూశాడు.

*లక్ష్మణుడి యోగ సమాధి*

రాముడు కాలపురుషుడిని  వడి వడిగా పంపేసి, దుర్వాసునికి ఎదురేగి స్వాగతించాడు. అయితే తాను కాలపురుషుడికి ఇచ్చిన మాటను గుర్తుతెచ్చుకొని  రాముడు విచారంలో మునిగిపోయాడు. కలపురుషుడికి ఇచ్చిన మాట ప్రకారం మధ్యలో వచ్చిన వ్యక్తి ప్రాణాలు తీయాలి.. లక్ష్మణుడు వచ్చి" అన్నా! నీవు మాట తప్పవద్దు. ఏ సంకోచమూ లేకుండా నాకు శిక్ష విధించి ధర్మాన్ని నిర్వర్తించు" అని ధైర్యంగా చెప్పాడు. రాముడు నిలువెల్లా కుంగిపోతూ వశిష్ట, భరత, శతృఘ్నులను సమావేశ పరచి విషయం వవరించాడు. వశిష్ఠుడు " రాజా! ఆడి తప్ప రాదు. నీవు లక్ష్మణుడికి దేశ బహిష్కరణ విధించు అది మరణ సమానమే." అన్నాడు. " సాధు పరిత్యాగం మరణశిక్ష తో సమానమవుతుంది కనుక నిన్ను బహిష్కరిస్తున్నాను." అన్నాడు. వెంటనే లక్ష్మణుడు తన ఇంటి వైపు కూడా చూడకుండా సరాసరి సరయూ నది ఒడ్డువద్దకు చేరి యోగసమాధి అయ్యాడు. ఇంద్రుడు తన విమానంలో అతన్ని అమరావతికి తీసుకుకుపోయాడు. విష్ణు అంశలో నాల్గవభాగం దేవలోకం చేరినందుకు  దేవతలు సంతోషించారు. లక్ష్మణుడికి దేశ బహిష్కారం చేసాక భరతుని రాజుగా చేసి తాను కూడా వెళ్ళి పోతానని ప్రకటించాడు శ్రీ రాముడు..

*అవతార సమాప్తి*

మరునాడు తెల్లవారింది. బ్రాహ్మణులు అగ్ని హోత్రాలు, వాజపేయచ్చత్రాన్ని పట్టుకొని ముందుకు నడుస్తుండగా రాముడు సన్నని వస్త్రాలు ధరించి, మంత్రోచ్చారణ చేస్తూ వెడుతునాడు.. శ్రీ రాముడు అర్ధ యోజన దూరం నడచి, పడమట దిక్కుగా ప్రవహిస్తున్న సరయూ నది చేరుకొన్నాడు. అప్పటికే దేవతలతో ముని బృందాలతో బ్రహ్మదేవుడు అక్కడ వేంచేసి ఎదురుచూస్తున్నాడు. ఆకాశం దివ్య విమానాలతో నిండిపోయింది. వేదవేత్తలు మంత్రోచ్చారణలుచేస్తున్నారు. దేవతలు దుందుభులు మోగించారు. పరిమళాలతో గాలి చల్లగా వీస్తోంది. పూలవాన కురవడం మొదలయింది. అప్పుడు సరయూ నదిలోకి పాదాన్ని పెట్టాడు రాముడు. బ్రహ్మ అప్పుడు రామునితో ఇలా అన్నాడు"

 మహావిష్ణూ ! నీకు శుభమగుగాక! 

నీ తమ్ముళ్ళతో కూడా స్థూల శరీరాలు విడిచి దివ్యశరీరాన్ని ధరించు. నీకు కావలసిన రూపం అందుకో తండ్రీ! సకల భువనాలకూ నువ్వే ఆధారం."

అనగానే రాముడు తన అవతార కార్రక్రమం పరిసమాప్తమైనందున, విష్ణుమూర్తి రూపం స్వీకరించాడు. అక్కడ చేరినవారంతా విష్ణుమూర్తి దర్శనంతో తరించి,జయజయ ధ్వానాలు చేసి విష్ణువుకు భక్తిగా మొక్కారు. అప్పుడు బ్రహ్మతో విష్ణువు "నావెంట వచ్చిన వారంతా నా భక్తులు. సర్వం త్యజించి నన్ను అనుసరించినవారు. వారికి పుణ్యలోకాలు ప్రసాదించు" అని అజ్ఞాపించాడు.  

హనుమ చిరంజీవిగా ఉంటాడని ,రామభక్తులను కంటికి  రెప్పలా కాపాడుతుంటాడాని   చెప్పి రామచంద్రమూర్తి, విష్ణువుగా విష్ణులోకానికి పయనమయ్యాడు.

*ఫలశ్రుతి*

మహర్షి వాల్మీకి రచించిన  శ్రీ‌రామాయ‌ణాన్ని చదివినవారు,విన్నవారు కూడా పాపవిముక్తులై ధనధాన్య సంపదలను పొందుతారు.

వారికి కీర్తి, విజయం లభిస్తాయి.

 కష్టాలను అధిగమిస్తారు.  

వంశ వృద్ధి కలుగుతుంది.

దీర్ఘాయుష్మంతులౌతారు. స‌క‌ల శుభాలూ పొందుతారు. ధర్మబద్ధ జీవనం సాగిస్తారు. రామాయణాన్ని శ్రద్ధతో  పారాయణం చేసే వారి యందూ, వినేవారియందు  శ్రీరాముడు దయాపరుడై ఉంటాడు.

రామాయణ పారాయణ చేస్తున్న వారి ఎదురుగా కూర్చుని,హనుమ  అదృశ్యరూపంలో  ఆనంద పార‌వ‌శ్యంతో రామకథను వింటుంటాడని భక్తుల విశ్వాసం. అలా ఈ 9 రోజులూ హనుమ మీ ప్రాంగణాన్ని పావనం చేసివుంటారు. 

మీ మనసు నిండా శ్రీసీతారామచంద్రులు,హనుమ ఉండగా, మీరు శ్రద్ధతో సాగించిన ఈ శ్రీ రామాయణ దివ్య కథా పారాయణం మీకు,మీ కుటుంబసభ్యులకు

సర్వశుభాలను కలుగజేస్తుంది. ధర్మబద్ధ జీవనానికి వీలు కల్పిస్తుంది.

 మీ పిత్రు దేవతలు సంతోషిస్తారు.

 శుభ వర్తమానాలు అందుతాయి. 

శుభకార్యాలు చేస్తారు .సర్వత్రా జయం లభిస్తుంది. సదా రామభక్తులను కంటికి రెప్పలాకాపాడే హనుమ ఈబాధ్యత తీసుకుంటాడు.

*మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాత్మనే,*

*చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్.*            

*వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామలమూర్తయే,*

*పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్*   

                       **

*ఆంజనేయం మహావీరం*  *బ్రహ్మ విష్ణు శివాత్మకమ్ !*

*తరుణార్క ప్రభం శాన్తం* *రామదూతం* *నమామ్యహమ్ !!*

*****

  *హనుమంతుని ద్వాదశనామాలు*

హనుమా, అంజనాసుతః, వాయుపుత్రో, మహాబలః

రామేష్టః, ఫల్గుణ సఖః, పింగాక్షో మిత విమహాబలఉధధిక్రమణశ్చ్చైవ, 

సీతాశోక వినాశకః

లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పహా

ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః

 స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః,

 తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్

                             **

*( ఈ 9 రోజులూ సంక్షిప్త శ్రీ రామాయణాన్ని పఠించిన వారికి, విన్నవారికి  ప్రత్యేక ధన్యవాదాలు)*                      *జై శ్రీసీతారామ్‌*

             *సర్వే జనా*  

        *సుఖినోభవంతు*

      *సమస్త సన్మంగళాని భవంతు*

  🪷*స్వస్తి* 🪷

శ్రీ రామ పద్యార్చనమ్*

 *విశ్వావసు నామ సంవత్సర శ్రీ రామ పద్యార్చనమ్*

*4*

*చం*

అవనిన రావణాసురుని యాగడముల్చెలరేగి వేగగన్

భువిజని రామభద్రునిగ భూజనిసీతను పెండ్లి యాడి తా

నవనిన రామరాజ్యమను నాకము జూపిన దేవదేవుడౌ

దివిపతి విష్ణుమూర్తి కి వె ధీజన పూజలునిత్య(దివ్య) హారతుల్.

*భావం*:-- భూలోకంలో రావణాసురుని ఆగడాలు చెలరేగి బాధలు పడుతున్న తరుణంలో భూలోకంలో రామభద్రునిగా పుట్టి భూజనియైన సీతామహాలక్ష్మి అమ్మవారి ని పెండ్లాడి భూలోకులకు రామరాజ్యం అనబడే స్వర్గమును జూపిన దేవదైన శ్రీ మహావిష్ణువు కు ఇవియే గొప్ప పూజలు నిత్య ( గొప్ప) హారతులు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

ఏకాక్షర సర్వ గురు కందము...

 ఏకాక్షర సర్వ గురు కందము...


కాకా కేకీ కేకే

కూకూ కాకైకాంకా కాంకాం కాంకా

కీకాకేకీ కేకే

కూకూ కూకూ కంకం కంకం కౌకే



 కాకా=కాకి, కేకీ=కోకిల,

కేకే= ఎవరు?ఎవరు?,

కూకూ=కోకిలధ్వని,

ఏకాంకా=ఒక పార్శ్వపు,

కాకా=కాకి, కాంకాం=ఎవరినెవరని

కాంకా=ఎవరెవరను,

కీకా=గాఢంగా, కేకీ=నెమలి, కేకే=ఎవరెవరన, 

కూకూ=కోకిల,

కూ కూ=మధురాలాపన,  

కంకం=నీటిబొట్టులవలె, కంకం=ఎవరెవరినయినా,  కౌకే=ఎటుల ౙతచేయునో...

పునాదులు లేని ఇల్లు

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏         🏵️ *పునాదులు లేని ఇల్లు గాలి వానకి ఎలా కూలిపోతుందో చెప్పుడు మాటలు విన్న మనిషి జీవితం కూడా అలాగే నాశనం అవుతుంది..పుకార్లు ఎప్పుడు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకీ మూర్కుల ద్వారా అంగీకరించ బడతాయి.. ఈ మూడింటి లోనూ మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది* 🏵️మూర్కులతో వాదన పెట్టుకోకూడదు.. ఎందుకంటే ముందు మిమ్మల్ని వారి స్థాయికి దిగజార్చుతారు.. ఆ తరువాత వారి కున్న అనిభవంతో మిమ్మల్ని వారి దారికి తెచ్చుకొని మిమ్మల్ని నాశనం చేస్తారు🏵️కంటి చూపు లేని వాడు గుడ్డి వాడు కాదు.. తన తప్పులను తెలిసికోకుండా ఉంటున్నాడే వాడే నిజమైన గుడ్డివాడు..నమ్మకం కోల్పోయిన తరువాత ఎంత నాటించినా ప్రయెజనం ఉండదు.. అందుకే ప్రాణం పోతున్నా నమ్మకాన్ని మాత్రం కాపాడుకోవాలి.. నమ్మకం, ప్రాణం రెండు ఒక్కటే.. ఒక్క సరి పొతే తిరిగి రావు.. నమ్మిన వారిని మోసం చేయకూడదు.. మోసం చేసిన వారిని తిరిగి నమ్మకూడదు🏵️🏵️మీ *అల్లంరాజుభాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్ D .N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు లేదా కొత్త వారికి రాలేనివారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును * 🙏🙏🙏

విలువలనొందుట కన్నను

 

*

*కం*

విలువలనొందుట కన్నను

విలువలు కాపాడుకొనుట విలువగు నెపుడున్.

విలువలకాచుకొనేందుకు

విలువెరుగని వారి నుండి వెలివడు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! విలువలు పొందటం కన్నా విలువలు కాపాడుకోవడం చాలా విలువైన పని. విలువలు కాపాడుకోవడం కోసం నీ విలువ తెలియని వారి నుండి దూరంలో ఉండుము.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

*

*కం*

విలువీయని వారల కడ

విలువల నొందెడి వశమున వెంబడకుము నీ

విలువెరిగెడి దినము కొరకు

నలుపెరుగని శ్రమలకోర్చి నెగడుము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! నీకు విలువ ఇవ్వని వారి వద్ద విలువలు పొందాలనే ఆశతో వెంపర్లాడవద్దు. నీ విలువ లు గుర్తించగలిగే విధంగా అలుపెరగని కృషి చేయుము.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*


గీతామకరందము

 గీతామకరందము:

16-01,02,03-గీతా మకరందము

  దైవాసురసంపద్విభాగయోగము 

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


శ్రీ భగవద్గీత 

అథ షోడశోఽధ్యాయః 

పదునాఱవ అధ్యాయము 

దైవాసురసంపద్విభాగయోగః

దైవాసురసంపద్విభాగయోగము 


శ్రీ భగవానువాచ :-


అభయం సత్త్వ సంశుద్ధిః

జ్ఞానయోగ వ్యవస్థితిః | 

దానం దమశ్చ యజ్ఞశ్చ 

స్వాధ్యాయ స్తప ఆర్జవమ్ || 


అహింసా సత్యమక్రోధః

త్యాగశ్శాన్తిరపైశునమ్ | 

దయా భూతేష్వలోలత్వం* 

మార్దవం హ్రీరచాపలమ్ ||  


తేజః క్షమా ధృతిశ్శౌచం

అద్రోహో నాతిమానితా | 

భవన్తి సమ్పదం దైవీం

అభిజాతస్య భారత ||   


తాత్పర్యము:- శ్రీ భగవానుడు చెప్పెను - ఓ అర్జునా! (1) భయములేకుండుట (2) అంతఃకరణశుద్ధి (3) జ్ఞానయోగమునందుండుట (4) దానము (5) బాహ్యేంద్రియనిగ్రహము (6) (జ్ఞాన) యజ్ఞము (7) (వేదశాస్త్రాదుల) అధ్యయనము (8) తపస్సు (9) ఋజుత్వము (కపటము లేకుండుట) (10) ఏ ప్రాణికిన్ని బాధగలుగజేయకుండుట (అహింస) (11) సద్వస్తువగు పరమాత్మ నాశ్రయించుట, లేక, నిజముపలుకుట (సత్యము) (12) కోపము లేకుండుట (13) త్యాగబుద్ధిగలిగియుండుట (14) శాంతస్వభావము (15) కొండెములు చెప్పకుండుట (16) ప్రాణులందు దయగలిగియుండుట (17) విషయలోలత్వము లేకుండుట, అనగా విషయములందాసక్తి లేకుండుట, వానిచే చలింపకుండుటయు (18) మృదుత్వము (క్రౌర్యము లేకుండుట) (19) (ధర్మవిరుద్ధకార్యములందు) సిగ్గు (20) చంచల స్వభావము లేకుండుట (21) ప్రతిభ (లేక, బ్రహ్మ తేజస్సు) (22) ఓర్పు (కష్టసహిష్ణుత) (23) ధైర్యము (24) బాహ్యాభ్యంతర శుచిత్వము (25) ఎవనికిని ద్రోహముచేయకుండుట, ద్రోహచింతనము లేకుండుట (26) స్వాతిశయములేకుండుట (తాను పూజింపదగినవాడనను అభిమానము, గర్వము లేకుండుట) - అను ఈ సుగుణములు దైవసంపత్తియందు పుట్టిన వానికి కలుగుచున్నవి. (అనగా దైవసంపత్తిని పొందదగి పుట్టినవానికి కలుగుచున్నవని భావము).


వ్యాఖ్య:- గీతా గ్రంథమున 'సాధన’కు విశేషప్రాముఖ్యత నొసంగబడినది. చిత్తము నిర్మలముగానున్నచో, అత్తఱి పారమార్థికలక్ష్యము చేరువనేయుండును. కావున అట్టి చిత్తశుద్ధిపరికరము లనేకములు గీతయం దొసంగబడినవి. ఈ అధ్యాయప్రారంభమునగల దైవీసంపద్వివరణము వానిలో చేరినదే అయియున్నది. ఇఱువదియాఱు సుగుణములను భగవాను డిచట తెలియజేసిరి. వానినన్నింటిని ముముక్షువు - విద్యార్థి పాఠములను వలె - క్షుణ్ణముగ నభ్యసించి హృదయమును పరిశుద్ధ మొనర్చుకొనినచో ఇక మోక్షలక్ష్యము సన్నిహితమైనట్లే యగును. కావున సాధకు లీసద్గుణరాశిని ప్రయత్నపూర్వకముగ నవలంబించి కడు జాగరూకతతో వానిని కాపాడుకొనుచుండవలెను.

సంపద యనగా ధనము, ఐశ్వర్యము. దైవసంపదయనగా దైవధనము. శ్రీకృష్ణపరమాత్మ దైవధనము నిపుడు లోకులముందు వెదజల్లుచు " ఓ జీవులారా! నశ్వర ప్రాపంచికధనములతో క్రీడించుచు, వానియందే అమూల్యకాలమంతయు వినియోగించుచు దుఃఖపరంపరలను, జన్మపరంపరలను బొందకుడు! ఇవిగో తీసికొనుడు దైవసంపద్రాసులను, పారమార్థిక రత్నచయములను - అని వచించుచున్నారు. ఈ దైవధనము ముందు ప్రాపంచిక సంపదలు, వజ్రవైఢూర్యాదులు ఏపాటి విలువగలవి? కావున వివేకవంతు లీ దైవసంపదను శీఘ్రముగ హస్తగతమొనర్చుకొని జ్ఞానధనులై బ్రహ్మసాయుజ్యము నొందెదరుగాక!


“అభయమ్" - శ్రీకృష్ణపరమాత్మ అర్జునునకు అనేక సుగుణములను చెప్పదలంచిన వారై మొట్టమొదట "సుగుణరాట్”అనదగు, "సుగుణసింహ” మనదగు “అభయము"ను పేర్కొనెను.ఇది గమనింపదగినవిషయమైయున్నది. ఏలయనిన, ఎన్నియో ఇతర సుగుణములుండ ఈ "భయరాహిత్యము”నే తొలుదొల్త చెప్పనేల? దీనికి కారణములు కలవు - (1) అన్ని దుర్గుణములకును భయమే పునాది: భయమునుండియే తక్కిన అవగుణములన్నియు నంకురించును. కావున విజ్ఞులద్దానిని మొట్టమొదట పారద్రోలినచో, అనగా నిర్భయత్వము నవలంబించినచో ఇక తక్కిన సుగుణము లన్నియు అవలీలగా వచ్చి చేరగలవు. ఇక్కారణమున నయ్యది మొదట చేర్చబడి యుండవచ్చును. మఱియు (2) త్రాడులాగు పందెము (Tug of War) లో మొదటివానిని చివఱివానిని మహాబలశాలులుగ నుండునట్లుచూచి పెట్టుదురు. అట్లే అసురగుణములు గావింపబడుచున్న పందెమున దైవగుణములపక్షమున "అభయం" - అను సుగుణరాజమును ఏరి భగవాను డద్దానిని నాయకునిగ (Captain) జేసి రణరంగమున నిలబెట్టెను. దీనిని బట్టి అది యెంతటి మహత్తర సుగుణమో వ్యక్తము కాగలదు. (3) ‘అభయం వై జనక ప్రాప్తోసి’ - అని ఉపనిషత్తు లా యభయమును సాక్షాత్ బ్రహ్మపదముగనే వర్ణించి చెప్పినవి. కాబట్టి గీతయందు భగవానునిచే నెంతయో ప్రముఖముగ నెంచబడినట్టి ఈ నిర్భయత్వమను గుణరత్నమును సర్వులును లెస్సగ నభ్యసించి దైవసంపత్తిని బాగుగ కూడబెట్టుకొనవలెను.


'సత్త్వసంశుద్ధిః’ - "శుద్ధిః” అని చెప్పక "సంశుద్ధిః” అనిచెప్పుటవలన చిత్తము అత్యంత నిర్మలముగా నుండవలెనని భావము. మనస్సునం దేలాటి ప్రాపంచిక సంకల్పములకు, మలినసంస్కారములకు, పాపములకు చోటీ యరాదు. నిర్మలదర్పణమందే ప్రతిబింబము స్పష్టముగ గోచరించునట్లు నిర్మలచిత్తముననే ఆత్మ చక్కగ స్ఫురించగలదు.


“జ్ఞానయోగ వ్యవస్థితిః” - భగవానుడు గీతలో అనేక యోగములనుగూర్చి బోధించినను, అచటచట జ్ఞానయోగాధిక్యతను వెల్లడించుచునేయున్నారు. (ఆత్మజ్ఞానానుభూతియే అన్నిటియొక్క పరమావధిగనుక). కనుకనే దైవసంపదలో ప్రారంభములోనే దానినిగూర్చిన ప్రస్తావనను లేవనెత్తిరి. ‘సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే' అనునట్లు అన్ని కర్మలు, అన్ని యోగములును తుదకు జ్ఞానమందే పర్యవసించుచున్నవి. కాబట్టి అట్టి జ్ఞానయోగమందు దృఢస్థితిని సంపాదించవలసినదిగా భగవాను డిచట నాదేశించుచున్నారు.


'దానం’ - భూదానము, సంపద్దానము, అన్నదానము, జలదానము, శ్రమదానము, విద్యాదానము, జ్ఞానదానము - ఇవియన్నియు దానములలో జేరినవే.


‘దమశ్చ’ - "శమ" మను అంతరేంద్రియనిగ్రహము ‘సత్త్వసంశుద్ధిః’ అను పదము ద్వారా ఇదివఱకే పేర్కొనబడియుండుటవలన ఇచట “దమ" మను బాహ్యేంద్రియ నిగ్రహముమాత్ర మిపుడు చెప్పబడినది. ఇంద్రియనిగ్రహములేనిది పరమార్థరంగమున ఎవరును ముందునకు పోజాలరని ఘంటాపథముగ చెప్పవచ్చును. కనుకనే గీతలో శమ, దమములకు సముచితస్థాన మొసంగబడుచునున్నది.


"యజ్ఞశ్చ” ఇచట యజ్ఞమనగా తపోయజ్ఞము, యోగయజ్ఞము, స్వాధ్యాయయజ్ఞము, జ్ఞానయజ్ఞము మున్నగునవిమాత్రమేయని గ్రహించవలెను.

"స్వాధ్యాయః” - గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, యోగవాసిష్ఠము, భారత, భాగవత, రామాయణములు - ఇత్యాది ఆధ్యాత్మిక ఉద్గ్రంథములను పఠించి అందలి సారమును మననముచేయుట స్వాధ్యాయ మనబడును.


“తపః” - తపస్సనగా తల క్రిందబెట్టి కాళ్లు పైనబెట్టుకొనియుండుట కాదు. గీత 17వ అధ్యాయమున చెప్పబడిన శారీరక, వాచిక, మానసిక తపస్సులని భావము. 


"ఆర్జవమ్” - శరీరము, వాక్కు, మనస్సు - అను మూడింటితోను ఏకరీతిగా వర్తించుట - అనగా త్రికరణశుద్ధి గలిగియుండుటయని అర్థము. విషజంతువులగు సర్పాదులు వక్రగతి గలిగియుండును. కావున వక్రస్వభావము గలిగియుండు మానవులున్ను విషజంతువులతో సమానులే యగుదురు.


‘అహింసా’ - శరీరముతో, వాక్కుతో, మనస్సుతో, ఏ ప్రాణికి హింస చేయకుండుట, ఏ ప్రాణిని బాధింపకుండుట.


"సత్యం” - (1) శరీరవాఙ్మనంబులతో అసత్యమాడకుండుట.

(2) సత్యవస్తువగు పరమాత్మయందు నిలుకడ గలిగియుండుట.


“అక్రోధః” — క్రోధము చాల చెడ్డగుణము. పరమార్థసాధకునకే కాదు. ప్రతి మానవునికిని అది యెంతయో కీడొనర్చగలదు. అది ఆవహించినపుడు మనుజుడు కల్లు త్రాగినవాని చందమున నుండును. ఆ ‘కైపు’ లో యుక్తా యుక్తములను విస్మరించి యతడు అధఃపతనమునొందును. కాబట్టియే ‘క్రోధాద్భవతి సమ్మోహః …. ప్రణశ్యతి’ - అని దీని ఆగడమును గూర్చి భగవాను డిదివఱకే విపులముగ తెలిపియుండెను. క్రోధము రజోగుణసంబంధమగు దుర్గుణము. కావున అది మనుజుని యావేశించునపుడతని కండ్లెఱ్ఱబడును. దేహమంతయు చెమటబట్టును. తుదకు వికృతరూపుడై, దాదాపు రాక్షసునివలె మారిపోవును. ఇక్కారణమున పరమార్థోన్నతికి క్రోధరాహిత్యము (అక్రోధము) ఒక గొప్ప ఆవశ్యకతయైయున్నది. కనుకనే యది దైవసంపదయందు పేర్కొనబడినది.


“త్యాగః” - ‘త్యాగేనైకే అమృతత్వమానశుః’ - త్యాగమువలననే మోక్షము సిద్ధించును అని ఉపనిషత్తు లుద్ఘోషించుచున్నవి. దృక్స్వరూపమగు ఆత్మను, భగవంతుని అవలంబించి, దృశ్యవస్తువులగు విషయసమూహములయం దాసక్తిని త్యజించుటయే త్యాగము. దుర్గుణములను, దుస్సంస్కారములను, దుష్టసంకల్పములను, విషయవ్యామోహమును, కర్మఫలమును త్యజించుటయే వాస్తవమగు త్యాగము. ఇదియే అంతరత్యాగము. బాహ్యత్యాగముకంటె అంతరత్యాగము శ్రేష్ఠమైనది.


"శాంతిః” - చిత్తము శాంతియుతముగ నుండవలెను. కల్లోలసముద్రమువలె నుండరాదు. సంకల్పములచే కొట్టుకొనుచుండరాదు. చిత్తము పరమాత్మయందు లయించినపుడే పూర్ణశాంతి సంభవిం చును. శాంతిలేనివానికి సుఖము యుండదు (అశాంతస్య కుతస్సుఖమ్). భగవదాశ్రయము, దృశ్యవిషయసంకల్ప వివర్జనము శాంతికి ఉపాయములు.


‘అపైశునమ్' - ఇతరులదోషములను లెక్కింపకుండుట, చాడీలు చెప్పకుండుట. పరులగుణములతో మనకు పనియేకాని పరులదోషములతోగాదు. జనులు తమ తమ హృదయములందు దాగియున్న కోటానుకోట్ల దోషములను ముందు నిర్మూలించుకొనిన చాలును. ఇతరులదోషములను లెక్కింపవలసినపనిలేదు.


“దయా భూతేషు” - ‘సమస్తప్రాణికోట్లయెడల దయగలిగియుండుట’ సాధకునకొక అత్యవసరమైన సుగుణముగనుక దానినిగూర్చి గీతయం దనేకచోట్ల ప్రస్తావించబడెను. బ్రహ్మజ్ఞానమను మందుకు భూతదయయను పథ్యము ఉండియే తీరవలెను. అపుడే ఆ మందు చక్కగ పనిచేయును. కాబట్టి భక్తి, జ్ఞాన, వైరాగ్యాదులతోబాటు భూతదయనుగూడ సాధకులు బాగుగ నభ్యసించవలయును.

         'అలోలత్వమ్’- ఇంద్రియలోలత్వము లేకుండుట, విషయచాపల్యము వదలి యుండుట;

ఇంద్రియములయొక్క శక్తియంతయు విషయభోగములందు వ్యర్థమైపోయినచో ఆత్మచింతనాదులం దది సమర్థమైయుండజాలదు. కావున ప్రత్యాహారముచే ఆ యా యింద్రియములను విషయములనుండి మఱలించి, ఆత్మయందు స్థాపించవలెను. మనస్సు చపలత్వము లేకయుండవలెను.


'మార్దవమ్' - మాటయందు, చేష్టయందు కాఠిన్యముచూపక మృదుత్వము గలిగి యుండవలెను. పరుషత్వమును వీడవలెను. ఇది సాత్త్వికగుణసంపన్నుని లక్షణము.


“హ్రీః” - (సిగ్గు) - (1) పాపకార్యములు చేయుటయందు సిగ్గు గలిగి యుండవలెను. (అనగా వానిని చేయరాదు).

(2) "నేనింతవఱకు పరమార్థక్షేత్రమున ఏమియున్నతిని బొందితిని?' అని

ప్రశ్నించుకొని, ఉన్నతినిబొందనిచో సిగ్గుపడవలెను.

(3) మహనీయులను, అనుభవజ్ఞులను సాధుమహాత్ములను, భక్తులను గాంచి, తన సాంసారిక అవనతిని తలంచుకొని సిగ్గునొందవలెను. మఱియు వారివలె ఉన్నత పారమార్థిక శిఖరము నధిరోహించుటకు పట్టుదలతో ప్రయత్నించవలెను.


“అచాపలమ్” - చంచలత్వము రజోగుణస్వభావము - అట్టిది లేకుండవలెను. మనస్సును ఆత్మనుండి (దైవమునుండి) చలింపజేయరాదు.


"తేజః” - బ్రహ్మతేజస్సుగలిగి యుండవలెను.


"క్షమా” - ఓర్పు, సహనము; ద్వంద్వములందు నిర్వికారుడై పృథివివలె , ఫలవృక్షమువలె క్షమాశీలుడై యుండవలెను. శుకుడు, యేసుక్రీస్తు మున్నగువారి క్షమాశీలత్వమును, సహనత్వమును అపుడపుడు తలంచుకొనుచుండవలెను.


"ధృతిః” - ధైర్యముగలిగి యుండవలెను. నిజరూపమగు ఆత్మను గూర్చి చింతించుచుండినచో, మఱియు ప్రపంచమిథ్యాత్వమును గూర్చి మననము చేయుచుండినచో మనుజునకు గొప్పధైర్యము చేకూరుచుండగలదు. ఎన్ని విపత్తులు తటస్థించినను మేరు సమానముగ గంభీరుడై యుండవలెను.

'శౌచమ్' - (1) బాహ్యశౌచము (శరీర, గృహాదులశుద్ధి) (2) అభ్యంతర శౌచము (ఇంద్రియ మనంబుల శుద్ధి, అపవిత్రసంకల్పములు లేకుండుట).


‘అద్రోహః’ - ఎవరికిని ద్రోహము, బాధ కలుగజేయకుండుట, మనస్సునందును ద్రోహచింతన లేకుండుట.


"నాతిమానితాః” - తాను గొప్పపూజ్యుడనని ఎన్నడును విఱ్ఱవీగరాదు. తనను పరులు గౌరవించవలె నను అభిమానమున్ను గలిగియుండరాదు. ఇది సాధకులకు అత్యంతావశ్యకమగు సుగుణము. ఇది లేనికారణమున అనేకుల దంభ అభిమానాదులచే పతనమొందిపోయిరి.

ఆంజనేయునకు గల్గియున్నటువంటి వినయవిధేయతలు, నిరభిమానము, దైవభక్తి కలవాడే పరమార్థమార్గమున సముత్తీర్ణుడుకాగలడు.

ఈ యిరువదియాఱు సుగుణములు దైవసంపత్తియందు జన్మించినవారికి కలుగుచుండును. ఇవిలేనివారు అట్టి దైవసంపదకై యత్నించి అద్దానిని పొందవలెను. మోక్షమున కీ సద్గుణములన్నియు అత్యావశ్యకములు.


ప్రశ్న:- శ్రీకృష్ణభగవానునిచే దైవగుణము లెన్ని పేర్కొనబడెను? అవి యేవి?

ఉత్తరము:- ఇరువదియాఱు. అవి క్రమముగ (1) భయరాహిత్యము (2) చిత్తశుద్ధి (3) జ్ఞానయోగస్థితి (4) దానము (5) బాహ్యేంద్రియనిగ్రహము (6) (జ్ఞాన) యజ్ఞము (7) శాస్త్రాధ్యయనము (8) (జ్ఞాన) తపస్సు (9) ఋజుత్వము (10) అహింస (11) సత్యము (12) క్రోధరాహిత్యము (13) త్యాగము (14) శాంతి (15) కొండెములు చెప్పకుండుట (16) భూతదయ (17) విషయలోలత్వము లేకుండుట (18) మృదుత్వము (19) సిగ్గు (20) చపలత్వము లేకుండుట (21) ప్రతిభ (బ్రహ్మ తేజస్సు) (22) ఓర్పు (23) ధైర్యము (24) శుచిత్వము (25) ద్రోహబుద్ధిలేకుండుట (26) అభిమానరాహిత్యము - ఈ సద్గుణములే దైవీసంపద యనబడును.

~~

* ‘భూతేష్వలోలుప్త్వం’ - పాఠాన్తరము.

తిరుమల సర్వస్వం 201-*

 *తిరుమల సర్వస్వం 201-*

*కపిల తీర్థం -6*

 *జంధ్యాలపౌర్ణమి* 


 ప్రతి సంవత్సరం శ్రావణపౌర్ణమి నాడు జంధ్యాలపండుగ ఆడంబరంగా జరుగుతుంది. ఆనాడు శ్రీగోవిందరాజస్వామి, శ్రీకృష్ణస్వామి, శ్రీసుదర్శన భగవానుడు, గోవిందరాజస్వామి ఆలయం నుండి వేర్వేరు పల్లకీలపై కపిలతీర్థం లోని వేణుగోపాలస్వామి ఆలయానికి వేంచేస్తారు. తదనంతరం వారికి శాస్త్రోక్తంగా యజ్ఞోపవీతాలు ధరింపజేసి; ఘనంగా హారతి, నివేదన ఇస్తారు.


 కార్తీకపౌర్ణమి నాడు కూడా శ్రీగోవిందరాజుల వారు తన దేవేరులతో కలిసి వేణుగోపాలస్వామి ఆలయానికి విచ్చేసి, అభిషేకాలు, నివేదన జరిగిన తరువాత, తిరిగి గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుంటారు.


 *శ్రీఆండాల్ (గోదాదేవి) ఆస్థానం* 


 ప్రతి సంవత్సరం కనుమపండుగ నాడు, గోవిందరాజస్వామి ఆలయం నుండి శ్రీగోదాదేవి ధరించిన పూల మాలలు తిరుమలలోని శ్రీవెంకటేశ్వరునికి పంపబడతాయి. తదనంతరం గోదాదేవి, గోవిందరాజస్వామి ఆలయం నుండి బయలుదేరి, కపిలతీర్థం వేంచేస్తుంది. అక్కడ గోదాదేవి ముత్తయిదువులకు వాయనదాన మిచ్చిన తరువాత, గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవి ఆస్థానోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతాయి. 


[పన్నెండు మంది ఆళ్వార్లలో మరో ప్రముఖ ఆళ్వారైన 'గోదాదేవి' లేదా 'ఆండాళ్' గురించి కూడా మరో ప్రకరణంలో విస్తారంగా తెలుసుకుందాం!]



 *కపిలేశ్వర స్వామి వారి త్రిశూల స్నానం* 


 మహాశివరాత్రి సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అనగా ఫాల్గుణ అమావాస్య నాడు కపిలేశ్వరస్వామి వారి ప్రధానాయుధమైన త్రిశూలస్వామి వారికి కపిలతీర్థం పుష్కరిణిలో త్రిశూల స్నానం జరుగుతుంది. ఈ స్నానాన్ని కాంచినవారికి త్రిశూలాయుధం సర్వకాల సర్వావస్థలయందు రక్షగా ఉంటుందని, అరిషడ్వార్గాలను అదుపులో ఉంచి, కైలాసప్రాప్తికి దోహద పడుతుందని భక్తులు నమ్ముతారు.


 *కార్తీకదీపం లేదా ఆకాశదీపం* 


 కార్తీకపౌర్ణమి నాడు, ఆలయం పై భాగాన, కొండశిఖరాలవద్ద అర్చకస్వాములు జ్యోతులను ప్రజ్వలింప జేస్తారు. అదే సమయంలో ఆలయానికి అనుసంధానింపబడి ఉన్న కొండ పైభాగాన గల పెద్దగూటిలో, తిరుపతి వాసులైన గాండ్ల కులస్థులు అఖండజ్యోతిని వెలిగిస్తారు. ఆ జ్యోతి తిరుపతి పట్టణ వాసులందరికీ దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. తరువాత, స్వామి, అమ్మవార్లను పల్లకీలో కపిలతీర్థం వద్దకు ఊరేగింపుగా తెచ్చిన అనంతరం జ్వాలాతోరణం జరుగుతుంది. ఆ సందర్భంగా కపిలతీర్థం పుష్కరిణిలో వేలాది భక్తులు అసంఖ్యాకమైన ప్రమిదలను వెలిగిస్తారు.


 *తెప్పోత్సవాలు* 


 ధనుర్మాసంలో ఆరుద్రానక్షత్రం ముందు రోజు పూర్తయ్యే టట్లుగా, ఐదురోజుల పాటు ప్రతిరోజు ప్రదోష వేళలో తెప్పోత్సవాలు జరుగుతాయి.


 *చందనోత్సవసేవ* 


 సౌర్యమానపు మకరమాసంలో (చంద్రమానపు పుష్యం లేదా మాఘం) పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు అమ్మవారికి చందనాలంకార సేవ జరుప బడుతుంది.


 *బ్రహ్మోత్సవాలు* 


 ప్రతి సంవత్సరం మాఘమాసంలో మహాశివరాత్రి సందర్భంగా పది రోజులపాటు మహావైభవంగా బ్రహ్మోత్సవాలు

జరుగుతాయి.


 *అన్నాభిషేకం* 


 కపిలతీర్థంలో అత్యంత వైభవంగా, విలక్షణంగా జరిగే ఈ అన్నాభిషేక మహోత్సవం, సౌరమానం ప్రకారం తులామాసంలో, పౌర్ణమి రోజున సంపన్న మవుతుంది. ఈ రోజును 'కపిలతీర్థముక్కోటి పేర్కొంటారు. ఆరోజు మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో, 250 కిలోల బియ్యంతో వండిన అన్నంతో కపిలేశ్వరలింగానికి అభిషేకం చేస్తారు. లింగాకృతి అంతా, పూర్తిగా అన్నమయమై పోతుంది. మిగిలిన అన్నంతో ఒక చిన్న శివలింగాన్ని తయారుచేసి తాత్కాలికంగా ప్రతిష్ఠ చేస్తారు. పోళీలు, కుడుములు, మురుకులు, సుఖియం, వడలు వంటి ఐదురకాల పిండివంటలను లవణరహితంగా తయారుచేసి అన్నలింగం యొక్క పానవట్టంపై అలంకరిస్తారు. తదనంతరం పొట్లకాయ, వంకాయ, అరటికాయ, సీమవంకాయ, బూడిద గుమ్మడికాయలను ముక్కలు కాకుండా పూర్తికాయలు గానే, ఉప్పు లేకుండా ఉడికించి; వీటిని అన్నలింగం పై సర్వాభరణాలుగా, చంద్రవంకగా, ఢమరుకంగా, త్రిశూలంగా అలంకరిస్తారు. పంచవాద్య సమ్మేళనంతో, మంగళధ్వనులతో మహా దీపారాధన జరుగుతుంది. తరువాత అన్నలింగాన్ని ఉద్వాసన చేసి, కర్పూరహారతి నిచ్చి, జలనిమజ్జనం చేస్తారు. తదుపరి, శివలింగంపై అమర్చిన అన్నాన్ని, పులుసు, కూరలతో కలిపి ప్రసాదంగా భక్తులకు పంచుతారు.


 అన్నాభిషేక మహోత్సవంలో పాల్గొని, అన్నలింగ దర్శనం చేసుకొన్నట్లయితే సమస్త గ్రహదోషాలు, పూర్వజన్మల పాపాలు సంపూర్ణంగా తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. 


[ రేపటి భాగంలో ... *శ్రీవారి సేవకులు* గురించి తెలుసుకుందాం]


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*


*340 వ రోజు*


*భీమసేనుడి విజృంభణ*


సాయంసమయం అయింది. సాత్యకి సోమదత్తుని ఒక నిశితశరముతో కొట్టాడు. ఘటోత్కచుడు సోమదత్తుడిని ముద్గర అనే ఆయుధముతో కొట్టాడు. ఆ దెబ్బలకు సోమదత్తుడు సోలిపోయాడు. తన కుమారుడు సోమదత్తుడు సోలిపోగానే బాహ్లికుడు సాత్యకితో యుద్ధముకు తలపడ్డాడు. భీముడు బాహ్లికునితో తలపడి బాణప్రయోగం చేసాడు. బాహ్లికుడు శక్తి ఆయుధంతో భీముని కొట్టాడు. ఆ శక్తిఆయుధ ఘాతానికి భీముడు మూర్చిల్లినా వెంటనే తేరుకుని బాహ్లికుని ముద్గర అను ఆయుధముతో కొట్టాడు. ముద్గర దెబ్బకు వయోధికుడైన బాహ్లికుడు తలపగిలి చనిపోయాడు. పాండవసేనలు జయజయధ్వానాలు చేసాయి.


*భీమసేనుడి చేతిలో కురురాజకుమారులు మరణించుట*


బాహ్లికుని మరణం చూసి దుర్యోధనుడి తమ్ములు పది మంది భీముడితో తలపడ్డారు. తనను చుట్టుముట్టిన పది మంది రాకుమారులను భీముడు పది బాణములతో సంహరించాడు. అది చూసి కర్ణుని తమ్ముడు వృకరధుడు భీమునితో తలపడ్డాడు. తనను సమీపించిన వృకరధుని భీముడు ఒకే దెబ్బతో చంపాడు. తరువాత భీమునితో శకుని తమ్ములు పన్నెండు మంది తలపడ్డారు. భీముడు వారిని అవలీలగా సంహరించాడు. భీముని పరాక్రమానికి ఎదురు లేక పోయింది. భీముని ఎదుర్కొన్న వారు ప్రాణాలతో బయటపడటం కష్టమైంది. ఆ తరువాత త్రిగర్త, బాహ్లిక, శూరసేన, మాళవ, వసాతి సేనలు ఒక్కుమ్మడిగా భీమసేనుని చుట్టుముట్టాయి. అది చూసి ధర్మరాజు తన సేనలతో భీమసేనుడిని చేరి కౌరవ సేనలను చీలి చెండాడటం మొదలు పెట్టారు. కౌరవ సేన క్రమంగా సన్నగిల్ల సాగింది.


*ద్రోణుడు పాండవులను ఎదుర్కొనుట*


కురుసేన క్షీణించడం చూసి సుయోధనుడు ద్రోణునికి జరిగిన విషయం వివరించగానే ద్రోణుడు వెంటనే ధర్మరాజును ఎదుర్కొని అతడి మీద దివ్యాస్త్రప్రయోగం చేసాడు. ధర్మరాజు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ద్రోణుడు ధర్మరాజు మీద ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ధర్మరాజు తిరిగి ఇంద్రాస్త్ర ప్రయోగంతో దానిని నిర్వీర్యం చేసాడు. ద్రోణుడు దర్మజునిపై బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయగా ధర్మరాజు అదే అస్త్రాన్ని ప్రయోగంచి దానిని నిర్వీర్యం చేసాడు. ఇంతలో ధృష్టద్యుమ్నుడు ద్రోణుని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు అతడిని లక్ష్యపెట్టక పాంచాలసేనను సంహరిస్తూ వారిని తరిమి కొట్టాడు. అదే సమయంలో మత్స్య కేకయ సేనలు కురుసేనను చుట్టుముట్టాయి.


*కృపాచార్యకర్ణుల వాదం*


సుయోధనుడు కర్ణుని వద్దకు వెళ్ళి తన పరాక్రమం చూపమని అర్ధించాడు. కర్ణుడు " అర్జునా! అర్జునుడు, భీముడు నాకు ఒక లెక్కా ! నేను ఒక్కడినే వారిరువురిని సంహరించి నీకు ఆహ్లాదం కలిగిస్తాను " అన్నాడు. కర్ణుని మాటలు విన్న కృపాచార్యుడు " కర్ణా ! చాలా బాగా పలికావు ఈ రోజుతో పాండవులను చంపి సుయోధనుడికి పట్టం కట్టేలా ఉన్నావు. ఈ పరాక్రమం ఘోషయాత్ర సమయాన, ఉత్తర గోగ్రహణ సమయాన ఏమైంది. ప్రగల్భములు వదిలి కార్యశూరత్వం చూపించు. అయినా నీవు ఇంత వరకు పాండవులను ఎదుర్కొన్నదే లేదు వారిని ఎలా గెలుస్తావు. మనమందరం అర్జునుడి చేత ఎన్ని సార్లు ఓడిపోయాము. ఇప్పుడు అతడికి ధర్మరాజు, భీముడు, ఘటోత్కచుడు ఉన్నారు. సాత్యకి విషయం సరేసరి. వీరినందరిని నీవు ఒక్కడివే గెవడం సాధ్యమేనా ! " అన్నాడు. ఆమాటలకు కర్ణుడు రోషపడి " కృపాచార్యా ! నేను ఆడిన మాట తప్పను పాండవులను జయించి అన్న మాట నెరవేర్చుకుంటాను. మీరంతా ఎప్పుడూ పాండవులను పొగిడి కౌరవసేనలో ఉత్సాహం తగ్గిస్తున్నారు. మన సైన్యంలో నేను, ద్రోణుడు, అశ్వత్థామ, శల్యుడు మొదలైన అతిరధ మహారధులు లేరా నీ మాటలు వారిని కాని వారిని చేస్తున్నాయి. నీవు బ్రాహ్మణుడివి కనుక నీ అధిక ప్రసంగం సహించాను. ఇక ఒక్క మాట మాట్లాడినా నీ నాలుక కోస్తాను జాగర్త " అన్నాడు. తన మేనమామను దూషించడం చూసి అశ్వత్థామ క్రుద్ధుడై కత్తి తీసుకుని కర్ణుని మీదకు లంఘించాడు. సుయోధనుడు అశ్వత్థామను వారించగా కృపాచార్యుడు అశ్వత్థామను గట్టిగా పట్టుకుని " నాయనా అశ్వత్థామా ! అంతకోపం పనికి రాదు శాంతం వహించు " అని అనునయించాడు. సుయోధనుడు అశ్వత్థామను చూసి " గురుపుత్రా ! మీ అందరి లక్ష్యం పాండవులను జయించి నన్ను ఈ భూమండలానికి పట్టాభిషిక్తుడిని చేయడం. మనలో మనం కలహించుకుంటే విజయం ఎలా ప్రాప్తిస్తుంది. కర్ణుడి బదులుగా మీ అందరిని నేను క్షమాపణ అడుగుతున్నాను అతడిని క్షమించండి " అన్నాడు. ఆ మాటలకు కర్ణుడు, అశ్వత్థామ శాంతించి తిరిగి యుద్ధసన్నద్ధమైయ్యారు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


*శ్లో*𝕝𝕝 *కాచే మణిర్మణౌ కాచో*

            *యేషాం బుద్ధిర్వికల్పతే*।

            *న తేషాం సన్నిధౌ భృత్యో*

            *నామమాత్రోఽపి తిష్ఠతి*॥


                  -- *పఞ్చతన్త్రమ్*--


*తా𝕝𝕝 ఎవరిబుద్ధికి (ఏ రాజుల బుద్ధికి) గాజుముక్క మణిగాను, మణి గాజుముక్కగాను.., భ్రాంతిగా తోస్తుందో అట్టి రాజులవద్ద నామమాత్రానికైననూ సేవకులు ఉండరు....*


 ✍️🌹💐🪷🙏

6, ఏప్రిల్ 2025, ఆదివారం

Panchang


 

పరిమిత జ్ఞానం

 పరిమిత జ్ఞానం 

ఈ భూమి మీద వున్న ప్రతి జీవికి కొంత జ్ఞానం కలిగి ఉండ్తుంది .  కానీ సాధారణంగా మనం ఏమి అనుకుంటామంటే కేవలం మనుస్యులకు మాత్రమే జ్ఞానం ఉంటుంది ఇతర జీవులకు జ్ఞానం ఉండదు అని అనుకుంటాం.  కానీ అది యదార్ధం కాదు ప్రతి జీవికి కూడా కొంత జ్ఞానం ఉంటుంది కానీ అది బుద్ది జీవిగా చెప్పే మనుషులకన్నా తక్కువగా ఉంటుంది. మనందరమూ చూస్తూ ఉంటాము ప్రతి పక్షి కూడా గ్రుడ్లు పెట్టె వయస్సు వస్తే తప్పకుండ గుళ్ళు పెట్టుకుంటాయి. విశేషము ఏమిటంటే ఒక జాతి కి చెందిన పక్షి గుళ్ళు  అన్ని ఒకే రకంగా ఉంటాయి. మరి ఆ  పక్షులకు ఆ రకంగా గుళ్లను నిర్మించే తెలివి తేటలు ఎక్కడివి అంటే మనం చెప్పలేము. అంతే కాకుండా చీమలు, చెదలు, పాములు కూడా పుట్టలు పెట్టటం మనం చూస్తాము. మీకు తెలుసా ఒక్కొక్క రకపు పాము ఒక్కో రకపు పుట్ట నిర్మిస్తుంది. జంతువులు వాటి వాటి సంతానాన్ని గుర్తించటం మాత్రమే కాకుండా వాటిని ప్రేమతో లాలించటం కూడా మనం చూస్తాము. ఒక ఆవుకు దూడ పుడితే తాను ఆ దూడను యెంత ప్రేమగా చూసుకుంటుందో రైతులకు బాగా తెలుసు. అప్పుడే పుట్టిన మనిషి నడవలేడు కానీ ఆవు దూడ నడవటమే కాకుండా తన తల్లిని గుర్తించి పాలకోసం ఆవు పొదుగు దగ్గరకు వెళుతుంది.  తనంతట తానె తల్లి పాలు త్రాగుతుంది. మరి ఈ జ్ఞానం అప్పుడే పుట్టిన దూడకు ఎవరు నేర్పారు. పిల్లలను పెంచటం వాటి ఆలనా పాలన చూడటంలో ఒక్కో జంతువూ ఒక్కో విధంగా తాన బాధ్యతను నెరవేరుస్తుంది. ఒక పిల్లి తాన పిల్లలను ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి తీసుకొని వెళ్ళటానికి తన నోటితో పట్టుకొని వెళుతుంది. కానీ కఠినమైన దాని నోటి దంతాలు (కోర పళ్ళు) తన శిశువుకు గుచ్చుకోకుండా తీసుకొని వెళ్ళటం ఏంటో విచిత్రం కదా. అదే విధంగా ఒక కోతి తన శిశువును తాను పట్టుకోదు కానీ శిశువే తన నాలుగు చేతులతో తల్లి ఉదరభాగాన్ని గట్టిగ పట్టుకొని ఉంటుంది. అది యెంత గట్టిగ తన తల్లిని పట్టుకుంటుందంటే ఆ తల్లి కోతి ఎన్నో చెట్లు, ఇళ్ళు గోడలు ఎక్కి దూకుతూ వున్నా కూడా పిల్ల కోతి  తన పట్టు వదలదు. అందుకే ఆధ్యాత్మిక జగత్తులో ఈ రెండు జంతువుల పద్దతులను ఆధారంగా  రెండు న్యాయాలను చెప్పారు.. అవి 1) మార్జాల కిశోర న్యాయము అంటే ఒక భక్తుడు తన పూర్తి బాధ్యతను భగవంతుని మీదనే వదిలి తనకు తాను భక్తి పారవశ్యంలో మునిగి వుండటము. పూర్తిగా భక్తిలో మునిగి తేలే భక్తుని బాగోగులు భగవంతుడే చూసుకుంటాడు దీనికి ఈ న్యాయం వర్తిస్తుంది. ఇది కేవలం పరిపూర్ణ భక్తులకు మాత్రమే వర్తిస్తుంది. 2) వానర కిశోర న్యాయము ఈ న్యాయం ప్రకారం ఒక సాధకుడు ఆత్మ జ్ఞాని  అయి తన జ్ఞానంతో భగవంతుడిని ఒక వానర శిశువులాగా అంటి పెట్టుకుంటాడు. కాబట్టి సాధకుడు సదా ముక్తుడే. ప్రతి సాధకుడు భక్తి మార్గంలో కొంత దూరం పయనించి తన అంతకరణ శుద్ధి చేసుకొని తరువాత జ్ఞానిగా మారి ముక్తుడు అవాలి.

జంతువులకు ఉన్న జ్ఞానం కొంతమేరకు మాత్రమే అని మనం తెలుసుకున్నాము. వాటికి మాట్లాడే శక్తి లేదు.  కానీ ఆలోచించే శక్తి, ఆహారాన్ని సంపాదించుకునే శక్తి, ఇంద్రియ సుఖాలను అనుభావించే జ్ఞానం వున్నది. ఈ విషయాలు ప్రతి మనిషికి కూడా వర్తిస్తుంది. కాకపొతే జంతువులకన్నా మానవులకు వున్న శక్తి ఆలోచనా శక్తి జంతువులకు స్వల్పంగా ఉంటే మనుషులకు ఎక్కువగా ఉంటుంది. ఇంకా మాట్లాడే శక్తి మానవులకు ఎక్కువగా వున్నది. మరి జంతువులకు మాట్లాడే శక్తి లేకపోయినా ఒక జంతువు ఇంకొక జంతువుకు సాంకేతాలను తెలుపుకొనే శక్తి తప్పకుండ ఉండి ఉంటుంది. అది లేకపోతె చీమలన్నీ ఒక వరుసలో ఎలా నడుస్తాయి. పక్షులన్నీ ఒక గుంపుగా ఎలా వెళతాయి. కుక్కలన్నీ ఒకే సారె దాడి ఎలా చేస్తాయి. ఇవన్నీ చూస్తుంటే జంతువులకు ఒక దానితో ఇంకొకటి సాంకేతాలు పంపే ప్రక్రియ ఏదో ఒకటి ఉండి ఉంటుందని తెలుస్తుంది. 

జంతువులకు లేకుండా మానవులకు మాత్రమే వున్నది విచేక్షణా జ్ఞానంగా మనం అనుకోవచ్చు. మనిషికి ఉన్న ఈ  శక్తి వలన తాను చుసిన రెండు విషయాలలో ఏది ఉత్తమమైనది ఏది కాదు అని తెలుసుకొని ఉత్తమమైనదానిని మాత్రమే ఎంచుకోగలడు.  ఈ విచేక్షణ జ్ఞానం వృద్ధి చెందితే దానికి వివేకం అని పేరు. వివేకం అంటే ఏది శాశ్వితము, ఏది అశాశ్వితము అని తెలుసుకునే జ్ఞానం. 

మనిషి తన చుట్టూ వున్నా జగత్తును నిత్యం కన్నులతో చూస్తూ వున్నది ఇతర ఇంద్రియాలతో జగత్తు ఉనికిని తెలుసుకుంటున్నారు. దృశ్యంగా కనపడుతున్నది కాబట్టి ఈ జగత్తుని దృశ్యమాన జగత్తు అని అన్నారు. నిజానికి మానవునికి ఉన్నది ఇంద్రియ జ్ఞానమే. ఇంద్రియాలకు లోపడి ఉన్నదానిని మాత్రమే తెలుసుకోగలడు. కాంతి పరిధిలో అంటే VIBGIOR అంటే సప్తవర్ణాలకు ఆధీనంలో ఉన్నదానిని మాత్రమే చూడగలడు అంటే ఆల్ట్రా వైలెట్ మరియు ఇన్ఫ్రా రెడ్ కిరణాల పరిధిని మానవుని కన్నులు గమనించలేవు. అంతే కాదు సూక్ష్మమైన బ్యాక్టీరియాలు, వైరసులను మనం కంటి తో చూడలేము. అంతదాకా ఎందుకు చీమను చూడగలము కానీ చేమ కాలిని చూడగలమా. ఇప్పుడు ప్రశ్న యేమని వస్తుందంటే కంటికి కనపడని వాటిని ఈ జగత్తులో లేవు అని అనగలమా అంటే అన లేము. శాస్త్రీయ పరికరాల ద్వారా ఈ రోజు మనం వాటి ఉనికిని తెలుసుకోగలం. అదే విధంగా సెకనుకు 20 నుండి 20,000 ప్రకంపనలు చేసే వాటి ధ్వనిని మాత్రమే మానవుని చెవులు గమనించగలవు మరి 20 కన్నా తక్కువ మరియు 20,000కన్నా ఎక్కువ ప్రకంపనల సంగతి ఏమిటి అంటే వాటి ఉనికి మానవుని చెవులకు తెలియదు. కుక్క పశువులు, పక్షులు, గబ్బిలాలు, పాములు మొదలగు జీవులకు  మానవుని వినికిడి శక్తి కన్నా ఎక్కువ ఉంటుందని ఈ రోజు శాస్త్ర పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ రోజు 20,000 కన్నా ఎక్కువ ప్రకంపనాలు చేసే ఆధునిక పరికరాలను ఉపయోగించి మానవుని శరీరంలోని అవయవాలను చూడటమే కాకుండా గర్భస్థ శిశువు ఉనికి లింగాన్ని కూడా కంప్యూటర్ తెరమీద వైద్యులు తెలుసుకోగలుగుతున్నారు. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే మానవునికి వున్న జ్ఞానం పరిమితంగా ఉన్నది అనిఅర్ధమవుతుంది. 

మన ధర్మంలో చతుర్వీదాలు (4+1) అష్టాదశ పురాణాలు (18) రెండు ఇతిహాసాలు , వేలకొద్ది ఉపనిషత్తులు ఉన్నాయి. పంచమ వేదంగా పేర్కొన్న ఆయుర్వేదము, ఇవికాక అనేక గీతాలు (భగవత్ గీత, వసిష్ఠ గీత, అష్టావక్ర గీత మొదలగునవి) కూడా వున్నాయి. ఇవి మన వైదికవాజ్హ్మయం అయితే ఇంకా సంస్కృత, ఆంధ్ర, హిందీ కవులు వ్రాసిన సాహిత్యం పాశ్చాచ్య దేశానినుంచి తెలియ వచ్చిన శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానం గురించి తెలుసుకుంటే ఒక మానవుడు తెలుసుకున్నది తాను తెలుసుకోవలసినదానికన్నా చాలా తక్కువ అని తేలికగా తెలుసుకోగలుగుతాడు.  కాబట్టి ఒక్క విషయం రూఢీగా చెప్పవచ్చు అదేమిటంటే బౌతికంగా వున్న జ్ఞానం కూడా అపారంగా ఉన్నట్లు మనకు జ్యోతిక మవుతుంది 

మనం తెలుసుకున్నది లేక తెలుసుకోదలుచుకున్నది రెండు కూడా నా కన్నా వేరుగా ఉన్నట్లు మనకు తెలుస్తున్నది. అందుకే ఈ భౌతిక జ్ఞానాన్ని లోక జ్ఞానంగా మనం అభివర్ణించవచ్చు. ఇన్ని విషయాలు తెలుసు కోవటము  అవసరమా అని ఆలోచిస్తే అవసరము కాదని మనం అనుకుంటాము ఎందుకంటె మనం చేసే ఏ శాస్త్రాధ్యనం అయినాకూడా కేవలం ఉదర నిమిత్తం  అంటే కేవలం అంటే కేవలము ధన సంపాదనకొరకు మాత్రమే ప్రతి మానవుడు తన తన పరిధిలో కొంత జ్ఞానాన్ని సౌపార్జించి దానితో తన భుక్తి కి ఒక మార్గము ఏర్పాటు చేసుకుంటాడు. ఒక వైద్యుడు ఒక న్యాయవాది , ఇంజనీరు ఇత్యాది వృత్తులు కేవలం ఉదర నిమిత్తమే అని మనకు తెలుసు. . ఒక వైద్యునికి న్యాయ శాస్త్రం  అనవసరం అలాగే  ఒక న్యాయవాదికి వైద్య శాస్త్రం అవసరం లేదు. 

ఈ భూమి మీద పరిపూర్ణుడు అంటే సర్వజ్ణ్యుడు ఎవరైనా వున్నారా అంటే లేనే లేరని మనం గంటా పదంగా చెప్పవచ్చు మరి సంపూర్ణ జ్ఞానం ఎవరికి ఉండదా అంటే ఉంటుంది అని జవాబు చెప్పవచ్చు. మరి ఆ సంపూర్ణ జ్ఞాని ఎవరు తెలపగలరు అంటే ఒకటి చెప్పవచ్చు ఆజ్ఞాని మనిషి మాత్రం కాదు మరైతే ఎవరు అంటే ఆయనే భగవంతుడు. కేవలం భగవంతుడే మాత్రమే ఈ జగత్తు గురించి సంపూర్ణ జ్ఞాని ఎందుకంటె ఆయనే సృష్టి, స్థితి మరియు లయకారుడు. అందుకే భగవంతుని బ్రహ్మగా మన ఉపనిషత్తులు పేర్కొన్నాయి. 

ప్రతి మానవుడు తనకు అరుదుగా లభించిన అపూర్వ అవకాశంగా ఈ మానవ జన్మను తలంచి దీనిని సార్ధకత చేసుకోవటానికి బ్రహ్మజ్ఞానాభిలాషి అయి సాధన చేయాలి అప్పుడే తనకు తానుగా తన్ను తానుగా యెఱింగి స్వయంగా బ్రహ్మగా మారతాడు "బ్రహ్మవిత్ బ్రహ్మయేవ భవత్" 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ

 

 

శ్రీరామ చంద్రుడులాగా

 ప్రతీఒక్కరూ శ్రీరామ చంద్రుడులాగా నైతిక జీవితాన్ని గడపండి 


"రామాయణం నుండి మనం ఏమి నేర్చుకొని ముగించాలి?" అనేది ఒక ప్రశ్న.. భగవంతుని పుణ్యకథ వినడం వల్ల పుణ్యం వస్తుంది.. అంతే కాకుండా ఇంకో ఉపయోగం ఉంది.. 


మనం తెలుసుకోవలసిన న్యాయం ఏమిటి అనే ప్రశ్నకు రామాయణం నుండి మన పూర్వీకులు క్లుప్తంగా సమాధానం ఇచ్చారు.


యాన్తి న్యాయప్రవృత్తస్య తిర్యఞ్జోస్పి సహాయదంఐ  

అబన్దనం దు కచందం సోతరోస్పి విముంజతి II 


ఇదీ మనం తెలుసుకోవలసిన సత్యం.. మానవ జీవితం రెండు రకాలుగా ఉంటుంది.. ఒకటి సరైన మార్గం, మరొకటి తప్పు మార్గం.. సరైన మార్గంలో ఉండగలిగే జీవితం అంటే నైతిక జీవితం.. తప్పు మార్గంలో ఉండే జీవితం అంటే అనైతిక జీవితం.. ఈ రెండింటిలో ఏది తీసుకోవాలి?  మనం సరైన మార్గంలో పయనిస్తే ఏమవుతుందోరామాయణం చెబుతుంది..


 "ఆ మార్గంలో నడిస్తేనే ఫలితం ఉంటుంది.. ఈ మార్గంలో నడిస్తే ఇదే ఫలితం.. మీకు నచ్చిన మార్గంలో వెళ్ళండి" అని రామయ్య...ని చూసి ఆచరించాలి 


— జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతి తీర్థ మహాస్వామి వారు

శ్రీ సీతారామ కళ్యాణ సర్గః

 శ్రీ సీతారామ కళ్యాణ సర్గః


1.యస్మింస్తు దివసే రాజా చక్రే గోదాన ముత్తమమ్ |

తస్మింస్తు దివసే వీరో యుధాజిత్సముపేయివాన్ ǁ

2.పుత్రః కేకయరాజస్య సాక్షాద్భరతమాతులః |

దృష్ట్వా పృష్ట్వా చ కుశలం రాజాన మిద మబ్రవీత్ ǁ

3.కేకాయాధిపతీ రాజా స్నేహాత్ కుశల మబ్రవీత్ |

యేషాం కుశలకామోఽసి తేషాం సంప్ర త్యనామయమ్ ǁ

4.స్వస్రీయం మమ రాజేంద్ర ద్రష్టుకామో మహీపతిః |

తదర్థ ముపయాతోఽ హ మయోధ్యాం రఘునందన ǁ

5.శ్రుత్వా త్వహ మయోధ్యాయాం వివాహార్థం తవాత్మజాన్ |

మిథిలా ముపయాతాంస్తు త్వయా సహ మహీపతే ǁ

6.త్వరయాఽభ్యుపయాతో ఽహం ద్రష్టుకామః స్వసుః సుతమ్|

అథ రాజా దశరథః ప్రియాతిథి ముపస్థితమ్ |

దృష్ట్వా పరమసత్కారైః పూజనార్హమపూజయత్ ǁ

7.తతస్తా ముషితో రాత్రిం సహ పుత్రై ర్మహాత్మభిః |

ప్రభాతే పునరుత్థాయ కృత్వా కర్మాణి కర్మవిత్ |

ఋషీంస్తదా పురస్కృత్య యజ్ఞవాట ముపాగమత్ ǁ

8.యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణభూషితైః |

భ్రాతృభిః సహితో రామః కృతకౌతుకమంగళః ǁ

9.వసిష్ఠం పురతః కృత్వా మహర్షీ నపరానపి |

పితుః సమీపమాశ్రిత్య తస్థౌ భ్రాతృభిరావృతః |

వసిష్ఠో భగవా నేత్య వైదేహ మిద మబ్రవీత్ ǁ

10.రాజా దశరథో రాజన్ కృతకౌతుకమంగళైః |

పుత్రై ర్నరవర శ్రేష్ఠ దాతార మభికాంక్షతే ǁ

11.దాతృప్రతిగ్రహీతృభ్యాం సర్వార్థాః ప్రభవంతి హి |

స్వధర్మం ప్రతిపద్యస్వ కృత్వా వైవాహ్య ముత్తమమ్ ǁ

12.ఇత్యుక్తః పరమోదారో వసిష్ఠేన మహాత్మనా |

ప్రత్యువాచ మహాతేజా వాక్యం పరమధర్మవిత్ ǁ

13.కః స్థితః ప్రతిహారో మే కస్యాజ్ఞా సంప్రతీక్ష్యతే |

స్వగృహే కో విచారోఽస్తి యథా రాజ్యమిదం తవ ǁ

14.కృతకౌతుకసర్వస్వా వేదిమూల ముపాగతాః |

మమ కన్యా మునిశ్రేష్ఠ దీప్తా వహ్నే రివార్చిషః ǁ

15.సజ్జోఽహం త్వత్ప్రతీక్షో ఽస్మి వేద్యామస్యాం ప్రతిష్ఠితః |

అవిఘ్నం కురుతాం రాజా కిమర్థ మవలంబతే ǁ

16.తద్వాక్యం జనకే నోక్తం శ్రుత్వా దశరథ స్తదా |

ప్రవేశయామాస సుతాన్ సర్వా నృషిగణానపి ǁ

17.తతో రాజా విదేహానాం వసిష్ఠ మిద మబ్రవీత్ |

కారయస్వ ఋషే సర్వామృషిభిః సహ ధార్మిక |

రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం ప్రభో ǁ

18.తథేత్యుక్త్వా తు జనకం వసిష్ఠో భగవా నృషిః |

విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికమ్ ǁ

19.ప్రపామధ్యే తు విధివ ద్వేదిం కృత్వా మహాతపాః |

అలంచకార తాం వేదిం గంధపుష్పైః సమన్తతః ǁ

20.సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురైః |

అంకురాఢ్యైః శరావైశ్చ ధూపపాత్రైః సధూపకైః ǁ

21.శంఖపాత్రైః స్రువైః స్రుగ్భిః పాత్రై రర్ఘ్యాభిపూరితైః |

లాజపూర్ణైశ్చ పాత్రీభి రక్షతై రభిసంస్కృతైః ǁ

22.దర్భైః సమైః సమాస్తీర్య విధివ న్మంత్రపూర్వకమ్ |

అగ్నిమాధాయ వేద్యాం తు విధిమంత్రపురస్కృతమ్ |

జుహావాగ్నౌ మహాతేజా వసిష్ఠో భగవానృషిః ǁ

23.తతః సీతాం సమానీయ సర్వాభరణభూషితామ్ |

సమక్ష మగ్నేః సంస్థాప్య రాఘవాభిముఖే తదా |

అబ్రవీ జ్జనకో రాజా కౌసల్యానందవర్ధనమ్ ǁ

24.ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ |

ప్రతీఛ్చ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా ǁ

25.పతివ్రతా మహాభాగా ఛాయే వానుగతా సదా |

ఇత్యుక్త్వా ప్రాక్షిప ద్రాజా మంత్రపూతం జలం తదా ǁ

26.సాధు సాధ్వితి దేవానా మృషీణాం వదతాం తద |

దేవదుందుభినిర్ఘోషః పుష్పవర్షో మహానభూత్ ǁ

27.ఏవం దత్వా తదా సీతాం మంత్రోదకపురస్కృతామ్ |

అబ్రవీ జ్జనకో రాజా హర్షే ణాభిపరిప్లుతః ǁ

28.లక్ష్మణాగచ్ఛ భద్రం తే ఊర్మిళా ముద్యతాం మయా |

ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ మా భూత్కాలస్య పర్యయః ǁ

29.తమేవ ముక్త్వా జనకో భరతం చాభ్యభాషత |

గృహాణ పాణిం మాండవ్యాః పాణినా రఘునందనǁ

30.శతృఘ్నం చాపి ధర్మాత్మా అబ్రవీ జ్జనకేశ్వరః |

శ్రుతకీర్త్యా మహాబాహో పాణిం గృహ్ణీష్వ పాణినా ǁ

31.సర్వే భవంతః సౌమ్యాశ్చ సర్వే సుచరితవ్రతాః |

పత్నీభిః సంతు కాకుత్థ్సా మా భూత్కాలస్య పర్యయః ǁ

32.జనకస్య వచః శ్రుత్వా పాణీం పాణిభి రస్పృశన్ |

చత్వారస్తే చతసృణాం వసిష్ఠస్య మతే స్థితాః ǁ

33.అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవ చ |

ఋషీంశ్చైవ మహాత్మానః సభార్యా రఘుసత్తమాః |

యథోక్తేన తథా చక్రు ర్వివాహం విధిపూర్వకమ్ ǁ

34. పుష్పవృష్టి ర్మహత్యాసీ దంతరిక్షాత్సుభాస్వరా |

దివ్యదుందుభినిర్ఘోషై ర్గీతవాదిత్రనిఃస్వనైః ǁ

35.ననృతు శ్చాప్సరస్సంఘా గంధర్వాశ్చ జగుః కలమ్|

వివాహే రఘుముఖ్యానాం తదద్భుత మదృశ్యత ǁ

36.ఈదృశే వర్తమానే తు తూర్యోద్ఘుష్ఠనినాదితే |

త్రిరగ్నిం తే పరిక్రమ్య ఊహు ర్భార్యా మహౌజసః ǁ

37.అథోపకార్యాం జగ్ముస్తే సభార్యా రఘునందనాః |

రాజా ప్యనుయయౌ పశ్యన్సర్షిసంఘః సబాంధవః ǁ

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే త్రిసప్తతితమః సర్గః


🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏🪷🙏🪷

రామాలాలి మేఘశ్యామా లాలి...*

 *రామాలాలి మేఘశ్యామా లాలి...* 


శ్రీమహావిష్ణువు దుష్టశిక్షణకు శిష్ట రక్షణకు ఎన్నో అవతారాలు ఎత్తాడు. వాటిలో మాతృగర్భం నుంచి మానవాకారుడై జన్మించిన అవతారాలు రెండే రెండు. అవి రామావతారం. కృష్ణావతారం. ఒకరు మాయామానుష విగ్రహుడు, రెండవ వారు లీలామానుష విగ్రహుడు. ఒకరు తనని తాను జీవితాంతమూ మానవమాత్రునిగా, దశరథ నందనునిగా చెప్పుకున్నారు. రెండవ వారు మానవునిగా జన్మించినా తన లీలలతో భగవంతునిగానే పరిగణింప బడ్డాడు. విశేషమేమంటే వాల్మీకి రామాయణంలో శ్రీరాముని బాల్య చేష్టల గురించి విస్తారంగా వర్ణన లేదు. తెలుగు భాగవతంలోని దశమ స్కంధంలో శ్రీకృష్ణుని బాల్య క్రీడలను విస్తారంగా పోతనామాత్యులు వర్ణించారు. అయితే బాల రాముని చిలిపి చేష్టలను వేరే కవులు తమ తమ గ్రంథాలలో అద్భుతంగా పేర్కొన్నారు. ఆయా గ్రంథాలలో శ్రీకృష్ణజననం మాదిరి రామ జననం కూడా అంతే ప్రాచుర్యాన్ని పొందింది. శ్రీరామ జననం గురించి ఎవరు, ఎన్నిసార్లు చెప్పినా, వినినా తనివి తీరదు. దీనిపై చలన చిత్రాలు వచ్చాయి, నాటకాలు వచ్చాయి. హరికథల్లో లెక్కకు మిక్కిలిగా వర్ణనలు వస్తూనే ఉన్నాయి. అయితే దీనిలో చెప్పేవారి ప్రతిభ కూడా ఉంటుంది. 'కవి ప్రతిభలోన నుండును, కావ్యగత శతాంశముల యందు తొంబదియైన పాళ్ళు అన్నది నిజము' అంటారు కవి సామ్రాట్టు శ్రీ విశ్వనాథ. శ్రీరామ జననంలోని విశేషాంశాలను కవి సామ్రాట్టు తమ రామాయణ కల్ప వృక్షంలో అత్యద్భుతంగా వర్ణించారు.


పుత్ర కామేష్టి జరిగింది. యజ్ఞపరుషుడు దశరథునకు పాయసపాత్ర అందించాడు. దశరథుడు తన భార్యలు ముర్వురికి పాయసం పంచి ఇచ్చాడు. ముగ్గురు సతులు కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భవతులయ్యారు. నెలలు నిండేయి. ప్రభవ నామ సంవత్సరం నుండి పదహారు సంవత్సరాలు గడిచేయి. స్వభాను సంవత్సరం ప్రవేశిం చింది. కౌసల్యను చూడడానికి శుక్ల పక్ష సప్తమినాడు రాముని అక్క శాంతాదేవి వచ్చింది. 'అమ్మా! ఎల్లుండి నవమినాడు షోడశ కళాపూర్ణుడై శ్రీహరి నీ కడుపున పుడతాడట. వారిని దర్శించడానికి నా భర్త (ఋష్యశృంగుడు) శిష్య సమేతంగా వచ్చి విడిదిలో ఉన్నాడు. నిన్ను చూడడానికి వచ్చాను' అంది శాంత. ఈ సందర్భంలో విశ్వనాథవారు 'పూర్వ మెన్నియుష కాలములను నేవి/నవమియే పుణ్యకాలమో/తవిలి ఈ స్వ/భాను వేనోము నోచెనో ? శుక్ల పక్షంబులెంతటి శోభగలదో' అని అద్భుతంగా రాశారు.


చైత్ర శుద్ధ నవమి వచ్చింది. కౌసల్యకు నొప్పులు వచ్చి అధికమయ్యాయి. మధ్యాహ్న మార్తాండుడు ఆ శుభసమయం కోసం ఆతృతగా చూస్తూ కదలకుండా ఉన్నాడు. శ్రీహరి మానవ రూపంలో అవతరించనున్నందున ఆకాశం నుంచి పూల జల్లుల మాదిరి చిరు జల్లులు కురిసేయి. ప్రసవానికి కావలసిన ఏర్పాట్లన్నీ పరిచారికలు చేసారు. శ్రీహరిని మానవావతార రూపంలో దర్శించే అదృష్టం భానుడికి కలగినందుకు చంద్రుడు కినుక వహించాడు. కాసింత అసూయ కూడా కలిగింది. గ్రహ మండలమంతా ఉత్సుకతతో ఎదరుచూస్తున్నది. ఈ సందర్భాన్ని కల్ప వృక్షంలో ఈ విధంగా వర్ణించారు. *శ్రీమన్మాలాభారతి/గా మొదలగు యోగ శతముగా గ్రహ రాజుల్/ స్వామి జననంబు వేళకు /సోమించిరి దితిజహరణ సూచకములుల గాన్'.*


అయోధ్యా నగరంలో మధ్యాహ్న సమయాన్ని సూచిస్తూ కోటలో ఘంటారావం వినిపించింది. అదే సమయంలో శీరోదయం జరిగింది. కర్కాటక లగ్నం, పునర్వసు నక్షత్రం, నవమి తిథి, కౌసల్య గర్భాన పురుషోత్తముడు జన్మించాడు. అంతవరకూ పురిటినొప్పులు భరించిన కౌసల్య తేలికపడి ఆనందంతో ఆ శిశువును అందుకోబోయింది. మంత్రసాని ఆమెను వారించింది. చేతిలోని శిశువును తట్టి గిచ్చింది. 'కెవ్వున స్నిగ్ధమంధరము కేక వినంబడె మంత్ర సానియున్ /బువ్వును బోలెజే శిశువు బూనెను, బట్టపురానియున్ గనుల్ /నొవ్వగు మూత విచ్చుచుగనుంగన్భాగ్యము నామె కన్నులన్/నవ్వెనోజాలి పొందెనోసనాతనమే మధుకాంతి జిమ్మెనో'. అప్పటివరకూ ఉత్కంఠతో నున్న మంత్రసాని, పరిచారికలు ఆ కెవ్వు కేక విని పులకించి ఆనందతన్ముయులయ్యారని విశ్వనాథవారి ఊహా పథంలో రామ జననం ఇలా కవితా ధారగా ప్రవహించింది.


ప్రాణసఖియైన కౌసల్య పుత్రునికి జన్మనిచ్చిందన్న వార్త దశరథునికి తెలిసింది. తన వంశాంకురాన్ని చూడాలన్న తహ తహ ఉరకలెత్తించింది. ఈ సందర్భాన్ని వర్ణిస్తూ కవి సామ్రాట్ కలం ఈ విధంగా స్పందించింది. కొంచెములో కొంచెమునకున్ చనుదెంచెను అంటూ మహారాజు పురిటి దగిలోకి వచ్చాడు. మంత్ర సాని పసికందును చూపించింది. దశరథుడు పసిబిడ్డను చూసి మురిసిపోయేడు.


కొన్రని ఘడియలలో అదే లగ్నంలో అశ్లేష నక్షత్రంలో సుమిత్ర కవలలను కన్నది. మీన లగ్నం, పుష్యమీ నక్షత్రంలో కైకేయి మగబిడ్డకు జన్మనిచ్చింది.


కౌసల్యా సుతునికి బొడ్డు కొయ్యడానికి మంత్రసాని తోరము కట్టిన కత్తిని చేతపట్టుకుంది. కార్యక్రమానికుపక్రమించింది.


కోసిన బొడ్డు పైసదిమి గోర విభూతిని బోరుకొడగం గాసరిదంబు పాదయుగు గంధిసుతాహృదయేశు స్వామి నిం జేసిరి బోరుకాడగనుజేసిరి క్షీర సముఏద్ర శాయిము క్తీశుడు ముక్తి గబ్బు విడయింపగరానినుదింపులొందగన్ తామర తూడును గోటిలో విరిచినంత నేర్పుగా మంత్రసాని బొడ్డుకోసింది. ఆయన సాక్షాత్తూ విష్ణుమూర్తి. ఆయన బొడ్డునుండే తామరలో బ్రహ్మ ఆసీనుడై ఉంటాడు. బొడ్డు కోయగానే చీమ కుట్టినట్టనిపించింది బ్రహ్మకు. విష్ణువు భూలోకంలో అవతరించినట్టు తన మనోనేత్రంతో తెలుసుకున్నాడు. ఆ వెంటనే పరిచారికలు బోరువాడ అంటే స్నానం చేయించారు.


శ్రీరామ జననంతో ఆకాశం నుంచి పూలవాన కురిసింది. ఇక్ష్వాకు కులతిలకుని జనన వార్త విన్న ఆయోధ్య పురవాసులే కాకుండా కోసల రాజ్యమంతా ఆఘమేఘాల మీద ఈ విషయం చేరిపోయింది. వార్త విన్న వారంతా ఉప్పొంగిపోయేరు.


ఆ నాటి నుంచి దశరథుని చూపు ఆకాశం వైపే. షోడష కళాపూర్ణుడైన చంద్రుణ్ణి తన బిడ్డలో చూసుకుంటూ ఉబ్బితబ్బిబ్బయ్యేవాడు. ఆకాశంలో చంద్రబింబం, ఒడిలో పాపడు. వీరిరువురిలో అందగాడెవరు? పురుషోత్తముని కంటె జగత్తులో అందగాడెవరుంటారు? అని తనకు తానే సమాధానం చెప్పుకుని పరవశించేవాడు.


దశరథ నందనునికి నామకరణం చేయడానికి కుల గురువు వశిష్ఠునితో పాటు ఋష్యశృంగాది మునులు కూడా విచ్చేశారు. సూర్యకాంతిలో మరుగును పడిన చంద్రుడు అంతరంగంలో మధనపడుతున్నాడు.


వశిష్ఠుడు పళ్ళెం నిండా బియ్యంపోసి దశరథుని ఒడిలో పెట్టి రత్న అంగుళీయకాన్ని ఇచ్చేడు. తన తపశక్తితో దశరథుని అంతరంగాన్ని తెలుసుకున్న కులగురువు దశరథుని చేత 'శ్రీరామచంద్రుడు' అన్న నామాన్ని రాయించేడు. దశరథుని కంటె ముందుగానే ఆ పేరును ప్రకటించాడు. దశరథుని ఆనందానికి అవధుల్లేవు. సూర్య కాంతి మరుగును ఉన్న చంద్రుని అంతరంగ ఆనందం హద్దులు దాటిపోయింది. పురుషోత్తముడైన శ్రీరామునితో కలిసి శ్రీరామచంద్రునిగా అవనిలో పూజింపబడనుండడమే అందుకు కారణం. ఆలస్యంగా నామకరణోత్సవానికి వచ్చిన మంత్రి సుమంతుడు మహారాజు రాసిన అక్షరాలను 'శ్రీరామ భద్రుడు'గా చదివాడు. అది కూడా సార్థక నామధేయమే అయింది. తల్లిదండ్రులకు రామచంద్రుడు, తతిమ్మా వారికి రామభద్రుడుగా ఇతిహాసంలో నిలిచిపోయేడు.


నామకరణోత్సవంలో సుమిత్రానందనులకు లక్ష్మణ శత్రుఘ్నులనీ, కైకేయి సుతునికి భరతుడని కులగురువు నామకరణం చేశాడు. అనంతరం శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులకు మంగళహారుతిలిచ్చి ఊయలలో పరుండబెట్టారు. పెద్ద ముతైదువులు అందరూ కలసి శ్రీరామా లాలీ...మేఘశ్యామా లాలీ అంటూ లాలిపాటలు ముక్తకంఠంతో పాడారు.


మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే

చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం


*🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*

                   _ఆధ్యాత్మికం ఆనందం_

రామాలాలి మేఘశ్యామా లాలి.

 *రామాలాలి మేఘశ్యామా లాలి...* 


శ్రీమహావిష్ణువు దుష్టశిక్షణకు శిష్ట రక్షణకు ఎన్నో అవతారాలు ఎత్తాడు. వాటిలో మాతృగర్భం నుంచి మానవాకారుడై జన్మించిన అవతారాలు రెండే రెండు. అవి రామావతారం. కృష్ణావతారం. ఒకరు మాయామానుష విగ్రహుడు, రెండవ వారు లీలామానుష విగ్రహుడు. ఒకరు తనని తాను జీవితాంతమూ మానవమాత్రునిగా, దశరథ నందనునిగా చెప్పుకున్నారు. రెండవ వారు మానవునిగా జన్మించినా తన లీలలతో భగవంతునిగానే పరిగణింప బడ్డాడు. విశేషమేమంటే వాల్మీకి రామాయణంలో శ్రీరాముని బాల్య చేష్టల గురించి విస్తారంగా వర్ణన లేదు. తెలుగు భాగవతంలోని దశమ స్కంధంలో శ్రీకృష్ణుని బాల్య క్రీడలను విస్తారంగా పోతనామాత్యులు వర్ణించారు. అయితే బాల రాముని చిలిపి చేష్టలను వేరే కవులు తమ తమ గ్రంథాలలో అద్భుతంగా పేర్కొన్నారు. ఆయా గ్రంథాలలో శ్రీకృష్ణజననం మాదిరి రామ జననం కూడా అంతే ప్రాచుర్యాన్ని పొందింది. శ్రీరామ జననం గురించి ఎవరు, ఎన్నిసార్లు చెప్పినా, వినినా తనివి తీరదు. దీనిపై చలన చిత్రాలు వచ్చాయి, నాటకాలు వచ్చాయి. హరికథల్లో లెక్కకు మిక్కిలిగా వర్ణనలు వస్తూనే ఉన్నాయి. అయితే దీనిలో చెప్పేవారి ప్రతిభ కూడా ఉంటుంది. 'కవి ప్రతిభలోన నుండును, కావ్యగత శతాంశముల యందు తొంబదియైన పాళ్ళు అన్నది నిజము' అంటారు కవి సామ్రాట్టు శ్రీ విశ్వనాథ. శ్రీరామ జననంలోని విశేషాంశాలను కవి సామ్రాట్టు తమ రామాయణ కల్ప వృక్షంలో అత్యద్భుతంగా వర్ణించారు.


పుత్ర కామేష్టి జరిగింది. యజ్ఞపరుషుడు దశరథునకు పాయసపాత్ర అందించాడు. దశరథుడు తన భార్యలు ముర్వురికి పాయసం పంచి ఇచ్చాడు. ముగ్గురు సతులు కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భవతులయ్యారు. నెలలు నిండేయి. ప్రభవ నామ సంవత్సరం నుండి పదహారు సంవత్సరాలు గడిచేయి. స్వభాను సంవత్సరం ప్రవేశిం చింది. కౌసల్యను చూడడానికి శుక్ల పక్ష సప్తమినాడు రాముని అక్క శాంతాదేవి వచ్చింది. 'అమ్మా! ఎల్లుండి నవమినాడు షోడశ కళాపూర్ణుడై శ్రీహరి నీ కడుపున పుడతాడట. వారిని దర్శించడానికి నా భర్త (ఋష్యశృంగుడు) శిష్య సమేతంగా వచ్చి విడిదిలో ఉన్నాడు. నిన్ను చూడడానికి వచ్చాను' అంది శాంత. ఈ సందర్భంలో విశ్వనాథవారు 'పూర్వ మెన్నియుష కాలములను నేవి/నవమియే పుణ్యకాలమో/తవిలి ఈ స్వ/భాను వేనోము నోచెనో ? శుక్ల పక్షంబులెంతటి శోభగలదో' అని అద్భుతంగా రాశారు.


చైత్ర శుద్ధ నవమి వచ్చింది. కౌసల్యకు నొప్పులు వచ్చి అధికమయ్యాయి. మధ్యాహ్న మార్తాండుడు ఆ శుభసమయం కోసం ఆతృతగా చూస్తూ కదలకుండా ఉన్నాడు. శ్రీహరి మానవ రూపంలో అవతరించనున్నందున ఆకాశం నుంచి పూల జల్లుల మాదిరి చిరు జల్లులు కురిసేయి. ప్రసవానికి కావలసిన ఏర్పాట్లన్నీ పరిచారికలు చేసారు. శ్రీహరిని మానవావతార రూపంలో దర్శించే అదృష్టం భానుడికి కలగినందుకు చంద్రుడు కినుక వహించాడు. కాసింత అసూయ కూడా కలిగింది. గ్రహ మండలమంతా ఉత్సుకతతో ఎదరుచూస్తున్నది. ఈ సందర్భాన్ని కల్ప వృక్షంలో ఈ విధంగా వర్ణించారు. *శ్రీమన్మాలాభారతి/గా మొదలగు యోగ శతముగా గ్రహ రాజుల్/ స్వామి జననంబు వేళకు /సోమించిరి దితిజహరణ సూచకములుల గాన్'.*


అయోధ్యా నగరంలో మధ్యాహ్న సమయాన్ని సూచిస్తూ కోటలో ఘంటారావం వినిపించింది. అదే సమయంలో శీరోదయం జరిగింది. కర్కాటక లగ్నం, పునర్వసు నక్షత్రం, నవమి తిథి, కౌసల్య గర్భాన పురుషోత్తముడు జన్మించాడు. అంతవరకూ పురిటినొప్పులు భరించిన కౌసల్య తేలికపడి ఆనందంతో ఆ శిశువును అందుకోబోయింది. మంత్రసాని ఆమెను వారించింది. చేతిలోని శిశువును తట్టి గిచ్చింది. 'కెవ్వున స్నిగ్ధమంధరము కేక వినంబడె మంత్ర సానియున్ /బువ్వును బోలెజే శిశువు బూనెను, బట్టపురానియున్ గనుల్ /నొవ్వగు మూత విచ్చుచుగనుంగన్భాగ్యము నామె కన్నులన్/నవ్వెనోజాలి పొందెనోసనాతనమే మధుకాంతి జిమ్మెనో'. అప్పటివరకూ ఉత్కంఠతో నున్న మంత్రసాని, పరిచారికలు ఆ కెవ్వు కేక విని పులకించి ఆనందతన్ముయులయ్యారని విశ్వనాథవారి ఊహా పథంలో రామ జననం ఇలా కవితా ధారగా ప్రవహించింది.


ప్రాణసఖియైన కౌసల్య పుత్రునికి జన్మనిచ్చిందన్న వార్త దశరథునికి తెలిసింది. తన వంశాంకురాన్ని చూడాలన్న తహ తహ ఉరకలెత్తించింది. ఈ సందర్భాన్ని వర్ణిస్తూ కవి సామ్రాట్ కలం ఈ విధంగా స్పందించింది. కొంచెములో కొంచెమునకున్ చనుదెంచెను అంటూ మహారాజు పురిటి దగిలోకి వచ్చాడు. మంత్ర సాని పసికందును చూపించింది. దశరథుడు పసిబిడ్డను చూసి మురిసిపోయేడు.


కొన్రని ఘడియలలో అదే లగ్నంలో అశ్లేష నక్షత్రంలో సుమిత్ర కవలలను కన్నది. మీన లగ్నం, పుష్యమీ నక్షత్రంలో కైకేయి మగబిడ్డకు జన్మనిచ్చింది.


కౌసల్యా సుతునికి బొడ్డు కొయ్యడానికి మంత్రసాని తోరము కట్టిన కత్తిని చేతపట్టుకుంది. కార్యక్రమానికుపక్రమించింది.


కోసిన బొడ్డు పైసదిమి గోర విభూతిని బోరుకొడగం గాసరిదంబు పాదయుగు గంధిసుతాహృదయేశు స్వామి నిం జేసిరి బోరుకాడగనుజేసిరి క్షీర సముఏద్ర శాయిము క్తీశుడు ముక్తి గబ్బు విడయింపగరానినుదింపులొందగన్ తామర తూడును గోటిలో విరిచినంత నేర్పుగా మంత్రసాని బొడ్డుకోసింది. ఆయన సాక్షాత్తూ విష్ణుమూర్తి. ఆయన బొడ్డునుండే తామరలో బ్రహ్మ ఆసీనుడై ఉంటాడు. బొడ్డు కోయగానే చీమ కుట్టినట్టనిపించింది బ్రహ్మకు. విష్ణువు భూలోకంలో అవతరించినట్టు తన మనోనేత్రంతో తెలుసుకున్నాడు. ఆ వెంటనే పరిచారికలు బోరువాడ అంటే స్నానం చేయించారు.


శ్రీరామ జననంతో ఆకాశం నుంచి పూలవాన కురిసింది. ఇక్ష్వాకు కులతిలకుని జనన వార్త విన్న ఆయోధ్య పురవాసులే కాకుండా కోసల రాజ్యమంతా ఆఘమేఘాల మీద ఈ విషయం చేరిపోయింది. వార్త విన్న వారంతా ఉప్పొంగిపోయేరు.


ఆ నాటి నుంచి దశరథుని చూపు ఆకాశం వైపే. షోడష కళాపూర్ణుడైన చంద్రుణ్ణి తన బిడ్డలో చూసుకుంటూ ఉబ్బితబ్బిబ్బయ్యేవాడు. ఆకాశంలో చంద్రబింబం, ఒడిలో పాపడు. వీరిరువురిలో అందగాడెవరు? పురుషోత్తముని కంటె జగత్తులో అందగాడెవరుంటారు? అని తనకు తానే సమాధానం చెప్పుకుని పరవశించేవాడు.


దశరథ నందనునికి నామకరణం చేయడానికి కుల గురువు వశిష్ఠునితో పాటు ఋష్యశృంగాది మునులు కూడా విచ్చేశారు. సూర్యకాంతిలో మరుగును పడిన చంద్రుడు అంతరంగంలో మధనపడుతున్నాడు.


వశిష్ఠుడు పళ్ళెం నిండా బియ్యంపోసి దశరథుని ఒడిలో పెట్టి రత్న అంగుళీయకాన్ని ఇచ్చేడు. తన తపశక్తితో దశరథుని అంతరంగాన్ని తెలుసుకున్న కులగురువు దశరథుని చేత 'శ్రీరామచంద్రుడు' అన్న నామాన్ని రాయించేడు. దశరథుని కంటె ముందుగానే ఆ పేరును ప్రకటించాడు. దశరథుని ఆనందానికి అవధుల్లేవు. సూర్య కాంతి మరుగును ఉన్న చంద్రుని అంతరంగ ఆనందం హద్దులు దాటిపోయింది. పురుషోత్తముడైన శ్రీరామునితో కలిసి శ్రీరామచంద్రునిగా అవనిలో పూజింపబడనుండడమే అందుకు కారణం. ఆలస్యంగా నామకరణోత్సవానికి వచ్చిన మంత్రి సుమంతుడు మహారాజు రాసిన అక్షరాలను 'శ్రీరామ భద్రుడు'గా చదివాడు. అది కూడా సార్థక నామధేయమే అయింది. తల్లిదండ్రులకు రామచంద్రుడు, తతిమ్మా వారికి రామభద్రుడుగా ఇతిహాసంలో నిలిచిపోయేడు.


నామకరణోత్సవంలో సుమిత్రానందనులకు లక్ష్మణ శత్రుఘ్నులనీ, కైకేయి సుతునికి భరతుడని కులగురువు నామకరణం చేశాడు. అనంతరం శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులకు మంగళహారుతిలిచ్చి ఊయలలో పరుండబెట్టారు. పెద్ద ముతైదువులు అందరూ కలసి శ్రీరామా లాలీ...మేఘశ్యామా లాలీ అంటూ లాలిపాటలు ముక్తకంఠంతో పాడారు.


మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే

చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం


*🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*

                   _ఆధ్యాత్మికం ఆనందం_

సప్త చిరంజీవులు

 *🙏🌹🙏సప్త చిరంజీవులు 🙏🌹🙏*


 *🙏🚩1. అశ్వత్థామ :-* 


🙏🚩ద్రోణాచార్యుని కుమారుడు.

మహాభారత యుద్ధం అనంతరం మిగిలిన దుర్యోధనుని పక్షపు వీరులలో ఒకడు..


 *🙏🚩2. బలిచక్రవర్తి :-* 


 🙏🚩ప్రహలాదుని కుమారుడైన విరోచనుని కుమారుడు.ఇంద్రుని జయించినవాడు.


🙏🚩వామనమూర్తికి మూడడుగుల భూమిని దానం చేసి, అతనిచే పాతాళమునకు త్రోక్కబడ్డాడు. కానీ ఇతని సత్య సంధతకు మెచ్చుకున్న వామనుడు గదాదారిగా ఇతని వాకిటికి కావాలి కాచేవాడు..


 *🙏🚩3. వ్వాసమహర్షి :-* 


🙏🚩సత్యవతీ పరాసరుల కుమారుడు. కృష్ణ ద్వాయపాయనముని అని పిలవబదేవాడు. అస్తాదాస పురాణాలను, బ్రహ్మసూత్రములను, భారత భాగవతములను మరియు అనేక తత్వ గ్రంధములను రచించాడు. వేదాలను విడబరచిన వారు అని వ్యాసుడుని పేర్కొంటారు..


 *🙏🚩4. హనుమంతుడు :-* 


🙏🚩 కేసరి భార్య అయిన అంజన పుత్రుడే హనుమంతుడు. భర్త ఆజ్ఞా ప్రకారం వాయుదేవుని కొలిచిన అంజనాదేవికి వాయుదేవుడు ప్రత్యక్షమై తన గర్భంలో శివుని శక్తిని ఆమెకు వరముగా ఇవ్వగా అంజనా గర్భమున హనుమంతుడు పుట్టాడు. సూర్యుని శిష్యుడు ఈ రామ భక్తుడు. పరమేశ్వరుని అవతారము. రావణాది రాక్షసులను ఎదిరించి, సీత ఉనికిని తెలుసుకొని లంకేస్వరుని హతమార్చతంలో శ్రీ రామునికి ఎనలేని సేవ చేసిన మహాభక్తుడు హనుమ. మహా భారతయుద్ధంలో అర్జునిని ధ్వజమున వెలసి పాండవుల విజయానికు కూడా దోహదకారి అయ్యాడు.


 *🙏🚩5. విభీషణుడు :-* 


🙏🚩 కైకసికిని విస్వబ్రహ్మకు కలిగిన మూడవ కుమారుడు. బ్రహ్మపరమున ఇతడు సుశీలుడైయ్యాడు. ఈయన భార్య పరమ అనే గాంధర్వ స్త్రీ. రావణుని దుర్మార్గాలను నిర్భీతిగా విమర్శించి, సన్మార్గము గూర్చి చెప్పేవాడు. సముద్రము దాటుటకు , రావణుని హతమార్చుటకు శ్రీ రామునికి ఉపాయము చెప్పాడు.రావణుని అనంతరం లంకాధిపతి అయ్యాడు..


 *🙏🚩6. కృపాచార్యుడు:-* 


 🙏🚩సప్త చిరంజీవులలో 6వ వాడు . కృపుడు శరద్వంతుని కుమారుడు.. శరద్వంతుడు ధనుర్వేదమును పొంది తపస్సు చేసుకునేవాడు.

ఇంద్రుడు ఇతని తపస్సును భగ్నము చేయుటకై ఒక అప్సరసను పంపాడు. ఆమెను చూడగానే ఇతడు కామ పరవశుడై ఆ చోటును వొదిలి వేరే చోటుకు వెళ్ళాడు. 


🙏🚩ఆ సమయమున కల్గిన కుమారుడు కృపుడు. కృపుడు శరద్వంత దగ్గర ధనుర్వేదమును నేర్చుకున్నాడు. భీష్ముని కోర్కె మన్నించి ధనుర్విద్యను నేర్పాడు. మహాభారత యుద్ధం లో దుర్యోధనుని పక్షమున నిలిచి యుద్ధం చేశాడు. యుద్ధం అనంతరం జీవించిన వీరులలో కృపుడు ఒకడు.


 *🙏🚩7. పరశురాముడు:-* 


 🙏🚩రేణుకా జమదగ్నుల కుమారుడు. జమదగ్నికి తాత బృగు మహర్షి ఉపదేశంతో హిమాలయాలకు వెళ్లి శివుని గూర్చి తపస్సు చేశాడు. ఈశ్వరుడు బోయవాని వేషమున వచ్చి పరశురాముని పరీక్షించాడు. శివుని ఆఙ్ఞతో తీర్ధయాత్రలు చేశాడు.శివ అనుగ్రహముతో భార్ఘవాస్త్రమును పొందాడు...

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

సమున్నతమైన ఆలోచనా విధానం

 🌹🌷🪷🪔🛕🪔🌷🪷🌹

   *🍁దయచేసి అందరూ* 

      *పూర్తిగా, చివరి వరకు*

          *చదువ గలరు🙏*


*🚩IIజై పవన పుత్ర హనుమాన్II🚩*


  *🍁హనుమంతుడు🍁*

*వ్యక్తిత్వ వికాస పాఠాలు!*                           

                   

 రచన: *రాయపెద్ది అప్పాశేషశాస్త్రి*

రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఆదోని ఆర్ట్స్ కాలేజి, ఆదోని. 


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


సమున్నతమైన ఆలోచనా విధానం, అసాధ్యాన్ని సుసాధ్యంచేసే తెగువ, అసాధారణ కార్యకుశలత, భయాన్నీ, నిరాశనూ, నిస్పృహనూ దరిచేరనివ్వని ధీశక్తి వీటన్నిటి కలపోత ఉత్తమవ్యక్తిత్వం అవుతుంది. ఈ లక్షణాలకు తోడు ఎదుటివారిని ప్రభావితంచేయకలిగే వాక్పటుత్వం జతగాచేరితే ఆవ్యక్తి సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. బుద్ధిబలం, కీర్తిని సాధించాలన్న తపన, ధైర్యం, భయరాహిత్యం, వాక్చాతుర్యం, ఆరోగ్యంతో కూడిన బలిష్టమైన శరీరం వంటివి మనం కోరదగిన వ్యక్తిత్వంలోని అంశాలు. మన పురాణసాహిత్యాన్ని పరిశీలించి చూసినపుడు ఈగుణాలలో కొన్ని కొన్ని కొంతమందిలో కనపడవచ్చు. కానీ ఈ లక్షణాలన్నీ ఒక్కరిలోనే సందర్శించగలమా అని ఆలోచిస్తే *హనుమంతుడొక్కడే అట్టివ్యక్తి కానవస్తాడు*.


జీవితంలో మనకు ప్రధానమైన శత్రువు భయం. *మతంగ మహర్షి శాపం వల్ల వాలి ఋష్యమూక పర్వతము మీదకు రాలేడని సుగ్రీవునికి తెలుసు. ఐనా ధనుర్బాణాలు, కత్తులు ధరించి, ఋషి వేషంలో ఉన్న బలిష్టులైన రామలక్ష్మణులను ఋష్యమూక పర్వత శిఖరముల మీద నుండి సుగ్రీవుడు చూసి భయంతో గడ్డ కట్టుకుపోయాడు.* అప్పుడే తొలిసారి మనకు *హనుమ రామాయణంలో దర్శనమిస్తాడు.* సుగ్రీవునికి ధైర్యం చెప్పేప్రయత్నం చేస్తాడు. ఈ రకంగా చూస్తే హనుమ తొలి దర్శనంలోనే సుగ్రీవునికే కాదు మనకు కూడా నిర్భయత్వాన్ని అలవరచుకొమ్మన్న పాఠం  చెప్పే గురువు. హనుమ సుగ్రీవునితో చెప్పే మాటలు గమనించండి. “సుగ్రీవా! ఎందుకయ్యా ఇలా శిఖరముల మీద ఎగురుతున్నావు, ఇక్కడికి వాలి రాడు కదా. వాలికి ఉన్న శాపం వలన ఈ పర్వతం మీదకి వస్తే మరణిస్తాడు. నీకు కనపడినవాడు వాలి కాదు, మరి ఎందుకీ గెంతులు. నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి, ఎవరో ఇద్దరిని చూసి నిన్ను చంపడానికే వచ్చారని అనుకొని గెంతులు వేశావు. ఏమిటయ్యా ఈ చపలత్వం. నడక చేత,అవయవముల కదలిక చేత, మాట చేత, అవతలివారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనస్సులలో ఏ భావన ఉన్నదో కనిపెట్టి, దానికి అనుగుణంగా నడిచి, తనని, తన ప్రజలని రక్షించుకోగల సమర్ధత ఎవడికి ఉన్నదో వాడు రాజు. అంతేకాని కనపడ్డ ప్రతివాడిని చూసి ఇలా పారిపోతే, నువ్వు రేపు రాచపదవి ఎలా నిర్వహిస్తావు?” ఈ విధంగా హనుమ తొలి సారిగా కనిపించగానే నిర్భీకతను బోధించే గురువుగా దర్శనమిస్తాడు. 



ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు, ఉద్యోగజీవితంలో, వ్యక్తిగత జీవితాలలో సందర్భోచిత వేష ధారణ అవసరమని చెపుతూ ఉంటాం. సందర్భోచిత వేషధారణ హనుమను చూసే నేర్చుకోవాలి. సుగ్రీవుని కోరిక మేరకు రామలక్ష్మణులతో మాట్లాడ్డానికి వెళ్ళేముందు కపివేషంలో కాక భిక్షువు వేషంలో వెళతాడు. వచ్చినవారు ఎవరు, ఎలాంటి వారు అన్న విషయం తెలిసిన తర్వాతనే నిజరూపం ధరిస్తాడు. మనం రూపాలు మార్చలేకపోయినా వస్త్రధారణనైనా సందర్భోచితంగా మార్చుకోగలం గదా!

తాను స్వతహాగా అత్యంత శక్తివంతుడైనా వ్యక్తి గొప్పతనంకంటే  ధర్మం గొప్పది అని నమ్మిన వాడు గనకనే *అధర్మపరుడైన వాలితో కాక సుగ్రీవుని తోనే వుంటాడు ఆంజనేయుడు.*


లాయల్టీ అని మనమీనాడు పదే పదే చెపుతూ ఉంటామో ఆ ధర్మాన్ని హనుమంతుడిదగ్గర నేర్చుకోవాలి. అలాగే రాముని సేవకు అంకితమైన తర్వాత రామునికి అత్యంత సమర్థుడైన అనుచరుడుగా, రామదూతగా వాసికెక్కుతాడు.


సమయోచిత వేషధారణ మాత్రమే కాదు సమయోచితంగా సంభాషించగలిగే సామర్థ్యాన్ని గురించి కూడా వ్యక్తిత్వ వికాస తరగతుల్లో బోధిస్తూ ఉంటాము.


సమయోచిత సంభాషణా చాతుర్యం హనుమకు వెన్నతో పెట్టినవిద్య. అతను మాట్లడిన నాలుగు మాటలకే మురిసి పోతాడు తానే పెద్ద వాగ్విశారదుడైన శ్రీరామచంద్రుడు.     


హనుమంతుని సంభాషణా చాతుర్యాన్ని గురించి రాముడేమంటున్నాడో చూడండి. *“చూశావా లక్ష్మణా, హనుమ ఎలా మాట్లాడాడో. ఆయన మాటలు విన్నావా. ఇలాగ మాట్లాడేవాడు మంత్రిగా దొరికితే కార్యాలు ఎందుకు నెరవేరవు!      ఇలా మాట్లాడేవాడు ఎదురుగా వచ్చి నిలబడితే, కత్తి పట్టి ప్రాణం తీసేద్దాము అనుకున్న వ్యక్తి కూడా కత్తిని ఒరలో పెట్టేస్తాడు. ఇటువంటి వ్యక్తి మంత్రిగా కలిగిన ఆ రాజు ఎంత అదృష్టవంతుడు.*

 

*ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడలేడు. అన్నిటినీ మించి ఈయన వ్యాకరణాన్ని చాలాసార్లు చదువుకున్నాడు. ఈయనికి ఉపనిషత్తుల అర్ధం పూర్తిగా తెలుసు. అందుకనే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమలు నిష్కారణంగా కదలడంలేదు, లలాటము కదలడం లేదు. వాక్యము లోపలినుంచి పైకి వచ్చేటప్పుడు గొణుగుతున్నట్టు లేదు, గట్టిగా లేదు. ఈయన మాటలు ప్రారంభించిన దెగ్గరి నుంచి చివరి వరకూ ఒకే స్వరంతో పూర్తి చేస్తున్నారు. కాళ్ళు, చేతులు, శరీరాన్ని కదపడం లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంతవరకు ఉచ్చరించాలో అలా పలుకుతున్నారు*. ఇటువంటి వ్యక్తి సుగ్రీవుడికి సచివుడిగా దొరికి, మన దగ్గరికి వచ్చి సుగ్రీవుడితో స్నేహం కలపాలని కోరుకుంటున్నాడు". సంభాషణా చాతుర్యం అంటే ఊరకే మాట్లాడుతూ వెళ్ళడం కాదు. అవసరమైనపుడు అతి స్వల్పంగా, ముక్కుకుసూటిగా, క్లుప్తంగా, ప్రధానవిషయాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడటం కూడా రావాలి. 


*లంకనుంచి తిరిగి వచ్చినతరువాత దూరంనించే  "దృష్టా సీతా"  అని ఒక్క మాటలో తన కార్యం విజయవంతమైనదన్న విషయాన్ని సూచించి ఆ తరువాత మిగతా విశేషాలను వివరిస్తాడు.*


అలాకాకుండా మైనాకుడూ, సరమా, సింహికా, లంఖిణీ అని నస మొదలు పెడితే వినేవాళ్ళాకు బీ.పీ. పెరిగిపోవడం ఖాయం. 


*అలాగే లంకలో సీత దగ్గిర అకస్మాత్తుగా  ఊడిపడి గాభరా పెట్టకుండా కొమ్మమీదకూర్చుని మొదట రామకథను వినిపించి, ఆమెను తగిన మానసిక స్థితికి తేవడంలో హనుమంతుని నేర్పు కనిపిస్తుంది.   అదీ మాట తీరు అంటే. ఇదీ మనం నేర్చుకోవాలి హనుమన్న దగ్గర.*


ఎలాంటి వారికైనా సహజంగానే పరిస్థితులప్రాబల్యం వల్ల ఒక్కొక్కసారి దారుణమైన ఆవేదన, గ్లాని కలుగుతూ ఉంటాయి గానీ అలాంటి సందర్భాలలో కూడా వెంటనే తేరుకోగలిగి,  నిర్వేదం నుంచి తక్షణమే బయటపడగలిగితేనే ఏదైనా సాధించగలం. 


బలహీన క్షణాల్లో ఒక్కొక్క సారి ఎంత అసాధారణ ప్రజ్ఞావంతులకు కూడా ఒక్క క్షణం పాటు "ఆత్మ హత్యతో ఈ బాధకంతా భరతవాక్యం పాడదామా" అని అనిపించవచ్చు కూడా. కానీ అలాంటీ సందర్భాలలోనైనా వెంటనే తేరుకోగలగడం నిజమైన ధీశాలి లక్షణం. 


ఈ గుణాలన్నీ అలవరచుకోవడానికి 

*మనకు గురుస్థానంలో నిలిచే నిలువెత్తు ఉదాహరణ హనుమంతుడు.*


లంకానగరమంతావెదికి సీత జాడ కానరాక హనుమంతుడు అదేస్థితికి చేరుకొంటాడు. సీత కనపడకుండా నేను తిరిగి వెళితే రామలక్ష్మణ, భరతశతృఘ్నులు, సుగ్రీవుడు, ఇతర వానర జాతి మొత్తం అంతరించి పోయే ప్రమాదము ఉన్నది కనుక నేను అసలు వెనక్కి వెళ్ళను. సీతమ్మ జాడ దొరికేవరకు వానప్రస్థుడిలా ఉంటాను, లేదా అగ్నిలోకి ప్రవేశిస్తాను, లేదా నీటిలోకి ప్రవేశించి శరీరాన్ని వదిలేస్తాను" అనుకున్నాడు. 


*కాని ఆయన వెంటనే "ఛీ! మరణించడం ఏమిటి, ఆత్మహత్య మహా పాపం. జీవించి వుంటేనే సుఖాలను పొందగలం. కనుక మళ్ళీ ఉత్సాహాన్ని పొంది వెతుకుతాను.  ఎవడు శోకమునకు లొంగిపోడో, ఎవడు నిరంతరము ఉత్సాహముతొ ఉంటాడో, వాడు మాత్రమే కార్యాన్ని సాధించగలడు. అందుకని నేను శోకమునకు లొంగను, మళ్ళి సీతమ్మని అన్వేషిస్తాను, మళ్ళి ఈ లంకా పట్టణం అంతా వెతికేస్తాను " అని ఉత్సాహాన్ని పొంది లంకా పట్టణం అంతా వెతికే పనిలో పడతాడు*


ఇదే సామాన్యులకూ, ధీశాలికీ మధ్య గల తేడా. హనుమ తన జీవితాన్నే ఉదాహరణగ చూపి   మనకు ఈ గుణాన్నే నేర్పుతున్నాడు. 


నేను చేపట్టిన కార్యం అసాధ్యమేమో అని భయపడుతూ ఉండిపోతే ఏ కార్యం కూడా సాధ్యం కాదు... ఉదాహరణకు హనుమన్నకు అప్పగించిన పనినే తీసుకోండి . సీతను అతను ఇంతవరకూ చూడలేదు. ఆమె ఎలాఉంటుందో తెలియదు. ఆమెను ఎత్తికెళ్ళింది ఎవరో తెలియదు ఎక్కడ దాచి ఉంచాడో తెలియదు. ఐనా నెల రోజులలో ఆమె ఆచూకీ తెలుసుకొని వస్తానని బయలుదేరతాడు హనుమంతుడు. మిగతా మూడు దిక్కులకు వెళ్ళిన వారూ, దక్షిణానికే బయలుదేరిన మిగతా వారూ ఉన్నారు కదా మరి ఈ పనిని హనుమంతునికి అప్పగించినట్లు ఎలా అవుతుంది అన్న సందేహం వస్తుంది. 


మనం గమనించవలసిన విషయం ఏమిటంటే రాముడు తన ఉంగరాన్ని ఆనవాలుగా హనుమకు ఇవ్వడాన్ని బట్టే ఈ పనిని హనుమకు అప్పగించినట్లు తెలియడం లేదూ? కనుక చాలెంజిలను స్వీకరించి సమర్థంగా ఎదుర్కొని విజయవంతంగా బయటపడటమెలాగో అన్న అంశాన్ని  నేర్చుకోవడానికి హనుమన్న జీవితమే మనకు ఒక పెద్ద పాఠ్యపుస్తకం.


సముద్ర తీరానికి చేరుకొన్నప్పుడు హనుమన్న ప్రవర్తన చూచి వినయమంటే ఏమిటో, అన్నీ ఉన్నా ఒదిగి ఉండటమంటే ఏమిటో నేచుకోవాలి. సముద్రాన్ని దాటి లంకను చేరే పని నువ్వే చేయగలవని అందరూ కలిసి అడిగేటంతవరకూ తానుగా నా బలమింతటిది అనీ, ఈ పని నేను చేయగలను అనీ ఎగిసి ఎగిసి పడలేదు. *శ్రేయాంసి బహు విఘ్నాని* అని ఉత్తమ కార్యంలో అనేక విఘ్నాలు ఎదురు అవుతూనే ఉంటాయి. అవాంతరాలను ఎదుర్కొని కార్య సాధన చేయడమెలాగో, తొనకకుండా బెణకకుండా కార్యాన్ని చక్కపెట్టడమెలాగో హనుమనే మనకు చేసి చూపించాడు. మైనాకుడు అనే పర్వతం ఆదరించి ఆతిథ్యం స్వీకరించి పొమ్మని అడగటం, దాన్ని సున్నితంగా తిరస్కరించి ముందుకు సాగటం సానుకూలగా కనిపించే విఘ్నాలను ఎలాగ ఎదుర్కోవాలో నేర్పుతాయి. 


భుజబలాన్నీ, బుద్ధి బలాన్నీ ఉపయోగించి విఘ్నాలను గట్టెక్కడం ఎలాగో సింహికను జయించడంలోనూ, సరమ నోటి లోనికి ప్రవేశించి బయటకు రావడంలోనూ చూపుతాడు.


కష్టాల్లో ఉన్న వాళ్ళను ఓదార్చడంకూడా ఒక గొప్ప కళ. అశోకవనంలో సీతతో మాట్లాడుతున్నప్ప్పుడు చూడాలి హనుమ చాతుర్యం. *"అమ్మా,  వానరసైన్యంలో నాకన్నా తక్కువ వాళ్ళెవరు లేరు, నాతో సమానమైనవారూ, నన్ను మించినవారూ ఎందరో ఉన్నారు. రాముడు వానరసైన్యంతో రావణుని సునాయాసంగా జయించగలడు. కనుక నీవు నిర్భయంగా ఉండమ్మా"* అన్న ఇటువంటి పలుకులు ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్న వారికైనా ఎంత సాంత్వన కలిగించ గలుగుతాయో చూడండి. 


హనుమను మించిన వారు ఎవరున్నారు వానరసైన్యంలో, ఐనా సమయోచితంగా మాట్లాడిన హనుమన్న మాటలు సీతకు ఎంత ఓదార్పు కలిగించి ఉంటాయో! ఇదీ మనము హనుమన్న దగ్గర నేర్చుకోవాల్సిన చాతుర్యం. 


ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని హనుమయ్య దగ్గర నేర్చుకోవాలి. అంతిమవిజయానికి ఉపయోగ పడుతుందనుకొంటే, కార్యసాధనలో         అవసరమైతే చొరవతీసుకొని స్వతంత్ర నిర్ణయాలను కూడా తీసుకోగలిగి ఉండాలి సమర్థుడైన కార్య సాధకుడు. 


సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు, లంకా దహనం చేయమనీ, రాక్షస సంహారం చేయమనీ, రాముడు ఆయనతో చెప్పలేదు. కానీ రామదూతనైన తనే ఇంత విధ్వంసాన్ని సృష్టించగలిగితే కపిసైన్యంతో రాముడు వస్తే ఎంత రాముడి ముందు తాను నిలవగలనా అన్న అనుమానాలను రావణునిలో రేకెత్తించడం అనే ప్రయత్నం చేయడం హనుమ తీసుకొన్న స్వతంత్ర నిర్ణయం. 


అక్కడికక్కడ,  ఆన్ ది స్పాట్ నిర్ణయ్యాలను తీసుకోగలగాలి ఒక సమర్థుడైన కార్య సాధకుడు. 


ఇలా హనుమంతుని దగ్గర మనమెన్నో వ్యక్తిత్వవికాసలక్షణాలనూ, సకారాత్మక ఆలోచనావిధానాన్నీ, మేనేజ్మెంట్ స్కిల్స్ అని చెప్పుకొనే యాజమాన్య కౌశలాన్నీ ఎంతైనా నేర్చుకోవచ్చు, నేర్చుకోవాలి కూడా. మనకు ఆదర్శవ్యక్తిగా, రోల్ మాడెల్ గా తీసుకోదగిన వ్యక్తి హనుమ.


*భక్తి ప్రపంచం బృందంలో,* ఒక *అధ్యాపకులు* ఎంతో *భక్తి పారవశ్యంతో* వ్రాసిన పలుకులు......


*🍁నేనుగా మీకు భాగస్వామ్యం చేస్తున్నందునకు ధన్యుడను*🙏


*న్యాయపతి నరసింహారావు*

కోసలేంద్రుడుపెక్కుకోర్కెలుదీర్చుచు

 కోసలేంద్రుడుపెక్కుకోర్కెలుదీర్చుచు

   పలువిధాలుమిముగాపాడుగాక

దశరథాత్మజుడుసదాక్షేమమునిడుచు

         మంచినిపంచిరక్షించుగాక

జానకీపతియెల్లజయములనిచ్చుచు

       పేరుప్రతిష్టలు పెంచుగాక

రావణసంహారిరాగముతోడను

శీఘ్రమేసాయమ్ముసేయుగాక


లక్ష్మణాగ్రజుడెల్లగౌరవములిచ్చి

ఆంజనేయునిదైవముహాయినిచ్చి

శంకరప్రియుడానందసంపదిచ్చి

యిష్టములుతీర్చిసుఖములనిచ్చుగాక

       తపస్వివిజయవాడ (పంతుల వేంకటేశ్వర రావు)9908344249

💐💐💐

రాముడంటే రాముడే

 


శ్రీభారత్ వీక్షకులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🌹 రాముడంటే రాముడే.. ఆయనకు సాటి ఆయనే. అందుకే ' రామో విగ్రహవాన్ ధర్మః' అంటారు. పుత్ర ధర్మం, మిత్ర ధర్మం, పతి ధర్మం, చివరికి శత్రు ధర్మం.. అన్నిటికీ శ్రీరాముడే. ఆ విశేషాలన్నీ కళ్లకు కట్టినట్లు వివరించారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

బ్రహ్మ సత్యం

 🙏వేదాంత వ్యాసం🙏

"బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, 

జీవో బ్రహ్మైవ న పరాః"


బ్రహ్మ అంటే అంతిమ వాస్తవికత, సర్వోన్నత దేవుడు

పురాణాలలో బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ. ఆయనే సృష్టికర్త. మరి ప్రకృతిని కూడా బ్రహ్మ అంటారు. వేదాన్ని, యజ్ఞాన్ని బ్రహ్మ అంటారు. ప్రణవాన్ని బ్రహ్మము అంటారు. ఇవికాక ఉపాధులే లేని నిరాకార పరమాత్మను కూడా బ్రహ్మము అంటారు.

 అన్నింటికన్నా పూర్వమైనది, మొదటగా ఉన్నది, రెండు కానిది, ఏకైకమైనది అయిన బ్రహ్మం తన ఏకైక తత్త్వం అనేకం కావాలని సంకల్పించింది. అదే రకరకాల వస్తువులుగా చిత్ర విచిత్ర సమ్మేళనాలతో రూపుదాల్చింది. ద్రవపదార్థాలు, ఘనపదార్థాలు, వాయుపదార్థాలు ఇలా ఎన్నో రకాలుగా మార్పులు చెంది, చిన్నచిన్న రూపాలతో ఈ సృష్టి ఆకారాన్ని పొందింది. జీవరాశులు ఉత్పన్నం అయినాయి. ఆదిలో ఉన్న ఒక్కదానిలో నుంచే ఈ అన్నీ ఉద్భవించాయన్నమాట 

 వ్యష్టిపరంగా చైతన్యాన్ని ఆత్మ అంటే, సమిష్టిపరంగా అదే చైతన్యాన్ని బ్రహ్మము అంటారు. రెండూ ఒకటే. మరి రెండు పేర్లు ఎందుకు అంటే? కారణం వాటి స్థానం. వ్యష్టి స్థాయిలో ఆత్మ, సమిష్టి స్థాయిలో బ్రహ్మము (ఈ సమిష్టి చైతన్యాన్నే పరమాత్మ అని కూడా అంటారు). వాటి అర్ధాలు కూడా ఇంచుమించు ఒకటే. ఆత్మ అంటే ఆప్నోతి సర్వం ఇతి ఆత్మ - సర్వాత్మకమైన ఎల్లలు లేని వస్తువు. బ్రహ్మము అంటే అనంతం - బృహ్ నుంచి వచ్చింది. బృహ్ అంటే పెద్దది. పూర్తిగా పెద్దది.

“బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి”-బ్రహ్మమును ఎవరు అనుభవించాడో వాడే బ్రహ్మము అవుతాడు. పరబ్రహ్మమును అనుభవించిన కారణం చేత ఆయనే పరబ్రహ్మము. అందుకే “గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః! గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః!!”-గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనబడే మూడు రూపములు పొందినటువంటి వాడై ఉంటాడు. అటువంటి గురువు జ్ఞానమును పొందినప్పటికీ, సమున్నతమైన స్థాయిలో నిలబడినప్పటికీ సామాన్యమైన లోకులు శాస్త్రాన్ని ఎలా ఆచరిస్తారో అలా ఆయన కూడా ఆచరించాలని నియమం లేదు. ఆయన అలా ఆచరించలేదు కాబట్టి ఆయన స్థాయి తక్కువైంది అని చెప్పడం సాధ్యంకాదు. భగవాన్ రమణులు మహా పురుషులు. వారు బ్రహ్మముయొక్క స్థాయిని చేరిపోయినవారు. అంతటి అద్వైతానుభూతియందు ఓలలాడుతూ ఉండేవారు. శరీరాన్ని చూపించి ఎప్పుడూ ఇది అని వేలు చూపించి తను సాక్షిగా ఉండేవారు. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి, గురుస్వరూపుడైన రమణమహర్షి సంధ్యావందనం చేయాలనీ, యజ్ఞోపవీతం వేసుకోవాలనీ, గోచీపోసి పంచె కట్టుకోవాలనీ, వేదం ఎలా చెప్పిందో అలా ఆయన ప్రవర్తించాలనీ, అలా ఆయన ప్రవర్తించకపోతే దోషం వస్తుందనీ, చెప్పడం సాధ్యం కాదు.అది అగ్నిహోత్రం వంటిది. ఆస్థాయికి చేరినటువంటి మహాపురుషులు కర్మాచరణను శాస్త్రీయంగా చేశారా? చేయలేదా? అన్న విషయంతో సంబంధం ఉండదు. వారు ఎప్పుడూ జ్ఞానమునందు ఓలలాడుతూ ఉంటారు. జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చేయకూడదు. అజ్ఞానిని ఎప్పుడూ అనుకరించకూడదు. అనుకరణవల్ల మహాత్ముల స్థాయిని చేరలేరు. పరమభక్తితో కర్మాచరణము చేయగా చేయగా అనుగ్రహించిన భగవంతుని కారుణ్యమే ఒకనాడు జ్ఞానము కలగడానికి అవకాశం ఇస్తుంది. ఒకసారి జ్ఞానము కలిగిన తరువాత అదే మోక్షమునకు హేతువు. జ్ఞాని శరీరముతో ఉన్నప్పటికీ నేను ఆత్మ అని దానియందు రూఢియై అద్వైతానుభూతియందు ఓలలాడుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తి శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా చూస్తాడు శరీరాన్ని. శరీరంతో తాదాత్మ్యత పొందడు. అందుకే అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారో ఎలా వైదికమైనటువంటి ప్రవర్తనకు కట్టుబడుతున్నారో అలా కట్టుబడాలి అని భావించడం పొరపాటు. గురువుయొక్క లీల, మాట పరమశక్తివంతములు. గురువు లోకోద్ధరణకొరకే నోరువిప్పుతాడు. గురువుయొక్క సహజస్థితి మౌనం. భగవాన్ రమణులకు అందుకే మౌనయోగి అని పేరు. అలా మౌనంగా ఉండి పరబ్రహ్మముగా అనుభవములో ఎప్పుడూ రమిస్తూ ఉంటారు. అటువంటి స్థాయి పొందిన మహాపురుషులు.


"బ్రహ్మము నిరాకార చైతన్యము. ఆకారము లేకపోవడంతో దానికి భౌతిక, రసాయనిక లక్షణాలు కూడా వుండవు. అది నిర్గుణం, ఎలాంటి గుణాలు వుండవు. కాలానికి, ప్రదేశానికి అతీతమైనది కాబట్టి దానికి మార్పు లేదు. ఒక ప్రదేశానికి అంకితమవలేదు కాబట్టి ఈ చైతన్యం నిర్వికల్పం. దానికి విభజన లేదు."

అద్వైతానికి ఆధారముగా శంకరాది వ్యాఖ్యాతలు చెప్పారు.

"బ్రహ్మ సత్యం జగన్మిథ్యా, జీవో బ్రహ్మైవ న పరాః" కు 

ఇది ప్రమాణం. 

సహజంగా ద్వైతులు ఇంకొక విధముగా వ్యాఖ్యానించారు. 

ఇది భగవంతుని వాక్కు. ప్రమాణంగా తీసుకోవలసినది. కనుపించే ప్రపంచం, చూస్తున్న మనం అసత్యంగానూ, కనుపించని ఆత్మ సత్యంగానూ అర్థమవడానికి మనస్సు, బుద్ధి లగ్నం కావాలి. 

ఆమాటకు వస్తే చెప్పిన కృష్ణుడూ లేడు, విన్న అర్జునుడూ లేడు, చెప్పబడిన గీతా, దాని అర్థము శాశ్వతమా? అని వితండవాదం చేయవచ్చు. కాని సమాధానం మన వాదములోనే ఉన్నది. అందుకే 5000 సంవత్సరాల తరువాత మనము ఇంకా గీత చెప్పుకుంటున్నాము.

.

ఇది లౌకిక శాస్త్రాలలోనూ నిజమే. న్యూటన్, ఐన్స్టీన్ లేరు. వారి భౌతిక శాస్త్రాలు నేటికీ ఉపయోగంలో ఉన్నాయి

అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్

వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి

.

ఓఅర్జునా! ఈ సర్వము (ఈప్రపంచమంతయు) ఏ పరమాత్మచేత వ్యాపింపబడిఉన్నదో, అది నాశరహితమని ఎరుంగుము. అవ్యయమగు అట్టి ఆత్మకు ఎవరూను వినాశము కలిగింపలేరు. 

ఈ సృష్టికి (ప్రపంచమంతకు) ఆధారభూతమైన వస్తువు ఒకటి ఉన్నది. అది మనకు కనబడటములేదు. అందుకే భగవంతుడు మనకు చెబుతున్నాడు. దానినే పరమాత్మ వస్తువు అని మనం అన్నాము. 

వైజ్ఞానికులు దానినే గురుత్వాకర్షణ క్షేత్రము అనవచ్చును

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

ఆకలి నడిపించినంత కాలం

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🔥 *మనిషిని ఆకలి నడిపించినంత కాలం ఏ రోగము దరి చేరదు .. ఆశ నడిపించడం మొదలు పెట్టాకే అన్ని రోగాలు రావడం మొదలపెడతాయి..నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంత ఎత్తుకు తీసుకు వెళుతుందో, నేనే అనే అహంకారం అనిషిని అంతంగా దిగజారుస్తుంది* 🔥మన అంతరంగంలో భావాల్ని వైకరిని మార్చుకోవడం ద్వారా మన జీవితాన్నే మలుపు తిప్పుకోవచ్చు.. మనశాంతిని కోరుకుంటే ఇతరుల దోషాలను ఎంచకు.. ముందు నీలో ఉన్న దోషాలను చూసుకో🔥అధికారం, సంపద ఉందని పొగరుగా ఉండకు.. అవి కొంతకాలమే..నీ సొంతం అనుకునే దేహమే సమయం వస్తే నిన్ను వదిలేస్తుంది.. అధికారము, సంపద ఒకలెక్క.. రాత్రికి రాజు చంద్రుడు.. పగటికి రాజు భానుడు.. ఒక్కరోజే ఒకరిది కనప్పుడు అన్ని రోజులు మనవి ఎలా అవుతాయి.. మనది కాని రోజు మౌనంగా ఉండాలి.. మనదైన రోజు వినయంగా ఉండాలి🔥జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతుడివి అవుతావు.. వయస్సు పెరిగితే ముసలివాడవి అవుతావు.. కానీ నీలో మంచితనం పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగులుతావు🔥🔥మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D.N 29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును.9440893593.9182075510*🙏🙏🙏

ఇంటింటారామాయణ

 *ఇంటింటారామాయణ*

 *దివ్యకథా పారాయణం* 

          *8 వ రోజు*

🏹🏹🏹🏹🏹🏹🏹🏹

*యుద్ధకాండ‌ కొనసాగింపు*

🏹🏹🏹🏹🏹🏹🏹🏹

*రావణ సంహారం*

*రామయ్యకు విజయం*

        🌸🌸🌸🌸🌸


శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం 

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుభాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి

*****

ఆకాశాన్ని పోల్చడానికి ఆకాశమే సరి. సముద్రాన్ని

 సముద్రంతోనే పోల్చగలం. అలాగే రామ రావణుల యుద్ధాన్ని మరి దేనితోను పోల్చడానికి వీలు లేదట.

*గగనం గగనాకారం సాగరం సాగరోపమం. రామ రావణయోర్యుద్ధం రామరావణయోరివ

*కుంభ‌క‌ర్ణుడి ప్ర‌వేశం*

అవమాన భారంతో కృంగిన రావణుడు, తన సోదరుడైన కుంభకర్ణుని నిద్ర‌లేప‌మ‌ని మంత్రులను పంపాడు. శూలాలతో పొడిచి, ఏనుగులతో త్రొక్కించి, కుంభకర్ణుడిని అతి కష్టంమీద నిద్ర‌నుంచి లేపారు. 

రావణుడు, కుంభకర్ణుడికి జరిగిన విషయం అంతా వివరించాడు. రాముడికి తమకు మధ్య యుద్ధం భీకరంగా జరుగుతున్నదని చెప్పాడు. కుంభకర్ణుడు పెద్దగా ఆవులించి,

అనాలోచితంగా, సీతమ్మవారిని అపహరించి తప్పు చేశావని సోదర ప్రేమతో , రావణాసురుడిని నిందించాడు. సీతమ్మను అపహరించేటపుడు, ఆమెను అశోక వనంలో బంధించేటపుడు ఈ తెలివి ఏమైందని రవణాసురుడిని నిందించాడు. 

కుంభ కర్ణా..నిన్ను నిద్ర లేపింది,యుద్ధంలో నీ ప్రతాపం చూపుతావని కానీ, జరిగిపోయిన విషయాల మీద నీ చేత తిట్లు తినడానికి కాదు.

ఆలస్యం చేయకుండా కదులు ,అన్నాడు రావణుడు.

స‌రే, జ‌రిగింది ఏదో జ‌రిగిపోయింది, ఇక తాను రామలక్ష్మణులను, సకల వానర సేనను భక్షించి పరిస్థితిని చక్కదిదద్దుతానని, రావణుడికి మాట యిచ్చి, కోట గోడను ఒక్క అడుగులో దాటి యుద్ధానికి బయలుదేరాడు కుంభకర్ణుడు. ఆరు వందల ధనువుల ఎత్తూ, వంద అడుగుల కైవారం ఉన్న ఆ మహాకాయుడిని చూస్తూనే వానర సేనలు పారిపోసాగాయి. వానరులకు ధైర్యం చెప్పి, వారిని అతికష్టంమీద అంగదుడు నిలువరించాడు.

కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనపై విరుచుకు పడుతున్నాడు. అంతే , రామలక్ష్మణులు రంగంలోకి దిగారు.వారి బాణాలు కుంభకర్ణుడిని ఆయుధ విహీనుడిని చేశాయి. రాముడు వాయవ్యాస్త్రంతోను, ఐంద్రాస్త్రంతోను కుంభకర్ణుడి చేతులు నరికేశాడు. రెండు మహిమాన్విత బాణాలతో తొడలు కూడా నరికేశాడు. అయినా నోరు తెరుచుకొని వానరులను మింగేస్తున్న కుంభ‌కర్ణుడిని , రామచంద్రమూర్తి తన ఐంద్రాస్త్రంతో చంపేశాడు. వాడు పర్వతంలా క్రిందపడ్డాడు. వాడిశరీరం క్రింద పడి ఎందరో వానరులు, రాక్షసులు కూడా నలిగిపోయారు.


*హనుమ వెళ్ళి*

*ఓషధి పర్వతాన్ని తెచ్చుట*

పుత్రుల, సోదరుల మరణానికి చింతాక్రాంతుడై యున్న రావణుడికి ధైర్యం చెప్పి, ఇంద్రజిత్తు యుద్ధరంగానికి వెళ్ళాడు. హోమం చేసి అస్త్రాలను అభిమంత్రించి అదృశ్యరూపుడై వానర సేనను చీల్చి చెండాడ సాగాడు. ఇంద్రజిత్తు రామలక్ష్మణులపైకి బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు..మానవ రూపంలో ఉన్న రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రాన్ని మన్నించి స్పృహ కోల్పోయాడు. లక్ష్మణుడు, అటు పక్కగా ఉన్న కొందరు వానర నాయకులూ స్పృహ కోల్పోయారు. అందరూ మరణించారనుకొని సింహనాదం చేసి ఇంద్రజిత్తు విజయోత్సాహంతో లంకలోకి వెళ్ళాడు.

అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా, జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు స్పృహలో ఉంటే వానరసేన మరణించినా తిరిగి బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికిఉన్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమంలో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడు ఉంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు అన్నాడు. హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఔషధ పర్వతం మీది మృత సంజీవని, విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధాన కరణి అనే ఔషధాలను తీసుకు రమ్మని జాంబవంతుడు, హనుమంతుడిని కోరాడు.

జాంబవంతుని కోరికపై హనుమంతుడు రామ చంద్రునికీ, సాగరునికీ నమస్కరించి, తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శన చక్రంలా ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఆకాశమార్గాన సంజీవని పర్వతం మీదికి వెళ్లి ఓషధులకోసం వెదకసాగాడు. ఓషధులు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్నే సమూలంగా ఎత్తిపట్టుకొని, నింగిలో మరో సూర్యునిలా, యుద్ధరంగానికి వచ్చాడు. ఆ పర్వతంపై గల ఔషధ మొక్కల గాలి సోకగానే రామ లక్ష్మణులూ, వానరులూ సృహలోకి వచ్చారు. మరణించిన వానరులు కూడా పునరుజ్జీవితులైనారు. అయితే ఎప్పటికప్పుడు మరణించిన రాక్షసులను సముద్రంలో త్రోసివేయమని రావణుడు అంతకుముందే ఆజ్ఞనిచ్చినందువలన రాక్షసులకు ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. తరువాత మళ్ళీ పర్వతాన్ని తీసికొని వెళ్ళి హనుమంతుడు యథాస్థానంలో ఉంచి వచ్చాడు.

*ఇంద్రజిత్తు మరణం*

రామలక్ష్మణులు స్పృహ నుంచి తేరుకోవడం, రాక్షసులు వందలు వేల సంఖ్యలో వానర సేన చేతిలో మరణిస్తుండడంతో, రావణుడు మళ్లీ ఇంద్రజిత్తును యుద్ధరంగానికి పంపాడు. హోమం చేసి, శస్త్రాస్త్రాలు ధరించి యుద్ధరంగానికి వచ్చి అదృశ్యరూపంలో వానరసేనను, రామలక్ష్మణులను ఇంద్రజిత్తు కల‌వ‌ర‌పెడుతున్నాడు. లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం వేద్దామంటే రాముడు అతనిని వారించాడు.

ఇంద్రజిత్తు నికుంభిలా యాగం చేయడానికి వెళుతున్నాడు. అతని చుట్టూ రాక్షసులు వ్యూహం తీరి కవచంలా ఉన్నారు. అయితే ఇంద్ర జిత్తు ప్రాణాలకు సంబంధించిన ఒక రహస్యాన్ని విభీషణుడు రామలక్ష్మణులకు తెలియజెప్పాడు. యాగం చేయడడానికి ఇంద్రజిత్తు నికుంభిలకు వెళ్ళకుండా అతడిని ఎవరు ఆపగలరో వారిచేతులలోనే ఇంద్రజిత్తు చావు రాసిపెట్టి ఉందని విభీషణుడు అస‌లు ర‌హ‌స్యం చెప్పాడు. రాముని అనుజ్ఞ తీసుకొని, లక్ష్మణుడు ఆయుధ ధారియై, హనుమంతుని భుజాలపై కూర్చుని జాంబవంత, విభీషణ, అంగదాది వీరులతో కూడి నికుంభిలవైపు కదిలాడు. భయానక సంగ్రామానంతరం చుట్టూరా ఉన్న రాక్షసులను ఛేదించి ఇంద్రజిత్తును ఎదుర్కొన్నారు. సమంత్రకంగా ల‌క్ష్మ‌ణుడు దివ్య మహేశ్వరాస్త్రాన్ని విడిచాడు. అంతే...రెప్పపాటు కాలంలో ఇంద్రజిత్తు తల తెగిపడింది. రాక్షసులు పారిపోయారు. వానరులు లక్ష్మణస్వామికి జయం పలుకుతూ రాముని వ‌ద్ద‌కు చేరుకొన్నారు.


*రామరావణ యుద్ధం ఆరంభం*

ఇంద్రజిత్తు మరణంతో రావణుడు తెలివితప్పి పడిపోయాడు. లేచి, కోపంతో సీతను చంప బోయాడు. సుపార్శ్వుడు అనే బుద్ధిమంతుడైన అమాత్యుడు అతనిని వారించి, వీరోచితంగా యుద్ధంచేసి విజయుడవు కావాలి కాని, యుద్ధం మధ్యలో పిరికివాడిలా ఇలాంటి పనులేమిటన్నాడు. దానితో ఆ ప్రయత్నం మానుకున్నాడు. ఇక రావణుడు అన్నింటికీ తెగించి సైన్యంతో ఉత్తర ద్వారంగుండా యుద్ధరంగంలో అడుగు పెట్టాడు.

మ‌రోవైపు వాన‌ర వీరులు "శ్రీరామచంద్రునికి జయం", "లక్ష్మణునికి జయం", "సుగ్రీవునికి జయం", "ఆంజనేయునికి జయం", "అంగదునికి జయం", "జాంబవంతునికి జయం" అని పేరుపేరునా జయజయ ధ్వానాలు చేస్తూ, ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతూ రాక్షసులనెదుర్కోవడానికి ముందుకు దూకారు.

*లక్ష్మణ మూర్ఛ, మారుతి సేవ*

రావణుడు తన వాడి బాణాలతో రామలక్ష్మణాదులను వేధించ సాగాడు. లక్ష్మణుడు రావణుని సారథి తల యెగురగొట్టాడు. ధనస్సు విరిచేశాడు. 

రావణుడు విసిరేసిన శక్తి , వక్షస్థలానికి తగిలి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. సోదరుని అవస్థకు పరితపిస్తూనే ప్రళయాగ్నిలా రాముడు రావణునిపై బాణవర్షం కురిపించసాగాడు. కొంత సేపటికి హనుమ ఔషధ పర్వతాన్ని తెచ్చాడు. సుషేణుడు మూలికలను ఏరి రసం తీసి లక్ష్మణుడి నాలుకపై పోశాడు. లక్ష్మణుడికి స్పృహ వచ్చింది రాముడు లక్ష్మణుడిని గుండెలకు హత్తుకున్నాడు. అన్నా ఇక నువ్వు ఆలస్యం చేయకుండా నువ్వు నీ ప్రతిజ్ఞను చెల్లించుకో , రావణ సంహారం చేయి అన్నాడు.. అప్పుడు రాముడు తనవారిని ఉద్దేశించి - "మీరు, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. రావణ వధను జగత్తు అంతా తిలకించాలి" అన్నాడు. రామ రావణ సంగ్రామం చెలరేగింది. ఎంతో సమయం యుద్ధం చేసిన రావణుడు గాలిలోకి ఎగిరి మేఘంలోకి దూరిపోయి కాసేపు విశ్రాంతికోసం లంకలోకి వెళ్ళిపోయాడు.

రాముడు చిరున‌వ్వు న‌వ్వాడు. కీల‌క ఘ‌ట్టం స‌మీపిస్తున్న‌ది.

వాన‌ర సేన జ‌య జ‌య‌ధ్వానాలు మిన్నుముట్టుతున్నాయి.....

 *రావణ సంహారం*

రావణ సంహార ఘట్టం దగ్గర పడడంతో దేవతలు ఆకాశం నుంచి ఈ కీలక ఘట్టాన్ని ఆసక్తితో తిలకిస్తున్నారు. అదే సమయంలో ఇంద్రుడు పంపగా మాతలి, దివ్యమైన రథంతో రాముడికి సారథిగా వచ్చాడు. అగ్ని సమానమైన కవచం, ఐంద్రచాపం, సూర్య సంకాశాలైన శరాలు, తీక్ష్ణమైన శక్తి కూడా ఆ రథంలో ఉన్నాయి. రాముడు సంతోషించి ఆ దివ్య రథానికి ప్రదక్షిణం చేసి రథం ఎక్కాడు. రావణుడు వజ్రసదృశమైన శూలాన్ని చేతబట్టి కొత్త వ్యూహం, కొత్త శక్తితో మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. రావణుడు విసిరేసిన శూలం ఎదురుపడి రాముని బాణాలు కాలిపోయాయి. అప్పుడు రాముడు, మాతలి తెచ్చిన ఇంద్రశక్తిని విసిరేశాడు. అది రావణుని శూలాన్ని నిర్మూలించింది. రావణుడు కూడా శరపరంపరతో రాముని ముంచెత్తాడు. రాముడు విడచిన తీవ్ర బాణాలతో రావణుడి శరీరం రక్తసిక్తమయ్యింది. చివరకు అస్త్రవిహీనుడైన రావణుని పరిస్థితి గమనించి రావ‌ణుడిసారథి, రథాన్ని రాముడి కి ఎదురుగా లేకుండా దూరంగా తీసుకుపోయాడు.


అగస్త్యుడు అక్కడికి వచ్చి యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు సనాతనము, పరమ రహస్యము అయిన *"ఆదిత్య హృదయము"* ను ఉపదేశించాడు.

*ఆదిత్య హృదయం పుణ్యం

 సర్వశత్రు వినాశనం ।

జయావహం జపేన్నిత్యం

 అక్షయ్యం పరమం శివం ॥

సర్వమంగళ మాంగళ్యం

 సర్వ పాప ప్రణాశనం ।

చింతాశోక ప్రశమనం

 ఆయుర్వర్ధన ముత్తమం ॥ ॥

రశ్మిమంతం సముద్యంతం

దేవాసుర నమస్కృతం ।

పూజయస్వ వివస్వంతం

 భాస్కరం భువనేశ్వరం 

 సమస్త లోక సాక్షి అయిన సూర్యుని స్తుతించే ఆ మంత్రం జయావహం. అక్షయం. పరమ మంగళకరం. సర్వపాప ప్రణాశనం. చింతా శోకప్రశమనం. ఆయుర్వర్ధనం. సమస్త ఆపదాపహరణం.

 రాముడు ఆచమించి ఆ మంత్రరాజాన్ని మూడు మార్లు జపించాడు. జ్యోతిర్గణాధిపతి, దినకరుడు, జయభద్రుడు, సహస్రాంశుడు, తమోఘ్నుడు, శత్రుఘ్నుడు అయిన ఆదిత్యునకు నమస్కరించాడు.

ధనుస్సు ధరించి యుద్ధానికి సిద్ధపడ్డాడు. రావణ సంహారానికి దీక్ష పూనాడు.

*శ్రీరామ జయం*


రావణుని సారధి మళ్ళీ రధాన్ని రాముని ముందుకు తెచ్చాడు.

 సకలాయుధ సంపన్నమై, ఒక గంధర్వ నగరంలా ఉన్న ఆ రథం అప్రదక్షిణంగా వచ్చింది. ఇక రావణుని మరణం తప్పదని గ్రహించిన రాముడు తమ రధాన్ని ప్రదక్షిణ మార్గంలో పోనిమ్మని మాతలికి చెప్పాడు. సర్వ శక్తులనూ ఒడ్డి రాముడు, రావణుడు బాణాల వర్షాన్ని కురిపింప సాగారు. వారి బాణాలు ఆకాశాన్ని కప్పేశాయి. "రామ రావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. వారి రథాలు యుద్ధరంగమంతా కలియదిరిగాయి.

 రాముని బాణాలకు రావణుని రధ ధ్వజపతాకం కూలింది.

గుర్రాలు పక్కకు తొలగిపోయాయి.

మహా సర్పాలవంటి రాముని బాణాలకు ,

రావణుని తల తెగిపడింది.

 కానీ వెంటనే మరొకటి మొలుస్తున్నది. ఇలా నూటొక్కసార్లు రావణుని తలలు తెగగొట్టినా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. 

"రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు.

 అప్పుడు రాముడు తనకు అగస్త్యుడిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని తీశాడు. అది బుసలు కొడుతున్న సర్పంలా ప్రకాశిస్తున్నది. దాని వేగ సాధనములైన రెక్కలలో వాయువు, ములికిలో అగ్ని,సూర్యులు, బరువులో మేరు మందర పర్వతాలు అధిష్టాన దేవతలుగా ఉన్నారు. దాని శరీరం బ్రహ్మమయం.

 రాముడు ఆ దివ్యాస్త్రాన్ని వేదోక్తంగా అభిమంత్రించి, ధనుస్సును బాగుగా లాగి సావధాన చిత్తుడై రావణాసురుడిపైకి విడిచాడు. 

వజ్ర సంకల్పంతో, రాముని వజ్ర హస్తాలనుండి విడివ‌డిన‌ బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి, భూమిలో ప్రవేశించి, సావధావంగా తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. 

రాముడు ఎరుపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతి నుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు. సుగ్రీవ విభీషణ అంగదాదులు, లక్ష్మణుడు, ఇతర సహమిత్రులు విజయోత్సాహంతో రణాభిరాముడైన రాముని యధావిధిగా పూజించారు. దేవతలు పుష్ప వర్షం కురిపించారు.      

*సీత అగ్ని ప్రవేశం*


భీకరంగా జరిగిన యుద్ధంలో రావణుడు కడతేరాడు. 

రాముని ఆనతిపై విభీషణుడు రావణుడికి అంత్య క్రియలు చేశాడు. పిదప విభీషణుడు లంకకు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. విభీషణుని అనుజ్ఞతో హనుమ లంకలోనికి వెళ్ళి, విజయవార్తను సీతమ్మవారికి నివేదించాడు. విభీషణుని అంతఃపుర పరివారం సీతమ్మ‌కు మంగళ స్నానం చేయించి, పల్లకీలో రాముని వద్దకు తీసికొనివచ్చారు.

లోకానికి సీత‌మ్మ పాతివ్ర‌త్యాన్ని తెలియ‌జేయాల‌నుకున్నాడు శ్రీ‌రాముడు. అందుకు లోకం కోసం చిన్న‌స‌న్నివేశాన్ని సృష్టించాడు.


"సీతా,.... ఇక్ష్వాకుకుల ప్రతిష్ఠకోసం నేనీ యుద్ధం చేశాను.

 రావణుడు నిన్ను దుష్టదృష్టితో చూశాడు గనుక నేను నిన్ను స్వీకరించలేను. నువ్వు యధేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళవచ్చును." అని అన్నాడు. ఆ మాట‌లు సీత‌కు పిడుగుపాటు లా అనిపించాయి.

సీత లక్ష్మణునివైపు తిరిగి "లక్ష్మణా, అగ్నిని ప్రజ్వలింపజేయి" అన్నది. రామునకు, దేవతలకు, దిక్పాలురకు మ్రొక్కి "నా హృదయం సదా రామచంద్రుడినే పూజిస్తున్నట్లయితే సర్వభక్షకుడైన అగ్ని నన్ను పునీతురాలిని చేయుగాక‌" అని పలికి సీతామహాసాధ్వి మంటలలోనికి నడచింది. 

అందరూ హాహాకారాలు చేశారు. అప్పుడు బ్రహ్మ, రాముని సమక్షంలో నిలిచి "రామా! నువ్వు లోక కర్తవు. ఉత్తమ జ్ఞానివి. అలా చూస్తూ ఊరుకుంటావేం? సీతను ఉపేక్షిస్తావేమీ" అన్నాడు. దేవతలు నీవు విష్ణువు అవతారానివని కీర్తించారు.రాముడు మాత్రం

*ఆత్మానం మానుషం మన్యే*

*రామం దశరథాత్మజం*

నాపేరు రాముడు,దశరథ కుమారుడైన మానవ మాత్రుడననే అని వినయంగా అంటాడు. మానవుడిగానే రావణ సంహారం చేశానని లోకానికి చాటాడు.

వెంటనే అగ్ని, సీతమ్మవారిని వెంటబెట్టుకొని రాముని వద్దకు వచ్చాడు.


 సీత అప్పుడు ఉదయ సూర్యబింబంలా ఉంది.


 "రామా! ఇదిగో నీ సీత. ఈమె పునీత. పాపహీన. నిన్నే కోరిన పరమ సాధ్వి.

 ఈమెను అవశ్యం పరిగ్రహించు. " అని చెప్పాడు.

 అప్పుడు రాముడు ,"సీత పరమపవిత్రురాలని నేనెరుగుదును. కాని దశరధ పుత్రుడనైన నేను కామాతురుని వలె ప్రవర్తింప జాలను. ఈమె మహిమను లోకం గుర్తించాలని అగ్ని ప్రవేశాన్ని మౌనంగా వీక్షించాను. నా పట్ల వాత్సల్యం కలవారు గనుక మీరు చెప్పినట్లే చేస్తాను" అని తన దక్షిణ హస్తాన్ని చాచి సీతమ్మవారి చేతినందుకొన్నాడు రామచంద్ర మూర్తి.

 ఆకాశం నుంచి పుష్ప‌వ‌ర్షం కురిసింది.

*అయోధ్యకు పునరాగమనం*

యుద్ధంలో చనిపోయిన వానరులందరినీ రాముని కోరికపై ఇంద్రుడు బ్రతికించాడు. వానర సైన్యమంతా సంబరాలలో మునిగిపోయింది. అయోధ్య చేరాలన్న ఆతురతలో ఉన్న రాముడు, విభీషణుని సత్కారాలను తిరస్కరించాడు. విభీషణుడు రాముని అనుజ్ఞతో వానరులను సత్కరించాడు.

 విభీషణుడు, వానరులు తోడు రాగా, పుష్పక విమానంపై సీతారామలక్ష్మణులు అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో తమ లంకా యుద్ధ, సీతాపహరణ, వనవాస ప్రదేశాలను చూసుకొంటూ కిష్కింధను, గోదావరిని, యమునను, గంగను దాటి భరద్వాజ ముని ఆశ్రమం చేరుకొన్నారు.

*భరతుడికి వర్తమానం*

ముందుగా హనుమంతుడు నందిగ్రామం చేరుకొని భరతునికి సీతారామలక్ష్మణుల రాక గురించిన సందేశాన్ని అందించాడు. ఆనందంతో భరతుడు అయోధ్యను అలంకరింపమని ఆనతిచ్చాడు. రాముని పాదుకలు శిరస్సుపై ధరించి పరివారసహితుడై ఎదురేగి రాముడికి, సీతమమ్మవారికి , లక్ష్మణునికి ప్రణమిల్లాడు. సుగ్రీవాది వీరులను ఆలింగనం చేసుకొన్నాడు. సౌహార్దంవల్ల తమకు సుగ్రీవుడు ఐదవ సోదరుడని పలికాడు. రాముని పేరుతో తాను రాజ్య సంరక్షణ చేస్తున్నానని, రాజ్యభారాన్ని తిరిగి చేప‌ట్ట‌మ‌ని శ్రీరాముని ప్రార్థించాడు. భరతుడే సారథ్యం వహించగా, శత్రుఘ్నుడు శ్వేతచ్ఛత్రం పట్టగా, లక్ష్మణ, విభీషణులు వింజామరలు వీయగా, వానరవీరులు వెంటరాగా సీతారాములు పరివార సమేతులై శంఖభేరీ భాంకారాలతో, ప్రజల జయ జయధ్వానాల మధ్య అయోధ్యలోనికి ప్రవేశించారు. తల్లులకు, పెద్దలకు, గురువులకు శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ స్వాములు మ్రొక్కారు. వనవాస విశేషాలు, సీతాపహరణం, కిష్కింధలో సుగ్రీవుని మైత్రి, హనుమంతుని అసమాన కార్య సాధన, విభీషణ శరణాగతి, లంకాయుద్ధాది వివరాలు విని అయోధ్యాపౌరులు అత్యాశ్చర్యభరితులయ్యారు.

                *****

శ్రీ రఘురామ చారు తులసీదళ దామ శమక్షమాది శృం

గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమా లలామ దు

ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో

త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ

 *****

రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ

స్తోమ పరాంగనా విముఖ సువ్రత కామ వినీల నీరద

శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధి సోమ సురారి దోర్భలో

ద్ధామ విరామ

 భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!*

         ***

మనోజవం మారుత తుల్యవేగం

జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం

వాతాత్మజం ,వానర యూధ ముఖ్యం

శ్రీరాందూతం మనసా స్మరామి.


*(రేపు, శ్రీరామ పట్టాభిషేక పరమ పావన ఘట్టం)*