22, మార్చి 2025, శనివారం

ఊరు మారితే తినే ఫుడ్డు

 ఊరు మారితే  తినే ఫుడ్డు మారుద్ది.పడుకునే బెడ్డు మారుద్ది.

బ్లడ్డెందుకు మారుద్దిరా బ్లడీ ఫూల్!

సేం కలర్....సేం పవర్.


అరవకు. అరిస్తే అరనిముషంలో చస్తావ్!

అరవకపోతే 5 నిముషాలైనా బ్రతుకుతావ్.


ఒక్కొక్కడ్ని కాదు షేర్ ఖాన్...వంద మందిని ఒకేసారి రమ్మను

లెక్క ఎక్కువైనా పరవాలేదు.తగ్గకుండా చూస్కో!


వద్దు...ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు..ఎస్.పి.

చరిత్రంటే మాదే!

చరిత్ర సృష్టించాలన్నా మేమే!

దాన్ని తిరగ రాయాలన్నా మేమే!

వాళ్ళెంత?.... బ్లడీ ఫూల్స్. బురద జాతి!


ఇలాంటి పంచ్ డైలాగ్స్...కొంచెం ప్రయత్నిస్తే.....మనం కూడా వ్రాసేస్తాం అనిపిస్తుంది.


కానీ వేదాంత పరమైన అద్భుత  విషయాలు డైలాగ్స్ లో కూర్చాలంటే....అష్టాదశ పురాణాలని మథించి ఉండాలి.


వాటిపై అద్భుతమైన అవగాహన కావాలి. 


ఆషామాషీ కాదు.


                             ************


శ్రీకృష్ణ పాండవీయంలో సుయోధనుడు:


“పాంచాలీ... పంచ భర్తృకా... నీవా నన్ను పరిహసించునది! 


సకల మహీపాల మకుట మాణిక్య శోభా నీరాజితుడైన రారాజును, నేడొక్క అబల, బంధకి అపహసించుటయా! 


అభిమానధనుడైన సుయోధనుడది విని సహించుటయా... సహించక మరణించుటా!.. 


మరణించి సాధించునది... మచ్చ మాసిపోవునా...పరిహాసాస్పదుడై  ప్రాణత్యాగము చేసికొన్నాడన్న అపనింద వేరొక్కటా...కల్ల... ఈ పరాభవము దాగుట కల్ల...


ఆ పాంచాలి ప్రక్కన నిలచి ఫక్కున నవ్విన ఆ టెక్కులాండ్రలో, యే ఒక్కతైనా ఈ వార్త ప్రక్కవాటుగా నొక్కించక మానునా! 


ఈ అపఖ్యాతి ఆనాటికానాటికి జ్వాజ్వల్యమాన దావానలమై అఖండ భూమండల మావరించి మా శ్రవణపుటభేద్యము కాకమానునా...


శత్రువులని తెలిసి తెలిసి నన్నధిక్షేపించుటకే పన్నిన పన్నాగమని ఎరిగి ఎరిగి మందమతినై, మామ మాటలకు ఏల చెవి ఒగ్గవలె... 


ఈ పాండవ హతకుల ఆహ్వానము నేనేల మన్నించవలె... 


మన్నించితిపో...ఈ మయసభ మాకేల విడిది కావలె...


అయినదిపో...ఈ మందిర సౌందర్య సందర్శనాపేక్ష నాకేల జనించవలె...


జనించెపో... మేమందేల పరిభ్రమించవలె, మనసేల భ్రమించవలె... 


ఆహూతుడన్న ఆదరముంచక, వావివరుసలు గణించక, బంధువని పాటించక, ఆ బంధకి... పాంచాలి... ఏల అపహసించవలె! 


మనుటయా మరణించుటయా’’


                             ***********


ఎవరు నాయనా నీవు? ఎందుకింత ఆవేదన పడుతున్నావు?


జీవిత పరమార్థం తెలుసుకోలేక...ఆర్తి పడుతున్న అంధుణ్ణి.


జీవితానికి...పరమార్థమంటూ ఒకటుందని అనుకుంటున్నావా?


లేదా స్వామీ?...వేద వేదాంగాలను ఎరిగిన మహర్షులు...దేశ దేశాలను జయించిన చక్రవర్తులు...సీదా సాదా...అంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారే. 


వీరంతా మరణించిన తరువాత...ఏమవుతున్నారు స్వామీ?


పిచ్చివాడా! లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయ పడుతుంటే...


మరణించిన తరువాత ఏమౌతారనే...విచారం నీకెందుకు?

ఆ విచారం వదులుకో. 


నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను. అనుభవించు.


వద్దు స్వామీ. అవన్నీ అనుభవించి...క్షణికములని...క్షుద్రములని...తెలుసుకున్నాను.వాటిపై నాకు వాంఛ లేదు.


నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటే.

మనం ఎక్కడనుంచి వస్తున్నాం? ఎక్కడికి పోతున్నాం?


ఈ రహస్యం తెలుసుకోవడానికి దేవతలకే సాధ్యం కాలేదే! మానవులకు సాధ్యమౌతుందా!


మీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే....మాకు దిక్కెవ్వరు స్వామీ? 


మేమీ దు:ఖ భాజనమైన శరీరంతో కృశించి...జనన మరణ ప్రవాహంలో కొట్టుకు పోవలసినదేనా?మానవునికి తరుణోపాయము లేదా స్వామీ?


                                ***********


లేకేం నాయనా.ఉంది.

ఈ శరీరం విద్యావిద్యలు...రెంటితోనూ పుట్టింది.


సంసార యాత్రకు...మోక్ష యాత్రకూ...ఇదే సాధనం.


అవిద్యచే మోహితుడవై...కనిపించే ఈ జగత్తు...సత్యము నిత్యము..అనుకుని....


దు:ఖభాజనుడవై....చావు పుట్టుకల కుమ్మరి సారి లో తిరుగుచున్నావు.


ఇదంతా అనిత్యమని...ఈ నాటకానికంతటికీ కారణమైన.....మహా చైతన్యం వేరే ఉందని....


అది నిత్యము...సత్యము అని తెలుసుకుని....ఆ ఆత్మానుభవం పొందాలి.


ఆ ఆత్మానుభవం...నాకెట్లా కలుగుతుంది స్వామి?


భక్తి మార్గంలో కొందరు...జ్ఞాన మార్గంలో కొందరు...సాధించారు.


కానీ జీవన్ముక్తికి...రాజయోగమే సులభతరమని...పెద్దల మతం.


రాజయోగమా? నాకెవ్వరు ఉపదేశిస్తారు స్వామీ?


ఆ సమయం వచ్చినప్పుడు...పరమాత్మే..సద్గురువై వచ్చి ఉపదేశిస్తాడు.


కారు చీకటిలో దారి తెలియక తిక మక పడుతున్న నాకు....వెలుగు వలె మీరు లభించారు. 


మీరే నా గురువులు...నా దైవం.. ఆయోగ రహస్యం నాకు బోధించి...సత్య స్వరూపం చూపించండి స్వామీ.


                             ***********


అతి గుప్తమైన ఆత్మవిద్యను నీకు బోధిస్తున్నాను. సావధానుడవై వినుము.


రసాన్ని కట్టేస్తేనే కాని...స్వర్ణం కానట్టు,

మనస్సును కట్టేస్తేనే కాని...సత్యము కనిపించదు.


మనస్సే మన బంధానికి...మోక్షానికి కారణం.


మనస్సును స్వాధీనం చేసుకుంటే...నీకు..

స్వాధీనం కానిదేదీ ఉండదు!

ఆ సాధనే యోగమంటారు.


సాంగ యోగాన్ని క్రమంగా సాధించి...

చిత్త వృత్తులనణచి...సమాధి స్థిరుడవైనప్పుడు....,


నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది.

అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు!


ఇంతవరకు ...తనచేత చిక్కించుకుని ఆడించే ప్రకృతి..

నీ స్వాధీనమౌతుంది!


మోక్షం అంటే....అదేనా స్వామీ?


కాదు నాయనా. అది మోక్షానికి మొదటి మెట్టు.


ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక...


సుస్థిర చిత్తుడవై...ధ్యానిస్తే,

స్వయంప్రకాశము...

సచ్చిదానందము....

శాశ్వతము అయిన స్వస్వరూపానుభవము...

కేవలం జ్ఞానరూపంగా... నీవనుభవిస్తావు.


తత్వమసి అంటే అదే. 


అప్పుడు నువ్వు....నేను ఒక్కటే.


రాజయోగం సాధించి...అఖండ బ్రహ్మానందానుభవం పొందు నాయనా.

                               ***********


1947 లో విడుదలైన... యోగివేమన మూవీలోని....


ఈ రాజయోగ రహస్యాల జ్ఞాన పలుకులు.....పామరులకు...పండితులకు కూడా...పంచదార చిలకలే!


మయూఖ చిహ్నితలు......


జ్ఞాన గవాక్షాలు.....


విజ్ఞాన వీచికలు....


సముద్రాల వారి పలుకులు.🙏


                               **********


ఏ కొరనోము నోచుకున్నానో...నేను...

 కూలే...నిరాశై లైలా బ్రతుకే!...


అంటే... ఆచార్యులు గారూ....పర్షియాలో....అరేబియాలో కూడా ఆడవాళ్ళు..నోములు & వ్రతాలు చేస్తారా?!


అడిగేవ్యక్తిని ఓ చూపు చూశారు ఆచార్యుల వారు! 


ఒరే నాయనా! అరేబియా ఆడపిల్ల తెలుగు లో మాట్లాడుతుందారా!? 


అయినా ఇది లైలా- మజ్ఞు తెలుగు చిత్రం....నిర్మాతలకు అనుగుణంగా...వ్రాయడం నా పధ్ధతి......


అంటూ తెలివిగా విషయాన్ని దాటవేశారు సముద్రాల రాఘవాచార్యులు గారు!


ముదావహంబున కడంగడు సంతసించి.....అనేకంటే...


నాకు ఎంతో సంతోషంగా ఉంది.....అనడం బాగుంటుంది కదా! 

ప్రజలకు అర్థమౌతుంది. అనేవారు ఆయన.. 


1937 లో కనకతార మూవీకి మాటలు వ్రాయడంలో ఆ బాణీనే చూపారు సముద్రాల వారు. 


పౌరాణికమా, జానపదమా, సాంఘీకమా అనికాదు......ప్రజలకు అర్థమయ్యే భాషలో వ్రాయాలి కవులు...అనేవారు!


ఎందరో పండితులు నొచ్చుకున్నారు. పామరులు సంతసించారు. 


భాషను భ్రష్టు పట్టిస్తున్నారు ఈ సినిమా రచయితలంటూ...పుంఖాను పుంఖాలుగా...విమర్శలు వస్తున్నా....


వాడుక భాష ను తెలుగు సినిమా కు పరిచయం చేసిన ఘనత....సముద్రాల రాఘవాచార్యుల వారిదే!


                               **********


100 కి పైగా సినిమాలకు రచన, మాటలు & పాటలు వ్రాశారు. 


1000 దాకా పాటలు వ్రాశారు. 


పౌరాణిక, చారిత్రక, జానపద & సాంఘీకాలలో...

శృంగార, శౌర్య, రౌద్ర, హాస్య, భక్తి & శోక రసాల వంటి నవరసాలలోనూ వ్రాశారు. మెప్పించారు!


సంస్కృతాంధ్రాలలో ఉధ్ధండులు. 


బెజవాడలో ఫ్రెండ్స్ & కో అని ఓవ్యాపార సంస్థ నడిపేవారు గూడవల్లి రామబ్రహ్మం గారు. 


స్టేషనరీ, గ్రంథాలు & గడియారాలు అమ్మేవారు. అక్కడ చేరేవారు ఆచార్యులు.


ఎందరో మహానుభావులు బి.ఎన్. రెడ్డి, నాగిరెడ్డి, కె.వి.రెడ్డి...లాంటి మిత్రులు చేరేవారు.  


అక్కడ సాహిత్య గోష్టులు...కవితా చర్చలే జరిగేవి. 


వ్యాపారం కంటే ! ఎవరికి నచ్చింది....వారు తీసుకుని పోయేవారు. ఎవ్వరూ కొనేవారు కాదు!


వ్యాపారం శూన్యమైతే...రామబ్రహ్మం గారు *ప్రజామిత్ర* అనే పత్రిక ప్రారంభించి...


సముద్రాల వారిని రచయితగా తీసుకున్నారు. 


ఆ ప్రజామిత్ర ...మద్రాస్ కు షిఫ్ట్ అయినప్పుడు....సముద్రాల గారు కూడా మద్రాస్ చేరుకుని సినిమాలకు మాటలు & పాటలు వ్రాయడం ప్రారంభించారు.


కనకతార(1937),గృహలక్ష్మి(1938),వందేమాతరం(39),సుమంగళి(40), దేవత(41),భక్త పోతన(42),స్వర్గసీమ(45)యోగివేమన(47) లకు రచన, మాటలు & పాటలు సముద్రాల గారివే!


భక్తి తత్వము & వేదాంత ధోరణి....వ్రాయాలంటే....


సముద్రాల వారే వ్రాయాలి. యోగి వేమన లో అది పరాకాష్టకు చేరుకుందంటే అతిశయోక్తి కాదు.


                               ***********


ఆయన ఎంత బిజీగా ఉండే వారంటే....కొంత మంది రచయితలు...వారికోసం ఘోస్ట్ రచయితలుగా పాటలు వ్రాశారు. 


అందులో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు & సముద్రాల కుమారుడు రామానుజాచార్య(జూనియర్ సముద్రాల) కూడా ఉండే వారు.


వేరే ఎవరి పాటో ....మీపాటగా చలామణి చేసుకోవడం తప్పు కదండీ?!...అని ఎవరైనా ప్రశ్నిస్తే,....


ఇందులో తప్పేముంది. మల్లాది...నా స్నేహితుడు. నేను బిజీగా ఉన్నాను. సహాయ పడ్డాడు. నేను డబ్బిచ్చాను. 


మా రామానుజం కూడా నాకు సహాయపడ్డాడు! ఇది కేవలం పరస్పర సహకారమే కానీ...మరేం లేదు అనేవారు!


సముద్రాల కు అసలు పద్యాలంటే...ఇష్టముండేది కాదు. 


నాటకాలలోలా...ఇంకా ఏమిటీ పద్యాలు...యుధ్ధం చేసుకుంటూ...రాగాలు తీసుకుంటూ...ఇంకా ఇలా పద్యాలు పాడటం ఏం బాగాలేదు! అనేవారు.


కానీ...నిర్మాతలు ఒప్పుకునేవారు కారు. ప్రజలు ఇంకా పద్యాలు కోరుకుంటున్నారండి. పద్యాలు ఉండాల్సిందే అని బలవంతపెట్టేవారు!


సముద్రాల...నిజంగా  సముద్రమంత వారు. పాండిత్యంలోను, నవరస పోషణా చతురతలోను, సంద్రాన ఎంతటి వైవిధ్యముందో....


అంతటి వైవిధ్యం తన రచనా చమత్కృతిలో చూపేవారు. 


సౌమ్యుడు, నిదానస్తుడు.

ముందు తన అభిప్రాయాలను చెప్పినా...దర్శకనిర్మాతల అభిరుచిమేరకు...రాజీపడి పోయేవారు.


                             **********


లవకుశ...అద్భుత దృశ్య కావ్యం లో సముద్రాల వారి గీతాలు...

ఆంధ్ర దేశమంతటా మారుమ్రోగిపోయాయంటే....

ఆ రచనా పటిమకు జోహార్లు చెప్పవలసినదే.


రామకథను వినరయ్యా...

శ్రీరాముని చరితమును...

వినుడు వినుడు రామాయణ గాధ...

ఊరకే కన్నీరు నింప....

జగదభిరాముడు శ్రీరాముడే...


ఎన్ని రసగుళికలు....జన్మ చరితార్థం కాదా! వారి సాహిత్యానికి తోడు...ఘంటసాల మాస్టారి స్వర రచనలో....చిరస్థాయిగా నిలిచిపోయాయా గీతాలు.


                                 ***********


నందమూరి కి మిక్కిలి ఇష్టులు సముద్రాల గారు.  ఆ స్నేహం చిరకాలం నిలుపుకున్నారు.


డి.ఎల్. నారాయణ గారి వినోదా పిక్చర్స్ లోను, ఎన్.ఏ.టి లోను భాగస్వామ్యం ఉండేదాయనకు. 


దర్శకుడుగా 3 చిత్రాలు చేశారు. వినాయక చవితి(57), భక్త రఘునాథ్(60) & బభ్రువాహన(64).


సముద్రాల గారి పుణ్యమా అని అలనాటి గ్రాంథిక భాష....వ్యవహారిక భాషగా మారింది. 


ఎన్నెన్ని చక్కటి గీతాలు మనకందించారో. 

అవి ఈ నాటికీ..మనలనలరిస్తూనే ఉన్నాయి. ఉంటాయి.


రేపల్లెలో...19 జూలై మాసాన 1902 లో సముద్రాల వారు జన్మించారు. 


16- 3 - 1968....సముద్రాల వారు....వారి ముద్రనిల వదలి....కీర్తిశేషులైనారు.


ఈ రోజు.....సముద్రాల వేంకట రాఘవాచార్యుల వారి వర్ధంతి.


స్మృత్యంజలి.🙏

       &

నీరాజన సుమగీత పుష్పాంజలి.🌹


                             🌹🙏🌹🙏🌹🙏🌹


రాజయోగ సాధనా జ్ఞానం........యోగి వేమన.


https://youtu.be/aBMPi3HqZfg


ప్రేమే నేరమౌనా, మాపై ఈ పగేలా.........లైలా- మజ్ఞు.


https://youtu.be/wqZEbdagGPw


దినకరా శుభకరా...........వినాయక చవితి.


https://youtu.be/hYQF31wvDYs


వదలజాలరా....వదలజాలరా.........యోగి వేమన.


https://youtu.be/GDIXnR0An_8


ఇదేనా...ఇంతేనా.....జీవితసారమిదేనా.........యోగి వేమన.


https://youtu.be/qWCdhjfe23w


మాయను పడకే మనసా.........యోగి వేమన.


https://youtu.be/qncOmz7Z8-I


జగమే మాయ బ్రతుకే మాయ......దేవదాసు.


https://youtu.be/nZCHsIegkaE


అందాలు చిందేటి నా జ్యోతి......యోగి వేమన.


https://youtu.be/5JY6dAIiSPI


సుందరాంగా...అందుకోరా.........భూకైలాస్.


https://youtu.be/Vsotu67Cbkw


జగదభిరాముడు శ్రీరాముడే.......లవకుశ.


https://youtu.be/9AshdyFBhPs


రాముని అవతారం.......భూకైలాస్.


https://youtu.be/bJGAWx1Dt3Y


ఎందుకోయి తోటమాలి........విప్రనారాయణ.


https://youtu.be/BJEs-Iw6dfU


చిగురాకులలో చిలకమ్మా..........దొంగరాముడు.


https://youtu.be/65gt3xXLNtM


జనని శివకామిని........నర్తనశాల.


https://youtu.be/flGvLGk5CMQ


దేవ దేవ ధవళాచల మందిర........భూకైలాస్.


https://youtu.be/ZZrKQLpQjyE


చూడుమదే చెలియా...కనుల.......విప్రనారాయణ.


https://youtu.be/YdFI1vbSQ6o


సీతారాముల కల్యాణం చూతము రారండి.......సీతారామ కల్యాణం.


https://youtu.be/Ys4k8kqOg4w


జీవితమే సఫలము........అనార్కలి.


https://youtu.be/SvHfiigQbPA


లోకమెరుగని బాల.........బాటసారి.


https://youtu.be/uGsgw6XnZm8


రాజశేఖరా నీపై మోజు తీరలేదురా..........అనార్కలి.


https://youtu.be/VIryMqxwijc


శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా.......లవకుశ.


https://youtu.be/Nu7HI43Dh7g


పాడవే రాగమయీ...వీణా.........సీతారామ కల్యాణం.


https://youtu.be/HP8wnOARaoQ


అడుగడుగో అల్లడుగో..........సారంగధర.


https://youtu.be/4wV9w1bHDPk


సఖియా వివరించవే........నర్తనశాల.


https://youtu.be/aJVXI_i-g1A


నీసరి మనోహరి..........బభ్రువాహన.


https://youtu.be/wBSdl9qjEzA


ఓ బాటసారి...నను మరువకోయి........బాటసారి.


https://youtu.be/-2Bciop6A4Y


సంసారజలధి దాటించే నావ...........భక్త రఘునాథ్.


https://youtu.be/PZ6FZnxnxlA


జీవము నీవే కదా............భక్త ప్రహ్లాద.


https://youtu.be/RM577fnnW0Q


రామ కథ...శ్రీరామ కథ..........శ్రీరామ.కథ(చివరి గీతం.)


https://youtu.be/1di1VykiM2o


🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏 Courtesy:Fb

మధుమేహ నివారణా చూర్ణం

 మధుమేహ నివారణా చూర్ణం  మరియు మధుమేహం గురించి సంపూర్ణ వివరణ ~ 


 మధుమేహము మహారోగములలో ఒకటిగా పేర్కొనబడినది . అధిక ప్రమాణమున మాటిమాటికి మూత్రము ఈ వ్యాధి నందు వెడలుటచే ఇది మేహరోగం అనబడును.  ఈ రోగం జనించుటకు ప్రధానకారణాలు గురించి ప్రాచీన ఆయుర్వేద వైద్యులు అనేక కారణాలు తెలియజేసారు. 


              సుఖముగా ఉండు ఆసనము పైన ఆసీనుడై యుండి ఏ పనిచేయక సోమరిగా ఉండుట , ఎక్కువసేపు సుఖముగా నిద్రించుట , పెరుగు , జలచరమాంసాదులు , పాలు , బెల్లం , తీపివస్తువులు , కఫవర్ధక పదార్థాలు ఎక్కువుగా సేవించుట , కొవ్వుపదార్ధాలు అధికంగా తీసుకొనుట , శరీరానికి శ్రమ లేకపోవుట , పగటినిద్ర  మరియు శీతల , మధుర , స్నిగ్ధ ద్రవముగా ఉండు అన్నపానాదులు అధికంగా సేవించుట వలన ప్రమేహము వచ్చును. 


              ఆరోగ్యవంతుని యందు ఒక పగలు , రాత్రి అంటే 24 గంటల కాలమున విసర్జించబడు మూత్రము యొక్క ప్రమాణము 800 - 2500 మీ.లీ  గా ఉండును. పైన పేర్కొనబడిన సాధారణ ప్రమాణము కన్నా అధికముగా మూత్రవిసర్జన జరిగినచో అది ప్రమేహం అనబడును. ఉదాహరణకు ఉదకమేహము ( Daibetes insipidus ) అను సమస్య నందు 5 - 10 లీటర్లు మూత్రము 24 గంటల కాలంలో విసర్జించబడును. ప్రమేహము నందు మూత్రము నిర్మలముగా ఉండక కలుషితమై కలకపరి ఉండును. 


     

         మధుమేహము కారణములను ఆధారం చేసుకుని రెండు విధములుగా పేర్కొనబడినది . 


      1 - సహజము .


      2 - అపథ్య నిమిత్తజము . 


 *  సహజము  - 


        సహజముగా కలుగు ప్రమేహము తల్లితండ్రుల బీజదోషము వలన కలుగును. శిశువు జన్మకు కారణం అయిన బీజము , శుక్రము యొక్క దోషములు సామాన్యముగా సహజ వ్యాధులకు కారణము. కావున మధుమేహము కూడా బీజదోషముల వలనే జనించును. 


 *   అపథ్య నిమిత్తజము  - 


        ఇది బీజదోష రహితముగా , జన్మించిన తరువాత అపథ్య ఆహార అలవాట్ల వలన జనియించును. ప్రమేహవ్యాధి జనియించినప్పుడు సరైన చికిత్స చేయక ఉపేక్షించిన యడల ప్రమేహములు ( 20 రకాలు ) అన్నియు మధుమేహములుగా మారును. 


                         మధుమేహము నందు మూత్రము కషాయ , మధుర రసములు కలిగి తెలుపుగా ఉండును. ఈ వ్యాధిని నిర్ధారించుటలో మూత్రపరీక్ష మరియు రక్తపరీక్షలు దోహదపడును. ఈ పరీక్షల ఆధారముగా వ్యాధితీవ్రత మరియు చికిత్సా ఫలితములను అంచనా వేయుట సాధ్యపడును. 


       కడుపులో చిన్నపేగు మొదటి భాగమునకు ( Duodenum) , పిత్తాశయం ( Gallblader ) నకు మధ్యభాగములో పైత్యనాళము (Bileduct ) పక్కగా క్లోమము ( Pancrease ) అను వినాళగ్రంధి ఉండును. ఇందులో ఎంజైములు మరియు హార్మోనులు ఉండును. ఎంజైములు ఆహార జీర్ణక్రియలో పాల్గొనును. ఇన్సులిన్ మరియు    గ్లూకాగాన్ అను రెండు హార్మోనులు ఈ క్లోమగ్రంధి యందు ఉండి రక్తములోని గ్లూకోజ్ ప్రమాణమును నియంత్రించుతూ శరీర అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూడును . మధుమేహ రోగికి పలుకారణాల వలన ఇన్సులిన్ అనే హార్మోన్ చురుకుగా లేకపోవడం , కావలిసినంత ప్రమాణముగా అందుబాటులో లేకపోవటం వలన రక్తములో గ్లూకోజ్ స్థాయులు పెరుగును . రక్తములో అధికంగా ఉన్న గ్లూకోజ్ మూత్రపిండాల ద్వారా మూత్రములో బయటకు వెళ్ళును. ఈ విధముగా శరీరంలో పలు జీవక్రియలకు ఆధారమైన మరియు శక్తిని సమకూర్చే గ్లూకోజ్ నిలువలు క్రమేణా తరిగిపోవడం మరియు శరీర అవయవాలు ఉపయోగించుటకు వీలులేని వాతావరణము నెలకొనుట మూలముగా క్రమముగా మధుమేహరోగి కండరాలు క్షీణించి నరముల బలహీనత , కంటిచూపు తగ్గుట మరియు మూత్రపిండముల సామర్ధ్యము తగ్గుట మొదలగు ఉపద్రవములతో మరణించును . సక్రమమైన ఆహారవిహారాలు , క్రమం తప్పకుండా ఔషధసేవన పాటించడం వలన రోగికి వ్యాధి లొంగుబాటులో ఉండి ఆయువును పెంపొందించును.  


.        మధుమేహం మరియు మధుమేహం వలన కలుగు సమస్యలు నివారణ కొరకు "మధుమేహ నివారణ చూర్ణం" అనే పేరుతో 14 రకాల వనమూలికలతో ఈ చూర్ణం నేను రూపొందించాను. ఇది ఒక పురాతన వంశపారంపర్య ఫార్ములా. ఇందులో ప్రతి మూలికను శుద్ధి చేసి కలపడం జరుగుతుంది. ఎటువంటి side affects లేకుండా పూర్తి ప్రకృతి సిద్ధ ఔషధం. 


.         ఈ ఔషదం వాడటం ద్వారా శరీరంలో మధుమేహం నియంత్రణ లోకి వస్తుంది. మధుమేహం వల్ల ఇతర అవయవాల మీద పడే ప్రభావం పోతుంది. శరీరంలో మధుమేహం వల్ల వచ్చే నీరసం, నిస్స త్తువ తగ్గును.  కొత్తగా మధుమేహం నిర్దారించబడినవారు మరియు మధుమేహం రావడానికి అవకాశం ఉన్నవారు ఈ చూర్ణమును వాడుట మూలాన త్వరగా బయటపడుతారు.  


 ఈ చూర్ణంతో పాటు శరీరమును శుద్ధి చేయు ఔషధాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని వల్ల శరీరంలో ఆణువణువు లో ఉన్న "Toxins" మరియు వ్యర్థ పదార్ధాలు బయటకు వెళ్లి శరీరం పూర్తిగా శుభ్రంగా తయారగును. 


.        ఈ "మధుమేహ చూర్ణం"  కావలసిన వారు డైరెక్టుగా 9885030034 నెంబర్ నందు సంప్రదించగలరు.  


.                కాళహస్తి వేంకటేశ్వరరావు 


.          అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


.                     9885030034

గరుడ పురాణం_*26వ భాగం*

 *గరుడ పురాణం_*26వ భాగం*



_మరొక విష్ణు పూజ వుంది. ఇది భోగమోక్షాలను అలవోకగా అందిస్తుంది. ఈ పూజా విధానంలో సాధకుడు ముందుగా స్నానం చేసి సంధ్య వార్చుకొని యజ్ఞ మండపంలో ప్రవేశించాలి. కాళ్ళూ చేతులూ కడుక్కొని శాస్త్రోక్తంగా ఆచమనం చేసి న్యాస విధిననుసరిస్తూ రెండు చేతుల ద్వారా వ్యాపకరూపంలో మూల మంత్రము యొక్క కరన్యాసం చేయాలి. హే రుద్రదేవా! విష్ణు దేవుని మూలమంత్రం ఇది :_


_*ఓం శ్రీ హ్రీం శ్రీధరాయ విష్ణవే నమః "*_


_ఇది దేవాధిదేవుడు, పరమేశ్వరుడునగు విష్ణువాచకం. ఇది సర్వరోగహర్త, సమస్త గ్రహశమకర్త, సర్వపాప వినాశకం, భక్తి, భుక్తి, ముక్తి ప్రదాయకం._


_*తరువాత "ఓం హాం హృదయాయ నమః " తో మొదలెట్టి "అస్త్రాయ ఫట్ " దాకా గల మంత్రాలతో అంగన్యాసం చేసుకోవాలి.*_


_తరువాత సంయమియై ఆత్మముద్రను ప్రదర్శించాలి. హృదయగుహలో అతులిత కాంతులతో విరాజిల్లుతున్న శంఖ చక్రధారి, కుందపుష్ప, చంద్రకాంతి శోభితుడు, శ్రీవత్స కౌస్తుభ సమన్వితుడు, వనమాల, రత్నహారాలంకృతుడునగు విష్ణుభగవానుని కనులు మూసుకొని, మనసులో మనసుతో చూసి మనసారా ధ్యానించాలి._


_*తరువాత 'విష్ణుమండలస్థితులైన దేవగణులారా, పార్షదులారా, శక్తులారా! మీ అందరినీ ఆదరంతో ఆవాహన చేస్తున్నాను. ఇక్కడికి దయచేయండి' అని ఈ మంత్రాల ద్వారా ఆవాహన చేయాలి.*_


ఓం సమస్త పరివారాయాచ్యుతాయ నమః, ఓం ధాత్రే నమః, ఓం విధాత్రే నమః, ఓం గంగాయై నమః, ఓం యమునాయై నమః, ఓం శంఖ నిధయే నమః ఓం పద్మనిధయే నమః, ఓం చండాయ నమః, ఓం ప్రచండాయ నమః, ఓం ద్వారిశ్రయై నమః, ఓం ఆధార శక్ష్యై నమః, ఓం కూర్మాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం శ్రియై నమః, ఓం ధర్మాయ నమః, ఓం జ్ఞానాయ నమః, ఓం వైరాగ్యాయ నమః, ఓం ఐశ్వర్యాయ నమః, ఓం అధర్మాయ నమః, ఓం అజ్ఞానాయ నమః, ఓం అవైరాగ్యాయ నమః, ఓం అనైశ్వర్యాయ నమః, ఓం సం సత్త్వాయ నమః, ఓం రం రజసే నమః, ఓం తం తమసే నమః, ఓం కం కందాయ నమః, ఓం నం నాలాయ నమః, ఓం లాం పద్మాయ నమః, ఓం అం అర్క మండలాయ నమః, ఓం సోం సోమమండలాయ నమః, ఓం వం వహ్నిమండలాయ నమః, ఓం విమలాయై నమః, ఓం ఉత్కర్షిణ్యై నమః, ఓం జ్ఞానాయై నమః, ఓం క్రియాయై నమః, ఓం యోగాయై నమః, ఓం పద్మ్యై నమః, ఓం సత్యాయై నమః, ఓం ఈశానాయై నమః,

ఓం అనుగ్రహాయై నమః.


_*ఈ నామ మంత్రాలతో, గంధ పుష్పాది ఉపచారాల ద్వారా పైన చెప్పబడిన దేవతలందరినీ నమస్కారపూర్వకంగా పూజించాలి.*_


_తదనంతరం పాప వినాశకుడైన, పరమేశ్వరుడైన విష్ణుభగవానుని మండలంలోకి ఆవాహన చేసి ఈ విధంగా పూజించాలి. ముందు మన శరీరంతో న్యాసం చేసినట్లుగానే ఇప్పుడు ప్రతిమతో చేయాలి. ముద్రాప్రదర్శన, అర్ఘ్య పాద్యాది ఉపచారాలతో పూజ చేసి, ప్రతిమకు, స్నాన, వస్త్ర, ఆచమన, గంధ, పుష్ప, ధూప, దీపాదులను సమర్పించి నైవేద్యంగా 'చరు'ని పెట్టాలి. ఆ మహాదేవునికి భక్తిగా ప్రదక్షిణ చేయాలి. తరువాత ఆయన మూల మంత్రాన్ని నూటయెనిమిది మార్లు జపించి ఆ జపాన్ని కూడా ఆయనకు అర్పించాలి. మరల ఆయన హృదయాదులను (ఓం హం హృదయాయ నమః నుండి హః అస్త్రాయ నమః దాకా) అలంకార, ఆయుధాదులను (శంఖం నుండి శారంగం దాకా)_


_*ఓం శంఖాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం చక్రాయ నమః, ఓం గదాయై నమః, ఓం శ్రీవత్సాయ నమః, ఓం కౌస్తుభాయ నమః, ఓం వనమాలాయై నమః, ఓం పీతాంబరాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం నారదాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం అగ్నయే నమః, ఓం యమాయ నమః, ఓం నిరృతయే నమః, ఓం వరుణాయ నమః, ఓం వాయవే నమః, ఓం సోమాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం సత్త్వాయ నమః, ఓం రజసే నమః, ఓం తమసే నమః, ఓం విష్వక్సేనాయ నమః ! అని పూజించి ఇతర దేవతలను కూడా ఇలా పూజించాలి.*_


ఓం శరాయ నమః, ఓం బ్రహ్మణే నమః,

ఓం నారదాయ నమః, ఓం పూర్వసిద్ధేభ్యో నమః,

ఓం భగవతేభ్యో నమః, ఓం గురుభ్యో నమః,

ఓం పరమ గురుభ్యో నమః।


_*అనంతరం దిక్పాలకులనూ, అనంతునీ, బ్రహ్మనీ సపరివారంగా ఆహ్వానించి ఈ మంత్రాలతో అర్చించాలి.*_


_ఓం ఇంద్రాయ సురాధిపతే సవాహన పరివారాయ నమః,


ఓం అగ్నయే తేజో ధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం యమాయ ప్రేతాధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం నిరృతయే రక్షో ధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం వరుణాయ జలాధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం వాయవే ప్రాణాధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం సోమాయ నక్షత్రాధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం ఈశానాయ విద్యాధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం అనంతాయ నాగాధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం బ్రహ్మణే లోకాధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం వజ్రాయ హుం ఫట్ నమః,


ఓం శక్యై హుం ఫట్ నమః,


ఓం దండాయ హుం ఫట్ నమః,


ఓం ఖడ్గాయ హుం ఫట్ నమః,


ఓం పాశాయ హుం ఫట్ నమః,


ఓం ధ్వజాయ హుం ఫట్ నమః,


ఓం గదాయై హుం ఫట్ నమః,


ఓం త్రిశూలాయ హుం ఫట్ నమః,


ఓం చక్రాయ హుం ఫట్ నమః,


ఓం పద్మాయ హుం ఫట్ నమః, మరియు


ఓం వౌం విష్వక్సేనాయ నమః,


_*ఓం మహాదేవా! ఈ విధంగా అందరినీ మంత్రాల ద్వారా పూజల ద్వారా సంతోష పెట్టిన తరువాత మరల అందరిలోనూ వ్యాపించియున్న వాసుదేవుడైన విష్ణుదేవుని ఇలా స్తుతించాలి.*_


విష్ణవే దేవ దేవాయ నమో వైప్రభవిష్ణవే ॥ 

విష్ణవే వాసుదేవాయ నమః స్థితి కరాయచ । 

గ్రసిష్ణవే నమశ్చైవ నమః ప్రళయశాయినే ॥ 

దేవానాం ప్రభవే చైవ యజ్ఞానాం ప్రభవే నమః । 

మునీనాం ప్రభవే నిత్యం యక్షాణాం ప్రభవిష్ణవే ॥ 

జిష్ణవే సర్వ దేవానాం సర్వగాయ మహాత్మనే । 

బ్రహ్మేంద్ర రుద్ర వంద్యాయ సర్వేశాయ నమోనమః ॥ 

సర్వలోక హితార్థాయ లోకాధ్యక్షాయవై నమః । 

సర్వగోప్తే సర్వకర్తే సర్వదుష్ట వినాశినే ॥ 

వరప్రదాయ శాంతాయ వరేణ్యాయ నమోనమః | 

శరణ్యాయ సురూపాయ ధర్మకామార్థదాయినే ॥


శంకరదేవా! ఏ విధంగా బ్రహ్మ స్వరూపుడు, అవ్యయుడు, పరాత్పరుడునైన విష్ణుభగవానుని స్తుతించి సాధకుడు తన హృదయంలో ఆయనను చూడగలిగి ధ్యానించాలి. తరువాత మూలమంత్ర జపాన్ని చేస్తూ ధ్యానించాలి. ఈ రకంగా చేయగలిగిన వానికి విష్ణువు వశుడౌతాడు. హే రుద్రదేవా! ఈ విధంగా ఒక రహస్య పూర్ణ పరమగుహ్య, భుక్తి ముక్తి ప్రద, * విష్ణు ఉత్తమ పూజా విధానాన్ని మీరు నాచే పలికించారు. విద్వాంసుడైన పురుషుడీ పూజను పఠించగానే విష్ణుభక్తశ్రేష్ఠుడై వెలుగొందుతాడు. దీనిని విన్నవారు, చెప్పినవారు విష్ణులోక ప్రాప్తి నొందుతారు.

(28-31అధ్యాయాలు సమాప్తం.)

గరుడ పురాణం_*25వ

 *గరుడ పురాణం_*25వ భాగం*



_*శ్రీ గోపాలదేవుని పూజ - శ్రీధరపూజ త్రైలోక్యమోహన మంత్రం:*_


_ఋషులారా! నేనిపుడు భోగమోక్షదాయకాలైన విష్ణురూప దైవతములు గోపాల, శ్రీధరుల పూజా విధానాన్ని వినిపిస్తాను. ముందుగా పూజ కొఱకొక మండలాన్నేర్పాటు చేసి దాని ద్వార ప్రదేశంలో గంగాయమునలనూ, బ్రహ్మ యొక్క శక్తులైన ధాత, విధాతలనూ పూజించాలి. తరువాత లక్ష్మి, శంఖం, పద్మనిధి, శారంగధనువు, శరభాలను పూజించాలి. ఆ తరువాత తూర్పు దెసలో భద్ర, సుభద్రలకూ, దక్షిణ దిశలో చండ ప్రచండులకూ, పడమటి దిక్కున బల, ప్రబలులకూ, ఉత్తరం వైపున జయ విజయులకూ పూజలు చేయాలి. పిమ్మట నాలుగు ద్వారాలలో క్రమంగా లక్ష్మి, గణపతి, దుర్గ, సరస్వతమ్మలను పూజించాలి._


_*మండలం ఆగ్నేయాది కోణాల్లో పరమ భాగవతోత్తముడైన నారదునీ, సిద్ధులనూ, గురుగ్రహాన్నీ, నలకూబరునీ స్థాపించి పూజించాలి. తూర్పు వైపు విష్ణువునీ విష్ణుశక్తినీ అర్చించాలి. మండలంలో విష్ణు పరివారాన్ని స్థాపించి పూజించాలి. మండలమధ్యంలో శక్తి కూర్మ, అనంత, పృథ్వి, ధర్మ, జ్ఞాన, వైరాగ్య మూర్తులకు ఆగ్నేయాది కోణాల్లో పూజలు చేయాలి. వాయవ్య కోణంలోనూ ఉత్తర దిశలోనూ ప్రకాశ, ఐశ్వర్యాలను పూజించాలి.*_


_*"గోపీజన వల్లభాయ స్వాహా "*_ 

_ఇది గోపాల మంత్రం. ఈ మంత్రాన్ని జపిస్తూ మండలంలో తూర్పుతో మొదలెట్టి క్రమంగా ఎనిమిది వైపులా కృష్ణపత్నులైన సుశీల, జాంబతి, రుక్మిణి, సత్యభామ, సునంద, నాగ్నజితి, లక్షణ, మిత్రవిందలను స్థాపించి ఆ తరువాత వారిని పూజించాలి. వెంటనే శ్రీ గోపాలదేవుని శంఖ, చక్ర, గద, పద్మ, ముసల, ఖడ్గ, పాశ, అంకుశ, శ్రీవత్స, కౌస్తుభ, ముకుట, వనమాలాది చిహ్నాలను పూజించాలి. పిమ్మట ఇంద్రాది ధ్వజపాలక దిక్పాలకునూ, విష్వక్సేనునీ, లక్ష్మీసహిత శ్రీకృష్ణ భగవానునీ అర్చించాలి._


_*గోపీ జన వల్లభ మంత్రాన్ని జపించి, ధ్యానించి, సాంగోపాంగంగా ఆయన పూజను పై విధంగా చేసే వారికి సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది.*_


_*త్రైలోక్యమోహన శ్రీధరీయ మంత్రం :*_


_ఓం శ్రీం (లేదా శ్రీః) శ్రీధరాయ త్రైలోక్య మోహనాయ నమః ।_


_క్లీం పురుషోత్తమాయ త్రైలోక్య మోహనాయ నమః |_


_ఓం విష్ణవే త్రైలోక్య మోహనాయ నమః ।_


_ఓం శ్రీం హ్రీం క్లీం త్రైలోక్యమోహనాయ విష్ణవే నమః ।_


_*ఈ మంత్రం సమస్త ప్రయోజనాలనూ సంపూర్ణంగా కలిగిస్తుంది.*_


_మహర్షులారా! ఇపుడు శ్రీధర భగవానుని అనగా విష్ణుదేవుని మంగళమయమైన పూజా విధానాన్ని వర్ణిస్తాను. సాధకుడు ముందుగా ఈ క్రింది మంత్రాలతో అంగన్యాసమును చేయాలి._


ఓం శ్రాం హృదయాయ నమః, 

ఓం శ్రీం శిరసే స్వాహా, 

ఓం శ్రూం శిఖాయై వషట్, 

ఓం శైం కవచాయ హుం, 

ఓం శ్రౌం నేత్రత్రయాయ వౌషట్, 

ఓం శ్రః అస్త్రాయ ఫట్.


_*అనంతరం శంఖ, చక్ర, గదాది స్వరూపిణీ ముద్రలను ప్రదర్శించి వాటిని ధరించి యున్న ఆత్మస్వరూపుడైన శ్రీధర భగవానుని ఇందాకటి మంత్రంతో ధ్యానించాలి. స్వస్తిక లేదా సర్వతో భద్రమండలాన్ని సిద్ధం చేసి శ్రీ భగవానుని ఆసనాన్ని పూజించి ఆ స్వామిని  "ఓం శ్రీధరాసన దేవతా ఆగచ్ఛత " అని ఆవాహనం చేయాలి.*_


_*ఈ క్రింది మంత్రాలతో ఆసన పూజ చేయాలి._


_*ఓం సమస్త "పరివారాయాచ్యుతా సనాయ నమః " అపై*_


_ఓం ధాత్రే నమః, ఓం విధాత్రే నమః లతో మొదలెట్టి ధాతా, విధాతా గంగాది దేవతలను ఈ క్రింది మంత్రాలతో పూజించాలి._


ఓం గంగాయై నమః, 

ఓం యమునాయై నమః, 

ఓం ఆధార శక్ష్యై నమః, 

ఓం కూర్మాయ నమః, 

ఓం అనంతాయ నమః, 

ఓం పృథివ్యై నమః, 

ఓం ధర్మాయ నమః, 

ఓం జ్ఞానాయ నమః, 

ఓం వైరాగ్యాయ నమః, 

ఓం ఐశ్వర్యాయ నమః, 

ఓం అధర్మాయ నమః, 

ఓం అజ్ఞానాయ నమః,

ఓం అవైరాగ్యాయ నమః, 

ఓం అనైశ్వర్యాయ నమః, 

ఓం కందాయ నమః, 

ఓం నాలాయ నమః, 

ఓం పద్మాయ నమః, 

ఓం విమలాయై నమః, 

ఓం ఉత్కర్షిణ్యై నమః, 

ఓం జ్ఞానాయై నమః, 

ఓం క్రియాయై నమః, 

ఓం యోగాయై నమః, 

ఓం ప్రహ్ వ్యై నమః, 

ఓం సత్యాయై నమః, 

ఓం ఈశానాయై నమః, 

ఓం అనుగ్రహాయై నమః.


మరల శ్రీధర దేవుని ఇలా అంటూ ఆవాహన చేసి పూజ చేయాలి.


_*ఓం హ్రీం శ్రీధరాయ త్రైలోక్య మోహనాయ విష్ణవే నమః ఆగచ్ఛ ।*_


_ఈ పూజానంతరము లక్ష్మీదేవిని ఓం శ్రియై నమః అంటూ పూజించాలి. ఆ తరువాత_


_*ఈ క్రింది మంత్రాలతో షడంగ న్యాసం చేయాలి.*_


ఓం శ్రాం హృదయాయ నమః,

ఓం శ్రీం శిరసే నమః,

ఓం శ్రూం శిఖాయై నమః,

ఓం శైం కవచాయ నమః,

ఓం శ్రౌం నేత్రత్రయాయ నమః,

ఓం శ్రః అస్త్రాయ నమః.


_అనంతరము స్వామివారి ఆయుధాలనూ ఆభరణాలనూ అవరోధ వ్రాతము (పరివారము)నూ ఈ మంత్రాలతో అర్చించాలి._


ఓం శంఖాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం చక్రాయ నమః, ఓం గదాయై నమః, ఓం శ్రీవత్సాయ నమః, ఓం కౌస్తుభాయ నమః, ఓం వనమాలాయై నమః, ఓం పీతాంబరాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం నారదాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం అగ్నయే నమః, ఓం యమాయ నమః, ఓం నిరృతయే నమః, ఓం వరుణాయ నమః, ఓం వాయవే నమః, ఓం సోమాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం సత్త్వాయ నమః, ఓం రజసే నమః, ఓం తమసే నమః,

ఓం విష్వక్సేనాయ నమః !


_*ఈ దేవస్వరూపాలను షడంగన్యాస, అస్త్రపూజలతో తృప్తిపఱచిన పిమ్మట విష్ణుభగవానుని మూర్తిని అభిషేకించి వస్త్ర యజ్ఞోపవీతాలతో సింగారించి గంధ పుష్ప ధూప దీపాలను నివేదించి ప్రదక్షిణ చేయాలి. నైవేద్యం పెట్టి, మూలమంత్రాన్ని నూట యెనిమిదిమార్లు జపించి దాని ఫలాన్ని కూడా శ్రీధర భగవానునికి సమర్పించి వేయాలి.*_


_ఒక ముహూర్తం పాటు కనులు మూసుకొని సాధకుడు తన హృదయ దేశంలో పరిశుద్ధ స్ఫటిక మణి సమానకాంతులతో విరాజిల్లువాడు, కోట్ల సూర్యుల ప్రభలతో వెలుగొందువాడు, ప్రసన్నముఖుడు, సౌమ్యముద్రలోనుండువాడు, ధవళ మకర కుండలాలతో శోభిల్లువాడు, ముకుటధారి, శుభలక్షణ సంపన్నములైన అంగములు గలవాడు, వన మాలాలంకృతుడునగు శ్రీధర దేవుని పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానించాలి. తరువాత ఈ క్రింది స్తోత్రాన్ని చదవాలి._


శ్రీనివాసాయ దేవాయ నమః శ్రీపతయే నమఃl 

శ్రీధరాయ సశారంగాయ శ్రీప్రదాయ నమో నమః ॥ 

శ్రీవల్లభాయ శాంతాయ శ్రీమతే చనమో నమఃl 

శ్రీ పర్వత నివాసాయ నమః శ్రేయస్కరాయ చ ॥ 

శ్రేయసాం పతయే చైవ హ్యాశ్రయాయ నమో నమఃl శరణ్యాయ వరేణ్యాయ నమో భూయో నమో నమః ll 

స్తోత్రం కృత్వా నమస్కృత్య దేవదేవం విసర్జయేత్ ll 


_*విష్ణువు శివునికి ఈ విధంగా ఉపదేశించాక శివుడు అత్యంత దుస్తరమైన భవసాగరాన్ని సులువుగా దాటించే పూజా విధానమేదైనా వినిపించుమని అభ్యర్థించాడు. దానికి విష్ణువు ఇలా చెప్పాడు (అని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పసాగాడు)*_

*శ్రీ అమరలింగేశ్వర స్వామి* *అమరావతి*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

    *శ్రీ అమరలింగేశ్వర స్వామి*

              *అమరావతి*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*పంచారామాలలో మొట్టమొదటిది ‘అమరారామం’.* 


*అమరారామము,కొమరారామమ, భీమారామము, ద్రాక్షారామము, క్షీరారామములలో మొదటిది.*


*ఇక్కడ 'అమరేశ్వరస్వామి' కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామి ముఖం ‘అఘోర’ రూపంలో ఉంటుంది. అమ్మవారు ‘బాల చాముండేశ్వరి’. ఆమె శాంతి స్వరూపురాలిగా ఇక్కడ కొలవై ఉన్నారు.*


*శంకరుడులో ‘శం’ అంటే శుభాన్ని, ‘కరుడు’ అంటే కలిగించే వాడనే అర్థం దాగుంది.*


*స్థల పురాణం ప్రకారం తారకాసుర సంహారం జరిగినప్పుడు కుమారస్వామి తారకుని కంఠంలో ఉన్న శివలింగాన్ని చేధించగా ఏర్పడిన అయిదు శకలాల్లో (ముక్కలు) పెద్దది, మొదటి శకలం పడిన చోటు ఈ అమరారామం.*


*ఇక్కడ అభించిన శాసనాలలో అమరావతి పూర్వనామం ధష్టుకడ (ధరణికోట) లేక ధాన్యకటకం అన్న పేర్లే కాని అమరావతి అన్న పేరు కన్పించదు. అమరావతిలో ఒకప్పడు బౌద్ధ స్తూపం వుండేది. అది అద్భుత శిల్పకళకు పుట్టినిల్లు. మరుగున పడిపోయిన ఆ స్తూపపు అవశేషాలను వెలికి తీసి ఆంగ్లేయులు చాలవరకు లండన్ మ్యూజియానికి తరలించారు. అమరావతి శిల్పాలు ప్రపంచ ఖ్యాతిని పొందాయి. మిగిలిన కళాఖండాలను ఇక్కడ నెలకొల్పిన మ్యూజియంలో భద్రపరచి ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ బుద్ధ భగవానుని ఆస్థికావశేషాలున్న స్ఫటికపు భరిణె లభించింది. భారతీయ శిల్పకళకు అమరావతి కళ శిరోభూషణమని కళాకోవిదులు వ్రాశారు. అమరావతి కళ తనదైన ఒక బాణీని ఏర్పరచుకొని అమరావతి శిల్పరీతిగా ప్రపంచ ప్రస్థిది పొందింది.*


*ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం.*


*కృష్ణా నదీ తీరంలో వెలసిన మహా మహిమాన్విత పుణ్యక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో అమరేశ్వర లింగాన్ని దేవేంద్రుడు ప్రతిష్టించాడు. అందువల్లే ఇక్కడి శివయ్య అమరేశ్వరుడయ్యాడు. ఈ క్షేత్ర మహత్యం గురించి స్కంధ, బ్రహ్మ, పద్మ పురాణాలలో చెప్పారు.*


*ఈ ఆలయానికి మూడు ప్రాకారాలున్నాయి. నాలుగు దిక్కులా నాలుగు ధ్వజ స్తంభాలు వున్నాయి.  ఇక్కడ ప్రణవేశ్వర, అగస్తేశ్వర, కోసలేశ్వర మొదలగు శివలింగాలే కాక ఇంకా అనేక దేవతా మూర్తులున్నారు. రెండవ ప్రాకారంలో వున్న కాలభైరవుడు ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు. మూడవ ప్రాకారంలో నైరుతిలో కాశీ ,శ్రీశైల మల్లికార్జునుడు, వాయువ్య దిశలో విశ్వేశ్వరుడు, ఈశాన్యంలో చండీశ్వరుడు, ఆగ్నేయంలో శ్రీకాళహస్తీశ్వరుడు ప్రతిష్ఠింపబడ్డారు.*


*భౌగోళికంగా ఆ పుణ్య క్షేత్రాలు అమరావతికి ఆ దిక్కుల్లోనే వుండటం గమనించదగ్గ విషయం.*


*శివ కేశవులకు బేధము లేదని నిరూపిస్తూ వేణు గోపాల స్వామి ఆలయం కూడా ఈ ప్రాకారంలో వుంది. దక్షిణ ముఖంగా ముఖ మండపం, తూర్పు ద్వారానికి ఎదురుగా కృష్ణవేణి ప్రవాహం ఉంది. దీనినే "‘పంచాయతన క్షేత్రం"’ అంటారు.*


*రాక్షసులకు మరియు దేవుళ్ళకు జరిగిన యుద్ధములో దేవుళ్ళు ఓడిపోవడంతో పరమ శివుడిని ఆశ్రయించగా అప్పుడు దేవతామూర్తులను ఈ అమరావతిలో ఉంచి రాక్షసులను ఈ ప్రాంతములోనే వధించాడు. అమరులను ఈ ప్రదేశంలో కాపాడాడు కనుక  అమరావతి అని పిలువబడుతుంది.*


*ఈ అమరావతికి ఒక పురాణ కథ కూడా వుంది. దేవేంద్రుడు అహల్యా జారుడై తత్పాప పరిహారార్ధం ఇక్కడ శివలింగమును ప్రతిష్ఠించాడని దేవతల ప్రభువైన సురేంద్రుని చేత ప్రతిష్టించబడినది గాబట్టి ' అమరావతి ' నామము సార్ధకంగా ప్రసిద్ధమయినది అని అంటారు. ఈ శివలింగం ఒకానొక కాలంలో ఆ శ్రీరామచంద్రుని చేత పూజించబడ్డ శివలింగంగా ప్రసిద్ధిగాంచింది.*


*అమరావతి ఆలయంలో లింగం చాల పొడవుగా వుంటుంది. ఇక్కడ ప్రచారంలో వున్న కథ ప్రకారం ఈ లింగం 'పెరుగుతూ వుండేదట. అందువలన ఎప్పటికప్పుడు గుడిని పెంచవలసి వస్తుండేది. చివరకు విసుగుచెంది అర్చకులలో వొకరు స్వామిపై ఒక మేకు కొట్టారు. అంతటితో లింగం పెరుగుదల ఆగిందట. దీనిని నిదర్శనంగా తెల్లని లింగంపై ఎర్రని (నెత్తుటి) చారికలను చూపిస్తారు. మేకు కొట్టినప్పుడు కారిన నెత్తుటి చారికలన్నమాట. ఈ లింగం 3 అడుగుల చుట్టుకొలతతో 60 అడుగుల ఎత్తు వుంటుంది.*


*ఇక్కడ కొలువుతీరిన అమ్మవారు బాలచాముండిక.  ఈ దేవేరి శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణిపబడుతోంది. భక్తుల ఈతి బాధలనుండి విముక్తి కలిగించి మనశ్శాంతిని, సుఖసంతోషాలను ప్రసాదించే చల్లని తల్లి అని భక్తులు భావిస్తారు.ఈ ప్రాంతాన్ని దర్శించినంత మాత్రానే మనలోనూ నూతన శక్తి ప్రవేశిస్తుందని భక్తుల నమ్మకం.*


*త్రిలోక ప్రసిద్ధమైన ఈ అమరేశ్వర తీర్థం ఉత్తమమైంది. అమరేశ్వరస్వామిని దర్శించడం వలన వేయి గోవులను దానమిచ్చిన ఫలితంతో పాటు, పునర్జన్మ ఉండదని పురాణ ప్రవచనం. ఇక్కడ శివుణ్ణి ప్రణవేశ్వరుడు, అగస్తేశ్వరుడు, కోసలేశ్వరుడు, సోమేశ్వరుడు, పార్థివేశ్వరుడు అనే నామాలతో కీర్తిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో మూడు రోజులు వరుసగా కృష్ణానదిలో స్నానం చేసి అమరలింగేశ్వరుడిని పూజించిన వారు మరణానంతరం శివ సాన్నిద్యం పొందుతారని భక్తుల విశ్వాసం.*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(83వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం* 

*చిన్ని కృష్ణుడు - పూతన సంహారం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*నందగోపుడు బంధువు.అతన్ని పలకరించేందుకు వచ్చాడు వసుదేవుడు. వసుదేవుణ్ణి చూస్తూనే నందుడు లేచి కౌగిలించుకున్నాడు. కంసుని చెరలో దేవకీ వసుదేవులు కష్టాలపాలయిన సంగతి తలచుకుని, కన్నీరు పెట్టుకున్నాడు. నందుడు కన్నీరు పెట్టుకోవడం గమనించక ఎటో చూస్తూ ఆందోళన చెందసాగాడు వసుదేవుడు.*


*అతని ఆందోళనను గమనించి ఆశ్చర్యపోయాడు నందుడు. కన్నీరు తుడుచుకుని అడిగాడు.‘‘ఏమైంది వసుదేవా? ఎందుకలా ఆందోళనగా ఉన్నావు?’’ ‘‘గోకులానికి ఏదో కీడు మూడనున్నట్టుగా అపశకునాలు తోస్తున్నాయి. దయచేసి నువ్వు తొందరగా వ్రేపల్లెకు బయల్దేరు.’’ చెప్పాడు వసుదేవుడు. అతని మాటను కాదనలేదు నందుడు. వెంటనే పరివారంతో వ్రేపల్లెకు బయల్దేరాడు.*


*పూతన సంహారం:-*


*కంసుని అనుచరి పూతన. రాక్షసి. పిల్లలను చంపుతుందది. దానిని ‘పూతిక’ అని కూడా అంటారు.*


*ఈ పూతన పూర్వజన్మలో బలి చక్రవర్తి కూతురు. పేరు రత్నమాల. శ్రీహరి వామనమూర్తిగా వచ్చి, బలిచక్రవర్తిని దానం అడిగినప్పుడు చూసిందతన్ని. బాలవటువు బాగున్నాడని ముచ్చటపడింది. పుత్రప్రేమ కలిగిందామెకు. ఇలాంటి బాలుడికి చన్నుకుడిపి, పాలు తాగించే అదృష్టానికి నోచుకుంటే బాగుండుననుకున్నది. ఆ కోరికను గ్రహించిన శ్రీహరి, వచ్చే జన్మలో ఆమె కోరిక తీర్చాలనుకున్నాడు.* 


*ఫలితంగానే పూతన జన్మించింది. కంసుని ఆజ్ఞమేరకు పూతన పల్లెలు, పట్టణాలు తిరుగుతూ కనిపించిన శిశువునల్లా చంపుతూ వస్తోంది. వ్రేపల్లెకు చేరుకుంది.*


*రాక్షసి రూపంలో గాక చక్కని స్త్రీరూపం ధరించి మరీ చేరుకుందక్కడికి. పట్టుచీరె కట్టుకుంది. మల్లెపూలు పెట్టుకుంది. చెవులకు అద్భుతమయిన కుండలాలు ధరించింది. నడుస్తోంటే కుండలాలు ఊగుతూ కాంతులు విరజిమ్ముతోంటే చూసిన ప్రతి ఒక్కరూ పూతనను మామూలు స్త్రీ కాదు, ఎవరో దివ్యాంగన అనుకున్నారు. ఊరంతా తిరిగింది పూతన. ఆఖరికి నందుడి ఇంటికి చేరింది.*


*చిన్ని కృష్ణుణ్ణి చూసిందక్కడ. యశోద, రోహిణి అతన్ని ముద్దు చెయ్యడాన్ని చూసి, ముందుకొచ్చింది. చిన్నికృష్ణుడు అప్పుడు ఉయ్యాలలో పడుకుని ఉన్నాడు. వస్తున్నది పూతన అని తెలుసతనికి. ఆమె రాక్షసి అని తెలుసు. అయినా ఏమీ తెలియని వాడిలా కళ్ళుమూసుకుని, పిడికిళ్ళు బిగించి పడుకున్నాడు*


*‘‘పిల్లాడు ముద్దొస్తున్నాడు.’’ అన్నది పూతన. కృష్ణుని బొజ్జనొక్కి చూసింది. మెత్తగా ఉన్నది.‘‘కడుపులో పాలులేవు. ఆకలి మీద ఉన్నాడు.’’ అన్నది.*


*యశోద అనుమతి కోసం చూడలేదు. రోహిణి ఏమంటుందోనని భయపడలేదు. కృష్ణుణ్ణి అందుకున్నది. ఒడిలో పెట్టుకున్నది. ఏడుస్తున్న కృష్ణుణ్ణి ఓదారుస్తున్నట్టుగా ఎత్తి ఆడిస్తూ, తర్వాత పాలు కుడిపేందుకు రవికె ముడి విప్పింది. చిన్నికృష్ణుని నోటికి చన్ను అందించింది. ఆనందాశ్చర్యాలలో ఉన్నారు యశోద, రోహిణి. మంత్రముగ్ధుల్లా ఇద్దరూ వారించలేదామెను. తనపాలలో విషాన్ని నింపుతుంది పూతన. ఆ పాలను తాగితే చాలు, చనిపోతారు పిల్లలు. చాలా మంది పిల్లల్ని అలాగే చంపింది.*


*ఈ కృష్ణుడో లెక్కా అనుకుంది. అయితే అందుకు భిన్నంగా జరిగిందంతా. పూతన పాలనే కాదు, ఆమె ప్రాణాలను కూడా పీల్చేశాడు కృష్ణుడు. బాధను భరించలేకపోయింది పూతన. చన్ను నుంచి చిన్నికృష్ణుణ్ణి వేరు చేసేందుకు ప్రయత్నించింది. వీలుకాలేదు. కృష్ణుడు గట్టిగా పట్టుకున్నాడు.*


*‘‘వదులు కృష్ణా! వదులు’’ అంటూ రోదించింది పూతన. వదల్లేదు కృష్ణుడు. లాగి లాగి ఆఖరికి ఆమె ప్రాణాలను హరించాడు. చెమటలు పట్టిపోయింది పూతన. కాళ్ళూ చేతులూ కొట్టుకుంది. పెద్దగా అరుస్తూ వెల్లకిలా పడిపోయింది. ఆమె అరుపునకు భూమి వణికి పోయింది. కొండలు దద్దరిల్లాయి. ఆకాశం కంపించింది. గ్రహతారకలు ఒక్క క్షణం గతులు తప్పి అంతలోనే సర్దుకున్నాయి. అధోలోకాలు అదిరిపడ్డాయి. దిక్కులు ప్రతిధ్వనించాయి. ఒక్కసారిగా వందలాది పిడుగులు పడ్డట్టుగా వినవచ్చిన ఆ శబ్దానికి వ్రేపల్లెవాసులు మూర్ఛపోయారు. చనిపోయిన మరుక్షణం పూతన తన నిజరూపంతో ప్రత్యక్షమయింది. పెద్దపెద్ద కోరలతోనూ, కొండగుహలంత నాసికారంధ్రాలతోనూ, కొండల్లాంటి కుచాలతోనూ, పాడుబడిన బావుల్లాంటి కళ్ళతోనూ, నీళ్ళింకిన చెరువంతటి కడుపుతోనూ, ఎర్రటిజుట్టుతోనూ పూతన నేల మీద వెల్లకిలా పడడంతో చుట్టుపక్కల ఆరుకోసుల వరకూ ఉన్న చెట్లూ, మానులూ ఫెళఫెళా విరిగిపడ్డాయి. పూతన శవాన్ని చూసి పరుగులు పెట్టారు ప్రజలు. చిన్నికృష్ణుడు మాత్రం ఎలాంటి ఆందోళనా చెందక దాని శరీరం మీద ఆడుకోసాగాడు.*


*జరిగింది చూస్తూ యశోదా, రోహిణీ తదితరులు చాలాసేపటి వరకు మనుషులు కాలేకపోయారు. అచేతనులయ్యారు. తర్వాత తేరుకున్నారు. తేరుకుని పరుగుదీసి, పూతన మీద ఆడుకుంటున్న కృష్ణుణ్ణి అందుకున్నారు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*భ్రమరాంబా పతియైన మల్లికార్జునుని భ్రమరాధిపతిగా నిరూపించి, ఆభ్రమరాధిపతిని, తన మానస కమలమునందు విహరించుమని శంకరులు ఈ శ్లోకంలో వేడు కుంటున్నారు.*


*శ్లోకం : 51*


*భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీస్ఫురన్మాధవా*


*హ్లాదోనాదయుతోమహాసితవపుఃపంచేషుణాచాదృతః*


*సత్పక్షస్సుమనోవనేషుస పునస్సాక్షాన్మదీయే మనో*


*రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః !!*


*గమనిక:~*


*ఈ శ్లోకంలోని విశేషణములు అన్నీ భ్రమరాంబాధిపతియైన శ్రీశైల మల్లికార్జునునికీ తుమ్మెదల అధిపతికీ అన్వయించేలా శ్లేషలో కూర్చబడ్డాయి.*


*భావము - వివరణ :~*


*ఈ శ్లోకంలో శంకరులు భ్రమరాధిపతి అనగా గండు తుమ్మెదను పోలిక చేసుకొని, భ్రమరాంబాధిపతియైన శ్రీ శైలవాసియైన ప్రభువు మల్లికార్జునుని వర్ణించారు.*


*భ్రమరాధిపతి(తుమ్మెద)  - ఆడుతుమ్మెద ఇచ్ఛననుసరించి సంచరిస్తుంది. శివుడు  _  భృంగి అనే ప్రమథగణములలోనివాడూ, శివద్వార పాలకుడూ అయిన నందికేశ్వరుని ఇచ్ఛననుసరించి నాట్యము చేస్తాడు.*


*భ్రమరపతి(తుమ్మెద) ఏనుగుల మదజలముగ్రహిస్తుంది. శివుడు గజాసురుని మదాన్ని అణచాడు.*


*తుమ్మెద వసంత ఋతువుచే ఆనందిస్తుంది. శివుడు మాధవుని ద్వారా ఆనందించాడు.*


*తుమ్మెద ఝంకారం చేస్తుంది. ఈశ్వరుడు ప్రణవనాదంతో కూడుకున్న వాడు.*


*తుమ్మెద మిక్కిలి నల్లని ఆకృతి కలది. శివుడు తెల్లని ఆకారం గలవాడు*


*తుమ్మెద భ్రమరాధిపతి. శివుడు భ్రమరాంబకు అధిపతి.*


*తుమ్మెద మన్మథునిచే సహాయంగా స్వీకరింప బడుతుంది. శివుడు మన్మథునిచే బాణ లక్ష్యంగా చేసికోబడ్డాడు.*


*తుమ్మెద అనగా భ్రమరాధిపతి పూలతోటలయందాసక్తి గలవాడు.*


*శివుడు కూడా విష్ణువువలె రక్షణకర్తయే. శివుడు కూడా విష్ణువు వలె అనేకావతారములను ధరించాడు. శివుడు దక్షిణామూర్తిగా అవతరించి, సనకాదులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు. యక్షరూపాన్ని ధరించి దేవతల అహంకారాన్ని పోగొట్టాడు. కిరాత రూపం ధరించి బ్రహ్మను శిక్షించాడు, అర్జునునికి పాశుపతాస్త్రం అనుగ్రహించాడు. విష్ణువు అర్చావతారములు ధరించి నట్లుగా శివుడనేక చోట్ల జ్యోతిర్లింగ మూర్తిగా వెలశాడని శాస్త్రములు చెబుతున్నాయి.*


*కాబట్టి అదృష్టవంతులూ, శ్రద్ధ గలవారూ శ్రీశైల మల్లికార్జునుని సేవించి ధన్యులౌతారు.*


*"సర్వః సద్బుద్ధిమ్ ఆప్నోతు " . ప్రతి వ్యక్తికీ శివుణ్ణి పూజించాలనే సద్బుద్ధి కలుగుగాక*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

భక్తి మాత్రమే ముఖ్యం!

 *🙏🏿భక్తి మాత్రమే ముఖ్యం!*

                  

*ఒక్కోసారి మనకు అర్ధం పర్దం లేని ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయ్ . పూజానియమాలు తెల్సుకోవడం మంచిదే, పూజలో దోర్లుతున్న తప్పులను సవరించుకోవడం మంచిదే కాని వాటికోసం పూజనే మానివేయడం తప్పు.* 


*దేవుడు ఎంత కారుణ్య మూర్తో చూడండి …*


*భక్తకన్నప్ప పెట్టిన నైవేద్యం ఏమిటి...?  జింక మాంసం..!                           *ఆయన భక్తితో పెట్టిన నైవేద్యం కాబట్టి దేవుడు స్వీకరించాడు. కాని దేవుడు “ఛీ నీచుడా...! నీకు ఏమి నైవేద్యంగా పెట్టాలో తెలియదు. నువ్వు స్నానం చేసావా ముందు.   విభూది కూడా పెట్టుకోలేదు దూరం జరుగు!” అనలేదు. పరమ సంతోషంతో స్వీకరించాడు.* 


*ఇక్కడ అర్ధం చేస్కోవాల్సింది అందర్నీ జింక మాంసం పెట్టమని కాదు శివుడికి జింక మాంసం ఇష్టం అని కాదు. నువ్వు భక్తితో ఏది పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు అనేది గ్రహించండి.*


*గజేంద్ర మోక్షం లో గజ రాజు ప్రాణం పోతున్న సమయంలో స్వామి వారిని పిలిస్తే వైకుంఠం నుండి పరుగెత్తుకుని మరీ వచ్చాడు ..   పైగా తను నిత్యం ధరించే శంఖు చక్రాలను ధరించకుండా. లక్ష్మి దేవికి కూడా చెప్పకుండా వచ్చి రక్షించాడు. అంతే కాని నీ చిన్నప్పటి నుంచి ఒకసారి కూడా పూజ చేయలేదు. ఈ ఆపద వేళలో మాత్రమే నీకు గుర్తుకు వచ్చానా .. నీ చావు నువ్వు చావు అనలేదు. ఆపదలో ఉన్నవాణ్ణి ఆర్తితో పిలిచినవాడిని, నీవుదప్ప వేరెవరూ లేరని సంపూర్ణ శరణాగతుడవైతే అప్పుడు శ్రీహరి నిన్ను కాపాడటానికి ఏ రూపంలో ఐనా సరే, ఏ సమయంలో నైనా సరే వచ్చి కాపాడతాడు, అదే ఆయన నైజం.*


*ద్రౌపతి వస్త్రాపహారణ వేళ నిండు సభలో రక్షించు వారెవరూ లేనప్పుడు ఇతరులెవ్వరు తనకు అండలేనప్పుడు ‘అన్నా శ్రీ కృష్ణా!’ అంటే వెంటనే వచ్చి వస్త్రాలు ఇచ్చి రక్షించాలేదా...?*


*తరువాత  వస్తాను. అప్పటివరకు నన్ను తలచకు అని చెప్పలేదే. భక్తీతో…”స్వామీ నీవే తప్ప నన్ను రక్షించేది ఎవరు”  అని శరణు వేడితే తప్పకుండా ఏదో ఒక రూపం లో స్వామి పలుకుతాడు. ఇక్కడ మనకు కావలసింది సంపూర్ణ భక్తి మాత్రమే...!*


*పూజ చేసేటప్పుడు ఎన్ని వత్తులు వెయ్యాలి .. అవి ఏ దిక్కుకు తిప్పాలి . ఏ నూనేతో వెలిగించాలి అంటూ పూజ ప్రారంభం లోనే సవాలక్ష ప్రశ్నలతో మొదటిలోనే ఆగిపోతే, ఎప్పుడు ప్రార్థించాలి, ఎప్పుడు శరణాగతుడవు కావాలి, అందుకే ఎప్పుడైనా ఒక్కటే గుర్తు పెట్టుకో .. స్వామి కి కావాల్సింది భక్తి తప్ప హంగులూ ఆర్భాటాలు కావు. ఏదైనా పూజలోనో వేరే ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు తప్పులు దొర్లితే “స్వామీ ఏదైనా తెలియక తప్పు చేస్తే క్షమించు తండ్రి!” అంటే అయన చిరునవ్వుతో మన్నిస్తాడు. తెలిసి కూడా తప్పుచేసి దాచేద్దాం అనుకుంటూ చేసే పనులు మాత్రం చేయకూడదు, ఎందుకంటే సర్వవ్యాపితుడైన అతని ముందు ఏదీ దాయటం కుదరదు గాక కుదరదు.*✍️


.                      🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

ఇచ్చాశక్తి -- జ్ఞానశక్తి -- క్రియా శక్తి

 🙏 ఇచ్చాశక్తి -- జ్ఞానశక్తి -- క్రియా శక్తి🙏


"ఇచ్చాశక్తి - జ్ఞానశక్తి --క్రియా శక్తి స్వరూపిణి "

అని లలితా సహస్రంలో వాగ్దేవతలు చెప్పారు..


యంత్రమనగా ఆరాధించే దేవత యొక్క శక్తి స్వరూపము.ఆ దేవతాశక్తి ఆ యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది. మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగా భావించారు.అవి

1) ఇచ్ఛాశక్తి

2) జ్ఞానశక్తి

3) క్రియాశక్తి.


ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే 'ఇచ్ఛ' (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎలా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ ఆలోచనాజ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరుపుటయే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు.


. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయికే.


ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రం లోని త్రికోణంలో మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే..


 మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిసిన శక్తినే ‘ప్రకృతి’ అని, ‘పరాశక్తి’ అని, ‘అవ్యక్తం’, ‘శుద్ధమాయ’ అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మనిచ్చినది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తు లన్నింటినీ ఆ జగన్మాత అయిన పరాశక్తి, వారికి అందిస్తోంది


సదాశివశక్తుల యొక్క ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనునవి మనోవాక్కాయ కర్మములు. ఇవి పార్వతి, సరస్వతి, లక్ష్మి అను మూర్తిత్రయములు. వేరువేరుగా పిలవబడుచున్న ఏకత్వ లక్షణముల గల శక్తి మాత్రమే. ఈ మూడు శక్తి రూపములు ‘శారదా తిలకము’ నందు – ‘బిందు పుమాన్ శివః ప్రోక్తః స్వర్గః శక్తిర్నిశాకరః’ – ఏది శక్తితో కూడా యున్నదో అది సృష్టి రచనా శక్తి కలిగియున్నదని చెపుతోంది..

ప్రపంచంలో ఉన్న చైతన్యం వెనుక శక్తి నిబిడీకృతమై వుంటుంది. అంటే భౌతికమైనది మాత్రమే కాదు, మానసిక చలనం కూడా కదలికే. అందుకే చైతన్యశక్తి- ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా మూడు రకాలుగా ఉటుందని మన పురాణాలు పేర్కొన్నాయి.

ఏదైనా పని జరగాలంటే ముందు ఆ పని చేయాలనే కోరిక (ఇచ్ఛ) పుట్టాలి. అదే ఇచ్ఛాశక్తి. కోరిక కలిగాక ఆ పని ఎలా చేయాలో జ్ఞానం కలగాలి. అదే జ్ఞానశక్తి. ఇచ్ఛ, జ్ఞానం రెండూ కలిగిన తరువాత పని జరగాలి. అదే క్రియాశక్తి.

ఈ ప్రపంచం మొత్తం ఒక కుండగా భావిస్తే దీన్ని సృష్టించేది సృష్టికర్త. ఆయన ‘సృష్టి’ స్పందనను పొందాలంటే ఈ మూడు శక్తుల కలయిక తప్పనిసరి. అంటే సృష్టి మొత్తం కూడా ఈ మూడు శక్తుల విపరిణామం. మనకు కనిపించేదంతా క్రియాశక్తి రూపాంతరం. దీనివెనుక జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తులున్నాయి. ఈ మూడూ కలిసిన సంపూర్ణశక్తే పరాశక్తి. ఈ జగత్తు మొత్తానికి పరాశక్తియే తల్లి అని శాస్త్రాలు నిర్ణయించాయి. సాక్షాత్తు జన్మనిచ్చేది తల్లి. తండ్రికాదు. అందుకే శక్తిని జగన్మాతగా దర్శించారు మన మహర్షులు.

అందువల్లనే శంకరాచార్యులవారు ”శివశ్శ్యక్త్యాయుక్తోయది భవతి శక్త: ప్రభవితుం”’ అనే శ్లోకంలో ఆ శక్తిని హరిహర బ్రహ్మాదులంతా ఆరాధన చేస్తున్నారు అని చెప్పారు.

బ్రహ్మలో ఆ పరాశక్తి సృష్టిని కలిగిస్తోంది. విష్ణువులో అదే పరాశక్తి స్థితిని కలిగిస్తోంది. రుద్రుడిలో అదే పరాశక్తి సంహారాన్ని కలిగిస్తోంది. అందుకే, ఆ ముగ్గురూ కూడా ఆ శక్తిమాతనే ఆరాధిస్తున్నారు. అందుకే మనం కూడా ఆ తల్లినే ఆరాధిస్తున్నాము. అయితే, మనం శుద్ధ స్వరూపంలో శక్తిమాతను దర్శించలేము. ఊహించనైనా లేము. అందుకోసమే శక్తిమాత తన మొదటి రూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది. ఆ తర్వాత వివిధ దేవీరూపాలను స్వీకరించి మన ఉపాసనకు సౌలభ్యం కల్పించింది. శ్రీచక్రముతో సకల చరాచర జగ త్తునకు నామరూపములకు, పదార్థములకు సమన్వయం కలుగుతున్నది.

పరాశక్తికి శ్రీచక్రానికి ఏమాత్రం భేదం లేదు. శ్రీదేవియే శ్రీచక్రము. శ్రీమాత. శ్రీవిద్య. శ్రీచక్రములు వేరువేరు కాదని, ఈ మూడూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీలలితా సహస్రనామ స్తోత్రము తెలియచేస్తోంది.

శివుని త్రిశూలం మూడు శక్తులకు ప్రతీక.అల్లాగే సుబ్రహ్మణ్య స్వామి (జ్ఞాన శక్తి). భూమి మీద పుట్టిన భార్య వల్లీదేవి (ఇచ్ఛా శక్తి) మరియు అతని దైవిక( దేవతా సంబంధమైన) భార్య దేవసేన (క్రియా శక్తి)తో కలిసి జ్ఞానాన్ని (సుబ్రహ్మణ్య స్వామి ) సృష్టించడానికి ఇచ్చా మరియు క్రియల కలయికను సూచిస్తారు.ఇది సుబ్రహ్మణ్య తత్త్వముగా చెప్పబడింది.

 కృష్ణుడు (జ్ఞాన శక్తి) కృష్ణుని యొక్క ప్రేమ స్వరూపిణి అయిన రాధా దేవి (ఇచ్ఛా శక్తి), మరియు ఆయన భార్య, రుక్మిణి దేవి (క్రియా శక్తి)అని కృష్ణ తత్త్వముగా చెప్పబడింది. తత్వశాస్త్రంలో, ఇడా నాడి (ఇచ్ఛా శక్తి) మరియు పింగళ నాడి (క్రియా శక్తి) సమతుల్యతలో ఉన్నప్పుడు సుష్మ నాడి (జ్ఞాన శక్తి)లోకి శక్తిని ప్రవహించటానికి అనుమతిస్తాయి

సారాంశం మళ్ళీ చెబుతున్నాను 

దేవతాశక్తి యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది. మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగా భావించారు.

అవి 1) ఇచ్ఛాశక్తి, 2) జ్ఞానశక్తి 3) క్రియాశక్తి. ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే ‘ఇచ్ఛ’ (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎట్లా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ, ఆలోచనాజ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరపడమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయిక వల్లనే

 సాధ్యం.

శ్రీచక్రంలో బిందువు ఇచ్చాశక్తి, త్రికోణం జ్ఞానశక్తి

మిగిలిన చక్రాలు క్రియాశక్తి అని గ్రహించాలి.


సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

సలహాలు ఇవ్వడం

 🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏             🏵️లోకంలో అన్నింటికంటే తేలికైన పని సలహాలు ఇవ్వడం.. ఒకటి అడిగితే వెయ్యి చెబుతారు.. కానీ అన్నింటికంటే కష్టమైన పని..సలహా ఇచ్చినోడు దానిని అమలపరచడం🏵️నీ పరిస్థితులు నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా నీ ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్ గా ఉంటే అవి నీ పరిస్థితులను నీకు అనుకూలంగా మారుస్తాయి.. అలాగే మనిషి తనలోని ప్రేమను ఎంత పెంచుకుంటే అంత మంచి చేస్తోంది.. తనలోని ద్వేషాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మనశాంతి చేకూరుతుంది🏵️ఎదుటి వారి కంటే గొప్పగా ఉండాలని అనుకోకు.. నీవు గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో..ఎందుకంటే కోరికలు పుట్టినంత త్వరగా అవకాశాలు పుట్టవు.. కావున కష్టపడుతూ పైకి ఎదగాలే కానీ ఒక్క సరిగా పైకి ఎగరాలని ప్రయత్నం చేయకు🏵️స్వేచకు శత్రువులు,  నిరంకుశత్వానికి మిత్రులు ఎప్పుడు విజయం సాధించలేరు.. మనం ఎంత పని చేయబోతున్నాము అనేది ముఖ్యం కాదు.. ఆ పని ఎలా చేయబోతున్నామనదే ముఖ్యం..కాలం మనకు ఏమీ నేర్పించదు.. మనకు ఎదురయ్యే మనుషులు ఎదుర్కొనే పరిస్థితుల నుంచే మనం నేర్చుకోవాలి🏵️🏵️మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్  D.29-2-4గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593 9182075510*🙏🙏🙏

చేసేవాడు,చేయించేవాడు

 కర్తా కారయితా చైవ ప్రేరక శ్చానుమోదకః 

సుకృతం దుష్కృతం చైవ చత్వారస్సమ భాగినః


అర్థము:-చేసేవాడు,చేయించేవాడు,ప్రేరేపించేవాడు, ఆమోదించువాడు ఈ నలుగురూ కూడా పుణ్య,పాప కార్యము లన్నింటిలోనూ సమభాగులే. (ఈ శ్లోకం పంచతంత్రం లోనిది)


జాడ్యం హ్రీ మతిగణ్యతే వ్రతరతే ద౦భః శుచౌ కైతవం 

శూరే నిర్ఘృణతామునౌ విమతితా దైన్యం ప్రియాలాపిని 

తేజస్వి న్నవలి స్తతా ముఖరతావక్త ర్యా శక్తి: స్థిరే 

తత్కోనామ గుణో భవే త్సుగుణినాం యో దుర్జనై ర్నా౦కితః 

(భర్తృహరి సుభాషితము)

గుణవంతులయందున్న సుగుణములను కూడా దుష్టుడు దోషములుగానే యెంచుతాడు.

బిడియపడేవాడిని రోగియని, వ్రతశీలుని దంభాచారపరుడనీ, శుచిశీలిని కపటియని,

పరాక్రమవంతుని దయాహీనుడని, మౌనిని మతిపోయినవాడని, తేజోవంతుని అహంకారియని, చక్కగా మాట్లాడగలవాడిని వాచాలుడనీ స్థైర్యము గలవానిని అశక్తుడనీ,

ఈ రీతిగా ప్రతివారి యందును దోషములనే ఎంచుట దుర్జనులకు పరిపాటి..,


వాంఛా సజ్జన సంగతౌ పరగుణే ప్రీతి ర్గురౌ నమ్రతా 

విద్యాయాం వ్యసనం స్వయోషితి రతిః లోకాపవాదాద్భయం 

భక్తి శూలిని శక్తి రాత్మ దమనే సంసర్గ ముక్తి: ఖలై:

ఏతే యేషు వసంతి నిర్మల గుణాః తేభ్యో నమః కుర్మహే


అర్థము:-సత్సాహవాసము నందు కోరిక, పరుల గుణముల యందు ప్రీతి, పెద్దల యెడ వినయము, విద్యాలయందు ఆసక్తి, స్వభార్య యందే యనురాగము, లోకనిండా అంటే భయము, శివుని యందు భక్తి, ఆత్మనిగ్రహ శక్తి, దుష్టులకు దూరముగా నుండుట, యను 

నీ నిర్మల గుణములు యెవ్వరియందు యున్నవో అట్టి మహాత్ములకు కైమోడ్పులు.

-------------------------------

ఏది జపియింప నమృతమై యొసగు చుండు 

నేది సద్ధర్మ పథమని యెరుగదగిన

దదియే సద్భక్తి యోగంబు నలవరించు 

మూర్తిమంతంబగు దా హరికీర్తనంబు

అర్థము:- ఏ నామము జపించిన కొద్దీ అమృతమై అతిశయమై అలరారు తూ వుంటుందో, ఏది ఉత్తమమైన ధర్మ మార్గమో అదియే హరినామ సంకీర్తనము.మూర్తీభవించిన భక్తి యోగమే హరినామ జపము అంటాడు అన్నమాచార్యులు. కలియుగ ధర్మం ప్రకారం దేవుని నామ జపమే మోక్ష దాయకము.

.

ఆకసాన లేదు మోక్ష మటు పాతాళమున లేదు 

ఈ కడ భూలోకమందు యెందు లేదు 

పై కొని యాస లెల్లపారద్రోలి వెదికితే 

శ్రీకాంతు పొగిడేటి చిత్తములో నున్నది

అర్థము:-ముక్తి ఎక్కడో ఆకాశము లోనో,పాతాళము లోనో.భూమిపైన నో లేదు.ఆశలవలయం లో చిక్కుకోకుండా ఆ శ్రీకాంతుని స్మరించుకునే మనస్సు లోనే మోక్షము వుంది.మనో నైర్మల్యమే ముక్తికి దారి..

ఇతరులు స్పందించనపుడు

 *2046*

*కం*

ఇతరులు స్పందించనపుడు

నితరులకుపకారమొనరు నిష్ఠల యందున్

హితముల కన్నను నెక్కువ

వెతలుమిగిలి తుదకు సడలు విలువలు సుజనా.

*భావం*:-- ఓ సుజనా!ఇతరులు స్పందించనపుడు ఇతరులకు ఉపకారం చేసే నిబద్ధత లలో మంచి కన్నా ఎక్కువగా కష్టాలు మిగిలి చివరకు విలువలు కూడా పోతాయి.

*భావం*:-- ఇష్టంగానీ,ప్రతి స్పందన గానీలేని వారికి ఉపకారం చేయడానికి ప్రయత్నాలు చేయడం వలన ఇబ్బందులే మిగులుతాయి.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

నిత్యకర్మకు, నైమిత్తిక కర్మకు

 ప్ర : నిత్యకర్మకు, నైమిత్తిక కర్మకు తేడా ఏమిటి?


జ : నిత్యకర్మకు ఫలితం ఉండదు. రోజూ స్నానం చేయడం, రోజూ సంధ్యావందనం చేయడం, వీటికి ప్రత్యేక ఫలితాలు ఉండవు. చేయకపోతే దోషాలుంటాయి. రోజూ ఎందుకు చేయడం అంటే చిత్తశుద్ధి కొరకు. నైమిత్తిక కర్మ అంటే ప్రత్యేకంగా ఒక తిథినాడు చేసేటటువంటి పని. ఆ తిథినాడు ఆ పని చేస్తే ఒక ప్రత్యేకమైన ఫలితం వస్తుంది. దీపావళి పండుగనాడు తెల్లవారు ఝామున తలస్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసినట్లే. ఎందుకంటే గంగ ఆ రోజున భూమండలంలో అన్ని నీళ్ళల్లోకి వస్తుంది. అందుకని ’జలే గంగా’. ’తైలే లక్ష్మీ’ - ఒంటికి నూనె రాసుకుంటే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఆరోజున. అలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది. నైమిత్తిక తిథినాడు చేసేపనికి ప్రత్యేక ఫలితాలు ఉంటాయి. నిత్యం చేసే కర్మకి చిత్తశుద్ధి ఒక్కటే దాని ప్రయోజనం. కాబట్టి నిత్యకర్మ చిత్తశుద్ధి కొరకు. నైమిత్తిక కర్మ పరమ పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం. ఇది నిత్యకర్మకీ, నైమిత్తిక కర్మకీ

శ్రీ రామదూత

 శ్రీ రామదూత...🕉️

*🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀


ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమః* 


రేపు *అనగాష్టమి* కావున దత్త భక్తులు దయచేసి దత్త నామం జపిస్తూ ఉండండి. మరియు *సిద్ధ మంగళ సొత్రం* చదవండి.

 


#శ్రీ దత్తాత్రేయ స్వామి  అర్ధాంగి కి “అనఘాదేవి” అని పేరు.

అఘము అనగా పాపము అనఘ అనగా పాపము లేనిది పాపము మూడు విధాలు మనసు తో, బుద్దితో, ఇంద్రియములతో, మూడు విధాల పాపములు పోగట్టునది అనఘ


#ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము. #అనఘాదేవి లో శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి. #అనఘస్వామి లో బ్రహ్మ,రుద్ర, విష్ణు లక్షణాలు ఉన్నాయి. #అనఘుడు విష్ణు స్వరూపుడు, అనఘాదేవి లక్ష్మి స్వరూపము. #ఈ దంపతులిద్దరూ నిత్యమూ తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వ జ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన, ఆది దంపతులు. #వారికే అష్టసిద్ధులు (అణిమా,లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యం ,ఈశిత్వం, వశిత్వం, కామావసాయితా, మహిమా ) పుత్రులై అవతరించారు .


#అనఘాదేవి యోగేశ్వరి, జగన్మాత, యోగంనందు ప్రీతి గలది. గృహం, పతి, పత్ని, పుత్రులను అనుగ్రహిస్తుంది. #వంశవృద్ధిని కలిగిస్తుంది. #సమస్త కోరికలను సిద్ధింపజేస్తుంది, కవితా శక్తిని, కళలను ఇస్తుంది. #ఈమెకే “మధుమతి ” అనే పేరు కూడా కలదు. ఈమె అనఘస్వామి భ్రూమద్య నుండి ఉద్భవించినది. #దత్తాత్రేయుడు అనఘను వామభాగమున ధరించి ఉన్న శాక్త రూపము . “అఘము” అంటే పాపము, ఇది మూడు రకాలు. అనఘము అంటే ఆ మూడు రకాల పాపాలను నశింపజేయడం.


*దత్తుని రూపంలో అంతరార్థం:*

శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరుభుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే •


#1. మూడు శిరస్సులు: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.


#2. నాలుగు కుక్కలు: నాలుగు వేదములు ఇవి. దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు.


#3. ఆవు: మనసే మాయాశక్తి. సంకల్ప, వికల్పములకు, సుఖదుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు.


#4. మాల: అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు,సాహిత్యసంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము.


#5. త్రిశూలము : ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి.


#6. చక్రము: అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును.


#7. డమరు: సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి.


#8. కమండలము: సమస్త బాధలను పోగొట్టును. శుభములను సమకూర్చును.


#దత్త తత్వం:

దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !

తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!


#దత్తాత్రేయుని భక్తితో స్మరిమ్చినవారికి సమస్త పాపములు నశిస్తాయి. #దీనిలో సందేహం లేదని‘ దత్త హృదయం ’లో చెప్పబడింది. #దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర్ర సంతుష్టుడు. #తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా “అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ” అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు, ఏదో ఒక రూపంలో వచ్చి, రక్షించి కోరిన కోరికలు తీర్చుతాడని నమ్మకం.#శ్రీభాగవత గ్రంథమునందు ప్రథమస్కంధ, తృతీయాధ్యాయములో భగవంతుని 21 అవతారములలో ఆరవ అవతారం దత్తాత్రేయుని అవతారమని చెప్పబడింది. 


*శ్రీ సిద్దమంగళ స్తోత్రం* 


#1. శ్రీ మదనంత శ్రీవిభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#2. శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#3. మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయశ్రీ పాదా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#4. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#5. సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#6. దో చౌపాతీ దేవ్‌లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#7. పుణ్యరూపిణీ రాజమాంబ సుతగర్భ పుణ్యఫల సంజాతా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#8. సుమతీ నందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాదా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#9. పీఠికాపుర నిత్యవిహారా మధుమతి దత్తా మంగళరూపా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#పరమ పవిత్రమయిన యీ సిద్ధ మంగళ స్తోత్రమును పఠించిన అనఘాష్టమీ వ్రతము చేసి సహస్ర సద్భ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును. #మండల దీక్ష వహించి ఏక భుక్తం చేయుచూ, కాయకష్టముతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర #సద్భ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రము యోగ్యులచే పఠించబడును. #దీనిని పఠించుట వలన సిద్ధపురుషుల దర్శన, స్పర్శనములు లభించును. #మనసున తలచిన కోరికలు నెరవేరును. #మనసా, వాచా కర్మణా దత్తారాధన చేయు భక్తులు యీ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు.


#ఈ స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మ వాయుమండలము నందలి సిద్ధులు అదృశ్యరూపమున సంచరించుదురు.


*ఓం ద్రాo దత్తాత్రేయాయ నమః*


🙏🙏🙏


✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀

21, మార్చి 2025, శుక్రవారం

గరుడ పురాణం_*24

 * *గరుడ పురాణం_*24వ భాగం*


 *"విషదూరక మంత్రం"*_


_ఋషులారా! ఇపుడు మీకు సర్పాది విష జంతువుల వల్ల కలిగే కష్టాలను తొలగించే మంత్రాన్నుపదేశిస్తాను వినండి._


_*'ఓం కణిచికీణి కళ్వాణీ చర్వాణీ భూతహరిణి ఫణి*_ _*విషణి విరథ నారాయణి ఉమే దహదహ హస్తే చండేరౌద్రే*_ 

_*మాహేశ్వరి మహాముఖి జ్వాలాముఖి శంకుకర్ణి శుకముండే*_

_*శత్రుం హనహన సర్వనాశిని స్వేదయ*_

_*సర్వాంగశోణితం తన్నిరీక్షసి మనసాదేవి*_

_*సమ్మోహయ సమ్మోహయ రుద్రస్య*_ 

_*హృదయే జాతా రుద్రస్య హృదయే స్థితా ।*_

_*రుద్రో రౌద్రేణ రూపేణ త్వం దేవి రక్ష రక్ష*_

_*మాం హ్రూం మాం హ్రూం ఫ ఫ ఫ ఠఠ*_ 

_*స్కందమేఖలా బాలగ్రహ శత్రు విషహారీ*_

_*ఓం శాలే మాలే హర హర విషోంకార*_

_*రహి విషవేగే హాంహాం శవరిహుం*_

_*శవరి ఆ కౌలవేగేశే సర్వే వించమేఘమాలే*_ 

_*సర్వనాగాది విషహరణం !'*_


_*ఈ మంత్రాన్ని ప్రయోగిస్తున్నపుడు దీని భావాన్నే మనసు నిండా అమ్మ స్వరూపంతో సహా నిలుపుకుంటూ వుండాలి. దీని భావం ఇది :*_


_'అమ్మా ఉమాదేవీ! నీవు రుద్రుని హృదయం నుండి పుట్టి అక్కడే నివసించగలిగిన పరాశక్తివి. నీది రౌద్రరూపము. నీ ముఖం జ్వాల వలె జాజ్వల్యమానం. నీ కటికి వున్న ఘంటికారవం దుష్టశక్తుల పాలిటి శరాఘాతం. అందుకే దానిని క్షుద్ర ఘంటిక అంటారు. నీవు భూతప్రియవైనా విషసర్పాలకే విషరూపిణివి. విరథనారాయణిగా, శుక్రముండగా పిలువబడే నీవు దుష్టశక్తుల పాలిటి విశాల, భయంకరముఖివి; ప్రచండ స్వభావురాలివి. నీ చెవి కుండల శంకువుల కాంతులే వాటిని నయన విహీనులను గావిస్తాయి. చేతి నుండి జ్వలన శక్తిని పుట్టించి మా శత్రువులను కాల్చివేయి. కాల్చివేయి. విషనాశినివైన ఓ దేవీ! ఈ నరుని (లేదా నారి)లో వ్యాపించిన విష ప్రభావాన్ని నశింపజేయి. ఆ విష జంతువును సమ్మోహితంగా గావించు, సమ్మోహితం గావించు. దేవీ మమ్ము రక్షించు, రక్షించు' అనుకుంటూ మంత్రాన్ని మరల చదివి దేవిని మరల ప్రార్ధించి హ్రూం మాం హ్రూం ఫఫఫఠఠ అనే బీజాక్షరాలను పలుకుతుండాలి. తరువాత హాంహం శవరిహుం అని కూడా ఉచ్చరిస్తూ రోగి శరీరాన్ని స్పృజించాలి. ఇలా రోగికి స్పృహవచ్చేదాకా మంత్ర పఠన, భావచింతన, బీజాక్షరోచ్చాటన, శవర్యుచ్చారణ చేస్తుండాలి._ _*(అధ్యాయం - 27)*_

గరుడ పురాణం_*23వ భాగం*

 *గరుడ పురాణం_*23వ భాగం*


*త్రిపురాదేవి గణేశాదుల పూజ:-*_


_ఋషులారా! ఇష్టకామ్యార్థ సిద్ధిని కలిగించే ఈ పూజలో ముందు శ్రీ గణేశుని ఆసనానికీ, మూర్తికీ పూజలు చేసి ఆసనంపై ఆయనను స్థాపించి మరల న్యాసపూర్వకంగా ఈ మంత్రాలతో పూజించాలి._


ఓం గాం హృదయాయ నమః, 

ఓం గీం శిరసే స్వాహా,

ఓం గూం శిఖాయై వషట్, 

ఓం గైం కవచాయ హుం, 

ఓం గౌం నేత్రత్రయాయ వౌషట్, 

ఓం గః అస్త్రాయ ఫట్


_*తరువాత సాధకుడు. "ఓం దుర్గాయాః పాదుకాభ్యాం నమః " అంటూ దుర్గమ్మ యొక్కయూ, "ఓం గురుపాదుకాభ్యాం నమః" అంటూ గురువు గారి యొక్కయు పాదుకలకు నమస్కారం చేసి త్రిపురాదేవికీ, ఆమె ఆసనానికి నమస్కారం చేసి 'ఓం హ్రీం దుర్గే రక్షిణి' అనే మంత్రంతో హృదయాదిన్యాసాన్ని గావించి మరల ఇదే మంత్రంతో రుద్రచండ, ప్రచండ దుర్గ, చందోగ్ర, చండనాయిక, చండ, చండవతి, చండరూప, చండిక, దుర్గ అనే తొమ్మిది శక్తులనూ పూజించాలి. తరువాత వజ్ర, ఖడ్గాది ముద్రలను ప్రదర్శించి దేవికి ఆగ్నేయంలో సదాశివాది దేవతలకు పూజ చేయాలి. దానికై సాధకుడు ముందుగా "ఓం సదాశివ మహాప్రేత పద్మాసనాయ నమః" అనే మంత్రాన్ని చదువుతూ ప్రణామం చేసి ఆ తరువాత "ఓం ఐం క్లీం (హ్రీం) సౌంత్రిపురాయై నమః " అనే మంత్రంతో త్రిపురాశక్తికి నమస్కారం చేయాలి.*_


_తరువాత త్రిపురాదేవి యొక్క ఆసనానికీ (పద్మానికి), మూర్తికీ, హృదయాది అంగాలకీ నమస్కారం చేసి ఆ పద్మపీఠం పై మాహేశ్వరి, బ్రాహ్మణి, కౌమారి, వైష్ణవి, వారిహి, ఇంద్రాణి, చాముండ, చండిక - అను ఎనమండుగురు దేవతలనూ పూజించాలి. పిమ్మట ఎనమండుగురు భైరవులనూ అర్చించాలి. అసితాంగుడు, రురుడు, చండుడు, క్రోధి, ఉన్మత్తుడు, కపాలి, భీషణుడు, సంహారి అనువారలు అష్టభైరవులు. భైరవ పూజానంతరము రతి, ప్రీతి, కామదేవ, పంచబాణ, యోగిని, బటుక, దుర్గ, విఘ్నరాజాదులనూ, గురువునూ, క్షేత్రపాల దేవతలనూ పూజించాలి._


_*సాధకుడిపుడు ఒక పంచగర్భ మండలాన్నిగానీ త్రికోణ పీఠాన్నిగానీ వేసి దానిపై శుక్లవర్ణ సుశోభితా, వరదాయినీ, వీణాపుస్తక ధారిణీ, అక్షమాల, అభయముద్ర హస్తాలంకృతా యగు సరస్వతీ దేవి మూర్తిని స్థాతిపించి మనసా ధ్యానించి పూజించాలి. చివరగా త్రిపురేశ్వరీ దేవి మంత్రాన్ని లక్షమార్లు జపించాలి. హవనం కూడా చేయాలి. అపుడా తల్లి సాధకునికి సిద్ధిధాత్రి కాగలదు. ఇక అతని శక్తికి తిరుగుండదు.*_


_(అధ్యాయాలు 24-26)_

మహాభారత సారాంశం.

 💥లక్షల శ్లోకాలు గల మహాభారత సారాంశం... తొమ్మిది వాక్యాలలో..

   మీరు ఏ మతస్తులు అయినా, స్త్రీ లేక పురుషుడు అయినా, బీదా ధనిక అయినా ఏ ప్రాంతం వారైనా సరే.. ఆణిముత్యాలు వంటి ఈ తొమ్మిది వాక్యాలలో మహాభారత సారాంశం తెలుసుకోండి.                       ♦️♦️♦️♦️♦️♦️♦️♦️

  🔥1 మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి,మీ ఆధీనంలోంచి దూరం అవుతారు..వారి ఆధీనంలో కి మీరు వెళ్తారు 

   ఉదా "కౌరవులు."               ♦️♦️♦️♦️♦️♦️♦️♦️

 🔥2. . నువ్వు ఎంత బలవంతుడు అయినా,ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ..ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ.. వాటిని అధర్మం కోసం వినియోగిస్తే..అవి నిరుపయోగమవుతాయి.

  ఉదా: కర్ణుడు.                     ♦️♦️♦️♦️♦️♦️♦️♦️

🔥3 యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యం తో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశం జరుగుతుంది.

 ఉదా.. అశ్వత్థామ.              ♦️♦️♦️♦️♦️♦️♦️♦️

🔥 4. పాత్రత తెలుసుకోకుండా విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బ్రతకవలసి వస్తుంది.

  " భీష్ముడు."                         ♦️♦️♦️♦️♦️♦️♦️♦️

🔥5.సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము  దురహంకారం తో అధర్మం గా వినియోగిస్తే వినాశం జరుగుతుంది.

 "దుర్యోధనుడు "                    ♦️♦️♦️♦️♦️♦️♦️♦️

🔥6.స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు,గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా తనవారి పట్ల వల్లమాలిన అభిమానం గల అంధునికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది.

  ఉదా: ధృతరాష్ట్రుడు.                  ♦️♦️♦️♦️♦️♦️♦️♦️

 🔥7. తెలివితేటలకి ధర్మం, సుజ్ఞానం తోడైతే విజయం తప్పక లభిస్తుంది.

 ఉదా: అర్జునుడు.                 ♦️♦️♦️♦️♦️♦️♦️♦️

🔥8. మోసం,కపటం, జిత్తులమారి ఆలోచనలు అన్ని వేళలా చెల్లవు. 

  ఉదా: శకుని.                       ⭕⭕⭕⭕⭕⭕⭕⭕                       

🔥9. నీవు నైతిక విలువలు పాటిస్తూ, సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు హానిచేయదు.

  ఉదా : యుధిష్ఠిరుడు.

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

💫💫💫💫💫💫💫💫

 " సర్వే జనాః సుఖినోభవంతు.🌷

సంతృప్తి

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🔥మన జీవితంలో విజయం కంటే సంతృప్తి చాలా ముఖ్యం.. ఎందుకంటే మన విజయాన్ని ఇతరులు నిర్ణయిస్తారు.. కానీ మన సంతృప్తిని మనమే నిర్ణయస్తాము.. తృప్తి లేని విజయం వ్యర్థం🔥జీవితాన్ని ఒత్తిడికి గురించేయవద్దు.. ఎల్లప్పుడూ ప్రశాంతగా నవ్వుతూ అనందంగా ఉండడానికి ప్రయత్నిద్దాము.. ఎందుకంటే ప్రశాంతత, నవ్వు మన జీవితానికి సంవత్సరాలు జోడించక పోవచ్చు.. కానీ ఖచ్చితంగా మనము జీవించిన సంవత్సరాలకు ఎక్కువ జీవాన్నిస్తుంది🔥మనిషి అందంగా కనిపించాలి అంటే ముఖం పై ఎన్నో రంగులు అద్ది ఎన్నోన్నో పొరలు వేయాలి..కానీ మనసు అందంగా కనబడాలి అంటే అహం, స్వార్థం, ఈర్స్య, అసూయ, ద్వేషం అనే పొరలను తొలిగించాలి🔥ఇష్టపూర్వకంగా కోరుకునేది అదృష్టం..బలంగా నమ్మినదే భవిష్యత్తు..అందంగా ఉన్న వారు అనందంగా ఉంటారో లేదో తెలియదు కానీ అనందంగా ఉన్నవారు మాత్రం అందంగా కనిపిస్తారు...ఏదీ శాశ్వతం కాదు ఈ లోకంలో..గడుపుతున్న ఈ క్షణం మాత్రం మనది.. నిన్న అనేది తిరిపోయిన ఋణం..రేపు అనేది భగవంతుడు ఇచ్చిన వరం.. అందుకే నవ్వుతూ అనందంగా జీవనం సాగిద్దాం🔥🔥మీ అల్లంరాజు భాస్కరారావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్యసలహాలు ఉచితం మందులు అయి పోయిన వారు రాలేని వారికి కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9182075510* 🙏🙏🙏3

భ్రమల వల్లే బాధలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

      *భ్రమల వల్లే బాధలు*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*మనిషి శాశ్వతమనుకొని సుఖసారమనుకొని ప్రీతి పెంచుకుంటున్న జీవితంపై జగద్గురువులైన శంకరాచార్యులు అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు…* 


*కారణజన్ములుగా ఈ భువిపైన అవతరించిన ఆదిశంకరులు మానవ శ్రేయస్సుకు ఉపయుక్తమైన ఉపదేశాలను అమృతగుళికలుగా అందజేశారు.*


*లౌకికమైన లంపటంలో కూరుకుపోయి ఈలోకంలో స్థిరంగా ఏదో వేల సంవత్సరాలు బతికేస్తామన్న పిచ్చి భ్రమలతో అతి ప్రణాళికలు రచించుకుంటూ మూర్ఖులుగా మసలుకుంటున్నా మానవులకు ఆయన హెచ్చరికలు చేశారు.*


*కొన్నాళ్లు యాత్రికుల్లా గడపడానికి ఈలోకంలోకి అడుగుపెట్టామన్న సత్యాన్ని మరచిపోయి, స్థిరాసనాలు వేసుకునేందుకు ఆస్తులు కూడబెట్టుకునేందుకు తాపత్రపడుతున్నాం. తుదకు మనమూ వెళ్లిపోయే రోజొకటి వస్తుందని తెలుసుకోలేకపోతున్నాం. తామరాకుపై ఉన్న నీటిబిందువులా మనిషి జీవితం కూడా అతిచంచలమైంది. అయినా ఈలోకంలో మనుష్యులు రోగాలతో బాధపడుతూ, దేహాభిమానాన్ని విడువక, దుఃఖంతో చిక్కుకొని ఉంటారు. ఇలా మనిషికి శాశ్వత సుఖమే లేదని తెలుసుకోమంటున్నారు శంకరాచార్యులు.*


*ఈ సత్యం మనల్ని నిరాశలోకి నెట్టేసేందుకు చెప్పింది కాదు. వాస్తవమేంటంటే తెలుసుకొని మసలుకొమ్మని చేస్తున్న హెచ్చరిక.*


*మనం అనవసరంగా ఈ జీవితంపై పెంచుకుంటున్న మమకారం ఈ శరీర సుఖాలకోసం పడుకున్న తాపత్రయం తగ్గించుకోమనే చెప్తున్నారు. ఏ సుఖమూ శాశ్వతం కాదనీ, ఏ కష్టమూ కలకాలం ఉండదనీ, మన మనస్సు అర్థం చేసుకుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వేగానికి లోను కాదు. మనల్ని ఉక్కిరిబిక్కిరి చేయలేదు. అందుకే భగవాన్‌ శ్రీరామకృష్ణులు అనేవారు ఎల్లప్పుడూ మృత్యువును జ్ఞాపకం చేసుకోవాలి.*


*మరణించాక చేసేదేమీ లేదు. స్వగ్రామం నుంచి సమీప నగరానికి ఉద్యోగం చేయడానికి వచ్చినట్లుగా, ఏదో కొన్ని కర్మలు నిర్వర్తించడానికి ఈలోకంలోకి వస్తాం. యజమాని తోటను చూడటానికి ఎవరైనా వస్తే తోటమాలి వారిని వెంటబెట్టుకుని ఇది మా తోట. ఇది మా తటాకం అని ఆ వనమంతా చూపిస్తాడు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు యజమాని, తోటమాలిని పని నుంచి తొలగించి వేస్తే, మామిడి చెక్కతో చేసిన తన పెట్టె కూడా తీసుకుపోయే అధికారం అతడికి ఉండదు. పుత్రమిత్ర బంధువులంతా సహచరులేకానీ శాశ్వతం కాదనీ ఇల్లూ, వాకిలీ, ఆస్తి అంతస్తులంతా మనం అద్దెకు తీసుకున్నా వసతి సౌకర్యమే కానీ వాటికి మనం సంపూర్ణ యజమానులం కామనీ, వెంటవచ్చేవి కావనీ గుర్తుంచు కోవాలి. ఈ మర్మం తెలియకే మనలో చాలామంది జీవితాన్ని సంక్లిష్టం చేసుకుంటున్నారు. వేదాంతంలో తామరాకు, నీటిబిందువ్ఞల సహచర్యం గురించి అద్భుతంగా వివరిస్తారు.*


*నీటిలోనే పుట్టి పెరిగి, నీటితోనే నిరంతరం సంబంధం కలిగి ఉంటుంది తామరాకు. కానీ ఆ నీటితో మమేకం కాకుండా, తడిసిపోకుండా, నిర్మలంగా తేలియాడుతుంది. అలాగే స్థితప్రజ్ఞుడు, జ్ఞాన యోగి, గుణాతీతుడు అయిన వ్యక్తి కూడా ఈ సంసారంలో ఉంటున్నా దానికి బందీ కాడు. చలించడు. ప్రయత్నం చేస్తే అందరికీ ఈ స్థితి సాధ్యమే. ఆధునిక సమాజంలో తీరికలేని వ్యవహారాలు మనల్ని మరింత అహంకార పూరితుల్ని చేస్తున్నాయి. మనం లేకపోతే ఈ ఇల్లు ఏమైపోతుందో ఈ పిల్లలేమైపోతారో అన్న ఆందోళనలో పడేస్తున్నాయి. ఈ ప్రపంచం స్తంభించి ఈలోకానికి ఏ ఒక్కరి అవసరమూ లేదు.*


*నెయ్యితో నిప్పును ఆర్పడం ఎంత అమాయకత్వమో, కోర్కెలను తీర్చుకోవడం ద్వారా వాటిని సంతృప్తిపరచాలనుకోవడం కూడా అంతే అమాయకత్వం.*


*ఓం శ్రీ గురుభ్యోనమః.*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(82వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం* 

   *వ్రేపల్లె వాసుడు శ్రీకృష్ణుడు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఇంకో సంగతి అంటూ మంత్రివర్గం మళ్ళీ కొన్ని మాటలు చెప్పింది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విష్ణువు ఉంటాడంటారు. గోవులు, బ్రాహ్మణులు, జపతపాలు, యజ్ఞయాగాలు, వేదపఠనం ఎక్కడ జరుగుతాయో అక్కడ ధర్మం ఉంటుంది కనుక, గోబ్రాహ్మణులను వధించడం, యాజ్ఞయాగాలను ధ్వంసం చేస్తే విష్ణువు బయటపడతారన్నారు. బయటపడితే విష్ణువుని ఇట్టే వధించవచ్చనీ, పగతీర్చుకోవచ్చనీ అన్నారు.*


*మంత్రుల బోధలు కంసునికి నచ్చాయి. వారు చెప్పినట్టుగానే విష్ణువుని వధించి, నిశ్చింతగా ఉండవచ్చనుకున్నాడతను. మంత్రవిద్యలు నేర్చినవారూ, మాయలు పన్నేవారూ, కామరూపులూ, బలాఢ్యులూ, దుర్మార్గులూ, రాక్షసులు ఎందరెందరో కంసుని అనుచరవర్గంలో ఉన్నారు. వారందరినీ కంసుడు ఆజ్ఞాపించాడు. అతడు ఆజ్ఞాపించినట్టుగానే వారంతా చెలరేగిపోయారు. సాధువుల్ని హింసించసాగారు.*


*గోబ్రాహ్మణులను వధించసాగారు. యజ్ఞయాగాదులను ధ్వంసం చేస్తూ, తాపసులను చిత్రహింసల పాల్జేశారు. స్త్రీలను చెరబట్టారు. విష్ణువుకి నిలయాలయిన పుణ్యస్థలాలను అపవిత్రం చేసి, ఆనందించసాగారు. కామరూపులయిన రాక్షసులు కోరుకున్న రూపంలో పల్లెల్లో, నగరాల్లో కనిపించిన బాలలందరినీ చంపడం మొదలుపెట్టారు. తల్లడిల్లిపోయారు తల్లులు. పిల్లలను కనడమే మహాపాపమయినట్టుగా రోదించారు. బాలలు బ్రతకడం కష్టం. వారి బ్రతుకు క్షణక్షణం ఓ గండం అయిపోయింది.* 


*ఒకనాడు కంసుడికి కప్పం కట్టేందుకు నందగోపుడు మధురానగరానికి వచ్చాడు. కంసుడికి సామంతుడతను. ఏటేటా కంసునికి కప్పం కట్టాలి. కప్పం సొమ్మును మూటగా కట్టి మధురానగరానికి బయల్దేరుతూ, వ్రేపల్లెను జాగ్రతగా చూసుకోమని గోపాలురకు హెచ్చరించి వచ్చాడతను. కంసుణ్ణి దర్శించాడు. కప్పం చెల్లించి, కానుకలు కూడా సమర్పించాడతనికి.* 


*వసుదేవునికి నందగోపుడు బంధువు. వసుదేవుని భార్య రోహిణీ, ఆమె కుమారుడు బలరాముడూ, ఇంకొందరు బంధువులూ అతని రక్షణలో వ్రేపల్లెలో ఉన్నారు. వారి క్షేమసమాచారాలు తెలుసుకునేందుకు నందుణ్ణి చూడవచ్చాడు వసుదేవుడు*.



*వసుదేవుణ్ణి చూస్తూనే గట్టిగా అతన్ని కౌగిలించుకున్నాడు నందుడు. ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. చాలా కాలానికి పుత్రసంతానం కలిగినందుకు నందుణ్ణి అభినందించాడు వసుదేవుడు. ఆ అభినందనలకు పొంగిపోలేదు నందుడు, దేవకీ వసుదేవులు కంసుని చెరలో హింసలపాలయినందుకు బాధపడ్డాడతను. కన్నీరు పెట్టుకున్నాడు. నందుడు అలా కన్నీరు పెట్టుకుంటుంటే అతన్ని గమనించక, ఏటో చూస్తూ ఆందోళనగా ఒక్కసారిగా లేచి నిల్చున్నాడు వసుదేవుడు. ఏమయిందేమయింది అన్నట్టుగా నందుడు కూడా లేచి నిల్చున్నాడు. భయాందోళనలతో వణికిపోతున్న వసుదేవుణ్ణి ఆశ్చర్యంగా చూడసాగాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శంకరులు శ్రీ శైల క్షేత్రంలో వెలసిన జ్యోతిర్లింగమూర్తి యైన భ్రమరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామిని సేవిస్తున్నారు*


*శ్లోకం : 50*


*సన్ధ్యారంభవిజృంభితం శ్రుతిశిర స్థానాన్తరాధిష్ఠితం*


*సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనా శోభితమ్ ।*


*భోగీన్ద్రాభరణం సమస్త సుమనఃపూజ్యం గుణావిష్కృతం*


*సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితమ్ ।*


*పూర్వకథ:~*


*శ్రీ శైల ప్రాంత దేశాన్ని చంద్రగుప్తుడు అనే రాజు పాలించేవాడు.అతని కూతురు రతీదేవి వలె సౌందర్యము కలది. ఆమె పేరు చంద్రవతి. ఆరాజు తన కూతురినే మోహించాడు. ఆవిషయం తెలిసిన చంద్రవతి, రాజ గృహం విడచి శ్రీశైలానికి వెళ్ళి శివుణ్ణి గూర్చి తపస్సు చేసింది. శివుడు ప్రత్రక్షమైనాడు. ఆమె శివునికి భక్తితో మల్లెపూల దండను సమర్పించింది. ఈశ్వర సాయుజ్యాన్ని ఆమె కోరింది. ఆ మల్లికా మాలను తీసుకుని శివుడు తెల్లని వర్ణాన్ని పొందాడు. అప్పుడు చంద్రవతి ఈశ్వరుని "మల్లికార్జునుడు " అనే సార్థకనామాన్ని ధరించమని ప్రార్థించింది. శివుడు అంగీకరించి లింగరూపం ధరించాడు. అప్పటినుండి శ్రీ శైల లింగానికి మల్లికార్జునుడనే పేరు వచ్చింది.*


*తాత్పర్యము:~*


*సంధ్యాకాలం మొదట ఈశ్వరుడు తాండవనృత్యంతో భక్తులను ఆనందపరుస్తాడు. మద్ది చెట్టు సంధ్యారంభ కాలంలో పుష్ప వికాసముతో ఆనంద పరుస్తుంది. ఈశ్వరుడు శ్రీ శైలమునందేగాక శ్రుతి సరస్సులలో అనగా ఉపనిషత్తుల యందు ఉంటాడు. మద్ది చెట్టు పుష్పాలు చెవులయందు, శిరస్సులయందూ అలంకారములుగా ఉంటాయి. మల్లికార్జునుడు అనురాగంతో కూడిన భ్రమరాంబా దేవితో మనోహరంగా ఉంటాడు. మద్ది చెట్టు ప్రీతితో కూడిన తుమ్మెదలచే సుందరముగా ఉంటుంది. ఈశ్వరుడు మాటిమాటికినీ యోగ్యములయిన సంస్కారములచే ప్రకాశించేవాడు. మద్ది చెట్టు మంచి సువాసనలచే ప్రకాశిస్తుంది. ఈశ్వరుడు సర్ప రాజయిన వాసుకి ఆభరణంగా కలవాడు . మద్ది పువ్వు భోగప్రియులైన వారికి ఆభరణమైనట్టిది.*


*ఈశ్వరుడు అందరు దేవతలకూ పండితులకూ పూజనీయుడు. మద్ది పూవు అన్ని పువ్వులలో శ్రేవ్టమైనది. ఈశ్వరుడు సద్గుణములచే వ్యక్తము చేయ బడేవాడు. మద్దిపుష్పము సుగంధ గుణము వలన తెలియబడుతుంది.*


*పార్వతిచే కౌగిలించుకొనబడినవాడు. శ్రీశైల మల్లికార్జున స్వామి మద్ది చెట్టు జమ్మి చెట్టు తో కూడినది. మల్లెపూదండలచే పూజింపబడి ఒకవిధమైన తెల్లనివర్ణము గలవాడు మల్లికార్జునుడు. అటువంటి మల్లికార్జున నామముగల శివుని జ్యోతిర్లింగాన్ని సేవిస్తాను.*


*వివరణ:~*


*శంకరాచార్యులవారు శిష్యులతో పాదచారియై హిందూమత ప్రచారానికై భారతదేశమంతటా పర్యటించారు. ఆసందర్భంలో వారు మన ఆంధ్ర ప్రదేశ్లోని శ్రీశైల మహాపుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఆ సమయంలో సంధ్యాకాలమయ్యింది.* *అప్పుడక్కడ మల్లెతీగ అల్లుకున్న మద్ది చెట్టు వారికి కనబడింది. దానిని పోలికగా చేసుకుని పరమేశ్వరుని ఈ అద్భుతమైన శ్లోకంలో వారు వర్ణించారు.*


*ఈ శ్లోకం దీని తర్వాతి శ్లోకము శ్రీశైల మల్లికార్జున స్వామిపై శంకరులు చెప్పిన గొప్ప శ్లోకాలు. శ్రీశైలం గొప్ప పుణ్య జ్యోతిర్లింగ క్షేత్రం.*


*"శ్రీ శైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న లభ్యతే " అంటారు. శివానంద లహరి లోని 100 శ్లోకాలలో శ్రీశైల మల్లికార్జున స్వామి ని వర్ణించే ఈ రెండు శ్లోకాలూ మణిహారంలోని నాయక మణుల వంటివి.*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

శబ్ద చికిత్సాదేవి

 .                శబ్ద చికిత్సాదేవి

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀నేడు…



                  *శీతల సప్తమి*

                    ➖➖➖✍️

```

హైందవులు జరుపుకునే పండుగలలో శీతల సప్తమి ఒకటి. ఈ రోజున శీతలా మాతను పూజిస్తారు. అంటు వ్యాధులు సోకకుండా తమను, తమ పిల్లలలను తమ కుటుంబ సభ్యులను రక్షించమని శీతలా మాతను వేడుకుంటూ ఈ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా జరుపుకుంటారు. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో ఎంతో పవిత్రంగా, వైభవంగా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో శీతలా సప్తమి రోజు అక్కడి గ్రామ దేవతలను పూజిస్తారు.


శీతల సప్తమి పండుగ ఔచిత్యం స్కాంద పురాణంలో స్పష్టంగా వివరించారు. పురాణాల ప్రకారం పార్వతి దేవి మరో అవతారమే శీతలా దేవి. శీతలా దేవి ప్రకృతి వైపరిత్యాలనుండి ప్రజలను కాపాడుతుందని విశ్వసిస్తారు. 'శీతలా' అనే పదానికి చల్లదనం అని అర్థం. ఆ తల్లిని నమ్మి కొలిచిన వారిని, వారి కుటుంబాలను శీతలా మాత చల్లగా చూస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. అనేక ప్రాంతాల్లో ఈ రోజున భక్తులు శీతలా మాతకు పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి చల్లటి నీటితో స్నానం చేస్తారు. అనంతరం పూజలు చేస్తారు. సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని పొందేందుకు శీతలా దేవతకు ప్రార్థనలు చేస్తారు. కొందరు శీతల వ్రతం పాటించి శీతల మాత వ్రత కథను చదువుతారు. శీతలా మాతను ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో భక్తులు తలనీలాలు సమర్పించుకుంటారు.


శీతల సప్తమి రోజున, భక్తులు వంట చేయడం మానుకుంటారు. ఒక రోజు ముందు తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తింటారు. ఈ ప్రత్యేక రోజున వేడి, తాజాగా తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా నిషేధిస్తారు. మహిళలు ప్రధానంగా తమ పిల్లల శ్రేయస్సు, మంచి ఆరోగ్యం కోసం ఉపవాసం చేస్తారు.```



*పురాణ కథనం:* ```

శీతల సప్తమికి సంబంధించిన పురాణ కథనం ఒకటి ప్రచారంలో ఉంది. ఇంద్రయుమ్న అనే రాజు ఉదారవంతుడు. సద్గుణశీలి. అతనికి ప్రమీల అనే భార్య, శుభకరి అనే కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కూడా జరిగింది. ఇంద్రయుమ్నుని రాజ్యంలో ప్రతి సంవత్సరం శీతల సప్తమి వ్రతాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరించేవారు. ఒకసారి శుభకరి కూడా ఆ ఉత్సవంలో పాల్గొంది. పూజలు చేయడానికి శుభకరి తన స్నేహితులతో కలిసి సరస్సుకు బయలుదేరింది. కానీ దారి తప్పడంతో వారు సరస్సుకు చేరుకోలేక పోయారు. ఆ సమయంలో ఒక వృద్ధురాలు వారికి సహాయం చేసి సరస్సుకు దారి చూపింది. అంతేకాదు శీతల సప్తమి పూజా నిర్వహణలో, ఉపవాసం పాటించడంలో తదితర ఆచార వ్యవహారాలను వారికి వివరిస్తూ తగు సూచనలు ఇచ్చింది. అంతా బాగా జరిగింది, శీతలా దేవి చాలా సంతోషించి శుభకరికి వరం ఇచ్చింది. కానీ తనకు అవసరం వచ్చినప్పుడు ఆ వరాన్ని ఉపయోగించుకుంటానని శుభకరి దేవితో చెప్పింది. వారు రాజ్యానికి తిరిగి వస్తుండగా ఒక పేద కుటుంబంలో పాము కాటు కారణంగా వారి కుటుంబ సభ్యులలో ఒకరు మరణించినందుకు దుఃఖిస్తున్నారు. ఆ దృశ్యం చూసిన శుభకరీ తనకు లభించిన వరాన్ని గుర్తుచేసుకుంది. చనిపోయిన ఆ వ్యక్తికి ప్రాణం పోయమని శీతలా దేవిని ప్రార్థించింది. ఆ వ్యక్తి తన జీవితాన్ని తిరిగి పొందాడు. శీతల సప్తమి వ్రత మహత్యం తెలుసుకున్న ప్రజలందరు అప్పటి నుండి ప్రతి సంవత్సరం అచంచలమైన భక్తి ప్రవత్తులతో, అంకిత భావంతో వ్రతం ఆచరిస్తున్నారు. ✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

దత్తపది

 కల్లలు - ఎల్లలు - మల్లెలు - జల్లులు (దత్తపది) *వసంత ఋతువు*


కల్లలు గావు రాజ! నవకంబులె నిత్యము సౌరు దిద్దుచున్


ఎల్లలు దాటె శోభలును నేర్పడె పల్లవ మందహాసముల్


మల్లెలు పూచె కొల్లలుగ మావులు నిండెను పూప పిందెతోన్


జల్లులు రాల్చె పుష్పతతి జావళి పాడ వసంత! రాగదే.


అల్వాల లక్ష్మణ మూర్తి.

ప్రియ బాంధవా మేలుకో 16*

 *ప్రియ బాంధవా మేలుకో 16*




శాస్త్ర, సాంకేతిక, విద్యా, ఆర్థిక రంగాలలో భారత దేశం ఎంత పురోగమిస్తున్నా, చట్ట పరమైన నిబంధనలు ఎన్ని అమలుచేస్తున్నా దిన దినము వ్యక్తిగత, సామాజిక అవినీతి మరియు నేరాలు పెరుగుటకు కారణాలు పెద్దలు అన్వేషించాలి. 


లెక్కకు మించిన క్రిమినల్ కేసులలో నిందితులైన వారిని, సాంఘికంగా దుశ్చరిత్ర కలవారిని తమ పార్టీ ప్రతినిధులుగా ఎన్నికలలో అభ్యర్థులుగా ఎంపిక చేసే

 *దుర్నీతి రాజకీయ* పార్టీలు వేళ్లూనుకున్న సమాజంలో మనం జీవిస్తున్నామన్న స్పృహ ప్రజలకు (సామాన్యులు + మాన్యులు)  ఉండాలి. *మేథోప్రజ నిద్ర నటిస్తే* చట్టాలను ఉల్లంఘించే వారు *శాసన కర్తలవుతున్నారు* అంటే ఆశ్చర్యానికి తావులేదు, నేర గ్రస్థ రాజకీయ నేపథ్యంలో ఇవన్నీ సాధ్యమే. 


సాక్షుల అకారణ మరణాలు, హత్యలు, ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభత్వ అధికారుల అనైతిక ప్రాబల్యాలు, తాబేదారుతనం ప్రజలు గమనిస్తున్నారు. 


హత్యా ప్రయత్నాలు, హత్యలు, అత్యాచారాలు, అపహరణలు, కుంభకోణాలు, స్కాంలు, వీటిపై నత్తనడక విచారణలు, దర్యాప్తులు, న్యాయస్థానాలలో ఏళ్ల తరబడి వాద వివాదాలు,  వాయిదాలపై వాయిదాలు, సుధీర్ఘ విచారణలు చివరికి *శిక్షలు జీవిత కాలం లేటు*.దేశ ద్రోహులకు, తీవ్ర వాదులకు, విదేశీ నేరస్థులకు కారాగారాలలో మృష్టాన్న భోజనాలు, రాజ మర్యాదలు.  

 

భారతీయ న్యాయ స్థానాల సామర్థ్యము కంటే మించిన వ్యాజ్యాలు. 2024 సంవత్సరపు గణాంకాల ప్రకారం భారత దేశ జనాభా మరియు న్యాయ మూర్తుల నిష్పత్తి (:) ...పది లక్షలు : ఒకటి. న్యాయ మూర్తుల నియామకాలు గూడా చాలినంతగా లేవు. 


ఏ దేశంలో లేని  మరియు ప్రపంచం అబ్బురపడే వింత... *దేశ ద్రోహులను, అరాచక మరియు తీవ్రవాదులను సమర్థిస్తూ వాదించే న్యాయవాదులు మన దేశంలోనే  కోకొల్లలు*.


దేశ  సామాజిక పరిస్థితి గురించి ఒక అవలోకనము, ప్రశ్నల రూపంలో....*దేశంలో నేర నిరోధక మరియు న్యాయ వ్యవస్థ శక్తివంతంగా ఉందా*. సాక్షుల రక్షణకు న్యాయపాలిక నిర్దేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ  *అవి యథాతథాంగా అమలవుతున్నాయా*. ఇవన్నీ ఎవరు గమనించాలి అంటే సమాజమే గమనించాలి, *అది సమాజ బాధ్యత*.


అధిక శాతం ప్రజలకు  సమాజ శ్రేయస్సు విషయమై పట్టింపులేదు, ఉండదు,  ఎందుకంటే తాము బాగున్నాము, తమ వాళ్ళు బాగున్నారు, *ఎక్కడ ఏమైతే మనకెందుకు*.  ఇంత దుర్గంధ భూయిష్టంగా ఉన్న సమాజంలో విద్యావంతులు, విజ్ఞానవంతులు మరియు ప్రజ్ఞావంతులు ప్రశాంతంగా ఉండడం లేదా ఏమి చేయలేని నిస్సహాయ స్థితికి లోనుగావడం నాలాంటి సామాన్యులందరికీ ఆశ్చర్యకరమే.


ధన్యవాదములు

*(సశేషం)*

ఆరోజులు

 ఆరోజులు మళ్లీ రావు. వస్తే ఎంత బాగుండును?


పెళ్ళి భోజనం

💥💥💥💥


ఆకుపచ్చని అరిటాకు ముందు కూచుంటాము శుభ్రంగా.  శుభ్రంగా...తడిగా మెరుస్తుంటుంది లేత అరిటాకు నవ నవలాడుతూ. 


వంటల వాసన గాలిలో తేలివస్తూ మనల్ని ఒక ఊపు ఊపేస్తుంటుంది తొందర చేస్తూ.  తినబోయే వాటి రుచులు నాలుకను చవులూరిస్తాయి. 


ఈలోగా ‘ చవి’ వడ్డిస్తానంటూ వస్తాడు ఒక బూరిబుగ్గల పిల్లవాడు. బొజ్జనిండా తిని పందిట్లో పడి అల్లరి చేస్తుంటే పిలచి వాడికి ఉప్పు విస్తట్లో పైన వారగా వేసే పని అప్పచెప్పారులా ఉంది. 

శ్రద్ధగా వేస్తున్నవాణ్ణి చూసి నవ్వుతుంటాం. 


పట్టుపరుకిణీ గర గర లాడించుకుంటూ నీళ్ళ జగ్గు పట్టుకొస్తుంది ఓ బాలామణి , దానితో పాటే ఇంకా కొందరు ఆడపిల్లలు వీరికి మంచినీళ్ళు పోసే పని . కిలకిలా గల గలా నవ్వుతూ చిందకుండా తలలు వంచి గ్లాసులలో నీళ్ళు పోస్తుంటే, ఆడపిల్లల వద్దిక చూసి ముచ్చట పడిపోతాం ఆకుల ముందు కూచున్న మనం . 


ఈలోగా వస్తాడు పూర్ణంబూరెల బుట్ట పుచ్చుకుని చినమామయ్య. 

ఈ మామయ్యకు లౌక్యం బాగా తెలుసు. 

బావా ! బామ్మర్దీ! ఏమే మరదలా ! మేనకోడలా ! అని పలకరిస్తున్నట్టే పలకరిస్తూ లాఘవంగా రెండు బూరెలు వడ్డించిపోతుంటాడు వేగంగా. ఇంకోటి వేయవయ్యా ! అంటున్నా మాటలు చెవిని వేసుకోనే వేసుకోడు. 


పెద్ద పళ్ళంలో కనపడేట్టు పట్టుకుని పొడుగ్గా ఉన్న అరటికాయ బజ్జీ అందంగా వడ్డించి పోతాడు నూనూగు మీసాల మేనల్లుడు మరో మాటుండదు. 


వచ్చి ఆకులో ఇటుపక్క  చెంమ్చాతో చూసి చూసి వడ్డిస్తుంది దోసావకాయను , పెళ్ళై ఇద్దరు పిల్లలున్న నంగనాచి మేనకోడలు. 

ఆ దోసావకాయ ఘాటుకు నోట్లో నీళ్ళూరి , ‘అదేమిటే ఆ  విదపడం ..ఇంకొంచం వేయచ్చు కదే ‘అంటే , 

‘ముందు అది తినవమ్మా తర్వాత మళ్ళా వేస్తా ‘అంటూ తన పిల్లలకు చెప్పినట్టు చెపుతూ చక్కా పోతుంది.


తర్వాత కొత్తావకాయని అత్తయ్య పట్టుకొస్తుంది . 

ఈ రంగు చూసావా వదినా! 

నే దగ్గరుండి గుంటూరు మిరపకాయలు ఆడించి కలిపించాను, ముక్క కసుక్కుమంటోంది కొరికితే ‘ అంటూ పెచ్చుతో సహా ఎర్రెర్రని ఆవకాయ వడ్డించి అందరి మనసు రంజింప చేస్తుంది.


పచ్చళ్ళ గుత్తి పుచ్చుకొని తెల్లటి లాల్చీ పైజమా వేసుకున్న బాబయ్య వస్తాడు వడ్డించడానికి. ఈ బాబయ్య ఎప్పుడూ తెల్లటి బట్టలే వేసుకొని చల్లగా నవ్వుతుంటాడు. 

పైగా వడ్డింపుకు పట్టుకొచ్చినదో.. 

రుచులూరించే గోంగూర పచ్చడి దానికి తగ్గట్టుగా గొప్పకబుర్లు చెపుతూ’ మీ పిన్ని చేత చేయించాను, ఆకంతా నేనొక్కడినే వలిచాను తెలుసా ‘ అంటూ. ఆచేత్తోనే గుత్తి రెండో భాగంలో ఉన్న తాజాగా ఘుమ ఘుమలాడే కొబ్బరికాయ మామిడికాయ కలిపిన పచ్చడి వడ్డించేసి పోతాడు.


తర్వాత అమాయకపు పిన్ని వంతు. పట్టెడు పట్టెడు పులిహోర వెనకాడకుండా వడ్డిస్తుంటుంది, వరసలో కుర్రవెధవ నాకు వేరుశనగపలుకులు ఎక్కువ రాలేదంటే, మళ్ళీ వెనక్కి వెళ్ళి చిరునవ్వుతో వడ్డిస్తుంది. ‘సుబ్బరంగా తినండి , లేకపోతే అక్క నన్ను కోప్పడుతుంది ‘ అంటుంది తెచ్చుకున్న పెద్దరికంతో.


ప్రత్యేకంగా పనసపొట్టు కూర గంపలో వేసుకు పట్టుకువస్తాడు వంటపంతులు మామ. ఎంతో కష్టపడి చేసిన ఆ కూర తన చేత్తో తానే వడ్డించాలని, పదిమందికీ తన వంట నైపుణ్యం చెప్పాలని , పనసపొట్టు కొట్టిన దగ్గరనుంచి పోపు పుష్కలంగా వేసానని , జీడిపప్పుకు మొహమాటపడలేదని,  కొంచం ఆవ కూడా తగిలించానని వర్ణిస్తూ వడ్డిస్తుంటే మనం ఉవ్విళ్ళూరిపోతాం ఎప్పుడెప్పుడు నోటపెట్టుకుందామా అని. 


ఈలోగా ’గుత్తివంకాయ కూర ‘అంటూ అరుస్తూ వడ్డిస్తాడు అసిస్టెంటు కుర్రాడు , పరుగులే నుంచోడం లేదు. గరిట నుంచి జారి విస్తట్లో పడుతుంటుంది నూనె ఓడుతున్న నోరూరూంచేసే గుత్తి వంకాయ . ఎవరో అది చూడంగానే బంతిలో వారు కూనిరాగం తీస్తారు , ‘గుత్తివంకాయ కూరోయి బావా ” అంటూ. 


పప్పు గోకర్ణంతో వస్తాడు పెళ్ళి కూతురు అన్నగారు. చెల్లెలి పెళ్ళిపనుల పర్యవేక్షించి అలసిపోయినట్టున్నా , వడ్డింపు పనికి కూడా పరుగెట్టుకొచ్చాడు. మరి ఇదే కదా అన్నిటికన్నా ముఖ్యమైన పని, వచ్చిన అతిధులను భోజనంతో ఆదరించడం . పేరుకు పప్పు గోకర్ణం పట్టుకు వడ్డిస్తున్నా , పది కళ్ళు పెట్టుకు చూస్తున్నాడు అందరకీ అన్నీ అందుతున్నాయా, వడ్డింపులు సరిగా సాగుతున్నాయా అని. అంత హడావిడిలోనూ ఆకులో మామిడికాయ పప్పు వడ్డిస్తూ మొహంలో నవ్వు చెదరనివ్వనేలేదు.  


సిల్కు వల్లెవాటు జారిపోతుంటే సద్దుకుంటూ, మొహం మీది ముంగురులు వెనక్కి తోసుకుంటూ, అక్క పెళ్ళికి సందడి అంతా తానై తిరుగుతున్న కాటుక కళ్ళ చిన్నది, పెళ్ళి కూతురు చెల్లి అప్పడాలు,గుమ్మడి వడియాలు,ఊర మిరపకాయ వడ్డిస్తోంది హుషారుగా. కాని ఒకళ్ళకి వడియం వడ్డించడం, వదిలేస్తే ఇంకోరికి ఊరమిరపకాయ సొడ్డు పెడుతోంది , నలుగురినీ ఒక్కదగ్గరగా చూసిన గాభారాలో. పైగా పొలోమంటూ ఈ పిల్లను చూడగానే ప్రతీవాళ్ళూ పరాచికాలాడటమే. 

‘ఏమిటా కంగారు అంటూ ‘తర్వాత నీదే కదా ఛాన్స్’, నువ్వెప్పుడు పెట్టిస్తావే పప్పన్నం’ 

ఇవ్వన్నీ వింటూ ఆ పిల్ల సిగ్గుపడిపోయి మరింత కంగారుపడి , కనిపించిన వదిన గారికి ఆ అప్పడాలు అప్పచెప్పి తుర్రుమంది.


వెంట అన్నం పట్టించుకుని చేతిలో నేతి కొమ్ముజారీ పట్టుకుని పట్టుచీరతో అక్షింతలు పూలరేకులు కాసిని మీదపడి అంటుకున్నవాటితో ఆమట్ని ఆపసోపాలు పడుతూ వస్తుంది పెద్దమ్మ , పెళ్ళికూతురు తల్లి యజమానురాలు. మొహమంతా పెళ్ళి నిర్విఘ్న్నంగా జరిగిందన్న తృప్తీ సంతోషమూనూ. 

ప్రతి వక్కరనీ పేరుపేరునా వరసలతో పలకరిస్తూ పెద్దవాళ్ళని ‘ ‘అన్నయ్యా! వచ్చి నీ చేతుల మీదుగా 

మా పిల్ల పెళ్ళి జరిపించావు, వదినా భోజమనమయ్యేక బొట్టెట్టించుకుని తాంబూలం తీసుకు వెళ్ళండమ్మా’ అంటూనూ’ 

తమ్ముడూ ! నువ్వొచ్చావు ఎంతో సంతోషం , అమ్మాయీ లక్షీమీదేవి లాగ ఉన్నావమ్మా’ అంటూ చిన్నవాళ్ళనీ పలకరించుతూ, వడ్డించిన అన్నం మరికాస్త కలపండి మొహమాటం లేకుండ భోంచేయమని చెపుతూ , చాలు చాలంటున్నా నేయి ధార కట్టిస్తుంది విస్తట్లో.


ఈలోగా అల్లక్కడ లోపలనుంచి  ‘తప్పుకోండి , తప్పుకోండి వేడి వేడి గుమ్మడికాయ దప్పళం వస్తోంది’ అని కేకలు వినిపిస్తుంటాయి . 

మనం అయితే దప్పళానికి ఖాళీ ఉంచుకోవాలనుకుంటూ, అన్నీ తినేసి కొంత అన్నం మధ్యలో గుంట చేసి పెట్టుకొని అందులో వేడి వేడి ముక్కల పులుసు పోయించుకొని మైమరచి తింటాము. 


అప్పుడొస్తాడు పెళ్ళి పెద్ద గృహయజమాని కన్యాదాత , కమ్మని గట్టి పెరుగు దగ్గరుండి వెంటబెట్టించుకుని. జోడీగా చక్కెరకేళీ,అరటిపండు .విస్తట్లో పెరుగుకు అన్నం ఏదని కేకలు పెట్టి మళ్ళీ అన్నం వడ్డిపిస్తాడు. అన్నీ అందాయా లోటేమీ జరగలేదు కదా అని కనుక్కుంటాడు. 

అతని మొహంలో భారం దిగిన తేలిక తృప్తి సంతోషం పరవళ్ళు తొక్కుతున్నా పొంగిపోకుండా అందరకీ తన ఆహ్వానం అందుకొని పెళ్ళికి వచ్చినందుకు పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఇంకా చేయవలసిన బాధ్యతలు తలచుకుంటూ అందరనీ గబ గబా చిరునవ్వుతో తలపంకించి చూస్తూ అభినందనలు అందుకుంటూ ముందుకెడుతుంటాడు.


ఈయనకు ఎదురు వస్తాడు అత్తాకోడలంచు పంచా, కండువా సవరించుకుంటూ, పెళ్ళికూతురి తండ్రికి ప్రాణస్నేహితుడుట. ‘ ప్రత్యేకించి పురమాయించి చేయించాను, మాపిల్ల పెళ్ళి కోసం’ అంటూ  బూందీ మిఠాయి , పాకం కాజా వేసి, ‘ వదలకుండా తినాలి’ అని బెదిరించి మరీ వెడతాడు.


చివరలో ఎవరు పెట్టి పోయారో గమనించముగాని , భోజనం పూర్తి చేసి తలఎత్తి చూసేటప్పటికి సుగంధభరితమైన తియ్యని కిళ్ళీ ఉంటుంది, మంచినీళ్ళ గ్లాసు పక్కన.


కిళ్ళీ నోట్లో బిగించి , ఎదురుగా చూస్తే పందిట్లో ఓ పక్క వెండి కంచాలలో వధూవరులకు భోజనం వడ్డించి, స్నేహితులు వరసైన వారు పరాచికాలాడుతూ వారిని ఒకరికొకరు తినిపించుకోవాలని గొడవ చేస్తుంటారు.

 సిగ్గులతో ఓరచూపులతో కొంటె నవ్వులతో,ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటూ ఒకరు కొరికిన మిఠాయి మరోకరు కొరుకుతూ , జీవితంలోని మధురిమలను రుచులను కలిసి అందుకోవడానికి సిద్ధమైన వారిని దూరం నుంచే మనసులో  కలకాలం సుఖంగా బతకమని ఆశీర్వదించి, భుక్తాయాసంతో ఇంటిదారి పడతాం మనం.

💥💥💥💥

మరి ఈరోజుల్లో ఆ సరదాలు ఎక్కడ,

ఆ అపురూప వడ్డనలు ఎక్కడ....

నుంచుని ప్లేట్ పట్టుకుని తినే రోజుల్లో

ఈ కబుర్లు,సంతోషాలు..మృగ్యం ఐనాయి.

కొసరు వడ్డనలు..ఆత్మీయ పలుకరింపుల్ల

మధ్య  ఉల్లాసం గా సాగే ... విందు భోజనాలు...దాదాపు కను మరుగే..

ఆ రోజులు మళ్లీ రావు, కదా, వస్తె ఎంత బాగుండు?



ఈ కమ్మని పోస్ట్ కొత్త వారి కోసం..చిన్న  మార్పులతో మరోసారి....

చదువుతూ  ఆనందించ గలరు...


Forwarded

⚜ శ్రీ మమ్మియూర్ మహాదేవ ఆలయం

 🕉 మన గుడి : నెం 1056


⚜ కేరళ  : గురువాయూరు


⚜ శ్రీ మమ్మియూర్ మహాదేవ ఆలయం



💠 శివునికి అంకితం చేయబడిన మమ్మీయూర్ ఆలయం కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉంది.  

ఈ ఆలయం ప్రసిద్ధ గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయానికి కేవలం 200 మీటర్ల దూరంలో ఉంది.  

మమ్మియూర్ ఆలయాన్ని మమ్మియూర్ శివాలయం మరియు మమ్మియూర్ మహాదేవ క్షేత్రం వంటి ఇతర పేర్లతో కూడా పిలుస్తారు.  


💠 శివుని విగ్రహం పక్కనే విష్ణువు విగ్రహం ఏర్పాటు చేయబడింది, ఇది చాలా ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం.  శివుడు మరియు విష్ణువు ఒకరినొకరు సమానంగా భావించే ఏకైక ఆలయం ఇది.  

ఇక్కడ శివుడు ఉగ్ర భవంలో ఉన్నాడు కాబట్టి ఆయనను శాంతింపజేయడానికి విష్ణువు కూడా ఇక్కడ పూజించబడతాడు. 

మమ్మియూర్ ఆలయాన్ని సందర్శించకుండా గురువాయూర్ ఆలయంలో ప్రార్థనలు చేయడం అసంపూర్ణంగా ఉంటుందని బలంగా నమ్ముతారు.  రెండు దేవాలయాల్లోకి హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంది.


💠 అది ద్వాపరయుగం చివరి దశ.  మహా ప్రళయంలో శ్రీకృష్ణుని నివాసమైన ద్వారక మునిగిపోయింది. 

 ఒక మర్రి ఆకుపై భద్రపరచబడిన కృష్ణుడు, భూమిపై ప్రతిష్టించడానికి దేవగురువు బృహస్పతి మరియు వాయుదేవుడైన వాయుదేవునికి ఒక విగ్రహాన్ని అప్పగించాడు.


💠 చివరగా గురువు మరియు వాయులు అక్కడ యుగయుగాలుగా తపస్సు చేస్తున్న శివునిచే పవిత్రమైన రుద్రతీర్థం విశాలమైన సరస్సు  ఒడ్డుకు చేరుకున్నారు.  చాలా సేపు తపస్సు చేస్తూ కూర్చున్న స్వామికి దొరికాడు.  


💠 గురువు మరియు వాయుదేవుని ఉద్దేశాన్ని శివుడు అర్థం చేసుకున్నాడు, అతను రుద్రతీర్థ సరస్సు ఒడ్డున శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్టించమని సూచించాడు.  అలా చేయడానికి, శివుడు సరస్సుకు అవతలి వైపు ఉన్న సమీపంలోని ప్రదేశానికి మారాడు.


💠 శ్రీకృష్ణుని విగ్రహాన్ని గురువు మరియు వాయుదేవుడు ప్రతిష్టించిన ప్రదేశం గురువాయూర్ అని పిలువబడింది.  


💠 శివుడు తన కోసం మరియు అతని భార్య శ్రీ పార్వతి కోసం వెంబడించే ప్రదేశం మహిమయూర్‌గా మారింది.  కృష్ణ భగవానుడికి వసతి కల్పించడానికి తన అసలు నివాసాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నందుకు శివునికి ప్రసాదించిన స్థితి నుండి మహిమ అభివృద్ధి చెందుతుంది.  

ఇది కాలక్రమేణా మమ్మియూరుగా వ్యావహారికంగా మారింది.  

ఈ విధంగా మమ్మియూర్ మహాదేవ దేవాలయం యొక్క పురాణం ప్రసిద్ధ శ్రీ గురువాయూర్ ఆలయ ప్రతిష్ఠాపన వరకు విస్తరించింది.


💠 ఇది కేరళలోని 108 ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటి మరియు గురువాయూర్ చుట్టూ ఉన్న ఐదు శివాలయాల్లో ఒకటి, ఇది శివుని ఐదు ముఖాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.


💠 ఈ ఆలయంలో శివుడిని ఉమా మహేశ్వరుడిగా, పార్వతితో వర్ణించే రూపం ఉంది.  ఒక ప్రత్యేక గర్భగుడి విష్ణువుకు అంకితం చేయబడింది.

గురువాయూర్ ఆలయాన్ని సందర్శించే భక్తులు మమ్మియూర్‌ను తీర్థయాత్రలో భాగంగా భావిస్తారు.


💠 ఈ ఆలయం కేరళలోని 108 ప్రసిద్ధ శివాలయాల్లో ఒక భాగం మరియు గురువాయూర్ చుట్టూ ఉన్న ఐదు శివాలయాల్లో ఒకటి.  


💠 ప్రధాన దేవత శివుడు, అతను 'ఉమా మహేశ్వర' భావనలో ప్రతిష్టించబడ్డాడు - అతని ఎడమవైపు పార్వతి దేవితో అతని రూపం.  

ఇక్కడ విష్ణుమూర్తికి కూడా గుడి ఉంది.  

ఉప దేవతలు గణపతి, సుబ్రహ్మణ్యుడు, అయ్యప్పన్, కాళీ మరియు సర్ప దేవతలు.  

ఈ ఆలయాన్ని మలబార్ దేవస్వోమ్ బోర్డు నిర్వహిస్తోంది.  రోజూ మూడు పూజలు నిర్వహిస్తారు.  పూజక్కర చెన్నాస్ మన ఈ ఆలయానికి వారసత్వ తంత్రి కూడా.  శివరాత్రి మరియు అష్టమి రోహిణి ప్రధాన పండుగలు.


💠 ఆలయ సముదాయం క్లిష్టమైన చెక్కడాలు, సాంప్రదాయ వాస్తుశిల్పం మరియు పవిత్రమైన ఆచారాలతో అలంకరించబడి, భక్తులకు ప్రార్థనలు మరియు ఆశీర్వాదాలు పొందేందుకు ప్రశాంతమైన మరియు దైవిక వాతావరణాన్ని సృష్టిస్తుంది.


💠 గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయం మరియు గురువాయూర్ ఏకాదశి ఉత్సవాలతో అనుబంధం కలిగి ఉండటం మమ్మియూర్ శివాలయం యొక్క విశిష్టమైన లక్షణాలలో ఒకటి. ఈ వార్షిక పండుగ సందర్భంగా, భక్తులు శివుడు మరియు కృష్ణుడు ఇద్దరి ఆశీర్వాదాలను కోరుతూ పవిత్ర యాత్రలో భాగంగా రెండు దేవాలయాలను సందర్శిస్తారు. 

ఈ ఆలయం ఏడాది పొడవునా వివిధ మతపరమైన వేడుకలు, ఆచారాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది, దాని ఆధ్యాత్మిక ఆకర్షణ మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను జోడిస్తుంది.


💠 గొప్ప వారసత్వం, శిల్పకళా వైభవం మరియు ఆధ్యాత్మిక వాతావరణంతో, మమ్మియూర్ శివాలయం గురువాయూర్‌లో ప్రతిష్టాత్మకమైన మైలురాయిగా నిలుస్తుంది, భక్తులను మరియు సందర్శకులను భగవంతుని యొక్క దైవిక ఉనికిని అనుభవించడానికి మరియు హిందూ ఆరాధన యొక్క పురాతన సంప్రదాయాలు మరియు ఆచారాలలో మునిగిపోతుంది. .


💠 గురువాయూర్ రైల్వే స్టేషన్ నుండి 1.5 కి.మీ దూరంలో మరియు గురువాయూర్ ఆలయానికి 2 కి.మీ దూరం


Rachana

©️ Santosh Kumar

15-05-గీతా మకరందము

 15-05-గీతా మకరందము

         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - నాశరహితమగు అట్టి పరమాత్మపదమును ఎవరు పొందగలరో వచించుచున్నారు -

 

నిర్మానమోహా జితసఙ్గదోషా

అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః | 

ద్వన్ద్వైర్విముక్తాః  సుఖదుఃఖసంజ్ఞైః 

గచ్ఛన్త్య మూఢాః పదమవ్యయం తత్ || 

 

తాత్పర్యము:-అభిమానము (లేక, అహంకారము) అవివేకము లేనివారును, సంగము (దృశ్యపదార్థములం దాసక్తి) అను దోషమును జయించినవారును, నిరంతరము ఆత్మజ్ఞానము (బ్రహ్మనిష్ఠ) గలవారును, కోరికలన్నియు లెస్సగ (వాసనాసహితముగ తొలగినవారును, సుఖదుఃఖములను ద్వంద్వములనుండి బాగుగ విడువబడినవారును అగు జ్ఞానులు అట్టి అవ్యయమగు బ్రహ్మపదమును (మోక్షమును) బొందుచున్నారు.


వ్యాఖ్య:- పునరావృత్తిలేని శాశ్వతబ్రహ్మపదమును (మోక్షమును) ఎవరు పొందగలరో ఈ శ్లోకమునందు చక్కగ నిరూపింపబడినది. ఆఱు సల్లక్షణములు గలవారు అట్టి మహోన్నతపదవిని జేబట్టగలరు. అవి యేవి యనిన -

(1) అభిమాన, అవివేకరాహిత్యము.

(2) సంగమను దోషమును జయించుట - (సంగమనగా దృశ్యపదార్థములందు ఆసక్తి, అసంగమనగా అది లేకుండుట, వానితో అంటకనుండుట).

(3) నిరంతరము ఆత్మయందు నిష్ఠగలిగియుండుట. ఇచట నిరంతరము (నిత్యాః) అను పదము గమనింపదగినది. ఏదియో యొక కాలమున దైవచింతన చేయుట మంచిదేకాని, అది చాలదు, క్రమక్రమముగ ఆ దైవనిష్ఠాసమయమును పెంచుకొనుచుపోయి 'నిరంతర దైవనిష్ఠ’ యను స్థితిని జేరుకొనవలయును. ఏలయనిన, దైవభావమను ప్రకాశము లేనిచో మాయయను అంధకారము వెంటనేవచ్చి అలముకొనును. అత్తఱి మహాప్రమాదము సంభవించును. కావున నిరంతర అధ్యాత్మనిష్ఠద్వారా మాయకు ఒకింతేని అవకాశమీయక నుండవలెను. ప్రపంచములో మూడురకముల జనులుందురు. కొందఱు అహర్నిశము ఆత్మస్థితిని, దైవభావమును గల్గియుందురు. వీరు ఉత్తములు. మఱికొందఱు కొద్దిసేపు దైవచింతనగలిగి తదుపరి ప్రాపంచిక కార్యకలాపములయందు నిమగ్నులగుదురు. వీరు మధ్యములు, సాధనాతిశయముచే వీరు మొదటితరగతికి క్రమముగ జేరుకొనగలరు. ఇక నిరంతరము దృశ్యపదార్థవ్యామోహములోనే కొట్టుకొనుచు దైవస్మరణ ఒకింతైనను లేనివారు కనిష్ఠులు. ఈ స్థితి నింద్యము, గర్హితము అయియున్నది. కావున వివేకవంతు లిద్దానిని త్యజించవలయును.

  (4) ఇక మోక్షపదప్రాప్తికి ఆవశ్యకమైన నాల్గవ సుగుణము కోరికలను సంపూర్ణముగ, వాసనాసహితముగ తొలగించుట (వినివృత్తకామాః). "నివృత్త” అని చెప్పక "వినివృత్త” అని చెప్పుటవలన కోరికలన్నియు నిశ్శేషముగ, సమూలముగ (వాసనాసహితముగ) తొలగిపోవలెనని భావము.


 'అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః’ అను ఈ శ్లోకపాదమును ముముక్షువులు సదా స్మరించుచుండుట మంచిది. ఏలయనిన ఆధ్యాత్మిక సాధనసర్వస్వమంతయు ఈ రెండు పదములలోనే ఇమిడియున్నది. మొదటిది తత్త్వజ్ఞానము (అధ్యాత్మనిత్యాః), రెండవది వాసనాక్షయము" (వినివృత్తకామాః). మొదటిది దృక్ - స్వరూపస్థితి. రెండవది దృశ్యరాహిత్యము. ఈ రెండిటిని సాధకుడు ఏకకాలములో అభ్యసించుచురావలెనని శాస్త్రము లుద్ఘోషించుచున్నవి.

          (5) ఇక ఐదవసాధన సుఖదుఃఖాది ద్వంద్వరాహిత్యము.

(6) ఆఱవది అమూఢత్వము. అనగా అజ్ఞానము లేకుండుట. అజ్ఞానమును, అవిద్యను దరికిచేరనీయక, జ్ఞానమందే సదా నిలుకడగలిగియుండుట. ఈ ప్రకారముగ భగవానుడు తెలిపిన ఆఱుసాధనలను చక్కగ అవలంబించువారు పొందునట్టి మహత్తర ఫలితమేది? అవ్యయమగు మోక్షమే (గచ్ఛన్తి  పదమవ్యయమ్). ప్రపంచములోని పదవులన్నియు వ్యయములు, నాశవంతములు, క్షయిష్ణువులు. పరమాత్మపదవి యొక్కటియే అవ్యయమైనది. శాశ్వతమైనది. తరుగులేనిది. కావున విజ్ఞులెల్లరును అద్దానినే అన్వేషింపవలయును.


ప్రశ్న:- పరమాత్మపద మెట్టిది?

ఉత్తరము:- అవ్యయమైనది. నాశరహితమైనది. 

ప్రశ్న:- దాని నెవరు, పొందగలరు? 

ఉత్తరము:- (1) అభిమానము అవివేకము లేనివారు (2) సంగము (దృశ్య వస్తులం దాసక్తి) అను దోషమును జయించినవారు (3) నిరంతరము ఆత్మస్థితియందుండువారు (4) కోరికలను పరిపూర్ణముగ (వాసనాసహితముగ) తొలగించినవారు (5) సుఖదుఃఖాది ద్వంద్వములనుండి విడువబడినవారు (6) మూఢత్వము (అజ్ఞానము) లేనివారు - ఈ ప్రకారములగు ఆఱుసల్లక్షణములుగలవారు-పరమాత్మపదమును (మోక్షపదవిని) పొందగలరు.