6, ఏప్రిల్ 2025, ఆదివారం

సప్త చిరంజీవులు

 *🙏🌹🙏సప్త చిరంజీవులు 🙏🌹🙏*


 *🙏🚩1. అశ్వత్థామ :-* 


🙏🚩ద్రోణాచార్యుని కుమారుడు.

మహాభారత యుద్ధం అనంతరం మిగిలిన దుర్యోధనుని పక్షపు వీరులలో ఒకడు..


 *🙏🚩2. బలిచక్రవర్తి :-* 


 🙏🚩ప్రహలాదుని కుమారుడైన విరోచనుని కుమారుడు.ఇంద్రుని జయించినవాడు.


🙏🚩వామనమూర్తికి మూడడుగుల భూమిని దానం చేసి, అతనిచే పాతాళమునకు త్రోక్కబడ్డాడు. కానీ ఇతని సత్య సంధతకు మెచ్చుకున్న వామనుడు గదాదారిగా ఇతని వాకిటికి కావాలి కాచేవాడు..


 *🙏🚩3. వ్వాసమహర్షి :-* 


🙏🚩సత్యవతీ పరాసరుల కుమారుడు. కృష్ణ ద్వాయపాయనముని అని పిలవబదేవాడు. అస్తాదాస పురాణాలను, బ్రహ్మసూత్రములను, భారత భాగవతములను మరియు అనేక తత్వ గ్రంధములను రచించాడు. వేదాలను విడబరచిన వారు అని వ్యాసుడుని పేర్కొంటారు..


 *🙏🚩4. హనుమంతుడు :-* 


🙏🚩 కేసరి భార్య అయిన అంజన పుత్రుడే హనుమంతుడు. భర్త ఆజ్ఞా ప్రకారం వాయుదేవుని కొలిచిన అంజనాదేవికి వాయుదేవుడు ప్రత్యక్షమై తన గర్భంలో శివుని శక్తిని ఆమెకు వరముగా ఇవ్వగా అంజనా గర్భమున హనుమంతుడు పుట్టాడు. సూర్యుని శిష్యుడు ఈ రామ భక్తుడు. పరమేశ్వరుని అవతారము. రావణాది రాక్షసులను ఎదిరించి, సీత ఉనికిని తెలుసుకొని లంకేస్వరుని హతమార్చతంలో శ్రీ రామునికి ఎనలేని సేవ చేసిన మహాభక్తుడు హనుమ. మహా భారతయుద్ధంలో అర్జునిని ధ్వజమున వెలసి పాండవుల విజయానికు కూడా దోహదకారి అయ్యాడు.


 *🙏🚩5. విభీషణుడు :-* 


🙏🚩 కైకసికిని విస్వబ్రహ్మకు కలిగిన మూడవ కుమారుడు. బ్రహ్మపరమున ఇతడు సుశీలుడైయ్యాడు. ఈయన భార్య పరమ అనే గాంధర్వ స్త్రీ. రావణుని దుర్మార్గాలను నిర్భీతిగా విమర్శించి, సన్మార్గము గూర్చి చెప్పేవాడు. సముద్రము దాటుటకు , రావణుని హతమార్చుటకు శ్రీ రామునికి ఉపాయము చెప్పాడు.రావణుని అనంతరం లంకాధిపతి అయ్యాడు..


 *🙏🚩6. కృపాచార్యుడు:-* 


 🙏🚩సప్త చిరంజీవులలో 6వ వాడు . కృపుడు శరద్వంతుని కుమారుడు.. శరద్వంతుడు ధనుర్వేదమును పొంది తపస్సు చేసుకునేవాడు.

ఇంద్రుడు ఇతని తపస్సును భగ్నము చేయుటకై ఒక అప్సరసను పంపాడు. ఆమెను చూడగానే ఇతడు కామ పరవశుడై ఆ చోటును వొదిలి వేరే చోటుకు వెళ్ళాడు. 


🙏🚩ఆ సమయమున కల్గిన కుమారుడు కృపుడు. కృపుడు శరద్వంత దగ్గర ధనుర్వేదమును నేర్చుకున్నాడు. భీష్ముని కోర్కె మన్నించి ధనుర్విద్యను నేర్పాడు. మహాభారత యుద్ధం లో దుర్యోధనుని పక్షమున నిలిచి యుద్ధం చేశాడు. యుద్ధం అనంతరం జీవించిన వీరులలో కృపుడు ఒకడు.


 *🙏🚩7. పరశురాముడు:-* 


 🙏🚩రేణుకా జమదగ్నుల కుమారుడు. జమదగ్నికి తాత బృగు మహర్షి ఉపదేశంతో హిమాలయాలకు వెళ్లి శివుని గూర్చి తపస్సు చేశాడు. ఈశ్వరుడు బోయవాని వేషమున వచ్చి పరశురాముని పరీక్షించాడు. శివుని ఆఙ్ఞతో తీర్ధయాత్రలు చేశాడు.శివ అనుగ్రహముతో భార్ఘవాస్త్రమును పొందాడు...

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

కామెంట్‌లు లేవు: