5, సెప్టెంబర్ 2020, శనివారం

మహాభారతం శాంతిపర్వంలోని పద్యం

సరిగ్గా ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితిని వర్ణించిన మహాభారతం శాంతిపర్వంలోని తిక్కన గారి పద్యం....



చంపకమాల


వల నధికంబుగాఁ గలుగు వైద్యులు శాస్త్రము లభ్యసించి మం
దుల నొడఁగూర్ప నేర్చి తనదోషము లారయ బుద్ధి గల్గి యా
ర్తులకుఁ జికిత్స సేసెదరు; రోగము వాయమి లేదా? వారు రో
గులగుట గానమెట్లు ప్రతికూలవిధిన్ నరునేర్పు ద్రోచునే

 (ఆంధ్ర మహాభారతం శాంతిపర్వం ప్రధమాశ్వాసం 215వ పద్యం )

శ్రీమదాంధ్ర మహాభారతము

ప్రతిపదార్థం : వలను= వీలు, ఆనుకూల్యం: అధికంబు+కాన్= ఎక్కువగా కలుగు= కలిగిన వైద్యులు= భిషక్కులు, శాస్త్రములు= రోగి దానికి సంబంధించిన శాస్త్రాలను; అభ్యసించి= చదివి: మందుల= ఓషధులను; ఒడన్+కూర్పన్= తగిన విధంగా కలపటం; నేర్చి= అభ్యసించి; తన దోషములు= వాత, పిత్త, కఫాది శరీర దోషాలు; ఆరయన్= గుర్తించే; బుద్ధి= తెలివి; కల్గి= ఉండి; ఆర్తులకున్ = బాధపడుతున్న వారికి; చికిత్స= వైద్యం: చేసెదరు= చేస్తారు; రోగము= వ్యాధి; పాయమి= పోకపోవటం; లేదు+ఎ?= లేదా?? వారు=

ఆ వైద్యులు; రోగులు+అగుట%3 వ్యాధి పీడితులవటం; కానము+ఎట్లు?= చూడటం లేదా?: నరునేర్పు= మానవుడి కౌశలం; ప్రతికూల విధి న్ = విధి వైపరీత్యాన్ని; తోచును+ఎ?= నెట్టివేయగలదా? (లేదని భావం)

తాత్పర్యం: అవకాశం అధికంగా కలిగిన వైద్యులు వైద్య శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి, మందులు సరిగా తయారుచేయటం నేర్చుకొని, శరీర దోషాలను గుర్తించే తెలివి కలిగి ఉండి, రోగులకు వైద్యం చేస్తారు. అయినా రోగం తగ్గకపోవటం ఉంటుంది కదా! ఆ వైద్యులే రోగులవటం కూడా చూస్తున్నామే. మానవుడు నేర్పు విధివైపరీత్యాన్ని తొలగించలేదు

విశేషం: అలా: అర్థాంతరన్యాసం. మానవుడి మేధకన్న విధి బలీయమని అందరూ విధికి తల ఒగ్గవలసినవారేనని చెప్పటం

కామెంట్‌లు లేవు: