5, సెప్టెంబర్ 2020, శనివారం

సాంబ్రాణి ధూపం

సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఇంటి నుంచి తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
గుగ్గిలంతో సాంబ్రాణి వేయటం ద్వారా ఏడు రోజుల్లో
ఒక్కో రోజు ఒక్కో ఫలితం పొందవచ్చునని వారు చెప్తున్నారు.

ఆదివారం.:🙏
ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే.. ఆత్మబలం, సిరిసంపదలు, కీర్తి ప్రతిష్టలు,
ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది.

సోమవారం.:🙏
దేహ, మానసిక ఆరోగ్య వృద్ధి. మానసిక ప్రశాంతత.. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.

మంగళవారం.:🙏
శత్రుభయం, ఈర్ష్య, అసూయ, తొలగిపోతాయి.
కంటి దృష్టిలోపాలుండవు.
అప్పుల బాధ తొలగిపోతుంది.
కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది.

బుధవారం. :🙏
నమ్మక ద్రోహం, ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడం, పెద్దల, మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థికాభివృద్ధి వుంటుంది.

గురువారం.:🙏
గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం ద్వారా గురువారం సకల సత్ఫలితాలు చేకూరుతాయి.
చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి.

శుక్రవారం.🙏
లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది.
శుభకార్యాలు చేకూరుతాయి.
అన్నింటా విజయాలుంటాయి.

శనివారం.:
 సోమరితనం తొలగిపోతుంది.
ఈతిబాధలుండవు.
శనీశ్వరుడు, భైరవుని అనుగ్రహం పొందవచ్చు.
********************

కామెంట్‌లు లేవు: