20, జనవరి 2021, బుధవారం

ధ్వజస్తంభ

 ఈ ధ్వజస్తంభ విశేషం 

మామూలుగా దేవాలయాలలో ధ్వజస్తంభం పైన జెండా ఆకారంలో ముందుకు ఉండి దానిలో మూడు చీలలను ఏర్పాటు చేస్తారు అవి మూడు వేదాలకు ప్రతీకలుగా చెప్తారు కానీ ఈ ధ్వజస్తంభ విశేషం ఏమంటే గర్భాలయ నమునాని దీనిపై ప్రతిష్టించారు తద్వార ఆలయ రూపం దాని సంప్రదాయం (శైవం లేదా వైష్ణవ అని ఇది వైష్ణవాలయం) తెలుస్తుంది ఇలాంటి ధ్వజస్తంభం మనం ఈ ఆలయం లోనే చూడగలం మన స్థపతుల నిర్మాణ శైలికి ఇది ఒక అద్భుత సాక్ష్యం!!!

అరుదైన "ధ్వజ స్తంభం" - మన్నార్గుడి, తమిళనాడు లోని రాజగోపాలస్వామి ఆలయంలో ఉంది.10 వ శతాబ్దం లో చోళ రాజులు దీనిని నిర్మించారు.

ఓం నమో నారాయణాయ!!!


(General concept...సాధారణంగా ప్రతి ఆలయానికి ధ్వజస్థంభం ఉంటుంది.... జాగ్రత్తగా పరిశీలిస్తే... ఇది ఆలయగోపురానికంటే ఎత్తుగా ఉంటుంది... దీనికి కారణం.. ధ్వజ స్థంభం పైభాగంలో ఉన్న రాగి లోహం ... మెరుపు మరియు ఉరుముల సమయంలో ఉన్న ఆవేశాన్ని ఆకర్షించి ఆయా ఆలయాలపై పిడుగులు పడకుండా చేస్తుంది... అందువలన ఉరుము తుఫానుల సమయంలో ఆలయంలో ప్రజలు ఆశ్రయం తీసుకున్నా.. పిడుగుపాటుకు గురయ్యేవారు కాదు.. ఎలా అయినా మన పూర్వీకుల విజ్ఞానం అర్థంచేసుకునే కొలది... పెరుగుతూనే ఉంది...

కామెంట్‌లు లేవు: