17, జులై 2024, బుధవారం

నామజప మహిమ

 **నామజప మహిమ** గురించి పరమపూజ్యులు శృంగేరీజగద్గు రువులు ఇలా సెలవిచ్చారు.

భగవంతుని నామం మనలను ఎంతటి చెడు నుంచి అయినా కాపాడగలదు. మన చేయి అగ్నికి తెలిసితగిలినా,తెలియకతగిలినా కాలకుండా ఉండదు. అలానే, భగవంతుని నామం పలుకుటచే సర్వ పాపలను దగ్ధంచేయగలదు అందుకే మనం ఏ పనిలోఉన్నా, ఏ సమయములో అయినా భగవంతుని నామమును మననం చేస్తూ ఉండాలి. అందరికి మంత్రజపం చేయాలని కోరిక ఉంటుంది . వారికి పరమేశ్వరుడు ఒక మంత్రం ప్రసాదించాడు, ఆమంత్రాన్ని ఎలాఅయినా చేయవచ్చు. ఈ మంత్రం అందరు చేయవచ్చు. చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, ఆచారం పాటించే వాళ్ళు, పాటించని వాళ్ళు సర్వులు కూడా సర్వకాలాలలో చేసే మంత్రం .ఆమంత్రం ఏమిటంటే -

 *"హరే రామ హరే రామ రామ* *రామ హరే హరే!* 

*హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే*".

ఈ మంత్రం అందరు జపించ తగ్గది. క్రమం తప్పకుండా ఈ మంత్రం జపించడం వల్ల భగవంతుని కృప కలిగి, చిత్తశుద్ధి కలిగి, అన్ని పనులునెరవేరగలవు కాని, మనుషులు తినడం పడుకోవడం, తిరుగడం,చనిపో వడం , పశువులు కూడా ఈ విధంగా జీవిస్తాయి. పశువులకి మనకి తేడా ఏమైనా ఉందా మరి ? అందుకే భగవంతుని నామాన్ని ఎప్పుడూ జపిస్తూ ఉండాలి.

--- *జగద్గురు శ్రీశ్రీ అభినవ* *విద్యాతీర్ధ మహస్వామివారు.*

కామెంట్‌లు లేవు: