17, అక్టోబర్ 2020, శనివారం

 


*సనాతన ఆరోగ్య సూత్రములు:*




*1.భోజనాగ్రే సదా పధ్యం, లవణార్ద్రకభక్షణమ్,*


   *రోచనం దీపనం వహ్ని, జిహ్వాకంఠ విశోధనమ్.*




తా: భోజనాత్పూర్వము అల్లము, సైంధవలవణము కలిపి నమిలి తినిన జీర్ణశక్తి వృద్ధిచెందుతుంది. గొంతు నాలుక పరిశుద్ధమై, రుచి కలుగుతుంది.




*2.భుక్త్వా శతపదం గచ్ఛేత్, శనై స్తేన తు జాయతే,*


*అన్నసంఘాతశైథిల్యం, గ్రీవాజానుకటీసుఖమ్.*


*భుక్తోపవిశత స్తుందం, శయానస్య తు పుష్టతా,*


*ఆయు శ్చంక్రమమాణస్య, మృత్యు ర్ధావతి ధావతః*




తా: భోజనానంతరము నూరడుగులు నడచిన అన్నము యుక్తస్థానమున చేరి, మెడ, నడుము, మోకాళ్లు వీటియందు సుఖము కలుగును.భుజించిన తోడనే కదలక కూర్చున్నచో పొట్ట పెరుగును; పండుకొన్న వారికి కొవ్వు పెరుగును; మెల్లగా అటునిటు తిరిగిన ఆయుర్వృద్ధి కలుగును; పరుగెత్తినచో ఆయుఃక్షీణము.




*3.భుక్త్వా శతపదం గచ్చేత్, తాంబూలం తదనంతరమ్,*


*వామపార్శ్వే తు శయనం, ఔషధై: కిం ప్రయోజనమ్.*




తా: భోజనానంతరము నూరడుగులు నడచి, తదనంతరము తాంబూలసేవనము చేసి, ఎడమవైపున శయనించుచో యిక ఔషధము లెందుకు? (ఆరోగ్యవంతుడై యుండునని భావము.)




*4.అనాత్మవంతః పశువత్ భుంజతే యోఽప్రమాణతః,*


*రోగానీకస్య తే మూలమ్, అజీర్ణం ప్రాప్నువంతి హి.*




తా: ఎవరైతే మిత మనేది లేకుండా ఎల్లప్పుడూ ఎదో ఒకటి నములుతూ ఉంటారో వారు అజీర్ణవ్యాధికి గుఱి అవుతారు. అజీర్ణమే సర్వరోగములకును మూలము. (మానవులు ఆ యా వేళలయందే మితముగా భుజించవలెను.)




*5.భుంజానో న బహు బ్రూయాత్, న నిందేదపి కంచన,*


*జుగుప్సికధాం నైవ, శృణుయాదపి ఆ వతెత్.*




తా: భోజనసమయమున అధికముగా మాట్లాడరాదు. పరనిందా ప్రసంగము అసలే కూడదు. కధాప్రసంగములు చేయరాదు, విననూ రాదు..

కామెంట్‌లు లేవు: