5, అక్టోబర్ 2020, సోమవారం

**అద్వైత వేదాంత పరిచయం**

 **దశిక రాము*

01. పురుషార్థములు


  తత్వబోధ వేదాంతానికి చెందుతుంది. అది సంస్కృతంలో శంకరాచార్యచే లిఖించబడిన ముఖ్యమైన, ప్రాధమిక వచన కావ్యం. ఇందులో సాధారణంగా మన శాస్త్రాల్లో వాడే ముఖ్యమైన పదాలన్నీ వస్తాయి. మన శాస్త్రాలని ` అది భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ, పురాణాలు కానీ, రామాయణం కానీ చదవాలంటే ఈ పదాల అర్థం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనాఉంది. ముఖ్యంగా వేదాంత శాస్రాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ఈ పదాలని క్షుణ్ణంగా అర్థంచేసుకోవాలి.

  ఈ తత్త్వబోధలో ఉన్న అంశాలన్నింటి గురించి కొన్ని ప్రసంగాల పరంపర చూద్దాం. ఇందులోని అంశాలన్నింటినీ వివరించటమే కాక, కొన్ని కొత్త అంశాలను కూడా చూద్దాం. అద్వైత వేదాంతం బాగా అర్థం చేసుకోటానికి ముందుగా పురుషార్థాలంటే ఏమిటో చూద్దాం. మనుష్య లక్ష్యాలు:` పురుషార్థాలన్న పదాన్ని మనం మన శాస్త్రాల్లో తరచు చూస్తాం. అందుకని దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. పురుషార్థాలంటే మనుష్య లక్ష్యాలు. పురుష: అంటే మనుష్యుడు స్త్రీ గాని,పురుషుడు గాని. అందుకని దీన్ని మనుష్యార్థాలుగా అనువదించవచ్చు.అర్థ: అంటే సంస్కృతంలో అనేక అర్థాలున్నాయి. అర్థ: కి ఒక అర్థం, అర్థమే, అర్థ: అంటే ఐశ్వర్యం కూడా.ఈ సందర్భంలో అర్థ: అంటే ఒక లక్ష్యం, ఒక గమ్యం.

  అర్థ్యతే సర్వైహి మనుష్యైహి ప్రార్థ్యతే ఇతి అర్థ:

  దేన్నైతే ప్రతి మానవుడు కోరుతాడో అది అర్థ: ప్రతి మనుష్యుడూ దేన్ని కోరుతాడు? రకరకాల లక్ష్యాలుంటాయి ఒక్కొక్కరికీ. కాబట్టి ఏ మానవ లక్ష్యాన్నైనా అర్థ: అంటారు. ఈ రెండు పదాలనీ కలిపితే మానవలక్ష్యాలు అని అర్థం.

  శాస్త్రంలో పురుషార్థంకి ఇంకో అర్థం కూడా ఉంది. ఒక సందర్భంలో పురుషార్థం అంటే ఇచ్ఛ. ఇంకో సందర్భంలో పురుషార్థం అంటే ఎన్నుకోవటం. ఇంకో సందర్భంలో ప్రయత్నం అని కూడా వస్తుంది. అంటే ఇచ్ఛ, ఎన్నుకోవటం, ప్రయత్నం పురుషార్థంకి ద్వితీయ అర్థం. ప్రాథమిక అర్థం మానవ లక్ష్యం లేదా మానవ గమ్యం. ఈ లక్ష్యాలు మనుష్యులుగా సాధించాల్సినవే. జంతువులకో, వృక్షాలకో ఇది సాధ్యం కాదు. ఈ పురుషార్థాలు అందుబాటులో ఉండటం వల్ల మనుష్యుడు జంతువులు లేదా చెట్ల నుంచి విభిన్నంగా ఉన్నాడు. వీటివల్లే తక్కిన అన్ని జీవరాసుల కన్నా ఉన్నతంగా ఉన్నాడు.


అద్వైత వేదాంత పరిచయం

మనుష్యుల ప్రత్యేకత :`

  మనుష్యులకి మాత్రమే ఎందుకు ఉన్నాయి ఈ పురుషార్థాలు? మనిషిలోని ఏ శక్తి ఈ ప్రత్యేక అవకాశాన్ని యిచ్చింది, పురుషార్థాలు కోరుకోవటానికి? మనుష్యులు ఎన్నో అంశాలలో జంతువులని, చెట్లని పోలి ఉన్నారని శాస్త్రాలు పలుకుతున్నాయి. తక్కిన జీవరాశులకీ మనుష్యులకీ మధ్య సాధర్మ ్యం ఉంది. కాని మనిషి మాత్రమే వాడగల ఒక ప్రత్యేక లక్షణం 

ఉంది. 

పురుషార్థాలు: ఆ విషయం ఒక అందమైన శ్లోకంలో చెప్పబడిరది.

  ఆహార నిద్ర భయ మైథునం చ

  సామాన్య మేతత్‌ పశుభిర్‌ నరాణామ్‌

  బుద్ధి: తేషామ్‌ అధికో విశేష:

  బుద్ధ్య విహీన: పశుభిర్‌ సమాన:

  మనుష్యులకూ, తక్కిన జీవరాశులకూ కొన్ని అంశాలలో పోలికలున్నాయి. అందరూ ఆహారం కోరతారు.పుట్టినప్పటినుంచి ఆహారం కోసం వెతుకులాట మొదలౌతుంది. అలాగే నిద్ర,భయం,వంశాభివృద్ధి కూడా అందరికీ ఉంటుంది. కాని ఆలోచనా శక్తి, విచక్షణాశక్తి, అర్థం చేసుకునే శక్తి, భవిష్యత్తును ఊహించే శక్తి, ముందుచూపు లాంటివి ఉండటం వల్ల మనిషి తక్కిన జీవరాశులకన్నా ఉన్నతుడయ్యాడు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేయటం, భవిష్యత్తు బాగుండాలని కష్టపడటం అంతా విచక్షణాశక్తి కింద వస్తుంది.దాన్నే మనం బుద్ధి అంటాం.బుద్ధిర్‌ తేషాం

అధికో విశేష: ఇదీ మనకున్న అధిక శక్తి. కేవలం బుద్ధి వల్లే మనిషి తక్కిన వాటికన్నా ఉన్నతుడయ్యాడు. బుద్ధ్యా విహీన:` బుద్ధి లేకపోతే లేదా దాన్ని వాడకపోతే, పశువుతో సమానం.అందువల్ల విచక్షణాశక్తి మనుష్యులకి విశేషంగా ఉంది.ఈ ప్రత్యేకమైన శక్తివల్లే మనం స్వయం ప్రతిభ,స్వయం నిర్ణయం చేసుకోగలుగుతున్నాం.తక్కిన వారితో మనని పోల్చుకోగలుగుతున్నాం. ఇవి పశుపక్ష్యాదులు చేయలేవు.

  ఒక డాగ్‌షోలో ఏ కుక్కకి బాగా తర్ఫీదు నిచ్చారో పరిశీలిస్తారు. కుక్కల చేత అనేక గారడీలు చేయించి వాటికి బంగారు, వెండి, రజత పతకాలిస్తారు. ఒలింపిక్స్‌లోలాగా వాటిని ప్రత్యేక స్థానంలో, ప్రత్యేక మెట్లమీద నిలబెట్టవచ్చు కూడా. ఆ కుక్కల భావాలెలా ఉంటాయి? వాటికి బంగారు పతకం వచ్చినా అవి పొంగిపోవు. రాకపోయినా కృంగిపోవు. అవి నాలుక బయటకి చాచి, అభావంగా యిటూ, అటూ చూస్తాయి అంతే. నిజానికి ఏం జరుగుతుందో వాటికేం అర్థంకాదు. కాని, ఆ కుక్కల యజమానికి మాత్రం కాంప్లెక్స్‌ ఉంటుంది. అందువల్ల మనకి బుద్ధి ఈ విశేష లక్షణమైన కాంప్లెక్సును పెంచి స్వయం నిర్ణయం, తోటివారితో పోల్చుకోవటం కలుగ

చేస్తుంది.


అద్వైత వేదాంత పరిచయం

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: