5, అక్టోబర్ 2020, సోమవారం

గురువు లేకుంటే వచ్చిన నష్టమేమిటి?

 [05/10, 7:13 am] +91 93913 24915: సత్పురుషుల సాంగత్యం


🍁🍁🍁🍁


‘సత్పురుషుడు ఎక్కడ ఉంటాడో ఆ ప్రదేశం ఇతర విషయాల్లో ఎలాంటిదైనా స్వర్గం కంటే అధికమైన దవుతుంది. అది జ్ఞానవంతులకు నివాసయోగ్యం.


 "సత్పురుషుడు, వృక్షము లేని చోటు.. సర్వవస్తు సమృద్ధమైనా అది మరుభూమి (శ్మశానం)తో సమానం’’అని జ్ఞానవాసిష్ఠ బోధ. జీవితంపై సందేహ, సంకటాలు కలిగినవారు మహాత్ములైన సజ్జనుల చెంత చేరాలి.


 

దుఃఖితులైన వారికి సత్పురుషులు.. ధైర్యాన్ని, దైవాలంబనోపాయాన్ని బోధిస్తారు. ధర్మ, తత్వ రహస్యాలను తెలియపరచి శాంతహృదయులు చేస్తారు.



ఇంతకీ సజ్జనులంటే, సత్పురుషులంటే ఎవరు ? అంతర్యామియైున భగవంతుని కనుగొనడానికి ప్రయత్నించే సాధనాపరులే సజ్జనులు, సత్పురుషులు. సజ్జనులైన మానవులు మానవ ధర్మ సారాన్ని ఎరిగి ఉంటారు. వారికి చిత్త చలనం ఉండదు. తాపత్రయాలను పొందరు. ఎన్ని కష్టాలు వచ్చినా.. పర్వతం వలె చలించక స్థిరచిత్తులై ఉంటారు.

 

మనస్సునందున్న మాలిన్యాన్ని దైవనియమ సాధనలచే పోగొట్టుకొని స్థిరమతితో యత్నించిన మానవులు పరమేశ్వరుని కనుగొనగలుగుతారు. ఆత్మవేత్తలైనవారు దేని మీదా ఇచ్ఛ లేనివారై ఉంటారు. ఆత్మదర్శనం చేతనే తృప్తి చెంది ఉంటారు. అటువంటి వారి దర్శనం లభించినవారే ధన్యులు.


 పద్మాకరం దినకరో వికచం కరోతి

చంద్రో వికాసయతి కైరవచక్రవాలమ్‌

నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి

సంతః స్వయం పరహితే విహితాభియోగాః’’


 తామరలు ప్రార్థించకుండానే సూర్యుడు పద్మాలను వికసింపజేస్తున్నాడు. కలువలు అడగకుండానే చంద్రుడు వాటిని వికసింపజేస్తున్నాడు. అడగకుండానే మేఘుడు వర్షోదకధారలు కురిపించి జీవనదానం చేస్తున్నాడు. ఇలా సత్పురుషులు తమంత తామే పరహితాసక్తులై ఉంటారని.. ఎవరూ అడగకుండానే సాయం చేస్తారని భర్తృహరి చెప్పాడు.



ఆత్మోద్ధరణకు ధనం, స్నేహితులు, శాస్త్రాలు, బంధువులు చేయగలిగిన ఉపకారమేదీ లేదు. ఆ విషయంలో సహాయం చేయగలిగినది సత్పురుషులే ! సత్పురుష సమాగమమనే చక్కని నావలో సంసారం నుంచి ముక్తిని పొందడమే ఉత్తమ మార్గం.


 సత్పురుషుల తోడి సాంగత్యం పూర్వపుణ్య వశానే లభిస్తుంది. అది గంగలా పాపాలను పోగొడుతుంది. వెన్నెలలా అందరి మనస్సులకూ ఆనందం కలిగిస్తుంది. సూర్యుని ప్రభలవలె అజ్ఞానాంధకారాన్ని నిర్మూలిస్తుంది. చల్లని చెట్టు నీడవలె తాపమును పోగొడుతుంది. బహుదుర్లభమైన సజ్జన సాంగత్యం వల్లనే పాప, తాప, దైన్యాలు నశిస్తాయి



 🌸జై శ్రీమన్నారాయణ🌸

[05/10, 7:13 am] +91 93913 24915: *ఇది చదవండి చాలా బాగుంటది good message*


మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ...  ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి.. ఇది చాలా అద్భుతమని  ఆశ్చర్యపోతుంటాం!! 


మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు .


🌷 *1* . *తల్లి* 


మనల్ని ఈలోకానికి  పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన...  👩‍🦱తల్లి మొదటి అద్భుతం. 


🌷 *2* . *తండ్రి* 


మన కళ్ళల్లో  ఆనందాన్ని చూడాలని  తన కన్నీళ్లను దాచేస్తాడు  

మన పెదవులపై  చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు 

దుఃఖాన్ని  తాను అనుభవిస్తూ..😎 సంతోషాన్ని  మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం. 


🌷 *3* . *తోడబుట్టిన*  *వాళ్ళు* 


మన తప్పులను వెనుకెసుకురావాడానికి...  

మనతో పోట్లాడడానికి...  మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు... 

తోడబుట్టినవాళ్లు మూడో అద్భుతం 😥🥴☺


🌷 *4* . *స్నేహితులు*  


మన భావాలను పంచుకోడానికి..  

మంచిచెడు అర్థం అయ్యేలా చెప్పడానికి...

ఏది ఆశించకుండా..  మనకు దొరికిన స్నేహితులు  నాలుగో  అద్భుతం. 🌚🌝👨‍✈️🕺


 *🌷5* . *భార్య* / *భర్త* 


ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను... ఎదిరించేలా  చేస్తుంది 

కలకాలం తోడు ఉంటూ...🌛 ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే...  ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది  🌜

భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే  ఐదో అద్భుతం మన సొంతం .


🌷 *6* . *పిల్లలు* 


మనలో స్వార్థం మొదలవుతుంది..  

మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది...  

వారి ఆలోచనలే  ఎప్పుడూ చుట్టూ ఉంటాయి..  

వారికోసం మాత్రమే గుండె  కొట్టుకుంటూ  ఉంటుంది.. 

వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని... తల్లి తండ్రులు  అసలు ఉండరు...  🙏

పిల్లలు ఆరో అద్భుతం 


అన్ని అయిపోయాయి ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా?


🌷 *7* . *మనవళ్ళు* *మనవరాళ్లు* 


వీరికోసం ఇంకా కొన్నిరోజులు  బతకాలనే  ఆశపుడుతుంది.. 

వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి, అద్భుతం 

మళ్ళీ పసిపిల్లలం...🏃🏃‍♀️👩‍🔧👨‍💼👨‍🎓👩‍🎓 అయిపోతాం  

వీరు మన జీవితానికి  దొరికిన.. ఏడో అద్భుతం 🌹🌺🌷🥀


🌹ఇలా అద్భుతాలన్నీ  మన చుట్టూ ఉంటె అక్కడెక్కడో వెళ్లి వెతుకుతుంటాం... 

కాసింత ప్రేమ చాలు... ఇంకెన్నో అద్భుతాలు  మన సొంతం అవుతాయి  

చిన్న పలకరింపు  చాలు... మనల్ని ఆ అద్భుతంగా  చూడడానికి.  

అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి  మరో అద్భుతాన్ని  సృష్టించేద్దాం ...🙏

[05/10, 7:13 am] +91 93913 24915: 🙏అమృతం తాగిన దేవతలు కూడా ఒకనాడు కాలం చేయవలసినదే, కానీ విషాన్ని మింగిన శివుడు మృత్యుంజయుడు. ఆ తల్లి మాంగళ్యాన్ని ఎవ్వరు స్మరించినా గండాలు ఆపదలు తొలగిపోతుంది. మాంగళ్యాన్ని భావన చేసి నమస్కారం చేసుకోవాలి.


🌹సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే,

శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమోస్తుతే.


🙏​​​​తాత్పర్యం:

 ఓం = ఓంకారము

సర్వ = సమస్తములైన

మంగళ = శుభములకును

మాంగళ్య = శుభ కరమగు దానా !

శివే = శివుని అర్ధాంగి అయిన

సర్వ = సమస్తములైన

అర్ధ = ప్రయోజనములను

సాధికే = నెర వేర్చెడి శక్తి గలదానా

శరణ్యే = భక్తులకు పెద్ద దిక్కు అయినదానా !

త్ర్యంబకే = ముక్కంటి అర్ధాంగి

నారాయణి = విష్ణుమూర్తి సోదరికి

గౌరీ = ఓ పార్వతి మాతా !

తే = నీకు

నమః = నా యీ వందనము

అస్తు = చెందును గాక !


🌹భావం: 

      సకల శుభములకు మూలమైన పార్వతీ! కోరికలన్నీ తీర్చు తల్లీ ! అందరికీ శరణము నిచ్చు,  మూడు కన్నుల కల శివుని అర్ధాంగి అయిన గౌరీ ! నారాయణుని సోదరీ ! నీకు నమస్కరము.


ఈ  శ్లోకమ్ స్త్రీలు పురుషులు అన్న బేధం లేకుండా అందరూ నిత్యం స్మరించవచ్చు.. ఉదయాన్నే వినాయకుడిని


ఓం గం గణపతయే నమః (21 సార్లు)


ఓం గంగా దేవై నమః (మూడు సార్లు) తలుచుకుని తర్వాత


సర్వ మంగళ మాంగళ్యే శివ సర్వార్ధ సాధికే

శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే||

సృష్టి స్థితి వినాశానాం శక్తి భూతే సనాతని

గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే||

శరణాగత దీనార్త పరిత్రాణ నారాయణే

సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే||

జయ నారాయణి నమోస్తుతే ( చై చూసుకుని నమస్కారం చేసాకే గణపతి స్మరణ తో మొదలు పెట్టాలి)


ఇలా స్త్రోత్రం చేసి తర్వాత మీ నిత్య కర్మలు పూర్తి చేసి ఇంటిదేవుణ్ణి, విష్ణు ఆరాధన చేసే వాళ్ళు వారి వారి పూజ విధులు యదా విధిగా పూర్తి చేసుకోవచ్చు.


రాత్రి పడుకునే సమయంలో 11 సార్లు శివ నామ స్మరణ చేయాలి.


🌹శ్రీ మాత్రే నమః🌹

[05/10, 7:14 am] +91 93913 24915: 🙏 సకల సౌభాగ్యలను యిచ్చే వట్టి వేరు. 🙏 దైవీక సువాసనలు వెదజల్లే చోట్ల మహాలక్ష్మీ నివాసముంటుంది.  పసుపు , కుంకుమ, చందనం,  వంటి సువాసన వెదజల్లే ద్రవ్యాలన్నీ మహాలక్ష్మి పూజకి యోగ్యమైనవే.  దేవి అనుగ్రహంతో , సకలసౌభాగ్యాలు  మనకు కలిగించే,  ద్రవ్యం  వెట్టి వేరు. జీవితంలో విజయాలు కలిగించే, వేరు యిది. మంచి సువాసన వెదజల్లే యీ  వట్టి వేరు పూజకి ఉపయోగించే విధానం.🙏 🙏 1. చెయ్యంత వట్టి వేరు తెచ్చి పూజా గదిలో  అమర్చుతేనే మంచి ప్రకంపనలు కలుగుతాయి.  🙏2. ఒక చిన్న కప్పులో  నీరు పోసి  అందులో వట్టి వేరు నిమ్మపండు వేసి , పూజా గదిలో  అమర్చుకుంటే లక్ష్మీ దేవి సంపూర్ణ అనుగ్రహం మనకి కలుగుతుంది.  (నిమ్మపండు మాత్రం మారుస్తూ  వుండాలి.)  ఇందువలన ఋణబాధలు వుండవు .  సంపదలు వృధ్ధి చెందుతాయి.  🙏3.వట్టి వేరుతో చేసిన, వేంకటేశ్వరుని, వినాయకుని ఇతర దైవాల రూపాలను పూజా గదిలో  అమర్చి పూజలు చేస్తే ఉన్నతమైన శుభఫలితాలు  కలుగుతాయి. 🙏 4.నవరాత్రి, వరలక్ష్మీ పూజలు గృహంలో జరిపే విశేష పూజలకి, కళ్యాణాలలో వట్టి వేరుతో చేసిన  దైవ  మూర్తులను  అందరికీ వినియోగించినందు వలన మనకి సకల ఐశ్వర్యాలు లభిస్తాయి.🙏

[05/10, 8:57 am] +91 93913 24915: *\!/ ఓం నమో వెంకటేశాయః.\!/* 

 **_అందరికీ  శుభోదయం...**_ 

         *నారసింహ విజయము* 

+++++++++++++++++++++

                 శ్రీ ప్రహ్లాద భక్తి    

************************

173శ్లోకము కొనసాగింపు 

**************************

" నిండినం బట్టుచాలక దోధూయమాన హృదయంబు లయి పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ముఖర చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగాఁ బ్రపుల్ల పద్మ యుగళ సంకాశ భాస్వర చక్ర, చాప, హల, కులిశ, అంకుశ, జలచర రేఖాంకిత చారు చరణతలుండును, చరణచంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మకులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరుస్తంభ యుగళుండును,"


 *భావము* : “బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు మొదలైన దేవతలందరితో, సమస్త జీవజాలంతో సహా బ్రహ్మాండభాండం గుండెలవిసేలా ఒక్కసారి ఫెఠేలున పగులినట్లు అయింది. స్తంభం ఛిన్నాభిన్నమైంది. దానిలో నుంచి దేదీప్యమానమైన దివ్య తేజస్సుతో నరసింహదేవుడు ఆవిర్భవించాడు. ఆ నరసింహదేవుని పాదాలు చక్రం, చాపం, నాగలి, వజ్రాయుధం, మీనం వంటి శుభరేఖలు కలిగి, వికసించిన పద్మాల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ స్వామి దివ్య పాదాలతో అడుగులు వేస్తుంటే, ఆ భారానికి భూమిని మోసే అష్టదిగ్గజాలూ, కులపర్వతాలూ, కూర్మరాజూ అణిగి మణిగిపోతున్నారు.”


+++++++++++++++++++++

 *విష్ణుసహస్రం* .... అర్థం, పరమార్థం.

+++++++++++++++++++++

571) దివ: సృక్ - దివిని అంటియున్నవాడు.

+++++++++++++++++++++

 *ఈ ఉదయం శ్రీహరి కీర్తన* 

+++++++++++++++++++++

" ఇతనికంటే మరి 

దైవము కానము  "

+++++++++++++++++++++

[05/10, 9:01 am] +91 93913 24915: 🙏🙏🙏🙏🙏


ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం.


– వాయువుకు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ.


– అగ్నికి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.


– జలముకు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.


– భూమికి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.

ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.


– జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.


– అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.


– వాయువు…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.


– ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.


కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే. ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే.


Copied


🙏🙏🙏🙏🙏

[05/10, 10:28 am] +91 93913 24915: 🌻🌺🌻🌺🌻🌺🌻🌺🌻🌺🌻

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

        *ఇంతకీ సప్తర్షులు ఎవరు!*

⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡

చిమ్మచీకటి రోజున ఆకాశంలోకి చూసినప్పుడు ఒక ప్రశ్నార్థకంలా కనిపించే నక్షత్ర సమూహమే... సప్తర్షి మండలం. సప్తర్ష మండలం మనకి కొత్త కాదు. తల పైకెత్తి పరిశీలించినప్పుడల్లా కనిపించేదే. అందులో ఉండేవి కేవలం నక్షత్రాలు మాత్రమే కాదనీ... మహారుషులే అలా తారా రూపంలో సంచరిస్తున్నారనీ మన నమ్మకం. మరైతే ఆ సప్తర్షులు ఎవరు.. వారి పేర్లు ఏమిటి అని తెలుసుకోవడం కూడా ఆసక్తికరమే కదా!


సప్తర్షుల పేర్లు ఏమిటి అని ఖచ్చితంగా చెప్పడం అంత తేలికైని విషయం కాదు. ఎందుకంటే వేర్వేరు పురాణ గ్రంథాలలో వేర్వేరు సప్తర్షులు కనిపిస్తారు. బృహదారణ్యకంలో, వేదాలలో, మహాభారతంలో... ఇలా ఒకో ప్రమాణం ప్రకారం వారి పేర్లు మారుతూ కనిపిస్తాయి. అంతేకాదు వేర్వేరు మన్వంతరాలలో కూడా వీరి పేర్లు వేర్వేరుగా కనిపిస్తాయి. దీనిని బట్టి సప్తర్షి అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదనీ, అది ఒక హోదా అని భావించవచ్చునేమో. కాలానుగుణంగా ఈ హోదాను వేర్వేరు రుషులు దక్కించుకుంటూ ఉండవచ్చు. కేవలం హైందవ మతంలోనే కాదు... హైందవం ఆధారంగా వచ్చిన సిక్కు, జైన మతాలలో కూడా ఈ సప్త రుషులు ప్రస్తావన కనిపిస్తుంది. మహాభారతం మనకు ఇటీవలి ప్రమాణం కాబట్టి ఇందులో ఉన్న పేర్లను ప్రస్తుతానికి ఉన్న సప్తర్షులుగా భావించవచ్చు. వీరు... మరీచి, అత్రి, అంగీరసు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు.


సప్తర్షి జాబితాలో ఉన్నవారంతా అసాధారణమైనవారే! తమ పేరుతో ఒక గోత్రాన్ని స్థాపించిన వారే! విద్యాదాతలుగా, జ్ఞాన ప్రదాతలుగా, హోమ ద్రవ్యాలను స్వీకరించేవారుగా వీరికి గొప్ప పేరు. అయితే వీరందరూ కూడా గృహస్థులే కావడం విశేషం! ఒకో రుషి కుటుంబాన్ని కనుక గమనిస్తే అందులో పురాణ పాత్రలు చాలానే కనిపిస్తాయి. రామాయణంలో ముఖ్య పాత్ర అయిన రావణాసురుడు సాక్షాత్తూ పులస్త్యుని మనవడు. మహాపతివ్రతగా పేరొందిన అనసూయ అత్రిమహాముని భార్య.


ఒకవైపు నడి సముద్రం, చుట్టూ చిమ్మచీకటి... ఇలాంటి సందర్భంలో మన పెద్దలకు సప్తర్షి మండలం ఒక దారిని చూపించే సాధనంగా ఉండేది. సముద్రం నుంచి ఎడారి వరకూ బాటసారులకు గమ్యం వైపు నడిపించేది. ఆఖరికి ప్రళయకాలంలో సత్యవ్రతుడనే రాజు సకల జీవరాశులను పడవలోకి చేర్చినప్పుడు, అతనికి దారి చూపింది కూడా సప్తర్షి మండలమే అని చెబుతారు. బహుశా అందుకనే ఆ నక్షత్రమండలానికి సప్తర్షి హోదాను కట్టబెట్టి ఉండవచ్చు. కేవలం భారతీయులకే కాదు! పాశ్చాత్యులు కూడా ఈ సప్తర్షి మండలాన్ని ‘బిగ్‌ డిప్పర్‌’ పేరుతో పిలుచుకుంటారు. ఉత్తర ఖగోళార్ధంలో సంవత్సరం పొడవునా కనిపించే ఈ బిగ్ డిప్పర్‌, నౌనాయానం ద్వారా మన నాగరికత ముందుకు సాగడానికి తోడ్పడింది.


సప్తర్షి మండలం అనగానే మనకు గుర్తుకువచ్చే మరో విషయం... అరుంధతీ నక్షత్రం! తన భర్త వశిష్ఠుని అడుగుజాడల్లో నడిచే అరుంధతి నక్షత్రం ఆయనతో పాటుగానే సప్తర్షి మండలంలో భాగమైందని విశ్వాసం. అందకనే పెళ్లయిన నూతన వధువుకు, అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటారు. అలా భర్తను నిత్యం అనుసరించే అరుంధతి, ఆమెను అంత ఎత్తున నిలబెట్టిన వశిష్ఠులు సప్తర్షి గణంలో ఒక భాగమైపోయారు.

✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️

*తెలుగు వెలుగు సౌజన్యంతో*

🌻🌺🌻🌺🌻🌺🌻🌺🌻🌺🌻

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

[05/10, 10:28 am] +91 93913 24915: 🕉🕉🕉 🕉🕉🕉


 🙏🏼 *భగవంతుని గురించి మన మనసు ఎంత పరితపిస్తే మనము ఆయనకు అంత సన్నిహితంగా ఉన్నట్లు అర్థం* 🙏🏼


🕉🔯🔯🕉☸☸🕉⚛

[05/10, 10:29 am] +91 93913 24915: *అరుణాచలంలోని ని ఉత్తర గోపురం ఈ గోపురం పేరు  అమ్మణ్ణీ అమ్మన్ గోపురం అని పిలుస్తారు.*


 అమ్మణ్ణీ అమ్మన్ అనే ఆమె మహా శివ భక్తురాలు ఆమె శివభక్తి కి టెంపుల్ లో ఒక గోపురం కట్టాలని సంకల్పించి ఆమె ఈ ఉత్తర గోపురం కట్టించారు. ఎలా కట్టించారు అంటే గోపురం కట్టడానికి ఆమె దగ్గర అ చిల్లి గవ్వ కూడా లేదు. ఆమె తిరువన్నామలై వీధులలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి చందా ఇవ్వమని అడిగేది చందా అంటే ఎవరైనా 100, 50 ఇస్తారు కానీ  అమ్మణ్ణీ అమ్మన్ అనే ఆమె వెళ్లి మీ ఇంట్లో పలానా ప్రదేశంలో లో ఇన్ని డబ్బులు ఉన్నాయి అవి నాకు చందాగా ఇవ్వండి  స్వామివారికి గోపురం కట్టాలి అని అడిగేది ఆమె చెప్పినట్టు అక్కడ అన్ని డబ్బులు ఉండేవి వారు అన్ని డబ్బులు తీసుకొనివచ్చి ఇచ్చే వారు అలా చందాలు వసూలు చేసి ఆమె ఈ గోపురం కట్టించారు. అందుకనే దీనిని అమ్మణ్ణీ అమ్మన్ గోపురం అని పిలుస్తారు అరుణాచలం వెళ్లే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ గోపురం నుంచి లోపలికి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకొని బయటికి రావాలి అని ఒక సంప్రదాయం ఉంది. అందువలన ప్రతి ఒక్కరు అరుణాచల యాత్రలో ఉత్తర గోపురం లోనుంచి ఒకసారి లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని బయటికి వచ్చి మీ  యాత్ర సంపూర్ణం చేసుకొని ధన్యులు కండి*

 

*ఓం అరుణాచలేశ్వరాయ నమః*


🙏🙏🕉🙏🙏🕉🙏🙏🕉🙏🙏

[05/10, 10:29 am] +91 93913 24915: ఆత్మజ్ఞానం అతి సులభం..!!

ఆత్మజ్ఞానం పొందడం ఎంతో తేలికని సద్గురు చెబుతున్నారు. మనం చేయవలసిందల్లా అది ఎక్కడో లేదు మనలోని ఉందని తెలుసుకొని అంతరంగంలో చూడడమే అని అంటున్నారు.

ఇప్పుడు భగవంతుడు దీనిని ఎందుకు ఇంత కష్టంగా చేశాడు అన్నది ప్రశ్న..! నిజానికి భగవంతుడు దీనిని ఏమాత్రం కష్టంగా చేయలేదు. మరోరకంగా చెప్పాలంటే, ఇది కష్టమైనదీ కాదు. మీరు రమణ మహర్షి గురించి విన్నారా..? ఆయన ఏమన్నారంటే “ఆత్మజ్ఞానం అతి సులభం” అని..! అంటే సృష్టిలో ఉన్న అన్నింటిలోకీ ఆత్మజ్ఞానం తేలికైనది అని..! అది నిజానికి అంత తేలికైనది కూడా..! ఇది కేవలం మీరు ఒకే సమయంలో సుముఖంగానూ విముఖంగానూ ఉండడంవల్ల ఇలా జరుగుతోంది. ఈ సంఘర్షణ అన్నది మీది..! ఇది కష్టమైనది కాదు. మీలో ఉన్నదానిని అనుభూతి చెందడానికి మీరు ఏ కష్టమైన పనులు చెయ్యాలి..? కాని మీరు ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నారు. మీరు ఈ ప్రక్క గదికి వెళ్లాలంటే, మీకు ఈ బిల్డింగ్ గురించి కొంత తెలిస్తే, మీరు ఇలా తిరిగి అలా వెళ్లిపోతారు. అదే, మీకు ఈ బిల్డింగ్ ఎలా కట్టారో తెలియకపోతే మొత్తం ఇలా చుట్టూ తిరిగి వస్తారు. ఆ విధంగా కూడా ఆ గదిని చేరుకోవచ్చు. కాకపోతే ప్రపంచం అంతా చుట్టూ తిరిగిరావలసి ఉంటుంది. ఇది కూడా ఒక విధంగా ప్రయాణం చెయ్యడమే. కానీ ప్రపంచాన్ని అంతా చుట్టి రావడం అనేది ఒక మూర్ఖమైన పని. అవునా..? కాదా..? మీరు ఇలా ప్రపంచాన్ని అంతా చుట్టి రావాలి అనుకుంటే, ఎన్నో ప్రమాదాలు మీకు మధ్యలో ఆటంకం కలిగించవచ్చు.

మీరు ఏదో ఒక రోజున ఇటువంటి ఎరుకను తెచ్చుకొని, ఒక్కసారి వెనుదిరుగుతారని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఇది ఎంతో సరళం, ఎంతో తేలిక..!

ఒకానొక సమయంలో యూరప్ లో కొన్ని వేలమంది ప్రజలు, ఇండియాను కనుగొనాలని బయలుదేరారు. చాలామంది మార్గమధ్యంలోనే రాలిపోయారు. వారు సముద్రంలో మునిగిపోయారు. కేవలం ఒక్క వాస్కోడీగామా మాత్రమే రాగలిగారు. ఎవరైతే సముద్రంలో మునిగిపోయారో, మనం వారి గురించి ఎప్పుడూ విననేలేదు. వారి పేర్లు కూడా మనకి తెలియదు. వారు ఎవరు..? ఏమి చేశారు..? ఏమీ మనకు తెలియదు..! కానీ ఎవరైతే వచ్చారో, వారినే మనం ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాం. కానీ ఆ వేల సంఖ్యలో ఉన్నవారు ఎవరైతే సముద్రంలో మునిగిపోయారో, వారు తుడిచిపెట్టుకు పోయారు! అవునా..? కాదా..? అందుకని ఈ ప్రక్క గదికి వెళ్లడానికి ప్రపంచాన్ని అంతా చుట్టి వెళ్లాలనుకుంటే, ఆ గదికి వెళ్లగల అవకాశం ఎంతో తక్కువ. మీరు అక్కడికి వెళ్లలేరని కాదు..! కానీ అందుకు అవకాశం ఎంతో తక్కువ. ఎందుకంటే ప్రయాణం ఎంతో కష్టంగా ఉంటుంది కాబట్టి..! మీరు కూడా ఈ విధంగానే వెళ్లాలనుకుంటున్నారు. కానీ గది ఇక్కడ ఉంది. కేవలం మీరొకసారి వెనుదిరిగారనుకోండి, అంతే!

మీరు ఏమి చెయ్యాలనుకుంటున్నారంటే, ఉదాహరణకి ఇక్కడ మీ ఎదురుగుండా మీ నీడ ఉందనుకోండి. మీరు ఎలా అయినా సరే, దాన్ని దాటి వెళ్లాలనుకొని మొదట త్వరగా నడవడం మొదలు పెడతారు. అప్పుడు మీ నీడ మీకంటే తొందరగా నడుస్తుంది..! ఆ తర్వాత మీరు పరుగెట్టడం మొదలు పెడతారు. ఇప్పుడు మీ నీడ మీకంటే వేగంగా పరుగెడుతుంది..! కానీ మీరు కనుక ఒక్కసారి వెనుదిరిగారనుకోండి, మీ నీడ మీ వెనక్కి వెళ్లిపోతుంది. చెయ్యవలసినదల్లా ఇంతే..! కానీ మీరు అలా తిరగాలనుకోవడం లేదు. మీరు ఇదే త్రోవలో వెళ్లాలనుకుంటున్నారు. ఇది సాధ్యమే..కానీ ప్రపంచాన్నంతా చుట్టిరావలసి ఉంటుంది.

మీరు ఏదో ఒక రోజున ఇటువంటి ఎరుకను తెచ్చుకొని, ఒక్కసారి వెనుదిరుగుతారని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఇది ఎంతో సరళం, ఎంతో తేలిక..!!!

సద్గురు జగ్గీ వాసుదేవ్...🙏

[05/10, 10:29 am] +91 93913 24915: ధర్మసూక్ష్మమ్ :-

************

   కాశీ వెళ్ళినప్పుడు మనకిష్టమైన కాయనో, 

పండునో విడిచి పెట్టి రావాలంటా రు. ఆమేరకు

మనం మనకిష్టమైన ఏదో ఫలాన్ని, ఏదో ఒక

కాయను వదిలేసి వస్తుంటాం.ఆ తర్వాత నుండి

వాటిని తినడం మానేస్తాం.పైగా

"నేను జామపండు తి ననండీ"కాశీలో ఎప్పుడో

వదిలేశాను "

"నేను కాకరకాయ తిననండీ, కాశీలో వదిలేశాను

అని చెప్పుకుంటాం.


నిజానికి పెద్దలు వదలమన్నది,

  "కాయాపేక్ష, ఫలా పేక్ష "


 *వదులుకోవడం అంటే తినే కాయలు ఫలాలు వదిలేయటం కాదు.*


   కాయాపేక్ష అంటే :- దేహం పట్ల ప్రేమ.  ప్రతి వ్యక్తికి

ఉంటుంది. శరీరం పట్ల ఆపేక్ష ఉంటుంది. అది వదిలేయమని, నా శరీరానికి సుఖం కావాలి ,

ఏసీ కావాలి, మెత్తని పరుపు కావాలి, తినడానికి

రుచికరమైన భోజనం కావాలి ,ఇలాంటి వన్నీ

వదిలేసి సాధువులా బతకమని అర్ధం.


  ఫలాపేక్ష అంటే :-  ఏదైనా పని చేసి దాని ధ్వారా

లభించే ఫలితం పట్ల ఆపేక్ష వదిలేయమని.


ఉదా:- పది రూపాయలు దానం చేసి, దాని ద్వారా ఫలితం ఆశించటం.  యజ్ఞం చేసి ఏదో కోరుకోవడం.  బంధుమిత్రులకు సహాయం చేసి దాని ద్వారా

ఏదో కావాలని కోరుకోవడం మానుకొమ్మని అర్ధం.


(ఎవరినో అనాలని కాదు అందరం చేసేవే.  మారటానికి ప్రయత్నిద్దాం)(అన్యథా భావించవద్దు)


(ఎక్కడో చదివాను బావుందని తెలియపరుస్తున్నాను) 


   ఓం నమశ్శివాయ

🙏🙏🕉🙏🙏🕉🙏🙏🕉🙏🙏

ఓ మహానగరంలో  ఓ గురువుగారు తన వద్దకు వచ్చేవారికి ఆధ్మాత్మిక శిక్షణ ఇస్తూ, ధర్మప్రబోధం చేస్తుండేవారు.

మహాసంపన్నుడొకడు ఈ గురువుగారి దగ్గరకు వచ్చి

అసలు గురువు అవసరమా?

గురువు లేకుంటే వచ్చిన నష్టమేమిటి?

అని ప్రశ్నించాడు.

గురువుగారు నవ్వుకుని, మీరేం చేస్తుంటారని అడిగారు.

నాకు అతిపెద్ద సూపర్ బజార్ ఉంది అని సమాధానమిచ్చాడు సంపన్నుడు.

అయితే! ఒకసారి మీ సూపర్ బజార్ కు నన్ను తీసుకువెళ్లండని గురువుగారు అడిగారు.

ఇద్దరూ కలిసి సూపర్ బజార్ కు వెళ్లారు. ఆ రోజు సెలవు కావడంతో నిర్మానుష్యంగా ఉంది.

ఏడంతస్థుల పెద్ద భవంతి. అందులో దొరకనిదంటూ ఉండదు. దానిని చూసిన గురువుగారు నవ్వుకున్నారు.

అక్కడే ఈ సంపన్నుడు ఆవులను, కుక్కలను పెంచుతున్నాడు.

ఆ మందలోంచి ఒక ఆవును సూపర్ బజార్ లోపలికి వదలవలసిందిగా గురువుగారు కోరారు.

కోరినట్లుగానే ఆవును లోపలికి ప్రవేశపెట్టారు. అది అన్నీ తిరుగుతూ, తిరుగుతూ చివరకు ఒక మూల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉన్న పండ్ల దుకాణంలోకి వెళ్లింది. కడుపునిండా , తృప్తిగా మేసింది. రెండుగంటల వ్యవధిలో తిరిగి వచ్చేసింది.

తదుపరి తను పెంచుతున్న కుక్కను లోపలికి వదలమని కోరారు గురువుగారు. దానిని కూడా లోపలికి పంపారు. అది కూడా తిరుగుతూ, తిరుగుతూ వాసన చూస్తూ, మూడవ అంతస్థులో మాంసం అమ్మే దుకాణంలోకి వెళ్లింది. తృప్తిగా తినేసింది. మూడు గంటల వ్యవధిలో అది కూడా తోక ఊపుకుంటూ యజమాని దగ్గరకు వచ్చేసింది.

ఈసారి ఒక సామాన్యుడిని పిలిచి, నీకు నచ్చినన దానిని తీసుకో అని చెప్పి పంపారు గురువు.

ఉత్సాహంతో లోపలికి ప్రవేశించిన మనిషి అన్నింటినీ చూసి, ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఏం తీసుకోవాలో అర్ధం కావటం లేదు.

రెండు, మూడు, నాలుగు గంటలు గడిచిపోయినా బయటకు రావడం లేదు. అందరూ ఆశ్చర్యపోయారు.

గురువుగారు యజమానిని కలిసి అతడున్న చోటకి చేరుకున్నాడు. నెత్తిమీద చేతులు పెట్టుకుని దిక్కులు చూస్తున్న ఆ వ్యక్తికి ఏం కావాలో అర్ధం కావడం లేదు. ఈ వస్తులన్నింటినీ చూస్తుంటే పిచ్చెత్తిపోతోంది అన్నాడు ఆ వ్యక్తి.

దీనిని విన్న సంపన్నుడు అవాక్కయ్యాడు.

ఆవుకీ, కుక్కకీ పిచ్చెక్కలేదు. వాటికి ఏం కావాలో వెతుక్కుని తృప్తిగా ఆరగించి వచ్చాయి.

మనిషి మాత్రం ఏం కావాలో తనకే తెలియదు. తనకే అన్ని తెలుసనుకుంటాడు.

పాపం! అందుకే వీడికి గురువు కావాలి.

ఎలా జీవించాలో జీవిత ఔన్నత్యాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలి.

అందుకే వాటిని తెలియజెప్పే గురువు అత్యంత అవసరమని గురువుగారు చెప్పడంతో యజమానికి ధనగర్వం తొలగింది.

గురువుతోనే గమ్యం సాధ్యమని తెలుసుకున్నాడు.👏

[05/10, 3:27 pm] +91 93913 24915: పురుష సూక్త శ్లోకాలు


*శ్లోకం..   2/25*


*పురుష ఏవేదగ్ం సర్వమ్! యద్భూతం యచ్చభవ్యమ్!*    

*ఉతామృతత్త్వ స్యేశానః! యదన్నే నాతిరోహతి!*


*భావం*


మునుపు ఏది ఉన్నదో,  ఇక ఏది రాబోతున్నదో, సమస్తమూ భగవంతుడే. మరణము లేని ఉన్నత స్థితికి అధిపతి అయిన వాడూ ఆయ‌నే, ఎందుకంటే ఆయన ఈ జడ ప్రపంచాన్ని అతిక్రమించినవాడు కనుక!

[05/10, 3:28 pm] +91 93913 24915: 🌹🌻 చాలామంది లాలితా సహస్రనామ పారాయణ చేస్తుంటారు మీ అందరికీ తెలిసిందే కదా. అయితే లలితాదేవి సృష్టికి మూలాధార శక్తి . అమె నుంచి సర్వ కోటి జీవ.ప్రాణి కోటికి శక్తి ఉత్పన్నం అవుతుంది. అయితే అసలు మన దత్త స్వామి కీ అమెకి ఏమిటి సంబంధం అని చాలామందికి సందేహం రావచ్చు . కాని సృష్టి కే మూలాధారం అయిన అమ్మ , సర్వ జీవ ప్రాణి కోటీ యందు మూలాధారం యందు ఉండీ శక్తిని యిచ్చి నడిపిస్తుంది శ్రీ లలితదేవి తల్లి. అంటే శక్తి లేనిదే మనం లేవు. ఈ చారాచర సృష్టి యే లేదు అనియే కదా అర్థం.   అయితే శ్రీ దత్తాత్రేయ ఆది గురువు . త్రిమూర్తి స్వరూపులు వారికి తెలియని శక్తి లు , యుక్తులు లేవు. మనకీ శ్రీ గురుచరిత్ర లో చెప్పిన విధంగా భగవంతుడు ఒక్కడే. ఆయనే నేను అనేకం అవుదును కాక అని సంకల్పించి సృష్టి ని సృష్టించారు . అప్పుడు భగవంతుడు అనేక జీవ ప్రాణీకోటి ని సృష్టించింది భగవంతుడే. దేవతలను , రాక్షసులు ను సృష్టించినదే ఆయనే. అప్పుడు ఒక్కడే ఉన్న భగవంతుడు తన రూపాలను మార్చుకుంటూ వస్తూ సృష్టి కి శక్తిని యివ్వటం కోసం అమ్మ ని బయటకు తెచ్చి మూలాధారం నందు నివశించి సృష్టి చేయమన్నారు. భగవంతుడు నుండి వేరుపడ్డ రూపమే శ్రీ లలిత దేవి , తన రూపం ప్రకృతి రూపంగా మార్చుకుని ప్రకృతి రూపంలో అమ్మ సర్వ జీవ ప్రాణికోటి కి శక్తిని ఇస్తుంది. అందుకే శ్రీ చక్రధారిణీ అని అంటారు. అందుకే మన దత్త స్వామి శ్రీ చక్రం నందు 6 వ కోణంలో ఉంటారు. అంటే ఆయన అమే వేరుకాదు. యిద్దరూ ఒక్కటే. బయటికి మాయ చేస్తారు మాయ స్వరూపులు కాబట్టి అంతే.    శ్రీ లలితా దేవీ సహస్రనామ అర్థ వివరణ చూడండి👇🌹🙏🌻

🌹🌻లలితాసహస్రనామ స్త్రోత్ర ఫలితం🌻🌹

లలితా సహస్రనామ స్తోత్రం వ్యాస ప్రోక్తం కాదు. అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారం లోకి వచ్చింది. ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతీ కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనింది. కాబట్టి కలియుగంలో మనకి లలిత సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం తప్ప అన్యము కాదు. ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రం.

నామము అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రము అని ఒక మాట అంటున్నాం.....కానీ బాహ్యంలో అది రహస్య నామా స్తోత్రం అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టండి. లలితా సహస్రనామ స్తోత్రం అని అవసరం అవతుందా!!! ఆవిడ పేరు లలిత అయతే ఆవిడని సహస్రము అంటే అనంతము అని పేరు. అనంతము అంటే లెక్కపెట్టలేనన్న్ని. సహస్ర శీర్ష వాదనా సహస్రాక్షీ సహస్రపాత్‌ అంటే ఖచ్చితంగా లెక్కపెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్ధం. అనంతమైన తలలు కలిగినది అని. అనంతమైన నామములు ఎందుకు ఉండాలి?? ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం అవసరం.

మనసుతో పలకాలి:

లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అప్పచెప్పేయడము కాదు. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మననస్సును హత్తుకుని నిలబడి పోవాలి.

భవానీమాతే లలితాదేవి:

ఎరుపు రంగు దుస్తులు కట్టు కొన్న, ప్రేమ మయ చూపులు కలిగిన పాశము, అంకు శం, పుష్పం చెరకు గడను నాలుగు చేతులలో ధరించిన అణిమాది సిద్ధులను కలిగిన శివుని భార్య అయిన భవానియే లలిత. రావణుని చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తేనే సాధ్యం. ఆ మహామం త్రాన్ని శ్రీరాముడికి చెప్పిన వారు అగస్త్య మహాముని. అటు వంటి అగస్త్య మహాముని ఆత్మతత్వమును తెలుసుకోవాలను కుంటాడు. ఆ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే జీవుడు అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు. జనన మరణ జంఝాటం నుండి తప్పించుకోగలుగుతాడు. అందుకుగాను అగస్త్య మహాముని శ్రీలలితను స్మరించేందుకు నామతారకమును అనుగ్రహించవలసినదిగా హయగ్రీవుడిని కోరుతాడు. ఏ పేరిట పిలిస్తే, ఆ తల్లి పలుకు తుందో ఆ పేర్లన్నీ హయగ్రీవుని అశ్వకంఠముతో ఆశువుగా వస్తాయి. ఈనామ సహస్రమే లలితా సహస్రం. ఇవి వేయినామాలు. ఇందులో కామాక్షి, పార్వతి, దుర్గ, మహాకాళి, సరస్వతి, భవాని, నారాయణి, కల్యాణి, రాజరాజేశ్వరి మహాత్రిపురసుందరి, వైష్ణవి, మహేశ్వరి, చండికా, విశాలాక్షి, గాయిత్రి అనేక దేవి రూపాలు కనపడతాయి. శ్రీలలితా సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు. ఇది గొప్ప శాస్తము,గొప్ప ప్రమాణం.

183 శ్లోకములలో చెప్పబడినది:

ఈ వేయినామాలు 183 శ్లోకములలో చెప్పబడినవి. శ్రీమాతా అను నామముతో మొదలై లలితాంబికా అనునామముతో పూర్తవుతుంది. విడివిడిగా చదువుతే ఓం శ్రీమాత్రేనమః అని చదవాలి. అర్థము తెలుసుకునే చదవాలి. అలా వీలుకానప్పుడు నామజపము వలె చదవాలి. ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది. శ్రీమాత ఈ నామముతో మొదలవుతుంది. ఈ నామమము వివరణ ఇవ్వబడుతున్నది. శ్రీమాతా శ్రీదేవి మాతృమూర్తి అయి సృష్టికి కారకురాలైనది. తల్లి, తండ్రి, గురువు రూపములోవున్నది. శ్రీఅంటే లక్ష్మి.మాతృ సహజమైన మమకారం అందిస్తుంది. ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ సమస్తప్రాణి కోటిని సరిదిద్దుతుంది. ప్రతినామము ఒక మంత్రం. ఈ నామములు చదివితే వచ్చే ఫలితం క్లుప్తంగా తెలుసుకొందాం. జీవితం తరిస్తుంది. అపమృత్యువు పోతుంది. ఆయుష్షు పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సర్వపాపాలు తొలగిపోతాయి. ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు.అందుకే శ్రీలలితా సహస్రనామాలు చదువుదాం. చదివించుదాం. ముక్తిని పొందుదాం.

🙏🙏🙏

[05/10, 3:28 pm] +91 93913 24915: భగవంతుడు సర్వశక్తిమంతుడు.ఆ సర్వేశరుడిని ఒకరు అర్ధించాలే కాని, ఆయన మరెవరినీ అర్ధించాల్సిన అవసరం లేదు...అంతటి శక్తివంతుడైన భగవంతుడు భక్తుని భక్తికి లొంగిపోతాడు. మనసా వాచా తనను నమ్మిన భక్తుడిని రక్షించేందుకు ఆయన ఏ రూపం దాల్చడానికైనా సిధ్ధమే...


అర్జునుడి భక్తికి లొంగే శ్రీకృష్ణుడు రథసారధి అయ్యాడు. శబరి భక్తికి లొంగే ఆమె పెట్టిన ఎంగిలి పండ్లను తృప్తిగా ఆరగించాడు శ్రీరాముడు....అందుకే భగవంతుని లొంగదీసుకునే ఏకైక ఆయుధం భక్తి...

 పరమేశ్వరుడు అందరిలో అంతటా అన్నిటా అంతర్లీనుడు. గంగా నది  పరివాహక ప్రాంతం లో లభించే లేత గరిక శష్పము . లేత గడ్డి కూడా పరమేశ్వర స్వరూపమే. వీటిని బాలతృణములు అని కూడా అంటారు . లేత గరికతో శివ పూజ శ్రేష్టమైనది. నదీ ప్రవాహము లోని నురుగు  శివస్వరూపమే. నదీ ప్రవాహపు నరగతో కూడా శివ పూజ  చేయ యోగ్యమైనది. ఫేన్యము అంటే నురుగు.  లేత పచ్చి గరిక స్వరూపుడైన శష్పునికి, నీటి నురుగు రూపంలో వున్న ఫేన్యునికి నమస్కారం .

కామెంట్‌లు లేవు: