12, ఫిబ్రవరి 2022, శనివారం

మన విద్యావేత్తలు

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

ఇందాక అలా పనుండి పాట్నా లో ఉన్న వేదపాఠశాల కాంపౌండ్ లో ఉన్న SBI కి వెళ్లాను. లింకు ఫెయిల్ అవడంతో అలా బయటపడి వేదం వల్లె వేస్తున్న పిల్లల్ని గమనిస్తూ అక్కడ ఉన్న గురువుగారైన సదానంద్ ద్వివేది గారిని *ఎందుకండీ ఇలా బట్టి వేయిస్తున్నారు, చేతికి పుస్తకం ఇస్తే చూసి జాగ్రత్తగా చదువుతారు కదా* అని అడిగా..


దానికి ఆయనిచ్చిన సమాధానం..


"నలంద, తక్షశిల,విక్రమశిల విశ్వవిద్యాలయాలలో ఉన్న అమూల్యమైన గ్రంధాలను భక్తియార్ ఖిల్జీ అనే ఉన్మాదుడైన మహమ్మదీయ రాజు కాలంలో కాల్చివేయ్యబడ్డాయి - తరువాతి కాలంలో మళ్ళీ ఆ వేదం విద్యను గ్రంధాలను తిరిగి రాయడానికి ప్రయత్నం చేసిన ఎంతో మంది భారతీయ విద్యావేత్తలను అత్యంత క్రూరంగా హింసించి చంపేయ్యడం జరిగింది!

ఇది ముందే గమనించిన  *మన విద్యావేత్తలు  వేదాన్ని ఆనాటినుండే కంఠస్తం చెయ్యడం అలాగే మరికొంత మందికి కంఠోపాఠం గా నేర్పడం మొదలు పెట్టారు - అలా చాలా వరకు వేదాధ్యయనం ముఖత గానే కొనసాగింది అందువల్లే వేదాన్ని కంఠస్థం చెయ్యడం అలవాటుగా మారింది*

4 వేదాలు నోటికి వచ్చిన వాడిని చతుర్వేది అని

3 వేదాలు వచ్చినవాడిని త్రివేది అని

2 వేదాలు వచ్చిన వాడిని ద్వివేది అని

1 వేదం నేర్చినవాడిని ఉపాధ్యాయ అని

శాస్త్రాలు తెలిసినవాడిని శాస్త్రి అని

మిశ్రమంగా కొన్ని విషయాలు నేర్చుకున్న వాడిని మిశ్రా అని

శాస్త్రీయ కర్మ విధి విధానాలను నేర్చిన వాడిని శర్మ అని ఇలా రకరకాలుగా విభజించి నేర్పించడం జరిగింది!"

*మరి.. ఇప్పుడు రాయచ్చు కదండీ..ఇప్పుడు మనం స్వతంత్రులం కదా?* అన్నాను.


ఆయన నవ్వేసి.. *ఎవరు చెప్పారు మనం స్వతంత్రులమని? గత 70 ఏళ్లుగా గమనిస్తున్నాను.. ఒక్కడంటే ఒక్క  మంత్రి లేదా ప్రభుత్వ అధికారి ఈ వేదాలను తిరిగి రాయించడం మీద దృష్టి పెట్టనేలేదు! - ఇప్పటికీ మనం బానిస రాజుల పాలనలోనే ఉన్నాం - హిందుమత గ్రంధాలను అవహేళన చేస్తూనే ఇతర మత గ్రంధాలకు ఎనలేని గౌరవం ఇస్తున్నాం లేదా ఇతరులకు ఇంకా భయపడుతూనే ఉన్నాం!* అన్నారు.


ఆయన మాటల్లో నిజం ఉందనిపించింది నాకు! మీరేమంటారు?


*(ఈ టపా..జాతీయ వాదుల సమాలోచన అనే గ్రూపు నుండి సేకరించింది)*

*హనుమంతు వెంకట రమణ మూర్తి* 

*టెక్కలి, విశాఖపట్నం* *(బతుకు తెరువు కోసం)*

కామెంట్‌లు లేవు: