10, జనవరి 2023, మంగళవారం

ద్వ్యక్షరి కందము

 “న”, “మ” అనే రెండు హల్లులతోనే రాసిన ఈ కందాన్ని “ద్వ్యక్షరి కందము” అంటారు. 


ఆపద్యం:

మనమున ననుమానము నూనను, నీ నామమ్మను మననమ్మును నేమ

మ్మున మాన, నన్ను మన్నన మనమను, నానా మునీన మానానూనా!!


ఈ పద్యం భావం ఇది – “ఓ కృష్ణా! నువ్వు నిరంతరం నీ నామధ్యానం చేసే మునులకు సైతం అందనంతటి గొప్పవాడివి. నాకు ఎలాంటి సందేహం లేదు. నీ నామ జపాన్నే నియమంగా జపించే నన్ను దయతో చల్లగా దీవించు.”


నంది తిమ్మనగారి

పారిజాతాపహరణంలో నారదులవారు చెప్పిన పద్యం ఇది.

కామెంట్‌లు లేవు: