19, ఆగస్టు 2024, సోమవారం

దేవాలయాలు - పూజలు 15*

 *దేవాలయాలు - పూజలు 15*


సభ్యులకు నమస్కారములు.


సాధారణంగా హైందవ దేవాలయాలలో ప్రతి రోజూ క్రమం తప్పకుండా రెండు సమయాలలో అనగా

 ప్రాతఃసంధ్య మరియు సాయం సంధ్యలలో పూజలు నిర్వహింప బడుతాయి. 

కొన్ని దేవాలయాలలో తెల్లవారు జామునుండి 

రాత్రి వరకు నిరంతర  పూజలు నిర్వహింపబడుతూనే ఉంటాయి. 

*గ్రహణ సమయాలలో మాత్రం శాస్త్ర నిబంధనల మేరకు దేవాలయాలు మూసివేయబడి ఉంటాయి*.


దేవాలయాలకు వెళ్ళినప్పుడు, మన దారిలో దేవాలయములు ఉన్నప్పుడు *శిఖర దర్శనం* తప్పకుండా చేసుకోవాలి. *శిఖర దర్శనం  "చింత నాశనం" /  "శిఖర దర్శనం పాప నాశనం"* అనునది పెద్దల మాట. ఆలయ శిఖరం  అల్లంత దూరాన ఉన్నా  సరే, దర్శనం కాగానే  ఒకసారి *అంజలి ఘటించి దైవ స్మరణ* చేయాలి. 


ధ్వజ స్థంభం ఉన్న దేవాలయాలలో 

 *భక్తుల ఆత్మ ప్రదక్షిణ* శాస్త్రీయం *కాదు, కూడదు*. విష్ణాలయాలు మరియు విష్ణు దేవతా సంబంధమైన ఆలయాలలో  ప్రధాన మూర్తికి *అభిముఖంగా  గరుడ   స్వామి వారు  గాని, శ్రీ చక్రాలు, శివాలయాలలో స్వామి వారికి అభిముఖంగా నందీశ్వర స్వామి వారు గాని ఉంటే* మూల మూర్తికి *సాష్టాంగ నమస్కారములు కూడవు*.


ధ్వజ స్థంభం *వద్దనే* సాష్టాంగ ప్రణామం చేయడం సంప్రదాయం..


భక్తి అనేది ఒక పవిత్ర భావన. ఇంకా చెప్పాలంటే *పవిత్ర ఆచరణ సహిత పవిత్ర భావన*. *భక్తి నవ విధములని* చెప్పబడింది. దేవాలయాల విషయం   వచ్చినప్పుడు  *దర్శనం* అని ప్రక్రియను జత చేసి *భక్తి దశ విధములు అని అందాము*.

వివరంగా ...

1) దర్శనం 

2) శ్రవణం 

3) కీర్తనం

 4) స్మరణం 

5) సేవనం 

6)  అర్చనం 

7) వందనం 

8) దాస్యం 

9) సఖ్యం 

10 )నివేదనం. 


ప్రహ్లాద చరిత్ర ఘట్టంలోని  ప్రామాణిక శ్లోకం జ్ఞప్తికి తెచ్చుకుందాము.

*శ్లోకం!!  శ్రవణం కీర్తనం విష్ణో:* *స్మరణం పాద సేవనం, అర్చక వందనం దాస్యం, సఖ్య మాత్మనివేదనం*


భక్తులు క్రమం తప్పకుండా పాటించాల్సిన *కనీస* నియమాలు. నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తితో దేవాలయ ప్రవేశం గావించాలి. భక్తులు సంప్రదాయ 

*తిలక, భస్మ ధారణ* *వస్త్రధారణ*... మరువరాదు. పురుషులు పంచె ,  ధోవతి, పై కండువా లేదా ఆ ప్రాంతపు సామాజిక,  సంప్రదాయ వస్త్ర ధారణ. ఏదైనా ఎబ్బెట్టుగా ఉండకుండా గౌరవం ఉట్టిపడేలా వస్త్రధారణ ఉండాలి. మహిళలు మరియు బాలికలు వారి వారి మంగళకరమైన చీర, పరికిణి, ఓణీలతోనే వస్తారు, రావాలి కూడా,.... ఇతర ప్రాంతాల వారు తమ ఆచార వ్యవహారాలననుసరించి మంగళకరంగా రావాలి. *మహిళలు, బాలికలు జుట్టు విరబోసుకుని దేవాలయ సందర్శన చేయరాదు*. అన్ని దేవాలయాలలో మహిళలు పువ్వులు అలంకరించుకొనవచ్చును గాని తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పువ్వుల ధారణ నిషిద్ధము.


*గమనిక*

*దేవాలయ అర్చక స్వాములు, దేవాలయ యాజమాన్యము మరియు దేవాలయాల సంప్రదాయాల పరిరక్షణ చేస్తూ ఉండాలి,  అవసరమైన పరిశుభ్రతా సంబంధమైన సేవలు తప్పకుండా చేయడం....నియమాలు పాటించుటకు భక్తులను ఉత్తేజపర్చాలి*.


ధన్యవాదములు

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: