19, ఆగస్టు 2024, సోమవారం

సంపాదనపరుడవై వున్నంత వరకు

 యావద్విత్తోపార్జన సక్త స్తావన్నిజపరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకోపి న పృచ్ఛతి గేహె||”


“నువ్వు సంపాదనపరుడవై వున్నంత వరకు ‘నీ వారు’ అనబడే పరివారమంతా నిన్ను ఆశ్రయించే వుంటారు. వృద్ధాప్యంలో నీ దేహం శిథిలమై శక్తి హీనమైనప్పుడు నీ ఇంటిలోని వారు కూడా నిన్ను కుశలం అడుగరు.”


“రక్తసంబంధాలు అన్నీ నూటికి 99 పాళ్ళు ఆర్థిక సంబంధమైనవిగానే ఉన్నాయి. ఒకానొక మనిషి ధనాన్ని సంపాదిస్తున్నంత వరకే అతనికి కుటుంబంలో గౌరవం ఉంటుంది. శరీరధారుడ్యం తగ్గి డబ్బులు సంపాదించలేనప్పుడు అతనికి కుటుంబంలో కానీ, సంఘంలో కానీ కించిత్ మాత్రమైనా విలువలేకుండా ఉంటుంది.


“కనుక, మనిషి కేవలం తన సంపాదనలోనే ఆమరణ పర్యంతం నిమగ్నం అయి ఉండాల్సి వస్తోంది. అలానే జీవించేస్తున్నాడే కానీ, ‘మరణం తరువాత ఏమిటి?’ అని ఆలోచించలేకపోతున్నాడు. ‘ధనలేమి’ లో కూడా విలువనిచ్చేది ఒక్క ‘జ్ఞాన బలమే‘. కనుకనే శంకరాచార్యుల వారు ‘ధ్యానం’ అంటున్నారు.”

కామెంట్‌లు లేవు: