18, ఆగస్టు 2024, ఆదివారం

దినేదినే గయా

 👏శ్లో|| దినేదినే గయా తుల్యం భరణ్యాం గయ పంచకే, దశ తుల్యం వ్యతీపాతే, పక్షమధ్యేతు వింశతిః, ద్వాదశ్యాం శతమిత్యాహుః,అమాయాంతు సహస్రకం.

🌹🌹🌹🌹🌹🌹


🌹భాద్రపద మాసం కృష్ణపక్షంలో వచ్చే పితృ పక్షాల యందు మనం శ్రాద్ధం చేయడం వల్ల గయాశ్రాద్ధ ఫలితం లభిస్తుంది. అందులోని విశేష ఫలితాలు గమనిద్దాం.👇


🌹1.పితృ పక్షాల యందు ఏ ఒక్క రోజు శ్రాద్ధం చేసినా గయలో ఒకసారి చేసినంత శ్రాద్ధ ఫలితం లభిస్తుంది.


🌹2.భరణీ నక్షత్రం ఉన్న రోజును మహాభరణీ అంటారు.ఆరోజు చేసే శ్రాద్ధం వల్ల గయలో ఐదు సార్లు చేసినంత ఫలితం లభిస్తుంది.


🌹3.ఏ రోజైతే వ్యతీపాతయోగం ఉన్నదో, దానిని వ్యతీపాత మహాలయం అంటారు.ఆరోజు చేసిన శ్రాద్ధం వల్ల గయలో పదిసార్లు చేసినంత ఫలితం లభిస్తుంది.


🌹4.పక్షమధ్యేతు అనగా మధ్యాష్టమీ (అష్టమి ఉన్న రోజు) రోజు శ్రాద్ధం చేయడం వల్ల గయలో ఇరవై సార్లు చేసినంత ఫలితం లభిస్తుంది.


🌹5.ద్వాదశి ఉన్న రోజు శ్రాద్ధం చేయడం వల్ల గయలో వందసార్లు చేసినంత ఫలితం లభిస్తుంది.


🌹6.మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధం చేయడం వల్ల గయలో వెయ్యి సార్లు చేసినంత ఫలితం లభిస్తుంది.

  🌹 మనజీవితం లో ఒక్కసారి అయినా గయలో శ్రాద్ధం చేస్తామని,ఉత్తమ లోకాన్ని మన ద్వారా పొందే అవకాశం కల్పిస్తామని పూర్వం ఎక్కువ మంది సంతానాన్ని పొందగలిగే వారు,

   మనం శ్రాద్ధాలు  శ్రద్ధగా చేయడం ద్వారా  పితృదేవతలు ఆయుస్సు, సంతానం,ధనం, సుఖం,సంతోషమైన జీవితాన్ని గడపాలని ఆశీర్వదిస్తారు.


 ప్రతి అమావాస్య రోజున తర్పణం మరియు ప్రతి సంవత్సరం శ్రాద్ధం, అలాగే చనిపోయిన వారికి కర్మకాండ చేయక పోవటం వల్ల నిరాశ చెందిన పితృదేవతలు శాపనార్థాలు పెట్టుటయే కాకుండా వీడు మా వంశం లో వ్యర్థం గా జన్మించాడు అని బాధ తో

కన్నీరుమున్నీరుగా నరకయాతన అనుభవిస్తారు.

ఆ పాపం మూట కట్టుకుని ఉన్న మనం కష్టాలపాలు అవుతాము.విద్యరాక, పెళ్లి కాక, పెళ్లి అయినా సంతానం కలగకుండా, సంతానం కలిగినా ఆ సంతానం అంగవైకల్యం గలవారు గా,మూగ, చెవిటి, అంధులు గా,రోగగ్రస్తులుగా అనేక

విధాలుగా పితృ శాపం అనుభవించక తప్పదు.

   శ్రాద్ధం వదలకుండా శ్రద్ధగా చేయడం ద్వారా పితృదేవతల ఆశీస్సులతో

సుఖసంతోషాలు పొందగలుగుతాము కదా అని శ్రద్ధ తో ఆచరిస్తే మన జీవితం సుఖమయం గా ఉంటుంది. 

🌹జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ 🌹

కామెంట్‌లు లేవు: