18, ఆగస్టు 2024, ఆదివారం

కుష్టువ్యాధిని నివారించే రహస్య ప్రక్రియ

 వంద సంవత్సరములు దాటిన వేపచెట్టుని ఉపయోగించి 40 రోజులలో కుష్టువ్యాధిని నివారించే రహస్య ప్రక్రియ - 


     నూరు సమత్సరములు కలిగిన వేపచెట్టు కాండంలో 3 నుంచి 4 శేర్లు నీరు పట్టినంత తొర్రని నిలువుగా ఏటవాలుగా తొలచి అందులో సుమారు సేరు బియ్యము అన్నము వండి చల్లారాక మునుపే ఉంచి ఆ వేపచెట్టు పచ్చికర్రతో ఆ తొర్రకి సరిపడు బిరడా తయారుచేసి బిగించి దానిపైన గాలి లొపలికి పోకుండా పైన ఆవుపేడ పూసి ఒక సంవత్సరం ఉంచి ఆఖరు రోజున ఆ బిరడా తెరిచి చూసిన ఆ అన్నం ఎర్రగా ఉండును.దానిని బాగా ఎండించి పూటకి పావులాయెత్తు ( 5 గ్రా ) చొప్పున 40 దినములు పుచ్చుకొనిన కుష్టురోగం నివారణ అగును. 


       ఇది అత్యంత రహస్య యోగంగా గ్రంధాలలో ఉన్నది . 


  గమనిక -


          బాగా ముదిరిన పెద్ద వేపచెట్టు కాండం దానంతట అది పగిలి దానినుంచి కల్లు వెలువడును. అలా ఎక్కడైనా మీకు దొరికితే విడవకుండా వెంటనే త్రాగండి. ఆ కల్లు తాగడం వలన పొట్టకు విపరీతమైన బలం చేయును. జ్వరము , శరీరంలో పైత్యం హరించును. శరీరతత్వం మార్చును. రక్తం శుభ్రం చేయును . కాని ఉదయం పూట మాత్రమే పుచ్చుకొనవలెను.


     

       మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


    గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కామెంట్‌లు లేవు: