26, అక్టోబర్ 2021, మంగళవారం

లిబరల్ హిందూ ఏకం సత్ వేదాంతులు,

 Srinivasa Dikshit Harathi పోస్ట్:


లిబరల్ హిందూ ఏకం సత్ వేదాంతులు,

నిజమైన సెక్యులర్ ముస్లిం లు,

లెఫ్ట్ మేధావులు, జై భీం జై మిమ్ లు

నా సందేహం తీర్చగలరా??

................

హిందూ సమాజ చరిత్రనే కాదు 

సామాన్య అజ్లాఫ్, అర్జాల్ ముస్లిం ల చరిత్రను కుట్ర పూరితంగా కప్పి

పెట్టిన భారత వామపక్ష వాద మోసగాళ్ళు.

..............

16 ఏళ్ళ కింద బంజారాహిల్స్ Care ఆస్పత్రి లో నాన్న గారికి గుండె ఆపరేషన్ సందర్భ చెక్కప్ కొరకు వైటింగ్ హల్ లో కూర్చున్నాం.


పక్కన ఒక ముస్లిం పెద్దమనిషి కూర్చున్నాడు.మాటలు కలిసినయ్.


ఆయన తనగురించి చెపుతూ మేము బుందేలి రాజపుట్ ల నుంచి ఇస్లాం లోకి మారినము. నేను నాలుగో తరం వాణ్ణి.

మేము అజ్లాఫ్ లము అన్నడు.

మొదటి సారి ఆమాట వినడం.

తరువాత నాన్న అష్రాఫ్, అజ్లాఫ్,అర్జాల్ తేడాల గురించి చెప్పినడు.

ముస్లిం లలో ఏమిటీయీ తేడాలు.

........


భారతీయ ముస్లిం లలో

అష్రాఫ్ Ashraf, 

అజ్లాఫ్ Ajlaf, 

అర్జాల్ Arzal / Arjalఅనే వర్గీకరణలు ఉన్నయ్.


ఇస్లాం ఇక్కడికి వచ్చి నప్పుడు

బయటినుంచి వచ్చిన 

అరబ్, టర్క్, ఉజ్బెక్, ఆఫ్ఘన్ జాతుల వాళ్ళు తమను తాము ఉత్తములుగా చెప్పుకున్నారు.


ప్రవక్త పుట్టిన తెగకు చెందిన Qureshi లు ఆయన మక్కా నుంచి వెళ్ల గొట్టబడి మదీనాకు వెళ్ళినప్పుడు ఆయనను స్వాగతించి సహాయం చేసిన Ansar లు, ఆయన direct descendents అని చెప్పుకునే Sayyad లు, 

కులీనులం, అధికార వర్గం అనే షేక్, పఠాన్ లు వగైరా యీ వర్గం లోకి వస్తారు.

తరువాత ఇక్కడి హిందు అగ్ర కులాలనుంచి తమలో కలిసిన వాళ్ళను తమ రాజకీయ అధికారం

నిలుపుకోవడానికి తమతో 

సమంగా కలుపుకున్నరు..So 

ముస్లింలలోని కులీనవర్గం Ashraf లు.

దీనికి Noble అని నిఘంటు అర్థం

వీళ్ళు ముస్లిం లలో పెత్తందారీ FC వర్గం.


తరువాత BC వర్గాలనుంచి మారిన వృత్తి కులాల వాళ్ళను తక్కువ దర్జాగా చూసినరు. వాళ్ళు Ajlaf వర్గం.

వీళ్ళు ముస్లిం లలో BC వర్గం


SC కులాలనుంచి మారిన వాళ్ళను Low category అని అర్థం వచ్చే 

Arzal / Arjal వర్గం గా చెప్పినరు.

ఉదాహరణకు తెలుగు ప్రాంతాల్లో దూదేకుల వాళ్ళు.

వీళ్ళు ముస్లిం లలో అస్పృశ్యత అనుభవించే SC వర్గం.


Ajlaf, Arjal వర్గాలు రెండింటిని కలిపి వాళ్ళు Pshmanda వర్గం గా చెప్పుకుంటారు.

యిది భారత ముస్లిం లలో బహుజన ఉద్యమం వంటిది.


బ్రిటిష్ ప్రభుత్వం ముస్లిం లకు సెపరేట్ నియోజక వర్గాలు పెట్టడం తో మొదలయ్యి ముస్లిం లీగ్ 1920 నుంచి ద్విజాతి సిద్ధాంతం ను ప్రచారం చేసినప్పుడు దాన్ని లేవనెత్తినది 

జమీందారులు, భూస్వాములు, మతాధికారులుగా, ప్రభుత్వ అధికారులుగా ఉండిన అష్రఫ్ FC వర్గం.


అలిఘర్ ముస్లిం యూనివరసిటీ ఏర్పాటు చేసిన Sir Sayyed Ahmed Khan, కాశ్మీరీ పండిత్ లనుంచి మతం మారిన కవి Iqbal లాంటి అష్రాఫ్ లు దింట్లో ప్రధాన పాత్ర పోషించినరు


కానీ యీ ద్విజాతి సిద్ధాంతాన్ని, వేరే దేశ డిమాండ్ ను పెద్ద ఎత్తున వ్యతిరేకించింది

ఉత్తర, మధ్య భారతం లో ఉన్న

Pashmanda ఉద్యమ BC, SC ముస్లిం వర్గం.


Pashmanda ముస్లిం ల యొక్క పాకిస్థాన్ ఏర్పాటు మీద వ్యతిరేకత:

...........

1941 లోనే బీహార్, UP లలో మెజారిటీ ముస్లిం వర్గం అయిన BC ముస్లిం వర్గం momin conference పేరుతో ఢిల్లీలో పాకిస్థాన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద సభ పెట్టింది.


Pasmanda వర్గం బలంగా ఉన్న

All India Azad Muslim Conference,

All India Momin Conference లాంటి అజ్లాఫ్ వర్గ ముస్లిలకు ప్రాతినిధ్యం వహించిన సంస్థలు మతపరంగా పాకిస్థాన్ ఏర్పాటు వల్ల అష్రాఫ్ ముస్లిం లకే లాభం కలుగుతుంది.

భారత్ కలిసి ఉంటేనే అజ్లాఫ్ లము, అర్జాల్ లము అయిన తమకు భద్రత, సామాజిక లాభం అనే పాయింటుతో పాకిస్థాన్ ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించినవి.


కానీ రాజ్యాంగ సభ ఏర్పాటుకు మార్గం వేసిన 1945-46 ఎన్నికల్లోseparate electorate పద్దతిలో ముస్లిం లు ఓటువేసే సీట్లలో ఎన్నికల్లో మతాన్ని, పాకిస్థాన్ ఏర్పాటును ప్రచార అస్త్రం గా వాడి అష్రాఫ్ డామినేషన్ ఉన్న ముస్లిం లీగ్ 80 శాతం పైన సీట్లు గెలుచుకుంది.

............

ఇప్పుడు కమ్మీ మేధావుల దగ్గరకు వద్దాం.


హిందూ చరిత్రను మాత్రమే కాదు భారతీయ ముస్లిం ల చరిత్రను కూడా వక్రీకరించిన కమ్మిలు.


భారత దేశం లో మతం ప్రధానం కాదు.

మనువాద కులమే ప్రధానం అనేది కమ్మీల ఒక వాదన.


కాబట్టి

ఇస్లాం లోకి మారిన హిందూ అగ్ర కులాలు

తమ విభజన వాద మనువాద కుల రొచ్చును 

"అద్భుత సమానత్వ సిద్ధాంతం" ఉన్న ఇస్లాం లోకి కూడా తీసుక పోయినరు.

కాబట్టి భారత ఇస్లాం లో కులం వివక్ష అనేది ఇస్లాం లోకి మారిన హిందూ అగ్ర కులాల కుట్ర అని అంటరు కమ్మీ మేధావులు.


కమ్మిలు చేసే అబద్ధపు ప్రచారం ఏమంటే,

బయటి నుంచి వచ్చిన జాతుల ముస్లిం లు తమను తాము

 "Nobul కూలిన వర్గం" అని అర్థం వచ్చే అష్రాఫ్ లుగా తామే చెప్పుకున్నరు అనేది కప్పి పెట్టి, 


ఉర్లో పెండ్లికి కుక్కల హడావిడి మాదిరి

అష్రాఫ్ లకంటే ఎక్కువగా వాదిస్తూ

అష్రాఫ్ లు తమగురించి చెప్పుకున్న దాన్ని కమ్మిలు హిందూ మతానికి,

మనువాదానికి అంట గడుతరు.


రెండు జాతుల సిద్ధాంతాన్ని సమర్థించి పాకిస్తాన్ ఏర్పాటును సమర్ధన చేసిన కమ్మిలు, అదే సమయంలో అజ్లాఫ్ అర్జాల్ వర్గ ముస్లిం లలో ఉవ్వెత్తున లేచిన ద్విజాతి సిద్ధాంత వ్యతిరేక , పాకిస్థాన్ వ్యతిరేక ఉద్యమం గురించి, ఎక్కడా రాయలేదు.


యీరకంగా భారత లెఫ్ట్ హిందూ సమజానికే కాదు ముస్లిం సమాజానికి కూడా చరిత్ర రాయడంలో ద్రోహం చేసింది.


కాబట్టి భారత కమ్మిలు 

1.కులీన వర్గం అనే అష్రాఫ్ ముస్లిం లకు, 2.స్వాతంత్ర్య తెచ్చిన పార్టీ అనే పేరుతో, గాంధేయవాదము పేరుతో ఉద్దేరకు అధికారం లో ఉండిన "ఇందిరా కాంగ్రెస్" పార్టీకి తొత్తులు తప్ప విళ్ళకు ఏ నైతిక విలువలు లేవు.


మహమ్మద్ ప్రవక్త చెప్పిన

తెగలు, జాతులు, సంపద ఆధారిత వర్గాలు లేని సమనత్వ egaliterian సమాజము అయిన ఇస్లాం లో సామాజిక విభేదాలు ఉండే వర్గాలు ఎందుకు ఉన్నయ్?


Pashmanda ఉద్యమం ఎందుకు వచ్చింది?


ఇస్లాం లోకి తనతో పాటు మనువాది కులాన్ని తీసుకపోతే 

అప్పుడు ఇస్లాం లోకి రమ్మని పిలిచిన వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నరు?


జరిగింది ఏదో జరిగింది.

కానీ ఇప్పుడు 


1- కులం అనే వ్యవస్థ లేని అద్భుత ఇస్లాం లొకి కులం అనేది భారత హిందూ మనువాది తెచ్చిన రొచ్చు అనే క్లారిటీ కలిగిన కమ్మీ మేధావికానీ,


2-హిందూ కుల వివక్ష గురించి పోరాడే కమ్మీ సంస్కర్త కానీ "నాకు అన్యాయం జరుగుతున్నది" అంటున్న పశ్మందా ముస్లిం ల గురించి ఎందుకు మాట్లాడడు?


3-జై భీం జై మిమ్ అని హిందూ దళితుల మీద ప్రేమ చూపే 

ముస్లిం లు కానీ,కమ్మిలు కానీ,

లేదా


4-చర్చ్ లో దళిత క్రైస్తవులు అంటూ

మతం మారితే కులం మారదు అని వాదిస్తూ క్రైస్తవమ్ తీసుకున్న SC లకు కూడా SC రిసర్వేషన్ ఉండాలి అనే దళిత అంబెడ్కర్ వాదులు కానీ

యీ నలుగురు కూడా అస్పృశ్యత అనుభవిస్తున్న 

"అర్జాల్ Arjal ముస్లిం" ల గురించి ఎందుకు మాట్లాడరు?


అగ్రకుల కమ్యూనిస్టుల మీద అంబెడ్కర్ వాదుల ఆరోపణ:

అగ్రకుల కమ్యూనిస్టులు పెద్ద దొంగలు, కుట్ర దారులు.

లెఫ్ట్ వాదం పేరుతో లాభ పడ్డది అగ్రకులాలనుంచి వచ్చిన కమ్యూనిస్టులే!

కానీ ......

సామాజిక ఉద్యమాల నుంచి నక్సలిజం వరకు చనిపోయినది SC లు అనేది దళిత అంబెడ్కర్ వాదుల మాట.


అదే రకంగా 

హిందూ, ముస్లిం బేధాలు అల్లర్లు పెరిగితే లాభ పడేది ముస్లిం మత వ్యవస్థలు, ముస్లిం రాజకీయ వ్యవస్థల మీద పట్టు బిగించిన అష్రాఫ్ వర్గం మాత్రమే లాభ పడుతుంది.


నిజానికి హిందూ ముస్లిమ్ విభేదాలలో నష్టపోయేది మెజారిటీ హిందువులతో రోజు వారీ కాంటాక్ట్ లో ఉండే 

పండ్లు పూల వ్యాపారి,

చాయ్ కేఫ్, పంచర్ షాప్, ప్లంబర్, ఎలెక్ట్రిషియన్, డ్రైవర్, ఆటో మొబైల్ రంగం, పెయింటింగ్ వర్కర్, చిన్న వ్యాపారాలు, చిన్న దుకాణం, మటన్ షాప్, చిన్న ఉద్యోగాలు చేసే అజ్లాఫ్, అర్జాల్ వర్గం అయిన బడుగు పాశ్మందా ముస్లిం.


కాబట్టి మనువాద హిందువు ఇస్లాం లోకి మారి తనతో పాటు తీసుకుపోయిన కులం కంపును

"అద్భుత సామాజిక సమానత్వ తాత్విక ఉన్న ఘనత వహించిన ముస్లిం సమాజం" ఇంకా ఎందుకు

మోస్తున్నదో 

సెక్యులర్ జైభీం జైమిమ్ వాద ముస్లింలు, అంబెడ్కర్ దళిత వాదులు, 

లిబరల్ వాద హిందు సంస్కర్తలు, 

భారత ఉద్యమ సంఘాల కమ్మీలు చెప్పాల.

కామెంట్‌లు లేవు: