30, మే 2024, గురువారం

తిరుమలనంబి

 తిరుమలనంబి .....

1000 ఏళ్ళ క్రితం తిరుమలలో ఎవరూ నివాసం ఉండేవాళ్ళు కాదు., 

అప్పుడు తిరుమల భయంకరమైన క్రూర జంతువులతో నిండి ఉన్న కీకారణ్యం.,

ఈ రోజుల్లోనే అప్పుడప్పుడు చిరుతపులులు సంచరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయంటే అప్పట్లో ఎంత భయంకరంగా పులుల సంచారం ఉండేదో ఊహించండి., విపరీతమైన చలి, భయంకరమైన దోమలు.,

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే నర సంచారం ఉండేది.

తిరుమలలో అప్పట్లో నివాసం అనేది కనీసం ఊహించడానికే భయపడే అంశం.,

అటువంటిది మొదటిసారిగా ప్రాణాలకు తెగించి స్వామి వారికి నిత్య కైంకర్యాల కోసం మొదటిసారిగా తిరుమలలో శాశ్వత నివాసం ఏర్పరచుకున్న వ్యక్తి తిరుమలనంబి.,

అందుకే ఆయనను First Citizen of Tirumala అని కీర్తిస్తారు.,

వెంకటేశ్వరస్వామి ఆయనకు స్వయంగా  బోయవాని రూపంలో ప్రత్యక్షమై ఆకాశగంగ తీర్థాన్ని ఏర్పరచిన సన్నివేశం అద్భుతం.,

తిరుమలనంబి దక్షిణ మాడవీధిలో చిన్న కుటీరం ఏర్పరచుకుని స్వామివారికి నిత్య కైంకర్యాలు జరిపేవారు.,ఈ తిరుమలనంబి నివశించిన ప్రాంతంలోనే గుర్తుగా ఆయనకు గుడి కట్టారు., మార్గానికి కుడి ప్రక్కగా దక్షిణ మాఢవీధిలో ఈ మహానుభావుడి గుడి ఉంది., బ్రహ్మోత్సవాలు/ఊరేగింపులలో స్వామివారు ఈ గుడికి ఎదురుగా రాగానే నైవేద్యం/హారతి సమర్పిస్తారు.,ఓసారి బ్రహ్మోత్సవాల్లో ఈవిషయం మర్చిపోయారు.,దానితో స్వామివారి రధం ముందుకు కదలలేదు, తరువాత విషయం తెలుసుకుని ముందుకు కదిలించారు....

Shared from WhatsApp

https://whatsapp.com/dl/source=sfw

కామెంట్‌లు లేవు: