30, మే 2024, గురువారం

చైతన్యo ద్వారానే*

 *భగవంతుని చైతన్యo ద్వారానే* 

 *ఏ సత్కార్యాలైనా జరుగుతాయి* 


 భగవంతుడు మనకు సత్కార్యాలు చేసే చైతన్యాన్ని ఇస్తాడు.. మనిషి ఏ పని చేయాలనుకున్నా, ముందుగా అతని మనసులో ఆచార్య భావన ఉండాలి. అప్పుడే మనం పనిలోకి దిగగలం. మనసులో ఆలోచనలు వచ్చేలా చేసేవాడు భగవంతుడు.  

కాబట్టి భగవంతుని ఉనికిని గురించి ఎవరికీ ఎటువంటి అనుమానం అవసరం లేదు. 

ఎందరో మహానుభావులు భగవంతుని  దర్శించుకున్నారు. ఈ సత్యం మనకు శాస్త్రాల్లో, పురాణాల్లో తెలియచెప్పారు. కొన్ని వందల సంవత్సరాల క్రితంవరకు జీవించిఉన్న  అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, తుకారాం వాటి వారికి భగవంతుని సాఖ్యాత్కార్యం లభించింది. మరి, మనకు ఆయన దర్శనం ఈ రోజుల్లో లభించకపోవడానికి కారణం మనం మన పూర్వీకులు అనుసరించిన మార్గాన్ని - సాధనను అనుసరించకపోవడమే..


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ* 

 *మహాస్వామి వారు*

కామెంట్‌లు లేవు: