30, మే 2024, గురువారం

గ్రహ కూటమి

 4 వ తేదీ ఎన్నికలు ఫలితం రావడం తోనే గ్రహ కూటమి కూడా మొదలు అవుతుంది ఈ సారి అధికారం లో ఎవరు ఉన్నా, పాలకులు చాలా ఇబ్బంది పడతారు.. అమావాస్య తో 

ఏర్పాడుతున్న పరిణామం శుభ సూచకం కాదు.. ఎవరు అధికారం లోకి వచ్చిన వారు తరచుగా చండి హోమాలు చేయించుకుంటూ ఉండాలి 


💐🙏పంచ గ్రహ కూటమి🙏💐


జూన్ 6 వ తేది(గురువారం)వైశాఖ అమావాస్య:-✍️


జూన్ 5 వ తారీకున ఉదయం 04:12 కి చంద్రుడి వృషభ రాశి ప్రవేశం జరిగినప్పటి నుండీ జూన్ 7 వ తారీకు ఉదయం 07:40 వరకు వృషభరాశిలో రవి,చంద్ర, గురు,బుధ, శుక్ర,  గ్రహాల పంచ గ్రహ కూటమి జరుగబోతోంది. 


ఈ గ్రహ కూటమిలో రవి ,గురువులు గ్రహ యుద్ధంలో ఓడింపబడి వున్నారు.

శుక్రుడు అస్తంగత్వం అయ్యి మౌఢ్యంలో వుండడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితికి సమస్యలు కలగడం జరుగుతాయి.


గ్రహ కూటములు ఎప్పుడూ దుష్ఫలితాలనే ఇస్తాయని బృహత్ సంహిత  వంటి గ్రంథాలలో చెప్పబడింది. అమావాస్య  సమయంలో  సంభవించబోయే ఈ పంచ గ్రహ కూటమి ఎక్కువ ప్రమాదకారి అనే చెప్పొచ్చు.


వృషభ రాశి భూతత్వపు రాశి కనుక కొన్ని ప్రదేశాల్లో భూకంపం సంభవించవచ్చు. వృషభ రాశి భారత దేశపు లగ్నం. 


ఈ పంచ గ్రహ కూటమి వివిధ రకాల దుస్సంఘటనలకు కారణం అయ్యే సూచనలు వున్నాయి. 


 మత/కుల/వర్గ ఘర్షణలు జరిగే అవకాశం ఉంటుంది. 


ఢిల్లీ, కశ్మీర్,ముంబై, తూర్పు భారత దేశంలోని రాష్ట్రాల్లో ఎక్కడైనా భూమి కంపించ వచ్చు. స్టాక్ మార్కెట్ లో విపరీతమైన హెచ్చు తగ్గులు వుండొచ్చు. అగ్ని ప్రమాదాలు, విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.


మరొక ముఖ్య మైన అంశం : వృషభ రాశి లో కూటమి లో వున్న 5 గ్రహాలు జల తత్వపు రాశైన వృశ్చిక రాశిని వీక్షిస్తారు.  ఈ 5 గ్రహాలతో పాటు మేష రాశిలో వున్న కుజుడు తన అష్టమ దృష్టితో ,  కుంభ రాశిలో వున్న శని తన దశమ దృష్టితో , మీన రాశిలో వున్న రాహువు తన నవమ దృష్టితో

అంటే మొత్తంగా అన్ని గ్రహాలు వృశ్చిక రాశిపై దృష్టి సారిస్తారు. 

దీని వల్ల దక్షిణ భారత దేశంలో  అకాల వర్షాలు, వరదలు, జన నష్టం, ఆస్తి నష్టం సంభవించవచ్చు. 


అరుదుగా సంభవించే ఈ కూటమి వల్ల కలిగే దుష్ఫలితాల ప్రభావం తమ పై పడకుండా ఎవరికి వారు ఇష్ట దైవ ప్రార్థన చేసుకోవాలి.


#గమనిక:- ద్వాదశ రాశులు వారు జూన్ 6 వ తేది తమ తమ గృహల్లో ఇది వరకు పోస్ట్ లో ఇచ్చిన అష్ట దిక్బంధనతో ఇంటికి రక్షణ చేసుకువాలి అదే మంత్రాన్ని 1008 సార్లు జపం చేసుకోవాలి. 3 వరాలు పాటు మాంసాహారం తినకపోవడం మంచిది వాతావరణం కారణం గా జబతువులు జబ్బు పడతాయి ఆ మాంసం ఆరోగ్యం కి మంచిది కాదు ముఖ్యం గా చేపలు తినే వారు త్వరగా అశ్వాస్తతకు గురు అవుతారు.. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నవారి మూడు లేక నాలుగు వరాలు పాటు గర్భధారణ జరగకుండా జాగ్రత్త పడాలి వైకల్యo వచ్చే సూచనలు ఉంటాయి.. దూరప్రయాణాలు చేయండి మంచిది కాదు.. వాయువు ద్వారానే వైరస్ వ్యాపించే రోగాలు ఈ గ్రహ కూటమి ద్వారా తెలుస్తున్న పరిణామం.. గ్రహ కూటమి వల్ల ఇవన్నీ ఏర్పడటం లేదు ఇవన్నీ జాగరగబోయే దానికి ఈ కూటమి ఒక ముహూర్తం.. ఇది వరకే చాలా సార్లు చెప్పాను ప్రకృతి వైపరిత్యం ద్వారా

 ప్రాణ నష్టం జరుగుతుంది అని ఈ కూటమి ఒక సూచన అంతే, తులా రాసి వారు శాంతి హోమం చేయించుకోండి.. హనుమాన్ చాలీసా పారాయణం సీతలిని స్త్రోత్రం పారాయణం చేసుకోండి.. భయపడాల్సిన అవసరం లేదు ఆహారం విషయం లో ప్రయాణం విషయం లో జాగ్రత్తగా ఉండాలి.. కరోనా లాంటి సమస్యలు కూడా క్రమశిక్షణ ఆహార నియమాలు వల్లే తగ్గింది మందులు వల్ల కాదు.. దైవానుగ్రహం తప్పా ఇటువంటి వాటికి పరిష్కారం ఉండదు అందుకే ఈ పూజలు హోమాలు 


🌹శ్రీ మాత్రే నమః 🌹

కామెంట్‌లు లేవు: