21, జనవరి 2025, మంగళవారం

అతి సామాన్య కుటుంబం..

 అతి సామాన్య కుటుంబం...

.

సిగ్గుపడిపోతూ, ముడుచుకుపోతూ, వేరెవరిదో ఇచ్చిన చొక్కా, ప్యాంట్‌తో,  ముతక చెప్పులతో బీదరికమే నా నేపధ్యం అంటూ చెప్పకనే చెప్పే అతడి బాల్య చిత్రమిది.. 

.

Bscలో మొదటి స్థానంలో ఉత్తీర్ణత సాధించారు. గణితం మరియు భౌతిక శాస్త్రంలో ప్రత్యేక అర్హత పొందాడు....

.

తండ్రి మరణించినప్పుడు, ఆయన సన్యాస దీక్ష ప్రమాణంతో ముడిపడి ఉన్నకారణంగా, తండ్రి అంతిమ సందర్శన కూడా పొందలేకపోయారు. 

.

సోదరుడు భారతీయ సైన్యంలో  సాధారణ సైనికుడు. కాశ్మీర్ ఫ్రంట్‌లో నియుక్తి చేయబడినారు. ఉద్యోగ బాధ్యతగా దేశ రక్షణ కోసం చేసిన ప్రమాణాన్ని నెరవేర్చుతున్న కారణంగా,  సోదరుని కలిసే అవకాశాలు మృగ్యమయ్యాయి. సోదరి, బావగారు టీ దుకాణం ఏర్పాటు చేసుకుని జీవితం కొనసాగించేవారు..

.

ఆయన మాత్రం కాషాయం ధరించారు. నేలపై నిద్ర. చలి కాలమైన ఎండా కాలమైన అన్నింటి కీ ఉన్నది ఒక్కటే వస్త్రం.  తెల్లవారుజామున గోసేవ, గో పూజ నిత్య కృత్యం. ఆ సామాన్యుడు బాబా గోరఖ్‌నాధ్ మఠాధీసుడు.


నేడు, దేశంలోనే అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్య మంత్రి ఆయన. 


నేడు  యూపీ వృద్ధి రేటు నిరంతర ప్రవర్ధమానంగా ఉంది. దేశంలోని రెండవ ఆర్ధిక రాష్ట్రంగా అవతరిస్తున్నది. రాష్ట్రంలో  24 గంటల విద్యుత్, ప్రజలలో రక్షణ భావం పెరగడం ఇవి అన్నీ ఆయన తన పాలనతో సాధించిన విజయాలు..


నిస్వార్థం, నిగర్వి, ప్రతీ క్షణం, ప్రతీ పనీ ప్రజాహితంగా చేసే మహనీయుడు. భరతమాతకి కీడుని తలపెట్టే తలని తీసేందుకు వెనకాడని సాహసి. సర్వస్పర్పి. సర్వసమదర్శి. భారతీయ కాషాయానికి, రామ రాజ్యానికి ప్రతీక

.

ఆయనే  52 ఏళ్ళ యోగి ఆదిత్యనాథ్...

.

కామెంట్‌లు లేవు: