శ్రీమద్భగవద్గీత: రెండవ అధ్యాయం
సాంఖ్యయోగం: శ్రీభగవానువాచ
హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్
తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః(37)
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జాయాజయౌ
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి(38)
అర్జునా... ధర్మయుద్ధంలో మరణిస్తే స్వర్గం పొందుతావు. శత్రువులను జయిస్తే రాజ్యభోగాలు అనుభవిస్తావు. అందువల్ల కృతనిశ్చయంతో యుద్ధానికి నడుం బిగించు. సుఖదుఃఖాలూ, లాభనష్టాలూ, జయాపజయాలూ సమానంగా భావించి సమరం సాగించు. అప్పుడు నీకు పాపం కలగదు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి