4, అక్టోబర్ 2024, శుక్రవారం

వ్యసనపరుడుVYASANA PARUDU


 వ్యసనపరుడు


ఏదైనా దుర్వ్యసనాలకు ఒక మనిషి బానిసగా మారితే అతనిని వ్యసనపరుడు అనడం మన మెరుగు దము. ఒక మనిషి రోజు మద్యం సేవిస్తూ, ఉన్న సంపాదన, ఆస్తి అంతా ఖర్చుపెట్టి భార్యా బిడ్డలను పట్టించుకోకుండా వుండే వారిని మనం సమాజంలో అక్కడక్కడ చూస్తూ ఉంటాం. అతని భార్యను చూసి నలుగురు అయ్యో పాపం ఆ తల్లి ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో ఇటువంటి వ్యసనపరుడికి భార్యగా వచ్చింది అని ముక్కు మీద వేలు వేసుకుని అంటూ ఉంటారు. ఆ తల్లి తల్లిదండ్రులు బాద్యతపరులు అయితే ఆమెను ఆమె పిల్లలను పుట్టింటికి తీసుకొని తన కూతురు మనవలు మనవరాళ్ల బాధ్యత తీసుకుంటే సరి అదే వాళ్ళు కూడా పట్టించుకోకుండా వదిలివేస్తే ఆ కుటుంబం పరిస్థితి చాలా హృదయ విదారకంగా మారుతుంది. పిల్లలు దొంగలుగా, మోసకారులుగా రౌడీలుగా మారి అక్రమ సంపాదన చేస్తూ సమాజానికి చీడపురుగులుగా పరిగమిస్తారు. మనం కొన్ని సందర్భాలలో అటువంటి పిల్లలను చూస్తూ ఉంటాం. వారిని చూసి జాలి కూడా పడలేము ఎందుకంటే ఎప్పుడైతే తండ్రి సంరక్షణ ఉండదో అప్పుడు పిల్లలు తెగించి జీవిస్తారు దాని పర్యవసానమే వారి దుష్టత్వం.

తల్లిదండ్రులు పిల్లలను ప్రేమతో, బాధ్యతతో పెంచితే పిల్లలు సమాజానికి ఎంతో ఉపయోగపడే వారుగా తయారవుతారు. మనం సాధారణంగా ఎవరైనా సంఘంలో ఉన్నత స్థితికి చేరుకుంటే అతను ఏ తల్లి కన్న బిడ్డో చూడు ఎంత పెద్దవాడు అయ్యాడు అని అతని తల్లిదండ్రులను తలుచుకుంటాము. అందుకే సంతానం ఉంటే తల్లిదండ్రుల పేరు ని నిలపెట్టేవారు వుండాలని అంటారు. అదే ఒక దుర్మార్గుడిని గురించి సమాజం వీడిని ఏ పాపిష్టి తల్లి కన్నదో అని అనవసరంగా నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిని కూడా దూషించటం పరిపాటి.

వ్యసనపరుడికి సమాజంలో తన భార్య పిల్లలు ఏమైపోయినా పట్టదు, తన గురించి సంఘం ఏమనుకుంటున్నాదో అది కూడా పట్టదు. కేవలం అంటే కేవలం అనుక్షణం సారా మత్తులో మునిగి తేలుతూ వుంటారు. వారు వీధులలో తాగి పడిపోయి నిద్రించటం కూడా మనకు అప్పుడప్పుడు గోచరిస్తుంది. అంటే వారికి తన గురించి తన కుటుంబం గురించి అంతేకాక సమాజం గురించి కూడా ఏమి పెట్టి ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు నిత్యానంద స్వరూపులు అదేమిటి అలా అంటున్నావు అని నీవు అనవచ్చు కానీ ఇది నూటికి నూరుపాళ్లు నిజం సదా సారా మత్తులో జీవితాన్ని గడపడమే వారి జీవన లక్ష్యం.

ఇదేమిటి భార్గవ శర్మ కి ఏమైంది తాగి ఇది వ్రాస్తున్నాడా అని మీకు అనిపించవచ్చు. కానీ నిజానికి ఒక ఆధ్యాత్మిక విషయం చెప్పాలంటే సమాజంలో ఉన్న ఏదో ఒక ఉపమానంతో చెబితే కానీ అది మనస్సుకు హద్దుకుని సాధకుని తన సాధనలో ముందుకు తీసుకొని వస్తుందని భావించి చెప్పడం జరుగుతున్నది.

మనం భగవంతుని కేవలం ఒక పది నిముషాలో లేక ఒక అర్ధగంటో ప్రార్ధిస్తే కలిగే ప్రయోజనం కేవలం స్వల్పంగా ఉంటుంది. అదే ఒక తాగుబోతు లాగా అనుక్షణం భగవంతుని జాసలో గడిపిన అప్పుడుగాని జీవన్ముక్తి అంటే మోక్షం లభిస్తుంది. ఒక తాగుబోతు ఉపమానం నీచంగా కనిపించవచ్చు కానీ నిజానికి అదే సరైన ఉపమానం తాను తన జీవిత లక్ష్యమైన మధుపానం కోసం సంఘములో తన మర్యాదను, తన భార్య పిల్లలను చివరకు తన ఆరోగ్యాన్ని సహితం పణంగా పెట్టి తన వ్యసనానికి బానిస అయ్యాడు. మరి ముముక్షువు అని చెప్పుకునే నీవు నిజంగా సంఘంలో నీ మర్యాదను, నీ భార్యాపిల్లలను పణంగా పెట్టి ధ్యానం చేస్తున్నావా అంటే లేదంటే లేదనే చెప్పాలి. ప్రతి క్షణం దేహ వ్యామోహంతో కొట్టుమిట్టాడుతూ నాకు మోక్షం కావాలని అనుకోవడం కేవలం అందని ద్రాక్ష కోసం ఆరాట పడటమే. 

ప్రతి సాధకుడు ముందుగా తెలుసుకోవలసింది తన శరీరం తనకు ఆ భగవంతుడు ప్రసాదించిన ఒక పరికరం లాంటిదే అని భావించి శరీర ఫై మొహం లేకుండా అంటే శరీరాన్ని అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని భావిస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా కేవలం శరీర శుభ్రత పాటిస్తూ పూర్తిగా మానసిక శుద్ధికి మాత్రం ప్రయత్నించాలి. మనస్సు పరిశుభ్రంగా లేకుండా శరీరం ఎంత పరిశుభ్రంగా ఉన్నాకూడా భగవంతుని చేరుకోలేవు.

సాధకుడు శరీరానికన్నా మనస్సుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సదా మనస్సును శుద్ధి గా ఉంచుకోవాలి. నిత్యం అనుక్షణం ద్యాస భగవంతుని మీదనే ఉంచాలి ఎలా అయితే వ్యసనపరుడు నిత్యం మత్తులో మునిగి ఉంటాడో అలా. కానీ భార్య పిల్లలను విడనాడాల్సిన పనిలేదు. సంసారాన్ని కేవలం ఒక బాధ్యతగా భావించి జీవనం చేయాలి. భార్యాపిల్లలకు భగవంతుని పట్ల ప్రేమ, భక్తిని పెంపొందించే విధంగా తర్ఫీదు ఇవ్వాలి. తాను మాత్రం నిత్యం భగవంతుని ధ్యానంలో గడపాలి, తన కేశాలు ఎలా ఉన్నాయి, దుస్తులు ఎలా ఉన్నాయి అనే విషయాల మీద పూర్తిగా శ్రద్ధను వదలాలి, ఒక మాటలో చెప్పాలంటే ఒక సాధకునికి అడ్డంపడి విషయాలు ఏమిటంటే అవి అరిషడ్వార్గాలు అందులో ప్రతి ఒక్కటి దాని దాని ప్రభావం కలిగి సాధకుని సాధనలో ముందుకు వెళ్లకుండా ఆపుతుంది. ఎప్పుడైతే సాధకుడు వాటిని అధిగమిస్తాడో అప్పుడే సాధనలో ముందుకు వెళ్లగలుగుతాడు. ముందుగా జయించాలసింది మొహాన్ని మొహం అనేది దేహ వ్యామోహం తో మొదలవుతుంది. దేహం అందంగా వున్నది అనే భావనే మొహానికి మొదటి మెట్టు. కాబట్టి ఆ భావనను విడనాడాలంటే ముందుగా కేశాలను నిర్ములించాలి అంటే ముండనం చేయించుకోవాలి. అప్పుడు సాధకుడు తనను తానూ అద్దంలో చూసుకొని నేను అందంగా లేను అనే భావం కలిగివుంటాడు దానివలన శరీర మొహం కొంతవరకు తగ్గుతుంది. సాధకుడు ఎట్టి పరిస్థితిలోను కేశాలకు రంగు వేయరాదు. ఇలా చేసాడంటే వాడు ఈ జన్మలో సాధనకు పనికి రాడు .

తానూ ఏ పరిస్థితిలో వున్నా అంటే స్నానమాచరిస్తూవున్న, మల మూత్ర విసర్జన చేస్తూ వున్నా భగవంతుడి ధ్యానం నుండి విడివడకూడదు. ఎందుకంటే మనకు వున్న సమయం చాలా కొద్దిది ఈ సమయాన్ని మంచి ముహూర్తం అని పరిశుభ్రం అని ఇంకా ఏదో ఏదో అని వ్యర్థం చేస్తే మన జీవిత లక్ష్యం ఆయిన్ మోక్షాన్ని చేరుకోలేము. సాధకుడు సదా పరిశుద్ధుడే. ఎందుకంటె సాధకుని మనస్సు ఎల్లప్పుడూ శుద్ధిగానే ఉంటుంది. కాబట్టి సాధక ఇంకా ఆలస్యం చేయక ఇప్పుడే నీ సాధనను మొదలు పెట్టు మోక్షార్థివి కమ్ము.

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు

మీ భార్గవ శర్మ

 

 

కామెంట్‌లు లేవు: