శ్రీమద్భగవద్గీత: ఏడవ అధ్యాయం
విజ్ఞానయోగం: శ్రీ భగవానువాచ
యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ (21)
స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే
లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తాన్ (22)
ఏ భక్తుడు ఏ దేవతామూర్తిని పూజించకోరుతున్నాడో, అతనికి ఆ దేవతామూర్తి పట్ల అచంచలమైన శ్రద్ధ నేను కలగజేస్తాను. అలాంటి శ్రద్ధాభక్తులతో ఆ దేవతామూర్తిని ఆరాధించినవాడు నేను కలగజేసే కామితార్థాలనే ఆ దేవతద్వారా పొందుతున్నాడు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి