23, మే 2021, ఆదివారం

వెంటనే ఈ రెండు మందులు తెచ్చుకోండి

ఇప్పుడు ప్రతివారు తమ ప్రాణాలను కాపాడుకోటం ఎలా అనే విధంగా వున్నారు. రోగం కన్నా రోగానికి చెందిన భయం ప్రతి వారిలో ఏర్పడుతున్నది.  నిజానికి మనం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఏమి కాదు. 

మనం శారీరికంగా మానసికంగా దృఢంగా ఉండాలి అంటే శరీరం కండలు తిరిగి ఉండటం కాదు.  మన దేహం చక్కటి రోగ నిరోధక శక్తి (immunity ) ఉంటే మనలను ఏ రోగము దరిచేరదు. ఇక్కడ నేను చెప్పే రెండు మందులు తెచ్చుకొని వెంటనే వాడటం చేయండి. 

1) చావనాప్రాస్  లేదా అమృత రసాయనం. ఈ రెండిట్లో ఏదో ఒకటి తెచ్చుకొని ఇంట్లోని వారంతా చిన్న పిల్లల దగ్గరనుండి వయోవృద్దుల దాకా రోజు క్రమం తప్పకుండా వాడండి. ఎవరు యెంత మోతాదులో వాడాలో ఆ డబ్బాల మీద వ్రాసివుంటుంది. ఒక్కవిషయం గుర్తుంచుకోండి డైయాబెటిక్ వ్యాధి గ్రస్తులు మాత్రమూ డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలి. ఇది మన శరీరంలో వ్యాధి నిరోధక శెక్తిని పెంచుతుంది కాబట్టి మీకు మంచి immunity లభిస్తుంది. దీని వాళ్ళ ఎటువంటి సైడ్ ఎఫక్ట్ ఉండదని ఆయుర్వేదం చెపుతున్నది. 

ఇక రెండో మందు ఇది మీరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి అవసరం ఉంటే మాత్రమే దీనిని వాడాలి అనవసరంగా వాడ కూడదు. అది 

2)తాలిసాది చూర్ణం (TAALISAADI చూర్ణం) ఇది మనకు పొడి రూపంలో లభిస్తుంది మనకు   వచ్చే దగ్గు, జలుబు లోజ్వరము మొదలగు రుగ్మతలను నిర్ములిస్తుంది. మీకు ఏ మాత్రం గొంతులో గరగర వున్నా జలుబుగా వున్నా లేక కొంచం జ్వరం వచ్చిన దీనిని వెంటనే ఒక పావు చెంచా లేక అర చెంచా మీ రోగ తీవ్రతను బట్టి సేవించి మంచి నీరు తీసుకోండి. 

మీరు పైన చెప్పిన విధంగా చేస్తే మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది మీకు ఏ విధమైన బాధ కలుగదు. 

ఇక మనకు కావలసింది మనో ధైర్యం 

మన మనస్సుని ఏదో ఒక విషయం మీద పెడితే అది ప్రస్తుత కరోనా విషయాలకు దూరంగా ఉంటుంది. దానికి ఒకటే మార్గం అది దైవ చింతన మీకు వచ్చిన, తెలిసిన శ్లోకాలు, కీర్తనలు ఆలపిస్తూ దైవ చింతన చేయండి లేదా మన పురాణ ఇతిహాసాలు చదువుతూ, భక్తుల చరిత్రలు చదువుతూ సత్కాలక్షేపం చేయండి. 

మీరు రోజు కొంత సమయం ధ్యానం చేయండి. 

ధ్యానం చేయటానికి సులువైన మార్గం. 

మీరు ఒక ఆశనం మీద కూర్చుని అంటే ఏదైనా పట్టా లేదా పీట మీద కూర్చొని మీ రెండు చేతులు కలిపి ఉంచి నిటారుగా మీ దేహాన్ని వుంచు మీరు మీ జాసను మీ ముక్కు లోని శ్వాస మీద ఉంచి కూర్చోండి కేవలం మీ శ్వాస గమనాన్నే గమనిస్తూ వుండండి ఇది చాలా సులువైన ధ్యాన మార్గం. 

ఎందరో మహర్షులు, మనకు అనేక ధ్యాన మార్గాలు ఉపదేశించారు కానీ అందులో కొన్ని కొంత సాధన చేస్తే కానీ గురు ముఖతః నేర్చుకో గలము. 

శ్రీ కృష్ణ భగవానులు శ్రీమత్ భగవత్గీతలో ధ్యానాన్ని ఆచరించే విధానం తెలిపారు కానీ అది సులువైనది కాదు కేవలము గురు శిక్షణతోటె సాధ్యం. ఇప్పుడు మీరు ధ్యాన మార్గాన్ని అవలంబించి ఆధ్యాత్మికతను సాధించటం మీ దృక్పధం కాదు కాబట్టి సులువైన దానిని ఆచరించండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. 

ఈ వ్యాసం చదివి ఫై మందులు వాడే పాఠకులు తమ అభిప్రాయాలను క్రింద కామెంట్ రూపంలో తెలుపగలరు. ఒక్క విషయం ముందుగా ఈ బ్లాగ్ follower గా అయ్యే తరువాత మీ కామెంట్ను తెలుపగలరు.  మీరు తెలుగు ఇంగ్లీష్ ఏ భాషలో అయినా తెలుప వచ్చు. మా పాఠకులు అందరు ఆరోగ్యంగా వుండాలని మా ఆకాంక్ష. 


సర్వే జన సుఖినోభవంతు. 

ఓం శాంతి శాంతి  శాంతిఁ 


కామెంట్‌లు లేవు: