13, సెప్టెంబర్ 2021, సోమవారం

వశిష్థ విశ్వామిత్ర శతానందాదులవంటి వారేరీ?

 ॐ పాలకులనీ ప్రజలనీ ప్రభావితం చేయగల 

    పురాణాలలోని వశిష్థ విశ్వామిత్ర శతానందాదులవంటి వారేరీ? 


    ఎప్పటివో పురాణాలు అనకుండా, అదే విధానాలని కొనసాగించిన, చరిత్ర చెబుతున్న వీరిని గూర్చి చూడండి. 


1. విద్యారణ్య స్వామి 

    శృంగేరి శారదా పీఠానికి 12వ పీఠాధిపతి. 

    శంకరాచార్యుల తరువాత ఐదు శతాబ్ధాలకు శారదా పీఠాన్ని అధిరోహించారు. 

    విజయనగర సామ్రాజ్య స్థాపనకు మూల ప్రేరకునిగా ప్రసిద్ధి చెందారు. 

పుట్టిన సంవత్సరం : 1268

పుట్టిన స్థలం: భారతదేశం. 

సిద్ధిపొందినది : 1391  


2. సమర్దరామదాస స్వామి 

    భారతదేశ చరిత్రలో సమర్దరామదాసుగారి పాత్ర చాలా కీలకమైనది. 

    శివాజీకి మత గురువై, ఛత్రపతి శివాజీతో హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పరచి మలుపు తిప్పటంలో సమర్ధ రామదాసు పాత్ర గురుతుల్యమైనది. 


పుట్టిన సంవత్సరం : 1608

పుట్టిన స్థలం: అమ్బాద్

సిద్ధపొందిన సంవత్సరం : 1681

సిద్ధపొందిన స్థలం: సజ్జన్గడ్, గజవది  


3. పరమాచార్య - చంద్రశేఖరేంద్ర సరస్వతి 

    వీరు, కంచి కామకోటి పీఠం జగద్గురువుగా అధిష్టించిన వారి వరుస క్రమంలో 68వ వారని తెలుస్తుంది.

    పీఠం అధిష్ఠించినప్పటి నుండి పీఠం అదిష్ఠించినవారిని జగద్గురు, పరమాచార్య, మహాస్వామి మున్నగు పేర్లతో పిలిచే ఆచారం పరంపరంగా వస్తుంది. 

    జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామి తన దివ్యదృష్టితో, 

    ప్రజల సమస్యలూ బాధలూ వారే గ్రహించి తెలుపుతూ, తన దైవశక్తితో వాటిని నివారించేవారు.   

    దానికి, ఆయనననను నడిచే దైవంగా, త్రికాల జ్ఞానిగా, ప్రత్యక్షంగా అనుభూతి పొందిన ఈ కాలం పెద్దలే సాక్షులు. 

 

పుట్టిన తేదీ: 20 మే, 1894

పుట్టిన స్థలం: విలుప్పురం

సిద్ధిపొందిన తేదీ: 8 జనవరి, 1994

సిద్ధిపొందిన స్థలం: కాంచీపురం 


    ఆ విధంగా ధర్మబద్ధతతో - నిష్పాక్షిక దిశా నిర్దేశం చేసే అటువంటివారేరీ?             


    — రామాయణం శర్మ

             భద్రాచలం

కామెంట్‌లు లేవు: