26, సెప్టెంబర్ 2022, సోమవారం

లంకాయాం శాంకరీదేవి*

 *లంకాయాం శాంకరీదేవి*                 


*ఇది 18వ శతాబ్దంలో జరిగిందట.*

       *శ్రీలంక కూడ అప్పట్లో భారతదేశపు అనుబంధమే.*


*అనేక పల్లెకారులు సముద్రమార్గం ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు శ్రీలంకకు వెళ్లి చేసుకుంటుండేవారు.* 


*ఒక సమయంలో తమిళపులులుగా కొన్ని ఉద్యమాలు , అల్లరులు, గొడవలు జరిగిన విషయం మనందరికి తెలిసినదే!!!*


*ఆసమయంలో జరిగిన సంఘటన ఇది. హఠాత్తుగ జరిగిన ఈ సంఘటనతో భయభ్రాంతులైన పల్లెజనం తమ తమ వర్తకసామగ్రిని హుటాహుటిన ఓడలలోనికి ఎక్కించి ఉరుకులు పరుగులమీద స్వస్థలాలకు చేరుకుని’బతుకుజీవుడా’ అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు.*


*అయితే తూర్పుగోదావరి కాకినాడ దగ్గర తాళ్లరేవు అనే ఒక కుగ్రామంకు చెందిన ఒక ఓడలోని వస్తువులను తాళ్లను ఖాళీ చేస్తుండగా అందులోనుండి ఒక అమ్మవారి విగ్రహం తాళ్లమధ్యలో పడుకుని కనిపించిందట.*


*గ్రామస్తులంతా తెల్లబోయి “ఈ విగ్రహం ఎక్కడిది?ఎలా వచ్చింది?ఎవరీఅమ్మ?ఏంచెయ్యాలి?” అని ధర్మమీమాంసలో పడ్డారు.* 


*పల్లెజనం.....అమాయకులు.. ఇప్పటంత communication లేదు. మాయలు, కుతంత్రాలు తెలియవు. ఊరిపెద్దలను కలిశారు. శ్రీలంకనుండి వచ్చిన ఓడలలో వచ్చింది ‘శాంకరీదేవి’ అని తెలుసుకునేటంత విజ్ఞానులు కారు వాళ్లు.*


*“అమ్మ తనంత తానుగా మనలను కాపాడటంకోసం వచ్చిన దేవీస్వరూపం“ అని మాత్రమే వాళ్లకు అర్ధమైంది.*


*గురువారంనాడు (లక్ష్మీవారంనాడు) దొరికింది కనుక మహాలక్ష్మి అని పేరు పెట్టి అదే ప్రదేశంలో ప్రతిష్ఠించుకుని పూజలు చేసుకోవటము మొదలు పెట్టారు.*


*అప్పటినుండి 2016 ఫిబ్రవరి వరకు శ్రీలంకలో శాంకరీదేవి పీఠంలో పీఠంమాత్రమే వున్నది......విగ్రహం లేదన్న విషయం మనందరికీ తెలుసు.* 


*శక్తిపీఠంకోసమే శ్రీలంకకు (తీసుకు) వెళ్తున్న యాత్రికులను తృప్తిపరచటం కోసంశ్రీలంక ప్రభుత్వంవారు (commercial purpose &income కోసం) ఆ పీఠంపై శాంకరీదేవి పేరుతో2016 ఫిబ్రవరిలో మరొక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.*


*అసలు “శాంకరీమాత” లంక రాక్షసులమధ్య, సీతామాత అన్నికష్టాలుపడ్డ ఆప్రదేశంలో“ వుండటానికి ఇష్టపడక మనవాళ్లతో మనదేశానికి తనంత తానుగా తరలివచ్చింది.*


*తూర్పుగోదావరిజిల్లా కాకినాడనుండి యానాం వెళ్లేరోడ్డులో తాళ్లరేవు దగ్గర “మట్లపాలెం మహాలక్ష్మి”పేరుతో కొలువై వున్నది.* 


*కేవలం శక్తిపీఠంకోసమే యాత్ర చేయాలనుకున్నవారు యానం వెళ్లి దర్శించుకోండి. ఈ విషయం 9 వ తరగతి పాఠ్యాంశాలలో కూడ వున్నది.*

కామెంట్‌లు లేవు: