22, ఏప్రిల్ 2022, శుక్రవారం

వైకుంఠయాత్రకు

 శ్లోకం:☝️

*చితాం ప్రజ్వలితాం దృష్ట్వా*

    *వైద్యో విస్మయ మాగతః l*

*నాహం గతో న మే భ్రాతా*

    *కస్యేదం హస్తలాఘవం ll*


భావం: ఒక వైద్యుడు పొరుగూరి నుండి తిరిగి వస్తుండగా... ఎవరో మరణించిన వ్యక్తికి శ్మశానంలో చితి పేర్చి నిప్పంటించి వెళ్లారు. అప్పుడా దారిన వచ్చిన ఈ వైద్యునికంట పడింది ఆ దృశ్యం. వెంటనే ఇతనికి అనుమానం వచ్చింది. "వైద్యానికి నేను కాని నా సోదరుడు కాని వెళ్లలేదు కదా! ఇది ఎవరి హస్తవాసియై వుంటుంది?" అనగా "ఎవరి చేతి చలవ వల్ల ఈతడు చనిపోయాడు?" అని ఆశ్చర్యపడ్డాడని భావం.

ఈ లెక్కన సోదరులిద్దరూ వారి చేతి మాత్రతో ఎంతమందిని వైకుంఠయాత్రకు పంపారో కదా!

కామెంట్‌లు లేవు: