8, సెప్టెంబర్ 2022, గురువారం

పందితో పడవలో

 ఒక వ్యక్తి తన పందితో పడవలో ప్రయాణిస్తున్నాడు.


ఆ పడవలో ఇతర  ప్రయాణీకులతో పాటు ఒక తత్వవేత్త కూడా ఉన్నాడు.


పంది ఇంతకు ముందు పడవలో ఎప్పుడూ ప్రయాణించలేదు, కాబట్టి దానికి ఆ ప్రయాణం సుఖంగా లేదు. అందువల్ల అది ఎవరినీ శాంతంగా కూర్చోనివ్వకుండా అటూ ఇటూ తిరుగుతూ ఇబ్బంది పెడుతోంది.


దీనితో బోట్ నడిపేవాడు ఇబ్బంది పడుతున్నాడు.  ఈ పంది వల్ల ,ప్రయాణికుల భయం కారణంగా పడవ మునిగిపోతుందేమో అని ఆందోళన చెందుతున్నాడు.


పంది కానీ శాంతించకపోతే అది పడవని 

మునిగిపోయే ప్రమాదంలోకి నెట్టేస్తుంది.


ఆ పందిని తెచ్చిన మనిషి పడవలో ఉన్న ఈ పరిస్థితి గురించి కలత చెందుతున్నాడు.  కాని తన పందిని శాంతింపచేయడానికి ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు.


వాళ్లలో ఉన్న తత్వవేత్త ఇవన్నీ చూసి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.


 "మీరు అనుమతిస్తే, నేను ఈ పందిని ఇంటి పిల్లిలా నిశ్శబ్దంగా చేయగలను." అని ఆ పంది యజమానితో ఆ తత్వవేత్త చెప్పాడు. 


ఆ వ్యక్తి వెంటనే అంగీకరించాడు.


తత్వవేత్త, ఇద్దరు ప్రయాణీకుల సహాయంతో పందిని ఎత్తుకొని నదిలోకి విసిరాడు.


ఆ పంది నీటిలో తేలుతూ ఉండటానికి ఈత కొట్టడం ప్రారంభించింది. దానికి ఇప్పుడు ఈత కొట్టకపోతే చచ్చిపోతాను అని తెలిసి దాని ప్రాణం నిలుపుకోవడం కోసం కష్టపడడం మొదలుపెట్టింది.


కొంత సమయం తరువాత, తత్వవేత్త పందిని తిరిగి పడవలోకి లాగాడు.


పంది వెళ్లి పడవలో ఒక మూల నిశ్శబ్దంగా కూర్చుంది.


పంది యొక్క మారిన ప్రవర్తనను చూసి దాని యజమాని మరియు ఇతర ప్రయాణీకులందరూ ఆశ్చర్యపోయారు.


ఆ వ్యక్తి తత్వవేత్తను అడిగాడు: "మొదట అది అటూ ఇటూ దూకుతోంది. ఇప్పుడు అది పెంపుడు పిల్లిలా కూర్చుంది. ఎందుకు? కారణం ఏమిటి అని అడిగాడు.


తత్వవేత్త ఇలా అన్నాడు: "అదే తరహా ఇబ్బందిని అనుభవించకుండా మరొకరి కష్టాన్ని ఎవరూ సరిగా అర్ధం చేసుకోలేరు. నేను ఈ పందిని నీటిలోకి విసిరినప్పుడు, అది నీటిలో పడితే  ప్రమాదాన్ని మరియు పడవ యొక్క ఉపయోగాన్ని అది అర్థం చేసుకుంది."


భారతదేశంలో అలాగే దేశం బాగోలేదు, వాక్ స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, ప్రభుత్వం బాగా నడపడం లేదు అంటూ అటూ ఇటూ దూకుతున్న పందులను ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్, సోమాలియా, దక్షిణ సూడాన్, సిరియా,ఇరాన్, ఇరాక్ లేదా పాకిస్తాన్ లేదా చైనాలో 6 నెలలు విసిరివేయాలి. తరువాత వారు భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు వారు ఆటోమాటిక్ గా పెంపుడు పిల్లిలా ప్రశాంతంగా జీవించడం నేర్చుకొని ఒక మూల కూర్చొని వుంటారు.


ఈ భారత్ దేశాన్ని'  రోజూ తిట్టుకునే అన్ని పందులకు అంకితం.


వాట్స్ అప్ సేకరణ..

కామెంట్‌లు లేవు: