27, సెప్టెంబర్ 2022, మంగళవారం

స్వర్గప్రాప్తి

 ప్రపంచ జనాభా ఇప్పుడు దాదాపు 800 కోట్లు పైబడట్టు అంచనా. అంటే రెండవ ప్రపంచ యుద్ధం దరిదాపుల్లో ఈ జనాభా లెక్కలు దాదాపు 150 నుండి 200 కోట్ల దాకా ఉండేవని. 


అంటే సుమారు 80 ఏళ్ళ తరువాత జనాభా నాలుగింతలైనట్టు. 


మనిషి సగటున 80 ఏళ్ళు బతుకుతాడు అని అనుకుంటే ఇప్పుడు ఉన్న జనాభా అంతా 1940 తరువాత పుట్టినవాళ్ళే కదా


పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం 1940 దాకా ఉన్నవారందరు మళ్ళీ పుట్టుంటే జనాభా లెక్కలు 200 కోట్లకు దాటకపోదును. కాని 800 కోట్లు ఎలా ఐనట్టు. 


అంటే మనుషులే కాకుండే ఇతర జీవులు కూడా మనుషులుగా పుట్టి తమ తమ మంచి కర్మల ద్వారా మోక్షం పొందగలరని కదా. 


కాని మనిషి కన్నా ఇతర జీవులకు మానవ జన్మ పొందడానికి అవకాశాలు తక్కువ అని విన్నాను. 


కాని ఆ ఇతర జీవులు ఏం చేసాయో గాని మనుషుల జనాభాను అతిక్రమించి మనుషులుగా జీవం పొంది స్వర్గప్రాప్తి సంపాదించుకుంటున్నాయి అని చెప్పడంలో సందేహము లేదు. 


పైన చెప్పిన వివరాలలో ఏవైనా తప్పులు ఉన్న యెడల మన్నించగలరు.

కామెంట్‌లు లేవు: