20, నవంబర్ 2022, ఆదివారం

అవగాహనా స్థాయిలు (UNDERSTANDING LEVELS) 

 

అవగాహనా స్థాయిలు (UNDERSTANDING LEVELS) 

ఈ భూమి మీద వున్న జంతుకోటిలో ఒక్క మానవుడు మాత్రమే బుద్ది జీవి.  అట్లా అని అందరు మానవులు అన్ని విషయాలను తెలుసుకునే స్థాయిలో (LEVEL) ఉంటారని మనం అనలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవగాహనా స్థాయి  ఉంటుంది.  పూర్వం కొంతమంది ఒక్కసారి ఒక పాఠం చెపితే వెంటనే దానిని తెలుసుకొని కంటతహా పట్టేవారట అంటే వారు ఒక్కసారి ఒక్కవిషయాన్ని వింటే వెంటనే ఆదివారికి నోటికే వచ్చేది అన్నమాట.  ఒకసారి మన తెలుగు దేశంలోని ఒక పండితుడు ఇప్పుడు ఆగ్రాగా పిలవబడే పట్టణానికి వెళ్లి అక్కడి యమునా నదిలో స్నానం చేస్తుండగా ఒక స్త్రీని కొంతమంది దుండగలులు తీసుకొని వచ్చి హత్య చేశారట అక్కడ మన పండితుడు తప్ప ఆ దేశంవారు ఎవరు అక్కడ  లేరు. మన పండితునివారికి అక్కడి భాష రాదు.  మరునాడు రాజుగారు ఆ కేసును విచారించటానికి రాజభటులను పంపగా వారు మన పండితుఁలవారిని సాక్షిగా తీసుకొని వచ్చారట.  రాజుగారు అడిగిన ప్రశ్నలకు పండితులవారు ఇలా చెప్పారట.  నాకు అక్కడి దుండగులు మాట్లాడే భాష తెలియదు, కానీ వారు ఏమి మాట్లాడుకున్నారో చెప్పగలను అని విన్నది విన్నట్లు  చెప్పారట. ఆ పండితుడు చెప్పిన మాటలతో ఆ నేరస్తుల వివరాలు పూర్తిగా తెలుసుకొన్నారు  రాజుగారు. అప్పుడు రాజుగారు ఆశ్చర్యపోయి మీకు బాష రాదుగా మరి ఎలాచెప్పారని అడిగారట.  దానికి మన పండితులవారు రాజా నేను అవధానాలు  చేస్తుంటాను. మాకు అవధానప్రక్రియలో ఏకసంతాగ్రాహ్యం ప్రధాన విషయం అని చెప్పగా మన పండితులవారి తెలివి తేటలకు ముగ్దులైన ఆ రాజుగారు ఆయనను విశేషంగా సన్మానించారట. మన అవధానుల మేధస్సు అంత గొప్పది. పూర్వకాలంలో వేదాలు నోటికే చెప్పేవారు.  బహుశా అప్పుడు భాషలకు లిపికి అంత ప్రాధాన్యత ఇచ్చేవారుకాదేమో. అందుకే " ముఖే ముఖే సరస్వతి" అని అన్నారు కాబోలు.

నిజానికి మనం రోజు అనేక విషయాలను వింటుంటాము, చూస్తుంటాము కానీ అవి అన్ని మనకు గుర్తుండవచ్చు లేక గుర్తుండకపోవచ్చు. మనజీవితంలో జరిగిన కొన్ని విషయాలు మనకు ఎల్లప్పుడూ జ్ఞ్యాపకం ఉంటాయి అవి సహజంగా మనం పొందిన అత్యంత ఆనందము, దుఃఖము, బాధలు.  ఎవరో నిన్ను అవమానించారనుకో అది నీకు సదా జ్ఞ్యాపకం ఉంటుంది.  అదే నిన్ను అవమానించిన వానితో నీకు జరిగిన ఇతరవిషయాలు మాత్రం జ్ఞ్యాపకం  ఉండకపోవచ్చు. "అది నేనెట్లా మరుస్తాను జీవితాంతం గుర్తుంచుకుంటా.  అని అనటం" మనం సర్వ సాధారణంగా చూస్తూవుంటాం.  అంటే మనం మనసుకు పూర్తిగా హత్తుకునే విషయాలు అవి మంచివి కావచ్చు లేక చెడ్డవికావచు వాటిని మాత్రమే గుర్తు  పెట్టుకోగలుగుతాము. ఇది నిజం. 

కొన్ని సందర్భాలలో మన ముందు జరిగిన విషయాలు కూడా తెలియనట్లుగా ఉంటాము.  నీవు ఇక్కడే ఉన్నావా అని నీ స్నేహితుడు అడిగితె ఇక్కడే గంటనుంచి బస్సుకోసం ఎదురుచూస్తున్నాను అని అన్నావు.  రామారావు ఇటుగా వెళ్ళటం చూసావా అంటే మాత్రం ఏమోరా నేను చూడలేదు అని బదులు ఇస్తావు.  ఎందుకు అంటే నీవు రామారావు నీ ముందరిగా వెళ్ళటం నీ కళ్ళు చూశాయి కానీ నీమనస్సు గుర్తించలేదు అదీ సంగతి. 

ఒక విషయాన్ని చూడటం, చూసినదానిని గమనించి అవగాహన చేసుకోవటం, చేసుకున్నదానిని గుర్తుంచుకోవటం మొదలైన అన్నివిషయాలు కూడా ఒక మనిషి మేధాశక్తి మీద ఆధార పడతాయి.  ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్కళ్ళ మేధాశక్తి ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఏదిఏమైనప్పటికీ తానుచేసిన విషయం మీద మనస్సు లగ్నం కానిఅప్పుడు ఆ విషయాన్ని అవగాహన చేసుకోవటం కుదరదు అంతేకాదు గుర్తుకూడా ఉండదు. భౌతికమైన విషయాలమీదనే ఇన్నిరకాల సమస్యలు ఉంటే ఇక ఆద్యద్మికమైన విషయాల మీద ఇంకా ఎంతో శ్రర్ధ కావలసి వస్తుంది. 

భౌతికమైన విషయాలు మనకు పంచేంద్రియాలతో ముడిపడినవి.  ఎందుకంటె భౌతికజ్ఞ్యానం మనకు ఇంద్రియాలతోటే కలుగుతుంది. ఇంద్రియాలకు అతీతమైనది ఆత్మ జ్ఞ్యానం లేక బ్రహ్మ జ్ఞ్యానం కాబట్టి ఆ జ్ఞ్యానం పొందాలంటే మనుషులకు అవగాహనా స్థాయి చాలా ఎక్కువగా ఉండాలి.  ఎందుకంటె బౌతికంగా పొందే జ్ఞ్యానం తనకన్నా బిన్నంగా వున్నా విషయాల జ్ఞ్యానం అదే బ్రహ్మ జ్ఞ్యానం అనేది తన గూర్చి తాను తెలుసుకునే జ్ఞ్యానం.  కాబట్టి బ్రహ్మ జ్ఞ్యాన పిపాసికి అనగా జిగ్న్యాశువుకి అవగాహనా సామర్ధ్యం చాలా ఎక్కువగా ఉండాలి. అణువణువున ఎన్నో సందేహాలు  వస్తూవుంటాయి. వాటిని సరైన పూజ్యగురువు సేవనం చేస్తూ నివృత్తి చేసుకుంటూ ముందుకు సాగాలి. ఆధ్యాత్మిక జీవనం చాలా కఠినంగా కష్టభరితంగా, దుర్లభంగా ఉంటుంది. ఎందుకంటె సాధకుడు తనకు తానూ మోక్షాన్ని పొందాలి అని యోచిస్తాడు  కాబట్టి. ఈ భూమిమీద మానవుడు సాధించవలసిన అతిబృహత్ కార్యం ఏదయినా వున్నది అంటే అది మోక్షం మాత్రమే.  ఒక మనిషి బౌతికంగా చేయగల కార్యాలు అన్నీ కూడా ఏదో ఒక హద్దు కలిగి ఉంటుంది.  కానీ మోక్షం అనేది అట్లా కాదు.  ఇంకొక విషయం బౌతికంగా సాధించేది ప్రతిదీ పూర్తిగా కానీ లేక ఒక స్టాయిమటుకు అయినా తనకన్నా ముందు ఎవరో ఒకరు చేసి వుంటారు, ఆలా చేసినది ఉపలబ్ధం అవుతుంది అంటే దానికి సంబందించిన సమాచారం, ఆధారము, సాక్షం ఉంటుంది.  కానీ మోక్షం ఏమిటో ఎలావుంటుందో అనేది ఒక్కొక్క సాధకుడు తన సాధనా పటిమతో సిద్దించుకునేది మాత్రమే మోక్షార్ధికి గతంలో మోక్షం పొందిన వాని జాడ కుడా తెలియదు.  తెలుసుకునేటందుకు అవకాశం కూడా ఉండదు.  ఒక్క మాటలో చెప్పాలంటే మోక్షం అనేది తనకుతానుగా తెలుసుకుని సిద్దించుకునేది . అంటే స్వయంగా తెలుసుకునేది మాత్రమే. 

ఓం తత్సత్  

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు

మీ భార్గవ శర్మ

 

 



కామెంట్‌లు లేవు: