7, జనవరి 2023, శనివారం

వ్యాఘ్రేశ్వరం

 [05/01, 8:34 pm] +91 93903 43371: 🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳 పూర్వం పెద్దాపురం సంస్థానం లో ఉన్న ఈ ప్రాంతం అంతా ఒక అడవి,ఒక బ్రాహ్మణోత్తముడు మహాశివరాత్రి రోజున స్నానసంధ్యాదులు పూర్తి చేసుకుని శివపూజకు మారేడు దళాలు కోసమై అడవికి వెళ్ళాడు

ఇంతలో ఒక.పులి తరమగా పరుగెత్తి, పరుగెత్తి ఒక చెట్టు ను ఎక్కాడు.అది మారేడు చెట్టు.పులి

చెట్టు కింద ఉంది.చేసేది ఏమీ లేక ఆ బ్రాహ్మణుడు మనసు లో పరమేశ్వరుడు ని ధ్యానం చేస్తూ ఉండిపోయాడు.రాత్రి సమయం అయింది, అయినా ఆ పులి 🐯 అక్కడ నుంచి కదలలేదు.అర్ధరాత్రి లింగోద్భవ కాలం అయింది.

మనసులో పరమేశ్వరుడు ని ధ్యానం చేస్తూ ఆ బిల్వదళం చెట్టు మీద నుండి ఒక్కొక్క దళం కోస్తూ చెట్టు కింద కు వేస్తున్నాడు.తెల్లవారేసరికి ఆ పులి 🐯 మారేడు దళాలతో కప్ఫబడింది.ఆ రాశి కదలకపోవడంతో ఆ బ్రాహ్మణుడు చెట్టు దిగి జనావాసాల మద్యకు వెళ్లి జరిగిన ది చెప్పడంతో ఆ జనాలు బరిశెలతో , డప్పులు వాయిస్తూ ఆ పులి ఉన్న ప్రదేశానికి వచ్చారు.అందులో ఒకడు ధైర్యం చేసి ఆ పులి ఉన్న రాశి దగ్గర కు వచ్చి,ఆ ప్రదేశాన్ని బరిశెతో పొడవగా రాయి తగిలిన శబ్దం వచ్చింది.ఆ శబ్దం నకు తొలగించి చూడగా, శివలింగం బయట పడింది.పరమేశ్వరుడు వారిలో ఒకరిని ఆవహించి, నేను ఈ బ్రాహ్మణోత్తముడుని పరీక్షించడానికి పులి రూపంలో వచ్చాను.ఇతని మానసిక బిల్వ పూజకు సంతోషించాను.ఈ బ్రాహ్మణుడు ఇహపరసుఖములను పొంది నాలో ఐక్యం చెందుతాడు,అని పలికాడు.అదేరోజు రాత్రి పరమేశ్వరుడు పెద్దాపురం మహారాజు కలలో కనిపించి, నేను ఈ ప్రదేశంలో స్వయంభూ గా వెలిశాను, నాకు ఇక్కడ గుడి కట్టించమని ఆదేశించారు.పెద్దాపురం మహారాజు గారు, అక్కడ ఆలయాన్ని మండపప్రాకారాలను,

నిర్మించి ఆ పరమేశ్వరుడు కి ధూపదీప నైవేద్యాలు ఉత్సవాలు కు నలభై ఎకరాల సస్యశ్యామలంగా పండే భూమిని 

ఇచ్చారు.ఆ దేవుని పేరు మీదుగా ఒక అగ్రహారం ను ఏర్పాటు చేశారు.అదియే వ్యాఘ్రేశ్వరం గ్రామం.వ్యాఘ్రం లింగాక్రుతిగా మారడంతో,వ్యాఘ్రేశ్వరుడిగా ప్రసిద్ధికెక్కాడు.అక్కడ అమ్మవారు బాలాత్రిపురసుందరి ని అర్చిస్తూ,

అనేక మంది భక్తులు ఇహపరసుఖములను పొందుతున్నారు.

మంగళం మహత్ శ్రీశ్రీశ్రీ

ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లా,క్రొత్తపేట మండలంలోని ముక్కామల దగ్గర ఉంది.

కామెంట్‌లు లేవు: