15, ఫిబ్రవరి 2023, బుధవారం

బాధ్యత మన అందరిదీ

 Brahmin సోదరులకు గమనిక;-

—--—-----------------------------

ఇప్పటిదాకా, బ్రాహ్మణ కులానికి చేసినటువంటి ద్రోహం,మోసం సరిపోక, కేవలం అర్చక, పురోహితులను మరియు బ్రాహ్మణులను లక్ష్యంగా చేసుకొని ఈ క్రింది కొత్తరకం మోసాలు బయలుదేరాయి. వీటి ఉచ్చులో పడకుండా, తగిన జాగ్రత్తలు తీసుకుని, తోటి బ్రాహ్మణులకు కూడా చెప్పి, వాళ్లు కూడా, తమ డబ్బును కోల్పోకుండా ఉండేటట్టుగా, చూడవలసిన బాధ్యత మన అందరిదీ.


1) గత కొద్ది కాలంగా బ్రాహ్మణులను టార్గెట్ చేస్తూ జరిగే మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. వాటిలో నేను గమనించిన కొన్ని మోసాలు.

2). బ్రాహ్మణులను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం అని ఒక వెయ్యి మందికి భూదానం చేసి అందులో గంధం చెట్లను నాటుతామని తద్వారా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి మీరు కోటీశ్వరులు అవుతారని చెబుతున్నారు. అయితే గంధం చెట్లను పెంచడానికి కొంత పెట్టబడి పెట్టాలని డబ్బులు వసూలు చేస్తున్నారు.

ఇది పక్కా మోసం. ఇది ప్రస్తుతం రన్నింగ్ లో ఉంది. ఎవరూ ఈ మాయలో పడవద్దు.

3) బ్రాహ్మణులు అందరికీ సొంత ఇల్లు కల్పించడమే నా కల. అని చెప్పి కొంత కాలం క్రితం తక్కువ రేటు కు ఇళ్ళస్థలాలు ఇస్తామని నమ్మించి కొన్ని వందల మందిని కొన్ని కోట్ల రూపాయలు మోసం చేసిన సంఘటన ఎవరూ మర్చిపోలేదని అనుకుంటున్నాను.

ఇకపై ఎవరన్నా ఇలాంటి ప్రకటన చేసినా జాగ్రత్తగా ఉండండి.

4). అమెరికా లోనో, జపాన్ లోనో లేదా ఏదో దేశంలోనో లేకపోతే మనదేశంలో నే కాశీ, అయోధ్య లాంటి క్షేత్రం లో కొన్నివేలమందితో "మహాయాగం" జరుగనుంది. దానికి ముందు అప్లికేషన్ పెట్టాలని రిజిస్ట్రేషన్ ఫీజు కొంత కట్టాలని, యాగం అయ్యాకా మీ డబ్బు మీకు ఇచ్చేస్తారని డబ్బులు వసూలు చేస్తున్నారు.

మనల్ని పూజలు చేయటానికి పిలిచేవారు ఎవ్వరూ మనల్ని డబ్బులు కట్టమని అడుగరు. ఇలాంటి వాటితో జాగ్రత్త.

5). మనకు తెలియని వారు ఎవరో ఫోన్ చేసి ఎవరో మీ నెంబర్ ఇచ్చారు మా ఇంట్లో ఏదో కార్యక్రమం చేయించాలని, మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు. ఆ రోజు ఉదయమే దిగుతాడు. పూజా ద్రవ్యాలు మీరు ఏర్పాటు చెయ్యండి. అని చెప్పి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్రస్ చెప్పకుండా ఫోన్ స్విచ్చాఫ్ చేసేవారు కొందరైతే, ఏదో ప్లేస్ చెప్పి అక్కడికి వెళ్ళాకా మనపై దాడిచేసి మన దగ్గరున్న బంగారం, డబ్బు దోచుకునే వారు కొందరు.

దయచేసి మీకు తెలియని వారు ఎవరన్నా ఇలా ఫోన్ చేస్తే ముందు అడ్వాన్స్ గా సగం డబ్బులు పంపించమనండి. డబ్బు పంపించాకే కార్యక్రమానికి బయలుదేరండి. వేరే దేశం నుండి అయినా డబ్బులు పంపిచవచ్చు. మనల్ని మోసం చేసేవారు డబ్బులు పంపించరు. అదే గుర్తు.

 6). బ్రాహ్మణుల కోసం ఏదో ట్రస్ట్ పెట్టామని, కొంత డబ్బు కట్టి అందులో జాయిన్ అయితే మీరు జాయిన్ అయిన సంవత్సరం తర్వాత నుండి ఒక లక్ష నుండి పది లక్షల వరకు వడ్డీ లేకుండా లోన్ ఇస్తామని చెప్పి మనం డబ్బులు కట్టాకా పరారు అవుతారు. ఇలాంటి తప్పుడు సంస్థల పట్ల జాగ్రత్త.

7). మీకు తెలియని వారెవరో ఫోన్ చేసి గోదానం చేస్తామని కార్యక్రమం మాట్లాడి రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి, మేము 20,000 వేలలో ఆవు కొందామని అనుకున్నాము. తీరా కొనడానికి వెళ్తే అక్కడ మంచి పుంగనూరు ఆవు కనిపించింది. 50,000 చెప్పారు. ఇలా పూజకి దానానికి అని చెప్తే చివరకు 40,000 కు ఇస్తా అన్నారు. మేము అనుకున్నది 20 వేలు. ఇంకో 20 వేలు మా వల్ల కాదు. ఆవు చాలా బాగుంది. ఒక పని చేద్దాం మీకు నచ్చతే ఇంకో 10వేలు వేసి నేను 30 వేలు పెడతాను. మీరు ఒక 10 వేలు పెట్టుకుంటారా? అని అడుగుతారు. సాధారణంగా ఎవరైనా సరే అని డబ్బు పంపిస్తే ఫోన్ ఆపేసి వారు పరార్ అయిపోతారు. 

8)ఇదే టెక్నిక్ బంగారు దానం చేస్తామని వాడచ్చు. భూదానం అని వాడచ్చు. భూదానం అయితే కొన్ని లక్షలు కూడా మోసం చెయ్యచ్చు. తస్మత్ జాగ్రత్త.

 ఫోన్ చేసిన వారు నిజాయితీ పరులని మీకు అనిపిస్తే కార్యక్రమం అయ్యాకా ఆవు మీ చేతికి వచ్చాకా మీరు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తానని చెప్పండి.

      ఇతరులను మోసం చెయ్యడం కంటే బ్రాహ్మణులను మోసం చెయ్యడం తేలిక. ఎవరికైనా ఫ్రీగా ఏదైనా ఇస్తామంటే వెంటనే మోసం అని తెలుస్తుంది. మనకి ఫోన్ చేసి గోదానం చేస్తామంటే మోసం అని ఎవరనుకుంటారు.

       మోసం చేసేవారు వాడే మరో టెక్నిక్ ఏంటంటే

ఒకరిని లక్ష రూపాయలు మోసం చెయ్యడం, మోసం చేసి తప్పించుకోవడం కష్టం. కానీ ఒకరిని వెయ్యి రూపాయల మోసం చెయ్యడం తేలిక. వెయ్యి రూపాయల కోసం ఎవ్వరూ పోలీసుల దగ్గరకు వెళ్ళరు. కాబట్టి తప్పించుకోవడం తేలిక. అలా వెయ్యి మందిని మోసం చేస్తే 1000×1000=10,00,000 సంపాదించి,  రిస్క్ లేకుండా తప్పించుకుంటారు. ఇలా వెయ్యి మంది ఉండడం వలన మనకు తెల్సిన వారి ద్వారానే మనం కూడా ఆ ఉచ్చులో చిక్కుకుంటాం.

వెయ్యి రూపాయలు కాదు పది రూపాయలు మోసం చేసినా తప్పే. వారు మోసం చేసారని తగిన ఆధారం ఉంటే తప్పకుండా కేసు పెట్టవచ్చు.

దయచేసి ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి.


🙏🙏🙏

కామెంట్‌లు లేవు: