22, ఫిబ్రవరి 2023, బుధవారం

అద్భుత భావనలు

అద్భుత భావనలు 

మనం చూస్తూవున్న చరా చర జగత్తు ఒక అద్భుతం. ప్రతిది మనకు భగవంతుని అపురూప కల్పనగానే గోచరిస్తుంది. ఎక్కడ చూసినా అది ఒక క్రొత్తదానిలా, దానిని మలచిన భగవంతుడు ఒక అద్భుతం. భక్తులు తమ భక్తి పారవశ్యంలో భగవంతుని లీలలను అద్భుతంగ పేర్కొంటారు

శ్రీ ఆది శంకర భగవత్పాదులవారు ఒక శ్లోకంలో అమ్మ భవాని మాత అని నేను నా కష్టాలను మొరపెట్టుకొని నన్ను కావమని ప్రార్ధిస్తే నీవు నా బాధలను ఏవి పట్టించుకోకుండా కేవలం నిన్ను "భావాని" అని పిలిచినదాని మాత్రమే తీసుకొని పదానికి "నేనే నీవు" అనే అర్ధాన్ని గ్రహించి నాకు మోక్షాన్ని సీటున్నావా తల్లి అని వేడుకొంటారు. నిజానికి నేను నిన్ను "భావాని" అన్న నా భావన భావుడైన పరమశివుని పత్నివి అని కానీ నీవు వేరే అర్ధం చేసుకొని నేను అడగకుండానే మోక్షాన్ని ప్రసాదిస్తున్నావు తల్లి నీవు యెంత గొప్పదాఅనివి అమ్మా అని ఆర్తితో స్పరిస్తారు

ఇంకొక ఉదంతం. ఒక పరమ భక్తుడు ఇలా అంటున్నాడు. పరమేశ్వరా నేను నిన్ను గత జన్మలో భజించలేదుఅంతే కాదు నేను భవిష్యత్తులో కూడా స్మరించను అని అంటున్నాడు అయన భావన ఏమిటో చుడండి

నేను గత జన్మలో నేను స్మరించలేదు కాబట్టి నాకు జన్మను ఇచ్చావు. జన్మలో సదా నేను నిన్ను భజిస్తూ వున్నాను కాబట్టి నా మోర ఆలకించి నాకు కైవల్యాన్ని ప్రసాదిస్తావు. జన్మ రాహిత్యాన్ని పొందిన నేను మరల జ్నామించటమే ఉండదు అటువంటప్పుడు నేను భవిష్యత్తులో నిన్ను ఎలా  స్మరిస్తాను. అని ప్రమేశ్వరుణ్నే ప్రశ్నిస్తున్నాడు భక్తుడు

ఎప్పుడయితే భగవంతునితో భక్తుడు సదా సంబంధం కలిగి నిరంతర ఉపాసన చేస్తూవుంటాడో అప్పుడు మాత్రమే భక్తులకు భగవంతుని మీద అనన్యమైన ప్రేమ, సఖ్యత కలుగుతాయి. అప్పుడు వారు ఇలా భగవంతునితో మాట్లాడ గలుగుతారు

భక్తుడు వేరు, భగవంతుడు వేరు అనే భావన ఉన్నంత వరకే ద్వేత భావన ఉంటుంది. త్వమేవాహం అనే భావం భక్తుని మదిలో కలగటమే మోక్షానికి కారణం

భార్గవ శర్మ చెప్పేది ఒక్కటే భక్తుడు, భగవంతుడు ఒక్కటే అనే భావం కలగాలి అది కలిగితె అదే మోక్షం అంతకంటే వేరొకటి కాదు.

ఓం తత్సత్,

 ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ 

 

 

 

కామెంట్‌లు లేవు: