22, ఫిబ్రవరి 2023, బుధవారం

నిద్ర పట్టనివారికి

 నిద్ర పట్టనివారికి నిద్రని కలిగించు సులభ ఔషధ యోగము  - 


    ఒక ఇనుప పాత్రలో 100 గ్రాముల స్వచ్చమైన నువ్వుల నూనెని తీసుకుని బాగా మరిగించాలి . దాని యందు 10 గ్రాముల ముద్ద కర్పూరం పొడి చేసి నువ్వులనూనె లో కలిపి బాగా కలిసేంత వరకు తిప్పి పొయ్యి మీద నుంచి క్రిందికి దింపి చల్లారాక ఒక బాటిల్ నందు నిలువ చేసుకుని ప్రతిరోజూ రాత్రిపూట ఆ నూనెతో అరికాళ్లుకు మర్దన చేసుకొనుచున్న సుఖవంతమైన నిద్రపట్టును . 


     పైన చెప్పిన యోగముతో పాటు రాత్రి సమయములో ఆహారం తీసుకొనిన అర్థగంట తరువాత అశ్వగంధ చూర్ణమును ఒక స్పూన్ మోతాదులో ( 3 గ్రా ) గోరువెచ్చని పాలతో కలిపి తీసుకొనుచున్న త్వరగా నిద్రపట్టును . 


          మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  

కామెంట్‌లు లేవు: