15, జనవరి 2024, సోమవారం

చరితామృతం

 🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷

*🪷శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం🪷*

.                  *భాగం - 21*

🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷

*ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ*

.  *శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః*


70  సంవత్సరములు వయస్సు గల తిరుమలదాసు అనే చాకలి వాడు  శంకరభట్టును నులక మంచం మీద కూర్చుండబెట్టి ప్రసాదమిచ్చి తినమని చెప్పినప్పుడు బ్రాహ్మణ జన్మంహకారము నశించుటవలన,ఏ జాతి  వాడైనా గురు బంధువు గా భావించడం వలన తిరుమలదాసు చెప్పినది 

విన సాగేడు.

ఈరోజు ఎంతో సుకృతము శ్రీపాదులవారి కృపా కటాక్షాలతో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైందని అతి శ్రద్ధగా స్వామివారి పీఠికాపుర విశేషాలు  గురించి చెప్పిన ప్రతీ అంశము గుర్తుపెట్టుకొని గ్రంధస్థం చేసి చరితాద్రుడవు కావలసినదిగా చెప్పెను. తాను పూర్వజన్మలో వేద  పండితుడునని  తాను అవసాన దశలో  దైవ స్మరణ చేయకుండా సంసారబంధములలో చిక్కుకుని పాతగుడ్డలను తినుచున్న గోవత్సవమును నివారించమని పిల్లలకు చెప్తూ శరీరంవదలడం వలన  నాకు ఈ చాకలి జన్మ వచ్చినదని, 

నా పూర్వజన్మ పుణ్యంకొలదీ గర్తపురి(గుంటూరు) మండలమున మాల్యాద్రి పురము  (మల్లాది) అను గ్రామమున జన్మించితిని అని చెప్పెను.ఆ గ్రామమున మల్లాది అను గృహనామంతో రెండు కుటుంబాలు కలవు.ఒకరు మల్లాది బాపన్నావదానులు హరితస గొత్రీయులు  అయిన మహామహా పండితులు,ఇంకొక కుటుంబమువారు శ్రీధర్ అవధానులు కౌశికస గొత్రీయులయిన మహా పండితులు వుండేవారు. శ్రీధర్ అవధానుల వారి సోదరి అయిన రాజమాంబను బాపన్నవధానులు గార్కి ఇచ్చి వివాహము చేసిరి. 

శ్రీ బాపన్నావధులవారు

శ్రీధర అవధానులు వారు బావబావమరుదులు అయినారు. ఈ బావా బావమరుదులు 

 ఏ మహా యాగమైనా 

కలిసి నిర్వహించేవారు.

ఒకసారి గోదావరీ తీరమున అయినవిల్లి  అను గ్రామమున స్వర్ణగణపతి  మహా యజ్ఞం నకు విచ్చేసిరి. వీరిద్దరూ ఒకరికి మించిన పండితులు ఇంకొకరు. పూర్ణాహుతి రోజున స్వయంగా గణపతి స్వర్ణకాంతులతో  విచ్చేసి తోండం తో యజ్ఞ ప్రసాదంను అందుకొనునని ఈ బావా బావమరుదులు చెప్పి యజ్ఞం ప్రారంబించిరి.తామిద్దరూ అతి శ్రద్ధాభక్తులతో మంత్రోక్తముగా చేసిన యాగానికి నిజంగానే గణేశుడు ప్రత్యక్షం అయి యజ్ఞ‌ ప్రసాదాన్ని స్వికరించి అనతికాలములో వారు గణేశ చతుర్ధి నాడు సర్వకళలతో శ్రీపాద వల్లభ రూపమున‌ అవతరించెదనని ఆనతి ఇచ్చిరి. ఆ యజ్ఞానికి విచ్చేసిన వారందరూ ఆశ్చర్యచకితులయిరి. ఆ సభలో ముగ్గురు నాస్తికులు ఇది కనికట్టేగాని నిజంగా జరగలేదు అని వాదించిరి. ఈ ముగ్గురే మరు జన్మలో  గుడ్డి,చెవిటి,మూగలుగా జన్మించెదరని వినాయకుడు వీరి యజ్జ కుండం లో భస్మం నుండి ప్రత్యక్షం అయి  శాపమిచ్చెను. అంత వారు వేడుకొనగా ఈ ముగ్గురు మూగ,గుడ్డి,చెవిటి  అన్నదమ్ములై పుట్టి భగవంతుని వాక్కును ఉనికిని అపహాస్యంచేయుటవలన పండితులను విమర్శించడం వలన కష్టాలు అనుభవించి  స్వయంభవమూర్తి దర్శనమైన తరువాత శాపవిమోచనం కలుగునని సెలవిచ్చిరి. మరియూ తాను సర్వ శక్తులతో సకలదేవీ దేవతా స్వరూపంతో దత్తాత్రేయుని అవతారం గా కలియుగంలో పీఠికాపురమున జన్మించుదునని చెప్పి అంతర్ధానంచెందిరి.

ఆవిధంగా ఆ ముగ్గురూ ఒక కాణీతో భూమిని కొని సాగుచేయుచండగా దిగుడు బావిలో స్వయంభువ వినాయకుని దర్శనమై శాపవిముక్తులైరి.

ఆ స్వయంభువు వినాయకుని ప్రతిష్ట చేయుటకు ఈ బావా బావమరుదులు విచ్చేసి వరసిధ్ధవినాయుకుడుని కాణిపాకం నందు ప్రతిష్ట చేసిరి‌.

కాలక్రమమున వీరిరువురే శ్రీశైలముల నందు కళలు పునరిద్దించుటకు శక్తిపాతం చెయ్యమని స్వామివారు చెప్పినారు. ఇంకా స్వామివారు చెప్పిన విషయాలతో రేపటి 22బాగం లో తెలుసుకుందాం.

(ఈ భాగం నుంచి  అతి శ్రద్ధగా చదవవలెను. )🙏


*సర్వం శ్రీ పాద వల్లభ చరణారవిందమస్తు🙏*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷

కామెంట్‌లు లేవు: