26, ఆగస్టు 2024, సోమవారం

శ్రీకృష్ణుని గురించి

 *🌹🙏🌹 శ్రీమతే రామానుజాయ 

 నమః. 🌹


🌹. శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం*అనుగ్రహించిన వారు 🌹🙏🌹 శ్రీమాన్ రంగనాధ ఫణిహారం ఆచార్యుల వారు. 🙏*


1. శ్రీకృష్ణుడు 5,246(5121సం||కలియుగాది+ 125సం|| ఆయన జీవితకాలం ) సంవత్సరాల క్రితం అవతరించారు

2. పుట్టిన తేది: ఇది క్రీస్తు శకం ప్రకారం గణిపశక్యం కాని విషయం. ఎందుచేతనంటే క్రీస్తు శకం అనేది 12 నెలలు పూర్తిగా కాలి సంవత్సరం గా పరిణామం చెందటానికి అనేక వందలసంవత్సరాలు పట్టింది. వారి గణన ప్రకారం క్రీస్తు పుట్టినదగ్గరనుండి మరణించే వరకూ సున్నా గా తీసుకుని క్రీస్తు పూర్వం, క్రీస్తు మరణానంతరం అని విభజించారు. అలాంటిది క్రీస్తు జననం మ తంత్రం డిసెంబర్ 25 అని ఎలా నిర్ణయించారో తెలియదు. ఇటువంటి అవకతవకల గణన కృష్ణావతార కాలనిర్ణయానికి తగదు. పైగా సింహమాసంలో బహుళ పక్షంలో అష్టమినాటి అర్థరాత్రి వృషభ లగ్నంలో రోహిణి నక్షత్రంలో చివరి పాదంలో అవతరించినట్లు ప్రమాణమున్నది. అదో జూలై నెలగా ఎలా నిర్ణయించారో తెలియదు.

3. మాసం : శ్రావణం- ఇదో దాక్షిణాత్య చాంద్రమానం. ఔత్తరాహులకు మాసం పూర్ణిమాంతం. అందుచేత వారి భాద్రపదమాసం అవుతుంది. 

4. తిథి: అష్టమి నవమి సంధి కాలం

5 . నక్షత్రం : రోహిణి చివరపాదం చివర్లో అవతారం. 

6. వారం : బుధవారం

7. సమయం : అర్థరాత్రి అని చెప్పబడిఃదే తప్ప 12 గంటలకు అని చెప్పటానికి ప్రమాణం లేదు. 

8 జీవిత కాలం : 125 సంత్సరాల 

9. నిర్యాణం: ఇది భారతంలో కలియుగాదిగా చెప్పబడింది. అందుచేత 🌹నేటికి 5123 సంవత్సరాల పూర్వం. 

10. శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది అనటానికి ప్రమాణం లేదు. 

11 కురుక్షేత్రం జరిగిన 36సం. తరువాత నిర్యాణం అనటానికీ ప్రమాణం లేదు

12. కురుక్షేత్రం క్రీ.పూ. మార్గశీర్ష శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 18రో జులపాటు జరిగింది. . ఆ సమయంలో పూర్ణిమ నాటికి భీష్ముడే సర్వసైన్యాధిపతిగా వున్నాడు. ద్రోణుని సైన్యాధిపత్యంలోనే పద్మవ్యూహం పన్ని అభిమన్యు వధ చేశారు. ఆ మరునాడే జయద్రధ వధ అర్జునుడు చేశాడు. ఆ సమయంలో సుదర్శన చక్రాన్ని లో అందరి కళ్ళు చీకట్లు కమ్మాయి సూర్యాస్తమయ భ్రాంతి కలిగిందే తప్ప గ్రహణం సంభవించలేదు. పూర్ణిమనాడు సూర్యగ్రహణానికి ఆస్కారం లేదు. కేవలం అమావాస్యనాడు మాత్రమే సూర్యగ్రహణం సంభవించడానికి ఆస్కారం వున్నది. యుద్ధం సమయంలో అమావాస్య రాలేదు. కనుక గ్రహణమే అబద్ధం. ఇక గ్రహణాలు నిర్ణయం అనేది భ్రాంతి మాత్రమే.

13. భీష్ముడు ఉత్తరాయణంలో మాఘ శుక్ల అష్టమి నాడు శరీరత్యాగంచేశాడు.

14. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. అవి:

మధురలో కన్నయ్య

ఒడిశాలో జగన్నాధ్

మహారాష్ట్ర లో విఠల (విఠోబ)

రాజస్తాన్ లో శ్రీనాధుడు

గుజరాత్ లో ద్వారకాధీశుడు & రణ్ ఛోడ్

ఉడిపి, కర్ణాటకలో కృష్ణ, ఆంధ్ర దేశంలో వేణుగోపాలుడు, తమిళ దేశాన -పార్థసారధి, రాజగోపాలుడు, కణ్ణన్ అంటారు. కేరళలో గురువాయూర్ అప్పన్ అంటారు. 


15. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు

16. జన్మనిచ్చిన తల్లి దేవకీ

17. పెంచిన తండ్రి నందుడు

18. పెంచిన తల్లి యశోద

19. సవతి సోదరులు- బలరాముడు, సాత్యకి గదుడు, మొదలైనవారు 

20. సవతిసోదరి సుభద్ర,

21. జన్మ స్థలం మధుర

22. భార్యలు : నీళాదేవి,(ఇతిహాసమైన భారతంలోని ఖిలభాగమైన హరివంశం ప్రమాణం)రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్ష్మణ, ఇంకా 16100 మంది రాచకన్నెలు(నరకుని చెరలోని వారు)

23. శ్రీ కృష్ణుడు తన అవతారకాలంలో అనేక మంది రాక్షసులను హతమార్చినట్టు సమాచారం. ఛాణూరుడు - కుస్తీదారు

కంసుడు - మేనమామ

శిశుపాలుడు మరియు దంతవక్ర - అత్త కొడుకులు, నరకాసురుడు-భూదేవి కుమారుడు, మురాసురుడు- నరకుని సైన్యాధిపతి, పంచజనుడనే రాక్షసుడు- సముద్రంలో వుండేవాడు), అఘాసురుడు, బకాసురుడు, పూతన, శకటాసురుడు,తృణావర్తుడు, ధేనుకాసురుడు, కపిద్థాసురుడు, కేశి, కాళీయుని గర్వం అణచబడింది. 

24. శ్రీకృష్ణుని తల్లి వృష్ణి వంశీకుడైన ఉగ్రసేనుని కూతురు వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు. వారిది కులాంతర వివాహం కాదు. 

25. శ్రీ కృష్ణుడు చామనఛాయ కలిగిన శరీరముతో పుట్టాడు. ఆయనకు యాదవ్ వంశీ పురోహితుడైన గర్గమహర్షి నామకరణ చేశాడు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. తన బాల్యమంతా పోరాటాలతో సాగింది. 

26. కరువు, రాక్షసుడు వలన శ్రీకృష్ణుని 3 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది. 

27 12 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 12 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.

28. తను మళ్ళీ ఎప్పుడు బృందావనానికి తిరిగి రాలేదు.

29.జరాసంధుని వలన ప్రజలకు ముప్పు వున్నందున మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది. కాలయవన అనే రాక్షసరాజు ను ముచికుందుడనే రాజర్షి ద్వారా సంహరింపజేశాడు. 30. వైనతేయుడు గరుత్మంతుడు ఆయన శ్రీకృష్ణుని వాహనం. ఆటవికులు కాదు. జరాసందుడిని భీముని ద్వారా నేటి బీహార్ ప్రాంతంలో సంహరింపజేశాడు.

31. శ్రీకృష్ణుడు ద్వారక ను నిర్మించాడే తప్ప పునర్నిర్మాణం చేయలేదు. 

32. విద్యాభ్యాసం కొరకు 12 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను.

33. గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద వరుణుని వద్దనుండి సముద్రంలో మునిగిపోయిన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపడెను.

34. పాండవుల వనవాసములో లక్క ఇంటి నుంచి కాపాడినది విదురుడు. శ్రీకృష్ణుడు కాదు ద్రౌపది ద్రుపదరాజపుత్రి శ్రీకృష్ణుని సోదరి కాదు తన సోదరి అయిన సుభద్రను అర్జునునికి ఇచ్చి పెండ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను.

35. పాండవులకు తోడుగ నిలిచి ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్తాపింపజేసెను.

36. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను.

37. పాండవులకు పరోక్షంగా తోడుగా నిలిచారు.

38. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను.

39 ద్వారక నగరము కృష్ణుని నిర్యాణానంతరము ఒక వారం తరువాత నీట మునిగింది.  

40. అడవిలో జర అను వేటగాడి బాణముచేత శ్రీకృష్ణుని పాదమందు దెబ్బతగిలింది.

41. శ్రీకృష్ణుడు అనేక అద్భుతాలు చేశాడు. జీవితములో ఒక్క క్షణం కూడా సంఘర్షణకు లోను కాకుండా ప్రశాంతముగానే వున్నాడు. ఆయన నిర్వికారుడు. . జీవితపు ప్రతీ మలుపులో అనేక సంఘర్షణలను ఎలా ఎదుర్కోవాలో మనకి నేర్పాడు

43. జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి / ఎవరికీ అంకితమవ్వలేదు.

అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తాను ఎపుడు నిమిత్తం కారణంగానే నిలిచారు  

44. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఆదర్శం. అర్థం చేసుకుంటే అదొక మహా సముద్రం.

కామెంట్‌లు లేవు: