శు భో ద యం 🙏
పోతన పద్యం విశిష్టత!!
మనం మామూలుగా చెప్పుకునే అర్ధంవెనుక మరో అర్ధంఉందట వినండి!
ఆహా!!!యనక మానరు!!
"అమృతమహాంబురాసి తెలు
గై మఱి భాగవతమ్మునై త్రిలిం/
గమునకుడిగ్గెనేమొయనఁగా హృదయమ్ములనాడ నేడునా/
ట్యములొనరించుపోతనమహాకవి ముద్దులపద్యముల్ శతా/
బ్దము లయిపోవుగాకమఱవన్ తరమే రసికప్రజాళికిన్"-అంటాడు దాశరధి.
(సుధా సముద్రమే తెలుగుగా అందునా భాగవతమ్మగా ఈ దేశములో నవతరించినది కాబోలును!
నాటినుండి నేటి వరకు మన ఎదలందు సతతం కదలాడు
పోతన మహాకవీంద్రుని ముద్దులు మూటగట్టు పద్యములు ఎన్నితరములు
గడిచిపోయినను రసజ్ఞులగు
నాంధ్రులు మరచిపోవుట జరుగునా?)
నిజమేగదా! ఆమహనీయునకు మనః పూర్వక నమస్సులు!!
స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి