19, సెప్టెంబర్ 2025, శుక్రవారం

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - వర్ష ఋతువు - భాద్రపద మాసం - కృష్ణ పక్షం -‌ త్రయోదశి - ఆశ్రేష/ మఘా -‌‌ భృగు వాసరే* (19.09.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

18, సెప్టెంబర్ 2025, గురువారం

గురువారం🪷* *🌹18సెప్టెంబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      *🪷గురువారం🪷*

 *🌹18సెప్టెంబర్2025🌹*

    *దృగ్గణిత పంచాంగం*                 

  

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః*

*భాద్రపద మాసం - కృష్ణపక్షం*


*తిథి  : ద్వాదశి* రా 11.24 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం    : గురువారం* ( బృహస్పతివాసరే )

*నక్షత్రం   : పుష్యమి* ఉ 06.32 వరకు ఉపరి *ఆశ్లేష*

*యోగం : శివ* రా 09.37 వరకు ఉపరి *సిద్ధ*

*కరణం  : కౌలువ* ప 11.27 *తైతుల* రా 11.24 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు:* 

*ఉ 11.00 - 12.00 సా 04.00 - 06.00*

అమృత కాలం  : *ఈరోజు లేదు*

అభిజిత్ కాలం  : *ప 11.37 - 12.26*

*వర్జ్యం      : రా 07.38 - 09.16*

*దుర్ముహూర్తం  : ఉ 10.00 - 10.48 మ 02.52 - 03.41*

*రాహు కాలం   : మ 01.33 - 03.04*

గుళికకాళం       : *ఉ 08.59 - 10.30*

యమగండం     : *ఉ 05.56 - 07.27*

సూర్యరాశి : *కన్య*                   

చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 06.05*

సూర్యాస్తమయం :*సా 06.16*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.56 - 08.22*

సంగవ కాలం         :     *08.22 - 10.48*

మధ్యాహ్న కాలం    :     *10.48 - 01.14*

అపరాహ్న కాలం    : *మ 01.14 - 03.41*


*ఆబ్ధికం తిధి         : భాద్రపద బహుళ ద్వాదశి*

సాయంకాలం        :*సా 03.41 - 06.07*

ప్రదోష కాలం         :  *సా 06.07 - 08.29*

రాత్రి కాలం           :*రా 08.29 - 11.38*

నిశీధి కాలం          :*రా 11.38 - 12.25*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.09*

++++++++++++++++++++++++++

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీదత్త నవరత్నమాలికా స్తోత్రం*


*రాగమోహముఖ* 

*వైరినివృత్త్యై*  

*దత్తదేవమనిశం* 

*కలయామి ॥*


*ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

అమావాస్యావిశేషః

 అమావాస్యావిశేషః


75. శ్లో॥ అమావాస్యా దినే ప్రాస్తే గృహద్వారం సమాశ్రితాః । వాయుభూతాః ప్రపశ్యన్తి శ్రాద్ధం వైపితరో నృణామ్ | యావదస్తమయం భానోః క్షుత్పిపాసా సమాకులాః । తతశ్చాస్తంగతే భానౌ నిరాశా దుఃఖ సంయుతాః | నిఃశ్వస్య సుచిరం యాన్తి గర్హయన్తః స్వవంశజమ్ | జలేనా2 పి చ నశ్రాద్ధం శాకేనాపి కరోతియః । అమాయాం పితరస్తస్య శాపందత్వా ప్రయాన్తి చ ॥“కూర్మపురాణే”


భావము :- అమావాస్య దినము పితృదేవతలకు ప్రీతికరము. ఆ రోజున


వాయురూపములో వారు వారి కుమారుల ఇంటి ద్వారము వద్ద ఉండి శ్రాద్ధమును, మా పుత్రులు ఆచరించుచున్నారా యని గమనిస్తూ ఉందురు. సాయంత్రము వరకు శ్రాద్ధముగానీ, ఆమద్రవ్య సమర్పణగానీ, తిలతర్పణకానీ చేయనిచో, ఆకలి దప్పికలతో నిరాశతో వెడలిపోవుచూ మన వంశమందు ఇట్టి వ్యర్థులు జన్మించిరి అని నిట్టూర్పు విడచి వీరు అభివృద్ధికి రాకుండుదురుగాక అని శాపమిచ్చి నిరాశతో వెళ్ళిపోయెదరు. - కావున అమావాస్యనాడు పితృప్రీతిగా కనీసము తిలతర్పణయైననూ చేసి తీరవలెను.

కంపవాతము ( parkinsonism

 కంపవాతము ( parkinsonism ) రావడానికి గల కారణాలు - లక్షణాలు . 


    ఆయుర్వేద శాస్త్రం నందు పార్కిన్సన్స్ వ్యాధిని కంపవాతం అని అంటారు. ఈ వ్యాధి పుర్తిగా నరములకు సంబంధించిన వ్యాది. మెదడులో "డోపమైన్ " , నార్ - ఎపినెఫ్రిన్ , సిరోటినిన్ , ఎసిటైల్ కొలిన్ , కొలిస్ట్ స్టాకిన్ -8 , సబ్ స్టెన్సు -p మెటాక్ ఫాలిన్ మరియు ల్యూ ఎన్ ఏ ఫాలిన్ మొదలయిన హార్మోన్స్ అస్తవ్యస్తంగా తయారు అవుతాయి. దీని పరిణామమే పార్కిన్సన్ వ్యాది. దీనితో పాటు మెదడు వాపు , మెదడులో గడ్డలు ఏర్పడటం , మెదడుకు రక్తప్రసరణ లోపించడంతో పాటు కార్బన్ మోనాక్సయిడ్ పాయిజనింగ్ లు కూడా కారణాలుగా గమనించాలి . ఇది వాతప్రకోప వ్యాధిగా ఆయుర్వేదం నందు చెప్పబడినది. 


  ఈ వ్యాధి లక్షణాలు - 


 * కంపవాతం నందు వణుకు విచిత్రముగా ఉంటుంది. వణుకు చేతుల్లో మొదలు అవుతుంది. 


 * పనిచేస్తున్నప్పుడు వణుకు ఉండదు. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే వణుకు ఉంటుంది.


 * కండరాలు బలహీనత పడతాయి. కండరాలు బిగదీసినట్టుగా ఉంటాయి. 


 * ఒళ్ళు తూలుతుంది . నడిచేప్పుడు వంగి నడుస్తారు. చేతులతో పాటు , పెదవులు , మెడకండరాలు , తల కూడా వణుకుతుంది.


 * నోటి నుంచి చొంగ కారుతుంది. 


 * కంటిచూపు కొంచం తీక్షణంగా ఉంటుంది. 

 

 * రోగి మానసికంగా కృంగిపోతాడు . 

  

గమనిక - మొదట చేతులు వణకడంతో ప్రారంభం అయిన వ్యాధి సరైన చికిత్స తీసుకోకపోవడం మూలాన ఎక్కువ అయ్యాక పైన చెప్పిన లక్షణాలు ఒక్కొక్కటిగా మొదలవుతాయి. 

   

. దీనికి చికిత్స కొరకు ప్రత్యేక ఔషదాలు ఉపయోగించవలసిందే ...ఆయుర్వేదం నందు స్వర్ణభస్మం వంటి భస్మాలతో వైద్యం చేస్తూ ఆహార విషయంలో వాతం కలిగించే ఆహారం తీసుకోకుండా కఠిన పథ్యం పాటిస్తే తప్పకుండా వ్యాధి నయం అవుతుంది. దీర్ఘకాలిక చికిత్స అవసరం అవుతుంది. 


 మరింత విలువైన సమాచారం, సంపూర్ణ వివరణ మరియు అనేక రకాలైన వ్యాధులకు అతి సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034

17, సెప్టెంబర్ 2025, బుధవారం

బుధవారం🌷* *🪷17సెప్టెంబర్2025🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🌷బుధవారం🌷*

 *🪷17సెప్టెంబర్2025🪷*        

    *దృగ్గణిత పంచాంగం*                


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః*

*భాద్రపద మాసం - కృష్ణపక్షం*


*తిథి  : ఏకాదశి* రా 11.39 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం    : బుధవారం* ( సౌమ్యవాసరే )

*నక్షత్రం   : పునర్వసు* ఉ 06.26 వరకు ఉపరి *పుష్యమి*


         *ఈనాటి పర్వం*  

         *ఇందిరైకాదశి* 

      *కన్యా సంక్రమణం*


*యోగం : పరిఘ* రా 10.55 వరకు ఉపరి *శివ*

*కరణం  : బవ* ప 11.57 *బాలువ* రా 11.39 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు:* *ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00*

అమృత కాలం  : *రా 12.06 - 01.43*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం      : మ 02.28 - 04.04*

*దుర్ముహూర్తం  : ప 11.37 - 12.26*

*రాహు కాలం   : మ 12.02 - 01.33*

గుళికకాళం       : *ఉ 10.30 - 12.02*

యమగండం     : *ఉ 07.27 - 08.59*

సూర్యరాశి : *కన్య* 

చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 06.04*

సూర్యాస్తమయం :*సా 06.17*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.56 - 08.22*

సంగవ కాలం         :     *08.22 - 10.49*

మధ్యాహ్న కాలం    :     *10.49 - 01.15*

అపరాహ్న కాలం    : *మ 01.15 - 03.41*

*ఆబ్ధికం తిధి         : భాద్రపద బహుళ ఏకాదశి*

సాయంకాలం        :*సా 03.41 - 06.08*

ప్రదోష కాలం         :  *సా 06.08 - 08.29*

రాత్రి కాలం           :*రా 08.29 - 11.38*

నిశీధి కాలం          :*రా 11.38 - 12.25*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.09*

==========================

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌷శ్రీ సరస్వతీ కవచం🌷*


*ఓం సర్వ వర్ణాత్మికాయై* 

*స్వాహా పాదయుగ్మం* 

*సదాఽవతు |*


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🪷🪷🍃🌷

    🌹🌷🪷🌷🪷🌷🌹

కాశీ వెళ్లాలనుకునే kaasi yaatra

 ఈ మెసేజ్ మీకు అవసరం లేకపోవచ్చు. కాశీ వెళ్లాలనుకునే పేద భక్తులకు ఉపయోగ పడుతుంది.ఈ మెసేజ్ మీకు తెలిసిన వారికి పంపించండి.


సనాతన ధర్మంలో తీర్థ యా త్రలు కూడా ఒక భాగం.


ప్రతి హిందు వు జీవితంలో ఒక్కసారి అయినా కాశీ మహాక్షేత్రాన్ని దర్శించాలని కోరుకుంటాడు. 


   3 వేలకే 10 రోజులు కాశి యాత్ర.   

               (9రాత్రులు కాశీ వాసం)

తల్లి గర్భం లో 9నెలలు ఉన్నట్లు, 9 రోజులు, 9నెలలు, 9సంవత్సరాలు, కాశీలో నివాసం ఉంటే, మరొక జన్మ లేకుండా మోక్షం ప్రసాదిస్తాడు కాశీ విశ్వనాధుడు.


అతి సామాన్యుల కూడా మోక్షాన్ని ప్రసాదించే కాశీ మహా క్షేత్రాన్ని దర్శింప చేయాలని 3 వేల రూపాయల కే 10 రోజులు కాశీ యాత్ర ను అందిస్తున్నారు.కాశీ శ్రీకంఠ బాబాజీ వారు.


ఇప్పటివరకు సుమారు వేల మందినీ కాశీ మహా క్షేత్రాన్ని దర్శింపజేశారు శ్రీకంఠ బాబాజీ వారు 


ప్రతి బుధ, గురు , శుక్ర, శని వారాల్లో 

3వేల రూపాయలు యాత్ర కలదు.

మొదటి బ్యాచ్ నవంబర్ 15 మొదలు


ఈ యాత్రకు రాదలచిన వారు 70 రోజులు 

ముందుగా డబ్బు చెల్లించి టికెట్ బుక్ చేసుకోవలెను.


ఈ యాత్ర లో కల్పించు సౌకర్యాలు  


1. చెన్నై,.. విజయవాడ, విశాఖపట్నం, గుంతకల్ , సికింద్రాబాద్, వరంగల్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లలో ఎక్కడ నుండైనా రానుపోను స్లీపర్ టికెట్లు ఇవ్వబడును.

2. కాశీ రైల్వే స్టేషన్ నుండి వసతి గృహానికి,

 రాను, పోను ఆటో ఛార్జీలు.

3. కాశీ లో 10 రోజులు వసతి, కామన్ హాల్ ,నేల పై పడుకొనుటకు చాపలు ఇవ్వబడును, 

4. కాశీలో 10 రోజులు సత్రం లో మధ్యాహ్నం భోజనం, రాత్రి ఫలహారం ఇవ్వబడును.

5. తిరుగు ప్రయాణంలో పులిహర, 

దద్దోజనం పాకెట్స్ ఇవ్వబడును. (రైల్లో తినడానికి)

6. కాశీ వెళ్ళే టప్పుడు రైల్లో ఎవరి భోజనం వారే 

ఏర్పాటు చేసు కొన వలెను.

7. లోకల్ సైట్ సీయింగ్, ఆటో,రిక్షాలు, గుడి దర్శనం ఖర్చులు,పితృ కార్యాల, ఇతర ఖర్చులు భక్తులే తీసుకున వలెను.

8. Ac రైలు టికెట్లు, ఏసీ,నాన్ ఏసీ, రూమ్ లు, కావలసిన వారు తగిన సొమ్ము చెల్లించి బుక్ చేసుకొనవచ్చును.

9.మేము ఇచ్చిన టికెట్ దగ్గర పెట్టుకుని మీరే ట్రైన్ ఎక్కి , కాశీ లో దిగి వలెను. కాశీ రైల్వే స్టేషన్ నుండి మావాళ్ళు మిమ్ములను పికప్ చేసుకుని మన ఆశ్రమానికి తీసుకొని వస్తారు.


పూర్తి వివరాలకు..98663 77208___ (పోన్ పే, గూగుల్ పే) 

                            70751 69635 లకు కు పోన్ చేయండి.

15, సెప్టెంబర్ 2025, సోమవారం

శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి జయంతి

 ✒️💐తెలుగు కవి, అవధాని, నాటకకర్త. తెలుగులో అవధాన విద్యకు రూపురేఖలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులలో ఒకరు శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారి జయంతి సందర్భంగా💐✒️


*జెండాపై కపిరాజు….బావ ఎప్పుడు వచ్చితీవు… అదిగో ద్వారక… అయినను పోయి రావలె హస్తినకు… వంటి నాటక పద్యాలు వినని తెలుగువారు ఉండరు.* తిరుపతి వేంకట కవుల కలంనుంచి జాలువారిన పాండవోద్యోగ విజయాలు నాటకంలోనివి అవి. తెలుగుభాష పదభూయిష్ఠమై నారికేళప్రాయంగా ఉన్న రోజుల్లో అలతి, అలతి పదాలతో పద్యాలు చెప్పి, రచనలుచేసి సామాన్యులకూ తెలుగు భాషా సాహిత్యం పట్ల మోజుపెంచిన కవితామూర్తులు వీరు........


*ఉత్తమమైన కవిత్వం అలవడితే సామ్రాజ్యాలను ఆశించవలసిన పనిలేదని సంస్కృతంలో ఒక సూక్తి ఉంది. సాహిత్యం ఒక విశాల సామ్రాజ్యం. దానికి అధినేత మహాకవి. భారతీయ వాంగ్మయంలో ఎందరో సాహితీ సామ్రాజ్య చక్రవర్తులు ఉన్నారు. తెలుగు కవిత్వాన్ని ఊరూరా, వాడవాడలా ఊరేగించి తెలుగు పద్యానికి పట్టాభిషేకం చేయించిన జంట కవిరాజులు- తిరుపతి వేంకట కవులు దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వేంకట కవి. చెళ్లపిళ్లవారు తిరుపతి శాస్త్రి కన్నా వయసులో ఏడాది పెద్ద అయినా వారు పరమపదించిన తరవాత మూడు దశాబ్దాలు జీవించారు.*


*#ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తొలి ఆస్థానకవి.*


‘కవనార్థంబుదయించితిన్, సుకవితా కార్యంబు నా వృత్తి’ అని చెప్పుకున్నాడు చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి. చెప్పినట్లుగానే తెలుగునాట కవితా కల్యాణం చేయించి, జీవితాన్ని తరింపజేసుకున్న మహాకవి చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి.

ఈయన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తొలి ఆస్థానకవి. 1949లో, సాక్షాత్తు ప్రభుత్వ యంత్రాంగం మద్రాస్‌ నుండి తరలి విజయవాడ వచ్చి, ఈ పదవిని అందించింది. అంతటి ఘన చరిత్ర చెళ్లపిళ్లది.


400 లకుపైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన చెళ్లపిళ్ల సత్యం గారి ముత్తాతగారే చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి.


ఆ కాలంలోనూ చెళ్లపిళ్లవారి రచనా వ్యాసంగం తిరుపతి వేంకటీయంగానే సాగింది. అవధానాల రూపంలో ఈ జంట కవులు పద్యకవిత్వాన్ని ప్రదర్శనాత్మకమైన కళగా ప్రాచుర్యంలోకి తెచ్చారు.


*#కవులకు మీసాలెందుకని......*


తిరుపతి వేంకట కవులు మీసాలు పెంచారు. అదీగాక, కవులకు మీసాలెందుకని ఎవరో అధిక్షేపించినపుడు, సంస్కృతంలోనూ, తెలుగులోనూ తమను మించిన కవులు లేరని సవాలు చేస్తూ, మీసాలు ఎందుకు పెంచారో, వారి పద్యంలోనే విందాం!


దోసమటం బెరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీ,

మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా

రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ

మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే.


*#అష్టావధాన, శతావధానాలు:*


తెలుగు నేలపై సంచారం చేస్తూ అష్టావధాన, శతావధానాలు నిర్వహించారు. తెలుగునాట వీరు దర్శించని రాజాస్థానాలు లేవు. కాలుమోపని నగరాలు, గ్రామాలు లేవు. ఈ కవుల ‘పాండవోద్యోగ విజయాలు’ నాటకం పేరు చెప్పగానే తెలుగువారు ఆత్మీయంగా పులకరిస్తారు. ఈ నాటక పద్యాలు పండిత, పామరుల నాలుకపై నర్తిస్తాయి. వీరిద్దరూ చర్ల బ్రహ్మయ్య శాస్త్రి శిష్యులు. వీరు మహాకవులు, బహు గ్రంథకర్తలు, శాస్త్రద్రష్టలు,తాత్త్వికులు, లోకజ్ఞులు.


*#బాల్యం-ఉద్యోగం:*


వేంకటశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా కడియంలో 8-8-1870న జన్మించారు. తల్లిదండ్రులు చంద్రమ్మ, కామయ్యలు. వీరికి తల్లిదండ్రులు పెట్టిన మొదటి పేరు వేంకటాచలం. బాల్యంలో బడికి వెళ్లకుండా తోటి పిల్లలతో గోళీలు, కోతి కొమ్మచ్చి ఆడుకుంటూ విచ్చలవిడిగా తిరిగినా, కాలక్రమంలో బుద్ధి కలిగి ఏళ్లలో నేర్వదగిన విద్య నెలల్లో ఆర్జించారు. ‘శాస్త్రి సామాన్యం ఎత్తు, చామనఛాయ, బహు చురుకైన మొహం, పిల్ల జుట్టు, కంచు గంట లాంటి గొంతుక, పండిత శాలువా పైనవేసుకొని, పంచ ధరించేవారు. చేతనున్న బంగారు కడియం కవితా దిగ్విజయాన్ని సూచిస్తుంది. తిరుపతి శాస్త్రి గారిది కవితాధారణ అయితే, చెళ్లపిళ్లవారిని లౌక్య ప్రజ్ఞకు ప్రసిద్ధులుగా చెబుతారు. తిరుపతి శాస్త్రి గారిది సంస్కృత ప్రకర్ష అని, వేంకట శాస్త్రి గారి కవిత్వంలో తెనుగుదనం జాస్తి అని వారిని బాగా తెలిసినవారు చెబుతారు.


 వేంకట కవి బందరు హిందూ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పని చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో వీరిని సత్కరించింది.


*#కంచు కంఠం:*


‘కవనార్థంబుదయించితిన్‌ సుకవితా కావ్యంబె నా వృత్తి’ అని చెప్పుకొన్నారు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి. పద్య పఠనంలో ఆయనది ఒక కొత్త తీరు. ఆయనలా పద్యాలు చదవాలని ఎందరో ప్రయత్నించినా, ఆ కంచు కంఠం అందరికీ రాదు కదా. ప్రతి విషయంలో తనదొక ప్రత్యేకత అన్నట్టు వేంకటశాస్త్రి వ్యవహరించేవారు.


చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి అనంత ప్రతిభామూర్తి. అద్భుతమైన ధారణ ఈయన సొత్తు. పద్య పఠనం పరమాద్భుతం. సంగీతజ్ఞానం కూడా మెండుగా ఉండేది. పద్యం ఎత్తుకోగానే అనేక రాగాలు అవలీలగా వచ్చి చేరేవి. శ్రీ రాగంలో ఎక్కువగా పాడేవారని చెబుతారు. ఉపన్యాసాలు సురగంగా ప్రవాహాలు. సందర్భోచితమైన శ్లోకాలు, పద్యాలు, పిట్టకథలు, సామెతలతో చెళ్లపిళ్ల ప్రసంగం చేస్తుంటే.. ప్రేక్షకులు మంత్రముగ్ధులై పరవశించేవారు.


*#శతకంల రచన:*


 ఆయన కామేశ్వరి శతకం, ఆరోగ్య కామేశ్వరి శతకం రచించారు. తన కుమారుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు కామేశ్వరీ దేవిని ప్రార్థిస్తూ వీరు రాసిన ఆరోగ్య కామేశ్వరి శతకంలో స్వవిషయాలు, తిరుపతి కవి గురించిన పద్యాలు ఉన్నాయి. అనంతర కాలంలో వెలువడిన ఆరోగ్య శతకాలకు వీరి శతకం మార్గదర్శనమైంది. తాను వ్రణంతో బాధపడుతున్నప్పుడు శారీరక బాధను, మానసిక వేదనను కామేశ్వరి శతకంలో దేవికి విన్నవించుకున్నారు.


*#గొప్ప వక్త.:*


వేంకటశాస్త్రి గొప్ప వక్త. అమిత భాషి. యౌవనంలో ఆయన ఉపన్యాస వాణి మేజువాణి. షష్టిపూర్తి తరవాతా వారి కంఠంలో ఝంకారం, మాధుర్యం తగ్గలేదు. ఆయనది శాఖాచంక్రమణం. అనేక విషయాల్లోకి చొచ్చుకుపోయేవారు. పద్యాలను, పిట్ట కథలను, సంఘటనలను, గానాన్ని, హాస్యాన్ని మేళవించి పంచామృతంగా ఉపన్యాసం అందించేవారు. ఏం మాట్లాడినా అది ధ్వని కావ్యం.

‘మంచి కవిత్వం అంటే ఏమిటి’ అనే అంశంపై  విశాఖపట్నంలో రాజా విక్రమదేవ వర్మ ఇంట్లో, చెళ్లపిళ్ల 5 గంటలపాటు అనర్గళమైన ప్రసంగం చేశారు. ఆద్యంతం నాటకీయ ఫక్కీలో సాగిన ఆ ప్రసంగం అనన్య సామాన్యం. దీనికి ప్రత్యక్ష సాక్షి శ్రీశ్రీ. అద్భుతమైన ప్రసంగాన్ని అందించడంతో పాటు, విక్రమదేవ వర్మ నుండి చెళ్లపిళ్ల మూడువేల రూపాయలు కూడా అందుకున్నారు. ఆ రోజుల్లో మూడువేలంటే, ఈరోజుల్లో లక్షలు. 


*#శిష్యగణం:*


వేంకట కవికి గణనీయమైన గొప్ప శిష్యగణం ఉంది. ఆయన బందరు పర్రల్లో కవుల్ని సృష్టించారని ఆ రోజుల్లో చెప్పుకొనేవారు. పింగళి, కాటూరి, వేటూరి శివరామశాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ వంటి వీరి శిష్యులు విద్వత్‌ కవులుగా వాసికెక్కారు. పింగళి, కాటూరి కవులు తమ సౌందరనంద కావ్యాన్ని చెళ్లపిళ్ల వారి షష్టిపూర్తి సందర్భంలో సమర్పిస్తూ వారిని ‘అద్యతనాంధ్ర కవి ప్రపంచ నిర్మాత’గా సంభావించారు.


శాస్త్రి గ్రాంథిక భాషా కవిత్వంలో పుట్టి పెరిగినా, చివరి దశలో వ్యావహారిక భాషను ఆదరించారు. వచనంలోనూ అమూల్యమైన రచన చేశారు. కృష్ణా పత్రికలో ప్రచురితమైన వారి కథలు, గాథలు మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. అవి తెలుగు భాషా సాహిత్యాలకు విజ్ఞాన సర్వస్వాలు. వ్యావహారిక భాషా సౌందర్యానికి తరగని గనులు. 


*#అమ్మా! సరస్వతీదేవీ, కేవలం నీ దయవలనే.....*


అమ్మా! సరస్వతీదేవీ, కేవలం నీ దయవలనే మేము ఎన్నో సన్మానాలు అందుకొన్నాము అని చెప్పిన ఈ క్రింది పద్యాన్ని తిలకించండి, వారి వినయ విధేయతలు, కూడా ద్యోతకమవుతాయి.


ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము, స

న్మానము లందినాము, బహుమానములన్ గ్రహియించినార, మె

వ్వానిని లెక్క పెట్టక నవారణ దిగ్విజయంబొనర్చి ప్ర

జ్ఞా నిధులంచు బేరు గొనినాము, నీ వలనన్ సరస్వతీ!


*#కాశీయాత్ర:*


వారి ‘కాశీయాత్ర’ యాత్రా సాహిత్యంలో విశిష్టమైనది. ఆధునిక, సాంఘిక చరిత్రకు విలువైన ఆధార గ్రంథం. ఆనాటి ఉత్తర హిందూస్థానం విశేషాలు, నాటి సామాజిక పరిస్థితులు ఈ గ్రంథంలో చూడవచ్చు. 


*#మానవతావాది:*


చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు గొప్ప మానవతావాది. వీరు కవికోకిల శ్రీ జాషువా గారి పాదాలు కడిగి, వారికి కాలికి గండపెండేరం తొడిగి, ఇలా అన్నారు--- "ఈ మహాకవి పాదాలు తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను"


*#పాండవ ఉద్యోగ విజయాలు:*


పాండవ ఉద్యోగ విజయాలు అజరామరమైన ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఎందరో పద్యనటులు తెలుగునేలపై పుట్టుకువచ్చారు. ఎందరో కళాకారులకు అన్నం పెట్టి, అనంతమైన ఖ్యాతిని అందించిన ఆధునిక పద్యనాటక రాజాలు ఈ పాండవ ఉద్యోగ విజయాలు. సంప్రదాయ పద్య కవిత్వ ప్రక్రియలోనే, భారత కథలను వాడుకభాషలో రాసి, వాడుకభాషను శిఖరంపై  కూర్చోపెట్టిన ఘనత వీరిదే

సాహితీవేత్త మోదుగుల రవికృష్ణ ఈ నాటకాల విజయాన్ని గురించి చెప్తూ “పాండవోద్యోగ విజయాల ప్రదర్శన జరగని ఊరు ఆంధ్రదేశంలో లేదంటే అతిశయోక్తి కాదని” పేర్కొన్నారు. వాటిలో వారు రాసిన పద్యాలు జాతీయాలుగా నిలిచిపోయాయి. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో “అయినను పోయి రావలె హస్తినకు” వంటివి ప్రముఖ ప్రయోగాలుగా, నిలిచిపోయాయి.


#వారి నాటకాల ద్వారా అనేక మంది నటులు ప్రఖ్యాతమైన పేరు తెచ్చుకున్నారు. వారిలో ముఖ్యులు, బందా, అద్దంకి, సి.యస్.ఆర్. రఘురామయ్య, పీసపాటి, షణ్ముఖి, ఏ. వి. సుబ్బారావు, మాధవపెద్ది మున్నగు వారు. ప్రస్తుతం గుమ్మడి గోపాలకృష్ణగారు, ఎ.వెంకటేశ్వరరావు గారు మొదలైన వారు వీరి నాటకాన్ని తన చక్కని గాత్రంతో, హావ భావాలతో అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు.

80వ పడిలో 1950 ఫిబ్రవరి15న శివైక్యం  పొందారు వేంకటశాస్త్రి.

*బావా ఎప్పుడు వచ్చితీవు, చెల్లియో చెల్లకో, జెండాపై కపిరాజు, అలుగుటయే యెరుంగని... లాంటి పద్యాలు తెలుగు వారి చెవుల్లో ప్రతిధ్వనిస్తునే ఉంటాయి.*

🙏🙏🏵️🌷🌸🙏🙏

Collected by 

Dr.A.Srinivasa Reddy

9912731022

Zphs Munugodu Amaravathi mandal Palanadu district.

పోతన పాత్ర చిత్రణ



పోతన పాత్ర చిత్రణ 


                    ఉ: కాటుక కంటినీరు చనుగట్ల పయింబడ నేలయేడ్చెదో?


                          కైటభ దైత్య మర్దనుని గాదిలి కోడల! యోమదంబ! యో


                         హాటకగర్భురాణి! నిను నాకటికైఁ గొనిపోయి యల్ల క


                         ర్ణాట కిరాట కీచకులకమ్మ ;త్రిశుధ్ధిగ నమ్ము; భారతీ!


                                        -- చాటువు ;


                 ఉ: కోపము తోడ నీవు దధి భాండము భిన్నము సేయుచున్నచో


                        గోపిక త్రాటఁగట్టిన వికుంచిత సాంజన భాష్ప తోయ ధా


                        రా పరిపూర్ణ వక్త్రముఁ గరంబులఁ బ్రాముచు వెచ్చనూర్చుచుం


                      బాపఁడవై నటించుట గృపాపర ! నామదిఁ జోద్యమయ్యెడిన్ ;


                                        భాగ-ప్రథ-స్కం: 181 పద్యం: కుంతి కృష్ణుని స్తుతించుట;


                                          ఆంధ్ర సాహిత్య క్షేత్రాన్నలంకరించిన కవితల్లజులలో పాత్ర చిత్రణ విషయమున కవులందరు నొకయెత్తు. బమ్మెరపోతన యొకయెత్తు. అతడుచిత్రించిన పాత్రలన్నియు శబ్దచిత్రములే! కానీ,అందుకొన్ని నిశ్చలనములు, మరికొన్ని చలనములు.

ఆపాత్రలు పోతనగారితో మాటగలిపిమాటాడినవే! మనకుగూడ నట్టి మనః పరిణామము గల్గినచో నవిమనతోగూడ మాటాడగలవు.

"పాత్రకు తగిన యాకారము. ఆకారమునకు దగిన ఆహార్యము. ఆహార్యమునకుదగినఅలంకారములు.వానికితగినమాటలు .మాటలకు దగిన చక్కనిపదములబంధములు, పోతన పాత్రచిత్రణలోని విశేషములు.


                                        పైరెండుపద్యములలో మొదటిది పోతన సరస్వతి నోదార్చుట. ధనముపై నాశతో భాగవత గ్రంధమును నరాంకిత మొనరించునేమోనని యనుమానమంది చదువులతల్లి దీనవదనయై కన్నులనీరుగార దేవతార్చనా పీఠమున నున్నపోతనకన్నుల

కగుపించినదట! పోతనయామెరూపమును గాంచి నివ్వెరపోయెను,." అమ్మా! సరస్వతీమాతా! కాటుక తో దిగజారు కన్నీరు వక్షోజములపై బడగా నేలనమ్మా విలపింతువు? ఓహో! ధనాశతో నిన్నముకొందుననియా నీవిచారము. అటులెన్నటికి జరుగదు. త్రికరణ శధ్ధిగా జెప్పునామాటను నమ్ము. మనుట"-. ఇది నిశ్చలన చిత్రమే! ,ఆజగదంబ కన్నులనీరుగార్చుట. కన్నులకున్న కాటుక కరగి కన్నీట గలసి చనుగట్లపై బడుట. ఆహా! ఏమాచిత్రణము! మనోముకురమున గాంచగల్గినవాని జీవితము ధన్యము!!


                                   ఇఁక రెండవ చిత్రము చలనము. బాలకృష్ణుని కొంటేపనులను దలచుకొని కుంతి కృష్ణుని ప్రస్తుతించుచు నాడిన మాటలు. ఆమాటలవెనుక నార్తియున్నది. అభిమానమున్నది. భక్తియున్నది. ఆప్యాయతను రంగరించి చిత్రించిన యీచిత్రము అపూర్వము.


                                    "కృష్ణా! యేమి చెప్పనయ్యా నాటి ముచ్చటలు. బాల్యమున నీవొకనాడొకగోపిక యింటికేగి. దధి భాండమును కోపముతో పగులగొడితివి. ఆగోపికయు కోపమున నిన్ను త్రాటితోగట్టివేయుచో, మొగమొక వంకకు వంచి,కన్నుల కజ్జలశిక్తమై కన్నీరుగార

దానినంతయు నిరుచేతులతో మొగమంతయు పులుముకొనుచు వేడినిట్టూర్పులను విడచుచు బాలునివలె నటించుట నేడుదలచికొనిన నాకు చోద్యమనిపించునయ్యా! కొంటె కృష్ణయ్యా! యెంత దొంగ నటన! "భక్తిపాశములచే గట్టుబడు నీవు సామాన్యమగు త్రాట బంధింపఁబడుట నటన గాకమరేమి? "- యనిమేనత్తమాటలు.


                                  త్రాటగట్టబడుట , సాంజన భాష్పతోయ సిక్తమైన మోమును చేతులతో పులిమికొనుట. అప్పటి కృష్ణయ్య ఆ యాకారము. ఇవియన్నియు పోతన పాత్రచిత్రణము లోని మెళకువలు.చివరకు "అంతవాడ వింతవాడ వైతివే!! యని యాశ్చర్యమును ప్రకటించుట. యతని రచన లోని చమత్కారము. 


                                                                  ఇదండీ పోతన గారి పాత్ర చిత్రణలోని గొప్పతనం!


                                                                                                   స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷💄💄🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

అర్చకుని తపస్సు

 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹


అర్చకశ్య తపోయోగాత్, 

అర్చకస్యాతి శ్యాయనాత్,

అభి రూప్యాచ్చ బింబానాం, 

దేవ సాన్నిధ్య మృచ్ఛతి.


తాత్పర్యము: అర్చకుని తపస్సు, యోగము, వినయము, భక్తి ప్రపత్తులు, ఆచారము, మంత్ర సౌష్టవముల వలన దేవతా విగ్రహములు దైవ సాన్నిధ్య శక్తిని కలిగి లోకానుగ్రహము కలిగించగలవు.... మనుస్మృతి ..  


విశ్లేషణ: ఈ శ్లోకం శ్రీశైలక్షేత్రం లోని శిఖరేశ్వర ఆలయం వద్ద కనపడుతుంది. మనుస్మృతి లోనిదని తెలుస్తోంది. అర్చకునికి ఉండవలసిన లక్షణాలేవో ఈ శ్లోకంలో తెలుస్తుంది.


అర్చకుడు తపస్సు చేయాలి. తపస్సు అంటే తపించడం, వేగిపోవడం. ఏ స్వామిని అర్చిస్తున్నారో ఆ స్వామి సేవలో పూర్తిగా లీనమై ఉండాలి. ఆ స్వామికి ఏమి కావాలి, ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే నిరంతర తపస్సులో ఉండాలి. 

యోగం లేకపోతే ఇవేవీ సాధ్యపడవు. 

ఆ యోగం పొందడానికి నిరంతరం కృషి చేయాలి. భగవంతుని పట్ల, భాగవతుల పట్ల వినయము కలిగి ఉండాలి. భక్తి కలిగి ఉండాలి. 

భక్తి లేని పూజ పత్రి చేటు అని తెలుసు కదా. 

ప్రపత్తి కలిగివుండాలి. 

ప్రపత్తి అంటే శరణాగతి. 

ఏ స్వామిని సేవిస్తున్నారో ఆ స్వామిపట్ల 'అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ' అన్న భావాన్ని త్రికరణ శుద్ధిగాకలిగి ఉండాలి. ఆచారము పాటించాలి. శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రంలో 'ఆచార ప్రభవో ధర్మః' అన్నారు. సదాచారము నుండే ధర్మము ప్రభవిస్తుంది అని చెప్పారు. కనుక ధర్మాన్ని నిలబెట్టాలంటే ఆచారమును పాటించడం తప్పనిసరి. మంత్రాన్ని స్పష్ఠంగా ఉచ్చరించాలి. ఉచ్చారణ దోషాలుంటే ప్రకంపనలలో తేడా వచ్చి ఆ మంత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. అప్పుడు ఆ మంత్రం సరిగా పనిచేయదు. ఈ లక్షణాలన్నీ అర్చకునిలో ఉన్నప్పుడు, ఆ అర్చకుడు అర్చన చేసే బింబములో, అంటే విగ్రహములో దైవసాన్నిధ్యం చేకూరుతుంది. అంటే, అర్చకుడి వలననే విగ్రహానికి ఆ ప్రత్యేకశక్తి వచ్చి చేరుతుంది. అందుకే కొన్ని ఆలయాలలో నిజమైన దైవసాన్నిధ్య అనుభూతి కలుగుతుంది. అందుకే, దైవం తరువాత ఆ స్థానం ఆలయాల్లో అర్చకునిదే.


                     🙏🙏

సోమవారం🕉️* *🌹15సెప్టెంబర్2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

     *🕉️సోమవారం🕉️*

*🌹15సెప్టెంబర్2025🌹*   

   *దృగ్గణిత పంచాంగం*                     


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః* 

*భాద్రపద మాసం - కృష్ణపక్షం*


*తిథి  : నవమి* రా 01.31 వరకు ఉపరి *దశమి*

*వారం    : సోమవారం* ( ఇందువాసరే )

*నక్షత్రం   : మృగశిర* ఉ 07.31 వరకు ఉపరి *ఆరుద్ర*

*యోగం : వ్యతీపాత* రా 02.34 వరకు ఉపరి *వరీయాన్*

*కరణం  : తైతుల* మ 02.15 *గరజి* రా 01.31 ఉపరి *వణజి*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.00 - 07.00 & 11.00 - 12.00*

అమృత కాలం  : *రా 09.05 - 10.38*

అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.27*


*వర్జ్యం      : సా 03.39 - 05.12*

*దుర్ముహూర్తం  : మ 12.27 - 01.16 & 02.54 - 03.43*

*రాహు కాలం   : ఉ 07.27 - 08.59*

గుళికకాళం       : *మ 01.34 - 03.06*

యమగండం     : *ఉ 10.31 - 12.02*

సూర్యరాశి : *సింహం*       

చంద్రరాశి : *మిధునం*

సూర్యోదయం :*ఉ 06.04* 

సూర్యాస్తమయం :*సా 06.18* 

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.56 - 08.22*

సంగవ కాలం         :     *08.22 - 10.49*

మధ్యాహ్న కాలం    :     *10.49 - 01.16*

అపరాహ్న కాలం    : *మ 01.16 - 03.43*

*ఆబ్ధికం తిధి         : భాద్రపద బహుళ నవమి*

సాయంకాలం        :*సా 03.43 - 06.09*

ప్రదోష కాలం         :  *సా 06.09 - 08.31*

రాత్రి కాలం           :*రా 08.31 - 11.39*

నిశీధి కాలం          :*రా 11.39 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.09*

++++++++++++++++++++++++++

        *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*


*హవ్యం తే లక్షసంఖ్యైర్హుత* 

*వహవదనే నార్పితం* 

*బీజమంత్రైః ।*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

Panchaag



 

_ఒక_పద్యం

 _ఒక_పద్యం



"కారే రాజులు? రాజ్యముల్‌ కలుగవే? గర్వోన్నతిన్‌ బొందరే? వారేరీ? సిరి మూట కట్టుకొని పోవంజాలిరే? భూమిపైపేరైనం గలదే? శిబి ప్రముఖులున్‌ ప్రీతిన్‌ యశఃకాములైఈరే కోర్కెలు? వారలన్‌ మరచిరే ఇక్కాలమున్‌ భార్గవా!"


ఇది పోతన గారి పద్యం. వామనావతార ఘట్టంలోది. వామనుడు నిజానికి విష్ణువని, బలిని నాశనం చెయ్యటానికే వచ్చాడని గ్రహించిన శుక్రుడు వామనుడికి దానం ఇవ్వొద్దని బలిని హెచ్చరించినప్పుడు అతనన్న మాటలు ఇవి.పోతన భాగవతంలో రెండే పాత్రలు భగవంతుడు, కవి. మిగిలిన వాళ్ళంతా నిమిత్తమాత్రులు. అంచేత నిజానికి ఈ మాటలు బలి పేరుతో పోతన గారే అంటున్నవని అనుకోవటం తప్పుకాదు.ఇంతకు ముందు ఒక సంచికలో వేలూరి గారు “ఎవ్వనిచే జనించు…” పద్యం గురించి అన్నట్లు, ఇక్కడ కూడ కొంత విచిత్రమైన భాషా ప్రయోగం కనిపిస్తుంది. “కారే రాజులు?” అనటమే ఒక వింత వాడుక. ఆ రెండు పదాల్నే తీసుకుని అర్థాన్ని సాధించాలంటే కష్టం కూడా. ఎవరో ఏమిటో చెప్పకుండా “వాళ్ళెక్కడ?” అంటే ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది? కాని అలా సందర్భాన్ని వివరించకుండా పద్యాన్ని ఎత్తుకోవటంలో బలి ఎంత భావావేశంలో వున్నాడో, అతని మనసు కన్నా వేగంగా మాటలు ఎలా పరుగిడుతున్నాయో ఇక్కడ పోతన గారు చూపిస్తున్నారు. ఇలాటి సందర్భాలు మనందరికీ అనుభవంలో వున్నవే. మరో విధంగా కూడ ఈ పద్యం ఎత్తుగడని వివరించొచ్చు. “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” అన్న గ్రంథంలో వెల్చేరు నారాయణరావు గారు అన్నట్లు, తెలుగు భారత భాగవత పురాణాలు నిజానికి ఎవరికివారు చదివి ఆనందించటానికి ఉద్దేశించినవి కావు ఒక పౌరాణికుడు వీటిలోని పద్యాలను మధ్య మధ్యలో వాడుతూ తనదైన కథనంతో ప్రవచనం చేసే పద్ధతికి అనుకూలమైనవి. అంచేత, ఒక పౌరాణికుడు ప్రసంగిస్తూ, బహుశా రకరకాల దేశాల పేర్లు చెప్పి, యుగాల పేర్లు చెప్పి, “అప్పట్నుంచి ఇప్పటివరకు

ఎందరెందరో..” అని ముందు చేర్చి “కారే రాజులు?” అని పద్యాన్ని ఎత్తుకుంటే అప్పుడు సరిగ్గా సరిపోతుందన్న

మాట. ఇక ఈ పద్యంలో పోతన గారు అంటున్నది, “ఎందరో రాజులయ్యారు, వాళ్ళకి రాజ్యాలు కలిగాయి, కాని అందువల్ల జరిగిందల్లా వాళ్ళకు గర్వం పెరగటం త ప్ప మరేమీ కాదు” అని. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్ళు

ఏమయ్యారు? ఆ సంపదని మోసుకుపోలేదు కదా! పోనీ, భూమ్మీద వాళ్ళ పేరైనా నిలబడిందా? అదీ లేదు. వాళ్ళెవరో

ఎవరికీ పట్టదు. అదే శిబి లాటి దాతలు కీర్తి కోసం కోరికలు తీర్చారు. వాళ్ళ పేర్లు ఇప్పటివరకూ నిలిచాయి. కొంచెం లోతుగా చూస్తే ఇక్కడ కనిపించేది గర్వోన్నతులైన రాజులకు చివరికి ఏ గతి పడుతుందంటే వాళ్ళ సిరిని ఇంకా బలవంతులైన వాళ్ళు వచ్చి కొట్టుకుపోతారు; ఆ పనిలో వాళ్ళెలాగూ ఈ గర్వోన్నతుల్నీ వాళ్ళ వంశాల్నీ నాశనం చేస్తారు; అంచేత వాళ్ళ వంశాలు కూడ మిగలవు ఆ విధంగా వాళ్ళ పేర్లు కాలగర్భంలో కలిసిపోతాయి; అనేది. చారిత్రకంగా చూస్తే ఇది నిజమే మరి. రాజుల జీవితాలు దినదిన గండాలుగా వుండేవి. వృద్ధాప్యంలో సహజ మరణాల్తో పోయిన వాళ్ళు చాలా కొద్దిమందే! కనుక నిజంగా విష్ణువే తనని నాశనం చెl ు్యటానికి వచ్చినప్పుడు దానం చేసి పేరు నిలబెట్టుకోవటమో లేక ఆ గర్వోన్నత రాజుల దారిలో నడిచి వంశనాశనం చేసుకోవటమో ఈ రెండే మార్గాలున్నాయి బలికి (పోతన గారి దృష్టిలో). అంచేత దానం ఇవ్వటం అనే మార్గాన్ని ఎంచుకోవటంలో బలి చేస్తున్న త్యాగం పెద్దగా ఏమీ లేదు. అది అతనికీ తెలుసు. మరో విషయం ఈ పద్యం “పేరు నిలబడటం” అనేది గొప్ప లక్ష్యమని ప్రతిపాదిస్తుంది. ఇప్పటి పరిస్థితుల్లో ఇది చాదస్తంగా, మౌఢ్యంగా అనిపిస్తుంది కాని వందేళ్ళ క్రితం కూడ అభిమానధనం ముందు ధనానికి విలువ తక్కువగానే వుండేది. అందుకు ముఖ్యకారణం పటిష్టమైన కుటుంబ వ్యవస్థ. ఒక కుటుంబం మీద మచ్చ పడితే అది మాసిపోవటానికి ఏడు తరాలు పడుతుందని భావించే సమాజంలో ఏ విధమైన చెడ్డ పేరూ రాకుండా చూడటం ప్రతి వ్యక్తికీ బాధ్యతే. అలా చెయ్యకపోతే అతను తన వంశాన్ని ఎన్నో తరాల ముందు వరకు శాపగ్రస్తం చేసిన వాడౌతాడు. కుటుంబ వ్యవస్థ కూలిపోయి వ్యక్తులు సర్వస్వతంత్రులై, వాళ్ళ ప్రవర్తనకి వాళ్ళు వ్యక్తిగత బాధ్యతని వహించే ఈ నాటి పాశ్చాత్య,

పాశ్చాత్య ప్రభావిత, సమాజాల్లో అప్పటి విలువలు పనికిరావు కనుక ఈ పద్యం చెప్పే నీతి ఇప్పుడు మనకు

అంగీకారయోగ్యం కానక్కర లేదు. ఐనా చక్కటి పద్యానికి ఉన్న శక్తి, దాన్లోని విషయం మనకు నచ్చకపోయినా


పదే పదే మన చేత మననం చేయించటం!

14, సెప్టెంబర్ 2025, ఆదివారం

లిపిడ్ ప్రొఫైల్

 *లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏమిటి?*

ఒక ప్రముఖ వైద్యుడు లిపిడ్ ప్రొఫైల్‌ను చాలా చక్కగా వివరించాడు మరియు దానిని ఒక ప్రత్యేకమైన రీతిలో వివరించే అందమైన కథను పంచుకున్నాడు.


మన శరీరం ఒక చిన్న పట్టణం అని ఊహించుకోండి. ఈ పట్టణంలో అతిపెద్ద సమస్య సృష్టించేది - *కొలెస్ట్రాల్*


అతనికి కొంతమంది సహచరులు కూడా ఉన్నారు. నేరంలో అతని ప్రధాన భాగస్వామి - *ట్రైగ్లిజరైడ్*


వీధుల్లో తిరగడం, గందరగోళం సృష్టించడం మరియు రోడ్లను అడ్డుకోవడం వారి పని.


*హృదయం* ఈ పట్టణం యొక్క నగర కేంద్రం. అన్ని రోడ్లు హృదయానికి దారి తీస్తాయి.


ఈ సమస్య సృష్టించేవారు పెరగడం ప్రారంభించినప్పుడు, ఏమి జరుగుతుందో మీరు ఊహించవచ్చు. వారు గుండె పనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు.


కానీ మన శరీర పట్టణంలో కూడా ఒక పోలీసు దళం మోహరించబడింది - *HDL*


మంచి పోలీసు ఈ సమస్య సృష్టించేవారిని పట్టుకుని జైలులో పెడతాడు *(కాలేయం)*.


అప్పుడు కాలేయం వారిని శరీరం నుండి తొలగిస్తుంది - మన డ్రైనేజీ వ్యవస్థ ద్వారా.


కానీ అధికారం కోసం ఆకలితో ఉన్న ఒక చెడ్డ పోలీసు - *LDL* కూడా ఉన్నాడు.


 LDL ఈ దుర్మార్గులను జైలు నుండి బయటకు తీసుకెళ్లి వీధుల్లోకి పంపుతుంది.


మంచి పోలీసు *HDL* తగ్గిపోయినప్పుడు, పట్టణం మొత్తం అల్లకల్లోలంగా మారుతుంది.


అటువంటి పట్టణంలో ఎవరు నివసించాలనుకుంటున్నారు?


మీరు ఈ దుర్మార్గులను తగ్గించి మంచి పోలీసుల సంఖ్యను పెంచాలనుకుంటున్నారా?


*నడక* ప్రారంభించండి!


ప్రతి అడుగుతో *HDL* పెరుగుతుంది మరియు *కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్* మరియు *LDL* వంటి దుర్మార్గులు తగ్గుతాయి.


మీ శరీరం (పట్టణం) మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది.


మీ గుండె - నగర కేంద్రం - దుండగుల అడ్డంకి *(హార్ట్ బ్లాక్)* నుండి రక్షించబడుతుంది.


మరియు గుండె ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.


కాబట్టి మీకు అవకాశం దొరికినప్పుడల్లా - నడవడం ప్రారంభించండి!


*ఆరోగ్యంగా ఉండండి...* మరియు *మీకు మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నాను*

**ఈ వ్యాసం HDL (మంచి కొలెస్ట్రాల్) పెంచడానికి మరియు LDL (చెడు కొలెస్ట్రాల్) తగ్గించడానికి అంటే నడకకు ఉత్తమ మార్గాన్ని మీకు చెబుతుంది.*

ప్రతి అడుగు HDL ను పెంచుతుంది. కాబట్టి - *రండి, ముందుకు సాగండి మరియు కదులుతూ ఉండండి.*




ఈ విషయాలను తగ్గించండి:-


1. ఉప్పు


2. చక్కెర


3. శుద్ధి చేసిన పిండి


4. పాల ఉత్పత్తులు


5. ప్రాసెస్ చేసిన ఆహారాలు


*ప్రతిరోజూ ఈ విషయాలను తినండి:-*


1. కూరగాయలు


2. పప్పులు


3. బీన్స్


4. గింజలు


5. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్


6. పండ్లు


*మర్చిపోవడానికి ప్రయత్నించాల్సిన మూడు విషయాలు:*


1. మీ వయస్సు


2. మీ గతం


3. మీ మనోవేదనలు


*అలవాటు చేసుకోవాల్సిన నాలుగు ముఖ్యమైన విషయాలు:*


1. మీ కుటుంబం


2. మీ స్నేహితులు


3. సానుకూల ఆలోచన


4. ఇంటిని శుభ్రపరచడం మరియు స్వాగతించడం


*అలవాటు చేసుకోవాల్సిన మూడు ప్రాథమిక విషయాలు:*


1. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి


2. మీ స్వంత వేగంతో క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయండి


3. మీ బరువును తనిఖీ చేసుకోండి మరియు నియంత్రించండి


*మీరు అలవర్చుకోవాల్సిన ఆరు ముఖ్యమైన జీవనశైలి అలవాట్లు:*

1. నీరు త్రాగడానికి దాహం వేసే వరకు వేచి ఉండకండి. 2. విశ్రాంతి తీసుకోవడానికి అలసిపోయే వరకు వేచి ఉండకండి.


3. వైద్య పరీక్షల కోసం అనారోగ్యంతో బాధపడే వరకు వేచి ఉండకండి.


4. అద్భుతాల కోసం వేచి ఉండకండి, దేవునిపై నమ్మకం ఉంచండి.


5. మీపై ఎప్పుడూ నమ్మకం కోల్పోకండి.


6. సానుకూలంగా ఉండండి మరియు ఎల్లప్పుడూ మంచి రేపటి కోసం ఆశిస్తారు.


ఈ వయస్సులో మీకు స్నేహితులు ఉంటే *(45-80 సంవత్సరాలు)* దయచేసి వారికి దీన్ని పంపండి.




మీకు తెలిసిన మంచి సీనియర్ సిటిజన్లందరికీ దీన్ని పంపండి.



🙏 🌹🌹🌹🙏

బృహద్ధర్మపురాణంలో

 బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి


బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి. ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతిబాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పుచేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రము చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక వారు చదివినవారిని అనుగ్రహిస్తారు. దీనిని ఎవరైతే వారి పుట్టిన రోజునాడు తండ్రికి నమస్కరించి వారి వద్ద చదువుతారో వారికి పితరుల అనుగ్రహం లభిస్తుంది.


బ్రహ్మఉవాచ:-


1. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ; సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే ఎవరివలన ఈ జన్మవచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో, ఎవరి ఆశీస్సులవల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు.


2. సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్టినే; సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ


సెప్టెంబర్-2015-


సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమాన మైనవారు సకల పుణ్యతీర్ధములకు ఆలవాలమైన కరుణా సముద్రులైన పితరులకు నమస్కారములు,


3. నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః; సదా... పరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేవారైన శివ రూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు,


4. దుర్లభం మానుషమిదం యేనలబ్దం మాయా వపుః సంభావనీయం ధర్మార్దే తస్మై పిత్రే నమో నమః ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వలన లభించినదో ఆ పితృదేవతలకు నమస్కారములు.


5. తీర్ధస్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం: మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః ఎవరిని చూసినంతనే అనేక తీర్ధస్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహా గురు వులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు.


6. యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం; అశ్వమేధ శతై: తుల్యం తస్మై పిత్రే నమో నమః ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా అవి వందల కొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరు లకు నమస్కారములు.


ఫలశృతి:


ఇదం స్తోత్రం పితృః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః ప్రత్యహం ప్రాతురుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితం నానాపకర్మకృత్వాపి యఃసౌతి పితరం సుతః సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీభవేత్ పితృప్రీతికరైర్నిత్యం సర్వకర్మాణ్యధార్హతి


-యస్.వి.యస్.ఎన్.శర్మ


35

వెంటనే జరుగుతుంది.

 కాలాన్తరేహ్యనర్థాయ 

 గృధ్రో గేహోపరిస్థితః |

ఖలో గృహసమీపస్య సద్యోనర్థాయదేహినామ్ || 


ఒక డేగ ఇంటిపై కూర్చుంటే, అప్పుడప్పుడు చెడు జరగవచ్చు. ఒక దుష్టుడు ఇంటి దగ్గర ఉంటే, చెడు వెంటనే జరుగుతుంది.


...కలివిడంబనమ్