బామ్మ గారు తల నొప్పిగా ఉంది అంటే వేడి చేసి వచ్చిందేమో అని ఇంత పంచదార వేసి గ్లాస్ నిండా చిక్కటి మజ్జిగ ఇచ్చే వారు. దెబ్బ కి తల నొప్పితో పాటు నీరసం కూడా తగ్గేది.
కడుపు నొప్పి వస్తే కాసింత శొంఠి పొడుం వేడివేడి అన్నంలో తొలి ముద్ద గా తినమని చెప్పవారు లేదా రెండుమూడు వాము ఆకులు నమిలి గోరు వెచ్చని నీళ్లు తాగమని చెప్పవారు. వారు చెప్పినట్టు చేసే వాళ్ళం దెబ్బకి కడుపు నొప్పి వస్తే వొట్టు.
అలాగే పిప్పి పంటికి లవంగం బుగ్గన పెట్టుకో మనేవారు.
జలుబు చేస్తే వెల్లుల్లి పాయ కారంపొడి పెట్టేవారు.
దగ్గు వస్తే కరక్కాయ బుగ్గన పెట్టుకోమని చెప్పేవారు.
జ్వరం వస్తే జీలకర్ర కాషాయం. రొంప జ్వరం ఉంటే మిరియాలు కాషాయం తో లంకణం పరమ ఔషధం అనిచెప్పి ఆరోజు అంతా భోజనం పెట్టేవారు కాదు మరునాటికి జ్వరం ఉంటే ఒట్టు.
మలబద్ధకం గా ఉంటే గోరు వెచ్చగా నీళ్లు తాగించే వారు. మోషన్స్ అయితే పల్చగా మజ్జిగ చేసి అందులో పంచదార ఒక నాలుగు చెంచాలు వేసి ఇచ్చే వారు.
జుట్టు ఊడుతుంటే కుంకుడు కాయ తో పాటు ఇన్ని మందారు ఆకులు ను మెత్తగా దంచి తలంటు పోసుకునే వారు.జుట్టు నిగ నిగ లాడుతూ పెరిగేది.
గుండెల్లో మంట గా ఉంటే
పంచ దార నీళ్లు లేదంటే మజ్జిగ తేట ఇచ్చే వారు.
వడ దెబ్బ తగలకుండా ఇన్ని దబ్బాకులు వేసిన మజ్జిగ బయటకు వెళ్లి వచ్చాక ఇచ్చేవారు..
ఇలా ఇలా అనేక చిట్కాలు... అనేక రోజులు అనుభవం తో నేర్చుకున్న ఇంటి వైద్యాలు...
తలుచుకుంటే అప్పటి వారి మెడికల్ box ఏమిటి అంటే పోపుల పేట్టే...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి