1, ఫిబ్రవరి 2026, ఆదివారం

*ఈ పూర్ణిమ

  _*ఈ పూర్ణిమ సామాన్యమైనది కాదు.*_



*1. మాఘ పూర్ణిమ:*


 *చంద్రుని శక్తి గరిష్టంగా ఉండే పవిత్రమైన రోజు. నదీ స్నానం తప్పక చేయాలి, ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున సముద్ర స్నానం కోటి జన్మల పాపాలు తొలగిస్తుంది అని శాస్త్ర వాక్యం. ప్రయాగ లో మాఘ పౌర్ణమి రోజున సమస్త దేవతలు స్నానం చేస్తారు,ఆ నీటిలో దైవ శక్తి అపరిమితంగా ఉంటుంది,కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించడం ఎంత గొప్పదో మాఘ పౌర్ణమి రోజున స్నానం అంతకు పది రెట్లు విశిష్టమైంది, వీలైతే నది, కుదిరితే సముద్రం, లేదా ప్రయాగ స్నానం చేయండి, లేదా ఇంట్లోనే గంగా యమున మొదలైన నదులను స్మరిస్తూ సూర్యోదయంలోగానే స్నానం చేయాలి.*


*2. రవి పుష్య యోగం (పుష్యార్క యోగం):* 


 *పుష్యమి నక్షత్రం ఆదివారం రావడం వల్ల ఏర్పడే ఈ యోగం గ్రహణముతో సమాన శక్తి కలది,ఈ సమయంలో చేసే స్నానం,దానం, జపం అక్షయమైన ఫలితం ఇస్తుంది.* 


*3. శ్రీ లలితా జయంతి:* 


 *జగన్మాత లలితా దేవి భండాసుర సంహారం కోసం దేవతలు చేసిన మహాయగం నుండి ఆవిర్భవించిన రోజు. సాధారణంగానే పౌర్ణమి రోజున లలితా ఆరాధన ఎంతో గొప్ప ఫలాలు ఇస్తుంది, అందులోనూ యోగం తో కూడిన, మాఘ పౌర్ణమి రోజున రాత్రి వేళ చంద్రబింబం పాలలో చూస్తూ అందులో లలితా దేవిని ధ్యానిస్తూ లలితా సహస్ర నామాలు చదివితే ఎలాంటి కోరిక అయిన వెంటనే తీరుతుంది, ఇది బ్రహ్మాండ పురాణం చెప్పిన గొప్ప రహస్యం.* 


*4. థైపూసం:* 


 *ఇది తమిళుల ఉత్సవం, తారకాసుర సంహారం కోసం జన్మించిన సుబ్రహ్మణ్య స్వామికి పార్వతి దేవుడు శక్తి ఆయుధాన్ని ఇచ్చిన రోజు. జ్ఞాన సిద్ధికి, ఈరోజున తమిళ నాట విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు.* 


5. *సర్వార్థ సిద్ధి & సిద్ధ యోగం:* 


 *మీరు చేసే ఏ ప్రయత్నానికైనా విజయాన్ని చేకూర్చే అద్భుత ఘడియలు ఇవి.* 


 *ఈరోజు చేసే చిన్న దానమైనా, పూజ అయినా, కొన్ని వందల రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది.* 


 *కనుక యథాశక్తి పూజ,ధ్యానం,జపం, స్నానం చేయడం ఉత్తమం.* 


 *ఈరోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం శుభ ప్రదం.* 


 *కనుక ఆధ్యాత్మికంగా ఎన్నో విశిష్టతలు ఉన్న ఈ గొప్ప సమయాన్ని వినియోగించుకొని దైవానుగ్రహాన్ని పొందగలరు.*


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఆయుర్వేద వైద్య పితామహుడు

 మరుగున పడిన ఆయుర్వేద వైద్య పితామహుడు అయిన "జీవకుడి" జీవిత విశేషాలు - 

    

ఆయుర్వేదం అనగా అందరికి చరకుడు , వాగ్భాటాచార్యుడు , శుశ్రుతుడు మాత్రమే అందరికి గుర్తుకువస్తారు. కాని కాలగర్భంలో కలిసిపోయిన ఒక గొప్ప ఆయుర్వేద వైద్య పితామహుఁడు , శస్త్రచికిత్సా నిపుణుడు గురించి మీకు ఈ రోజు తెలియచేస్తాను. ఆ గొప్ప ఆయుర్వేద వైద్య పితామహుఁడు నామధేయం "జీవకుడు " ఇతను బుద్ధుని కాలం నాటి అనగా క్రీస్తూపూర్వం 6 వ శతాబ్దం నాటివాడు .ఈ వైద్యుని చరిత్ర మనకి ఆశ్చర్యం కొలుపుతుంది.

                 

  ఇతను గౌతమబుద్ధుని సమకాలికుడు ఆయనకు చికిత్స చేసెను. " కౌమార భృత్యం " అనగా బిడ్డల చికిత్స యందు మిక్కిలి చతురత కలవాడు అని ఇతనికి బిరుదు కలిగి ఉండెను. కాని జీవకుడు కాయచికిత్స యందు శస్త్రచికిత్స యందు గొప్ప ప్రజ్ఞ కలవాడు అని చారిత్రిక నిదర్శనములు కలవు. అతడు మగధరాజ్యమునకు ముఖ్య పట్టణం అగు రాజగృహ నగరము నుండి బింబిసార చక్రవర్తి యొక్క కుమారుడు అగు అభయునిచే అప్పటికే ప్రసిద్ది చెందిన తక్షశిలా నగరం నందలి వైద్యవిశ్వవిద్యాలయమునకు పంపబడెను. ఆ కాలము నందే వేయిమైళ్ల దూరం వైద్యవిద్యను సంపాదించు నిమిత్తం ఇతను పోయననిన ఆశ్చర్యపడవలసిన అవసరమే లేదు .

               

    తక్షశిలా విశ్వవిద్యాలయము నందు జీవకుడు ఏడు సంవత్సరాలపాటు వైద్యవిద్యను అభ్యసించి గురువువద్దకు సెలవు తీసుకొనుటకు వెళ్లగా గురువు ఇతనిని పరీక్షింపదలచి " ఈ గడ్డపార తీసుకుని తక్షశిలా నగరం చుట్టూ యోజనము దూరములో వైద్యమునకు పనికిరాని మూలికను తెమ్ము " అని పంపించెను . అతడు తిరిగి తిరిగి ఏదో ఒకరకమగు చికిత్సకు కాని , ఆహారంగా గాని పనికిరాని వస్తువు అంటూ ఏమి లేదు అని " న కించిత్ జగ త్యనౌషధం " అని చెప్పెననియు అందుకు ఆ గురువు సంతసించి అతని ప్రయాణ ఖర్చులకు కొంత ధనమును ఇచ్చి వీడ్కోలు పలికే అని పురాతన గ్రంథాలలో ఉన్నది. జీవకుడు సాకేత నగరముకు వచ్చు వరకు ప్రయాణ ఖర్చులకు ధనము లేక అక్కడే కొన్ని రోజులు వేచిచూడవలసిన వచ్చెను.


 * జీవకుడి చికిత్సలు - 

        

   సాకేత నగరమున ఒక ధనికుడు అగు శెట్టి భార్య ఏడు సంవత్సరముల నుండి తలలో ఏదో సమస్యతో భాధపడుచూ ఎందరు వైద్యం చేసినను కుదరక కష్టపడుచుండును. జీవకుని గురించి విని తన గృహమునకు ఆహ్వానింపగా ఇతడు కొన్ని మూలికలు సంపాదించి వానితో ఒక ఘృతము తయారుచేసి ముక్కుద్వారా నశ్యము చేయించెను. ఈ చికిత్సతోనే ఆమె రోగము నయం అయ్యెను. ఆ కాలములోనే వైద్యదక్షిణగా 16000 బంగారు రూపాయలు ఇచ్చెను . ఒక గుర్రపు బండిని , నౌకరులను ఆయనకు సమర్పించెను. దీనితో జీవకుడు రాజగృహమునకు చేరి తనపోషకుడు అగు అభయునకు తనకు సహాయం చేసిన ధనమును తిరిగి ఇచ్చివేసెను. ఆ తరువాత బింబిసార చక్రవర్తికి కలిగిన" భగంధర " రోగమును కొన్ని లేపనముల సహాయముతో చేసి కుదిర్చెను . ఆ తరువాత జీవకుడు రాజవైద్యుడిగా నియమించబడెను. ఆ తరువాత గౌతమబుద్ధునకు వారి బౌద్ధ సంఘమునకు వైద్యుడు అయ్యెను.

                    

    జీవకుడు చికిత్స చేసిన అత్యద్భుత చికిత్సలలో కొన్ని బౌద్ధ గ్రంధములలో వర్ణింపబడినవి. రాజగృహ నగరం నందు ఒక వైశ్యశిఖామణి కుమారునకు మితిమీరిన తలనొప్పి అనేక సంవత్సరముల నుండి భాదించుచుండెను. జీవకుడు శస్త్రచికిత్సచే తలలో నొకభాగం తొలచి రెండు పురుగులను తీసివేసి వ్రణమును ఎప్పటివలె కుట్టి ఏదో ఒక లేపమును పూసి కట్టు కట్టెను. ఇందువలన తలనొప్పి నిర్మూలనం అయ్యెను .

              

    కాశీపట్టణమునకు చెందిన ఒక వ్యక్తి కుమారుడు వ్యాయామము చేయుచుండగా పేగులలో మెలికపడి ఆహారం జీర్ణించుకోలేక మలబద్దకం కలిగి రక్తహీనుడు అయ్యి శల్యావశిష్టుడై యుండెను. అంతట వారు జీవకునిని పిలిపించగా ఇతడు శస్త్రచికిత్సచే సరిచేయుచూ మెలికపడిన పేగులను రోగి భార్యకు చూపించి పేగులను మెలికను విడకొట్టి తిరిగి ఎప్పటివలె ఉదరకుహరమున స్వస్థలమున నిలిపి పైన చర్మం కుట్టి ఏదో లేపనం పూసి మాన్పెను. 

                

    ఉజ్జయినీ మహారాజు అగు "ప్రద్యోత" చక్రవర్తి కామెర్ల వ్యాధిచేత భాధపడుతుండెను. ఆఖరు వైద్యముగా వారి సంస్థాన వైద్యులను బింబిసార చక్రవర్తి దగ్గరకు జీవకుని కోసం పంపిరి. రోగము కంటే రోగి మొండివాడు అని జీవకునకు తెలుసుకొనెను. ఈ వ్యాధికి ఘృతపానం చేయవలెను . (ఆయుర్వేదం నందు ఘృతము అనగా మూలికలను ఆవునెయ్యితో కలిపి వండుటను ఘృతము అందురు.) ఘృతం పేరుచెప్పగానే రోగికి వాంతి వచ్చుచుండెను. అందువల్ల ఘృతం పనికిరాదు అని రాజు శాసించెను . జీవకుడు కష్టపడి రంగు , రుచి అన్నియు మారునట్లు ఒక ఘృతమును తయారుచేసి ఒకవేళ మహారాజుకు వాంతి అయిన మహారాజు ఘృతం అని కనిపెట్టి ఏమి దండన విధించునో అను శంఖ చేత ఒక యుక్తిని పన్నెను . అదేమనగా మహారాజునకు మందు లొపలికి ఇవ్వగానే తాను ఒక పచ్చిమూలిక సంపాదించి వెంటనే విరుగుడుగా ఇవ్వవలెను అనియు అందుకు వేగముగా పరిగెత్తగల వాహనమును తయారుచేసి వీధిలో సిద్ధముగా నుంచవలెను అనియు ఏర్పాటు చేయించెను .

                

      మహారాజునుకు ఔషదం ఇచ్చి ఉపచారవిధానాదులు చేయుటకు తగినవారిని నియమించి వేగముగా నగరం విడిచిపోయెను. చక్రవర్తికి రోగము నివారణ అయ్యెను . కాని వైద్యుడు కనిపించలేదు . రాజు రహస్యం అంతా తెలుసుకుని జీవకునకు చేరవలసిన బహుమానమును బింబిసారుని రాజధానికి పంపెను. ఇలా జీవకుడు ఎన్నో కఠినమైన చికిత్సలు చేయుచుండెను అని " చుల్లవగ్గా " 5 -14 - 1 అనే గ్రంథము నందు కలదు . ఒకసారి బుద్ధునకు అనారోగ్యం కలిగెను. అప్పుడు విరేచనౌషధం ఇవ్వవలసి వచ్చెను. అతిగౌరముగా కాపాడుబడుచున్న పవిత్ర మునీశ్వరుడు అయిన గౌతమ బుద్దునకు లొపలికి తీసికొనుటకు అహితములైన మందులను లొపలికి ఇచ్చుట జీవకునకు ఇష్టం లేదు . అందుచే విరేచనౌషధములను పద్మములో ఇమిడ్చి వాసన చూచుటకు బుద్దునకు ఇచ్చెను. సుఖముగా విరేచనాలైన పిమ్మట వేడినీళ్లలో స్నానం చేయించి సంపూర్ణంగా ఆరోగ్యం కలుగు వరకు ద్రవపదార్థాలను ఆహారంగా ఇచ్చుచుండిరని వ్రాయబడినది . మరొకసారి ఒక భక్తురాలు విందు ఇచ్చినప్పుడు ఆహార దోషము వలన తినినవారందరికి అజీర్ణము పుట్టి దోషప్రకోపం వలన బాధలు పడుచుండిన సమయమున అందరికి చికిత్స చేసెను అని కలదు .

     

   

ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 



గమనిక -

      

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  

  

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

          

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  9885030034

మాఘ పురాణం - 14వ*

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷ఆదివారం 1 ఫిబ్రవరి 2026🌷*

_*మాఘ పురాణం - 14వ* 

      _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


      *1వ తేదీ ఆదివారం*

         *వేకువఝామున*

       *చదువు కొనుటకు*

```

మాఘ పురాణం పధ్నాలగవ అధ్యాయములో…. పూర్వం, గంగానది ఒడ్డున నివసించిన ఒక బ్రాహ్మణుడు, సంతానం లేని లోటుతో బాధపడుతూ, శ్రీహరిని పూజించి వరం కోరుకున్నాడు. అతని నిష్టకు మెచ్చిన శ్రీహరి, కుమారుడిని వరంగా ఇచ్చాడు. కానీ, ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. నారదుడి ద్వారా కుమారుడు పన్నెండేళ్లకే మృతి చెందుతాడని తెలుసుకున్న బ్రాహ్మణుడు, భార్యతో కలిసి విచార సముద్రంలో మునిగిపోయాడు. అయితే, భార్య ధైర్యం చెప్పి, మరణం తప్పనిదని, శోకించడం వ్యర్థమని చెప్పింది. తన భక్తి నిజమని నిరూపించాలని బ్రాహ్మణుడు మళ్లీ శ్రీహరిని ఆరాధించాడు.


అతని భక్తికి మెచ్చిన శ్రీహరి, కుమారుడికి సుదీర్ఘ జీవితాన్ని వరంగా ఇచ్చాడు. ఈ కథ, ధైర్యం, భక్తి యొక్క ఫలితాలను చాటిచెప్పడమే కాకుండా, మాఘమాస వ్రతం యొక్క మహిమను కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే, ఈ వ్రతం ద్వారా ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలు కలుగుతాయని పూర్వకాలపు ఋషులు చెప్పేవారు. అంతేకాకుండా, ఈ వ్రతం మనసుకు శాంతిని, ఆత్మకు తృప్తిని కలిగించి, జీవితంలోని కష్టాలను దాటే శక్తినిస్తుంది.```


        *విప్రుని పుత్ర ప్రాప్తి*```


గృతృనమద మహర్షిని చూసి జహ్నముని యిట్లనెను. “మహర్షీ! మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞాన మోక్షములు కలుగునా?, నా సందేహమును తీర్చుమ”ని అడుగగా మహర్షి ఇట్లు చెప్పెను. 


“జహ్నమునీ! వినుము మాఘమాస వ్రతమును ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు, పరలోక సుఖములు కలుగును. వారి కష్టములు తీరును, అందు వల్ల సంతుష్టుడైన మానవుడు ఇంకను హరి ప్రీతికరములగు వ్రతములను ఆచరించి జ్ఞానియై సత్కర్మల నాచరించి ముక్తినందును. అటువంటి కథని ఓక దానిని చెప్పెదను వినుము అని ఇట్లు పలికెను..


‘పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడు ఒకడు ఉండెను. అతడు వేద వేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి దయజ్ఞానము ఇంద్రియ జయము కలిగినవాడు. అతని భార్య ఉత్తమురాలు. వారిరువురికి  సంతానము లేదను లోటు తప్ప మరి దేనికిని లోటులేదు. పుత్రుడు లేరని విచార పడుచున్న ఆ బ్రాహ్మణుడు ఓక నాడు భార్యతో “గుణవంతుడు అయిన పుత్రుడొక్కడు అయినను మనకు కలుగలేదు, అట్టి పుత్రుడు ఒక్కడున్నను మన వంశమునకు మనకును సద్గతులు కలుగునాయని విచారపడెను”. 


అప్పుడు ఆమె ‘నాధా! నీవు తగిన పూజను చేయలేదేమో? అందువలన మనకు సంతానము కలుగలేదు అని అనుకొందును’ అని సమాధానము ఇచ్చెను. 


అప్పుడు ఆ  బ్రాహ్మణుడు ‘ప్రియా కష్టతరమైన తపమును ఆచరించి  అయినను, శ్రీమన్నారాయణుని సంతుష్టి పరచెదను. పుత్ర వరమును కోరుదు’నని చెప్పెను. 


కష్టతరమైన నియమములను పాటించి నిశ్చలమైన తపము చేసి మృకండు మహాముని వలె ఉత్తమ పుత్ర వరమును కోరెదననియు పలికెను. 


ఆ దంపతులు ఇరువురు తపమాచరించ వలెనని గంగాతీరమునకు పోయిరి.


బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచు శ్రీహరినిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపము ఆచరించెను. 


కొంత కాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యెను. అతడు నాలుగు చేతులయందును శంఖమును, చక్రమును, గదను ధరించియుండెను. వరమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టను కట్టెను. కౌస్తుభమను మణి భూషణమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యుల కాంతితోనుండెను. శాంత భూషితమై ప్రసన్నత కల శ్రీహరి ముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానముగ ఉండెను. నారద మహర్షి స్తుతించుచుండగా అప్సర కాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీసమేతుడై గరుత్మంతుని పైనెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయవచ్చెను.

తనను గమనించక తీవ్రతరమైన తపమున నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూసి చిరునవ్వుతో  “విప్రా! నేను నీకు వరమునీయవచ్చితిని, నీ తపమునుమెచ్చితిని” అని పలికెను. ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై, బాహ్య జ్ఞానము లేని స్థితిలో ఉండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరచి నిశ్చల చిత్తముతో అతడు చేయు తపము భగవంతుడగు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. 


అతనికి ఎట్టి వరమునైన ఈయవలయునని నిశ్చయించెను. వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలునట్లు చేసెను. మనస్సు చెదరగా నా బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలచియుండుటను గుర్తించెను. ప్రసన్నమూర్తిని జూచెను. ఆనంద పరవశుడైన అతడు శ్రీమన్నారాయణ మూర్తిని ఇట్లు స్తుతించెను.```     


      *విప్ర కృత విష్ణు స్తుతి*


నమస్తే దేవదేవేశ నమస్తే భక్తవత్సల |

నమస్తే కరుణాంశే నమస్తే నందవిక్రమ ||

గోవిందాయసురేశాయ అచ్యుతాయ వ్యయాచ |

కృష్ణాయవాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిణే ||

లోకస్థాయ హృదిస్థాయ అక్షరాయాత్మనే నమః |

అనంతాయాది బీజాయ ఆధ్యాయాఖిలరూపిణే ||

యజ్ఞాయ యజ్ఞపతయే మాధవాయ మురారయే |

జలస్థాయ స్థలస్థాయ సర్వగాయా మలాత్మనే ||

సచ్చిద్రూపాయ సౌమ్యాయ సమస్స్ర్వాఘనాశినే నమః |

కాలాయ కలయే కామితార్థ ప్రదాయచ ||

నమోదాంతాయ శాంతాయ విష్ణవే జిష్ణవే నమః |

విశ్వేశాయ విశాలాయ వేధసే విశ్వవాసినే ||

సురాధ్యక్షాయ సిద్దాయ శ్రీధరాయ నమో నమః |

హృషికేశాయ ధైర్యాయ నమస్తే మోక్షదాయినే ||

పురుషోత్తమాయ పుణ్యాయ పద్మనాభాయ భాస్వతే |

ఆగ్రేసరాయ తూలాయ ఆగ్రేసరాయాత్మనే నమః ||

జనార్థనాయ జై త్రాయ జితామిత్రాయ జీవినే |

వేదవేద్యాయ విశ్వాయ నారసింహాయతే నమః ||

జ్ఞానాయజ్ఞానరూపాయ జ్ఞానదాయాఖిలాత్మనే |

ధురంధరాయధుర్యాయ ధరాధారాయతే నమః ||

నారాయణాయశర్వాయ రాక్షసా నీకవైరిణే |

గుహ్యాయ గుహ్యపతయే గురవే గుణధారిణే ||

కారుణ్యాయ శరణ్యాయ కాంతాయామృతమూర్తయే |

కేశవాయ నమస్తేస్తు నమోదామోదరాయచ ||

సంకర్షణాయ శర్వాయ నమస్ర్తైలోక్యపాలినే |

భక్తప్రియాయ హరయే సమస్సర్వార్తి నాశివే ||

నానాభేద విభేదాయ నానారూప ధరాయచ |

నమస్తే భగవాన్ విష్ణో పాహిమాంకరుణాకర ||```


శ్రీ మన్నారాయణుని ప్రత్యక్షముగ చూచిన బ్రాహ్మణుడు భక్తితో ఆశువుగ చెప్పిన యీ స్తోత్రము అందరు చదువుట శ్రేయస్కరము.


జహ్నుమునీ! ఆ బ్రాహ్మణుడు అష్తోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతిస్తూ ఆనంద పరవశుమై  నమస్కరించుచు నిలిచియుండెను, భగవంతుడు వరమును కోరుకొనమనెను.


శ్రీహరి మాటలను విన్న ఆ విప్రుడు “స్వామీ! నీ పదములనందు నాకు నిశ్చలమైన భక్తిని ఇమ్ము, ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానమునిచ్చి, నాకు ముక్తినొసగుమని కోరెను. 


శ్రీహరి “నీవు కోరినట్లే వరము నిచ్చితిని, నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివినవారికి నేను శీఘ్రముగ ప్రసన్నుడనగుదు”నని పలికి యంతర్థానయ్యెను. 


బ్రాహ్మణుడు నష్టద్రవ్యమిక్కిలి  లాభము అందినవానివలె సంతసింసించు తన ఇంటికి చేరెను. 


కొంత కాలమునకు వాని భార్య గర్భవతి అయ్యెను. కుమారుడు కలిగెను. పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను.

కొంతకాలమునకు నారద మహర్షి వాని యింటికి వచ్చెను. బాలుని జూచి వీని ఆయుర్దాయము పన్నెండు సంవత్సరములేయని చెప్పి తన దారిని తాను పోయెను. 


ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలచుకొని విచారమగ్నుడయ్యెను. వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకొని కన్నీరు కార్చుచు నిట్టూర్పులు విశచుచుండెను. విచార వదనముతో ఆహారమును తీసికొనక విచారించుచుండెను. “నాధా నీవు త్రీవ్ర తపమొనర్చి వరముగా నీ పుత్రుని పొందితిని చంద్రుని వలె సంతాపమును కలిగించు నీ కుమారుడు పండ్రెండు సంవత్సరములు జీవించి విధ్యాభ్యాసము చేయుచు మరణించును కదా! నేనీ పుత్ర శోకము నెట్లు సహింపగలను?” అని భర్తతో పలికెను.


ఆ విప్రుడును భార్య మాటలను విని బాధపడుచు నామెనోదార్చి నిశ్చయించెను. ఆమె నూరడించుచు యిట్లనెను. ప్రియా దుఃఖింపకుము, దుఃఖము శరీరమును బాధించును. నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది అది యెవరిని విడువదు. మన పుత్రుడు పదుమూడవయేట మృతినందునని యిప్పుడు దుఃఖించుచుంటివా? నీకు నాకును యెప్పటికైనను మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనము మరణించిన తరువాతనైనా మరణింపక తప్పదు కదా! మరి ఈ ముందు వెనుకలు వయస్సులకు కలదు కాని మృత్యువునకు లేదు కదా. కావున నీవును శోకింపకుము జరుగవలసినది జరుగక తప్పదు. అట్టిచో నీకు విచారమేల? నీవు దుఃఖించినను కానున్నది కాక మానదు.

అనగా నీ శోకము నిష్ప్రయోజనము. ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మననుసరించి జన్మించును, మరణించును, కనిపించినది నశింపక నిలుచునా? కావున శోకింపుము” అని ఆమెను ఊరడించెను మరియు నిరర్థకమైన దుఃఖమును విడువుము. శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టుదును. నీవు ధైర్యముగ ఉండుము” అని పలికి మరల గంగా తీరమున చేరి నియమ నిష్ఠలతో శ్రీహరిని సర్వ ఉపచారములతో పూజించుచుండెను. 


శ్రీహరి అష్టాక్షరీ మంత్రమును జపించెను. 


శ్రీహరి వాని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యెను. బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణునకు సాష్టాంగ నమస్కారము చేసి నిలిచియుండెను.```


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*మాఘపురాణం పధ్నాలగవ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

మాఘపూర్ణిమ

 🌹 *మాఘపూర్ణిమ , మహామాఘి*


నేడు మాఘపూర్ణిమ. ఇది విశేష పర్వదినం. 

స్నానానికి ప్రముఖ మైన మాఘమాసంలో ప్రతి రోజూ సూర్యోదయం ముందు చెయ్యలేని వారు (స్నానం అంటే సూర్యోదయాత్ పూర్వం సభక్తికంగా, విధివిధానంగా చేసే స్నానం) 

ఈ రోజు నైనా చేయాలని ధర్మశాస్త్రోక్తి.

ఈ పూర్ణిమ నాడు సముద్రస్నానం విశేషం.

తిథుల్లో ఏ పూర్ణిమ అయిని సంపూర్ణంగా దైవీశక్తులు దీపించే పుణ్యతిథే. 

ఈ తిథినాడు ఇష్టదేవతారాధన, ధ్యానజపాది అనుష్ఠానాలు మహిమాన్విత మైన ఫలాన్ని ఇస్తాయి. 

ఈ రోజు సూర్యోదయానికి ముందు సముద్ర స్నానం చేయడం మంచిది.

అన్ని పూర్ణిమల్లోకి మాఘ, 

కార్తిక, 

వైశాఖ మాసాలలో వచ్చే పూర్ణిమలు ఎంతో ఉత్కృష్ట మైనవి. 

వాటిని వ్యర్థంగా గడుపరా దని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి.

*వైశాఖీ కార్తికీ మాఘీ*

*తిథయో౭ తీవ పూజితాః!*

*స్నాన దాన విహినాస్తా*

*ననేయాః పాండునందన!*

స్నానదానజపాది సత్కర్మలు లేకు౦డా వృథాగా ఈ మూడు మాసాల పూర్ణిమలను గడుపరాదు.

మాఘపూర్ణిమ నాడు 

*అలభ్యయోగం* అని కూడా అంటారు. 

అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది గొప్ప యోగ మవుతుంది. 

 అది అంత తేలికగా లభించేది కాదు.


(సేకరణ)

    🌹🌹🌹🌹🌹

*1. మాఘ పూర్ణిమ

 _*ఈ పూర్ణిమ సామాన్యమైనది కాదు.*_



*1. మాఘ పూర్ణిమ:*


 *చంద్రుని శక్తి గరిష్టంగా ఉండే పవిత్రమైన రోజు. నదీ స్నానం తప్పక చేయాలి, ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున సముద్ర స్నానం కోటి జన్మల పాపాలు తొలగిస్తుంది అని శాస్త్ర వాక్యం. ప్రయాగ లో మాఘ పౌర్ణమి రోజున సమస్త దేవతలు స్నానం చేస్తారు,ఆ నీటిలో దైవ శక్తి అపరిమితంగా ఉంటుంది,కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించడం ఎంత గొప్పదో మాఘ పౌర్ణమి రోజున స్నానం అంతకు పది రెట్లు విశిష్టమైంది, వీలైతే నది, కుదిరితే సముద్రం, లేదా ప్రయాగ స్నానం చేయండి, లేదా ఇంట్లోనే గంగా యమున మొదలైన నదులను స్మరిస్తూ సూర్యోదయంలోగానే స్నానం చేయాలి.*


*2. రవి పుష్య యోగం (పుష్యార్క యోగం):* 


 *పుష్యమి నక్షత్రం ఆదివారం రావడం వల్ల ఏర్పడే ఈ యోగం గ్రహణముతో సమాన శక్తి కలది,ఈ సమయంలో చేసే స్నానం,దానం, జపం అక్షయమైన ఫలితం ఇస్తుంది.* 


*3. శ్రీ లలితా జయంతి:* 


 *జగన్మాత లలితా దేవి భండాసుర సంహారం కోసం దేవతలు చేసిన మహాయగం నుండి ఆవిర్భవించిన రోజు. సాధారణంగానే పౌర్ణమి రోజున లలితా ఆరాధన ఎంతో గొప్ప ఫలాలు ఇస్తుంది, అందులోనూ యోగం తో కూడిన, మాఘ పౌర్ణమి రోజున రాత్రి వేళ చంద్రబింబం పాలలో చూస్తూ అందులో లలితా దేవిని ధ్యానిస్తూ లలితా సహస్ర నామాలు చదివితే ఎలాంటి కోరిక అయిన వెంటనే తీరుతుంది, ఇది బ్రహ్మాండ పురాణం చెప్పిన గొప్ప రహస్యం.* 


*4. థైపూసం:* 


 *ఇది తమిళుల ఉత్సవం, తారకాసుర సంహారం కోసం జన్మించిన సుబ్రహ్మణ్య స్వామికి పార్వతి దేవుడు శక్తి ఆయుధాన్ని ఇచ్చిన రోజు. జ్ఞాన సిద్ధికి, ఈరోజున తమిళ నాట విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారు.* 


5. *సర్వార్థ సిద్ధి & సిద్ధ యోగం:* 


 *మీరు చేసే ఏ ప్రయత్నానికైనా విజయాన్ని చేకూర్చే అద్భుత ఘడియలు ఇవి.* 


 *ఈరోజు చేసే చిన్న దానమైనా, పూజ అయినా, కొన్ని వందల రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది.* 


 *కనుక యథాశక్తి పూజ,ధ్యానం,జపం, స్నానం చేయడం ఉత్తమం.* 


 *ఈరోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం శుభ ప్రదం.* 


 *కనుక ఆధ్యాత్మికంగా ఎన్నో విశిష్టతలు ఉన్న ఈ గొప్ప సమయాన్ని వినియోగించుకొని దైవానుగ్రహాన్ని పొందగలరు.*


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

పంచాంగం



 

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం - పూర్ణిమ - పుష్యమి -‌‌ భానువాసరే* (01.02.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

31, జనవరి 2026, శనివారం

మహాభారతము

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*శనివారం 31 జనవరి 2026*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                    1️⃣2️⃣1️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*       

     

                    *121 వ రోజు*                 

*వన పర్వము పంచమాశ్వాసము*


*అగ్ని సముద్రములో దాగుట*```


కార్యభారంతో అలసి పోయిన అగ్ని అధర్వునితో ఇలా చెప్పాడు.. 

“యజ్ఞయాగాదులలో సమర్పించే హవిస్సులను దేవతల కందించి నేను అలసి పోయాను. ఇకపై ఆ కార్యాన్ని నీవు నిర్వహించు!” అని చెప్పి అగ్ని సముద్రంలో దాక్కున్నాడు. 


దేవతలందరూ అగ్ని ఎక్కడున్నాడో తెలియక వెదక సాగారు. ఇంతలో సముద్రంలోని చేపలు అగ్ని సముద్రంలో దాక్కుని ఉన్న విషయం దేవతలకు అందించాయి. 


అగ్నిదేవుడు ఆగ్రహించి”మీ చేపజాతిని మానవులు నిర్ధయులై తినెదరు కాక!”అని శపించాడు. 


దేవతలంతా “అగ్నిదేవా! నీవు యధావిధి మాకు హవిస్సులను అందించు!” అని అడిగారు. 


కాని అందుకు అగ్ని సమ్మతించక శరీరాన్ని విడిచి భూమిలో ప్రవేశించాడు. భూమి పై పడిన అగ్ని నుండి అనేక ధాతువులు ఆవిర్భవించాయి. చీము నుండి గంధకం, ఎముకల నుండి దేవదారు వృక్షములు, కఫం నుండి కర్పూరం, పిత్తం నుండి పచ్చలు, వాతము నుండి నల్లటి పాషాణము, గోళ్ళనుండి అభ్రకము, రక్తనాళముల నుండి పగడములు ఏర్పడ్డాయి. 


అగ్ని దేవుడు భూగర్భంలో తపస్సు చేసుకుంటున్నాడు. అధర్వుడు అగ్ని కార్యములన్నీ నిర్వహిస్తున్నాడు. దేవతలంతా అధర్వుని పూజిస్తున్నారు. అధర్వుని కాంతిని దేవతలు అతనిచే తృప్తి పడటాన్ని ఓర్వలేక అగ్ని బయటకు వచ్చి మరల హవిస్సును అందిస్తానని ముందుకు వచ్చాడు. 

ధర్మరాజా ఆ విధంగా ఎందరో అగ్నులు ఉన్నా అందరిలో వెలిగే అగ్ని ఒకటే!” అన్నాడు మార్కండేయుడు. ```


           *కుమారస్వామి*```


ధర్మరాజు “మహర్షీ! మహాసేనాని అని పిలువబడే కుమారస్వామి అగ్నిదేవునికి, కృత్తికలకు, శివునకు కుమారుడెలా అయ్యాడు?” అని అడిగాడు.```


                  *దేవసేన*```


మార్కండేయుడు “ధర్మరాజా! పూర్వం దేవేంద్రుడు రాక్షసులతో యుద్ధం చేసి ఓడి పోయాడు. రాక్షసులను గెలవడమెలా అని దేవేంద్రుడు మానస అనే కొండ మీద ఆలోచించే సమయంలో ఒక స్త్రీ ఆర్తనాదం వినపడింది. దేవేంద్రుడు ఆ స్త్రీని రక్షించాలని వెళ్ళి కేశి అనే రాక్షసుడు ఒక స్త్రీని ఆకాశమార్గంలో తీసుకు వెళ్ళడం చూసాడు. దేవేంద్రుడు తనవజ్రాయుధంతో అతనిని వెంబడించాడు. అతడు తన గధాయుధాన్ని ఇంద్రుని మీద విసరగా ఇంద్రుడు వజ్రాయుధంతో గధను ముక్కలు చేసాడు. కేశి ఆస్త్రీని వదిలి పారిపోయాడు. ఇంద్రుడు ఆ కన్యను చూసి “నీవెవరు? ఈ రాక్షసుడికి ఎందుకు చిక్కావు?” అని అడిగాడు. 


ఆమె “అయ్యా! నాపేరు దేవసేన, 

నా అక్క పేరు దైత్యసేన. మేము అరిష్టనేమి అనే ప్రజాపతి పుత్రికలము. మేము ఇక్కడ విహరిస్తుండగా ఈ రాక్షసుడు కామచేష్టలతో మమ్ము వేధిస్తున్నాడు. నా సోదరి దైత్యసేనకు అవి నచ్చాయి ఆమె అతనితో వెళ్ళింది. నాకు నచ్చలేదు కనుక నేను వెళ్ళలేదు. అతడు అంతటితో ఆగక తిరిగి వచ్చి నన్ను బలవంతంగా తీసుకు పోతున్నాడు. ఆ సమయంలో తమరు వచ్చి నన్ను రక్షించారు” అని చెప్పింది. ఇంద్రుడు మీ తల్లి,మాతల్లి దక్షుని పుత్రికలు. అందు వలన నీవు నాకు సోదరివి. నీకేం వరం కావాలో కోరుకో!” అని దేంద్రుడు అడిగాడు. 


ఆమె “దేవేంద్రా! మా తండ్రి నా చిన్నతనం నుండి నాకు మహా పరాక్రమవంతుడు, కీర్తిప్రతిష్టలు కల వాడు భర్తగా రాగలడని చెప్పాడు. ఆ మాటను మీరు నిజం చెయ్యండి. దేవతలకు రాక్షసులకు గెలువ శక్యం కాని వాడు, భయంకరమైన రాక్షసులను సంహరించే వాడు, ముల్లోకాలను రక్షించే వాడు, నీకు ఇష్టమైన వాడిని నాకు భర్తగా ప్రసాదించు!” అని కోరింది. 


ఆమె మాటలు విని దేవేంద్రుడు.. 

“ఈ రోజు అమావాస్య. సూర్యచంద్రులు ఏక రాశిలో ఉంటారు. ఇది సూర్యోదయం. రౌద్ర ముహూర్తం. అగ్ని మునులు అర్పించిన హవిస్సులను తీసుకుని సూర్య మండలంలో ప్రవేశిస్తున్నాడు. కనుక సూర్యుడు, చంద్రుడు, అగ్ని తేజములతో జన్మించిన వాడు ఈమెకు భర్త కాగలడు” అని అనుకున్నాడు. 

దేవసేనను తీసుకుని బ్రహ్మ వద్దకు వెళ్ళి దేవసేనకు తగిన భర్తను ప్రసాదించమని కోరాడు. 


బ్రహ్మదేవుడు “దేవేంద్రా! ఈ కన్యకు గొప్ప వీరుడు భర్త కాగలడు. అతడు దేవసేనకు సేనాధిపతి కాగలడు. నీ కష్టములు తీర్చగలడు” అన్నాడు.```


              *సశేషం*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

త్యాగరాజ స్వామి

 🙏🌺ఇది చాలా అరుదయిన త్యాగరాజ స్వామి వారి పటాలలో ఒకటి🌺🙏   


🌺ఆ రోజుల్లో బహుశః చిత్రకారులు కొన్ని సన్నివేశాల్నీ ఘట్టాలనీ తమ చిత్రాలలో భద్ర పరచేవారు కాబోలు తరువాతి తరాలకి!.

వెనక గుమ్మం దగ్గర నిలుచున్నావిడ ఆయన సతీమణి. ఈ వర్ణచిత్రం గురించి వెనక పెద్దలు ఒక మాట చెప్పగా నాకు జ్ఞాపకానికొచ్చింది! అది.....

ఒక పర్యాయం త్యాగయ్య గారింటికి సాయంవేళ కొంతమంది అతిథులొచ్చేరుట! శ్రీ త్యాగయ్య ఒక సామాన్య గృహస్తు. రాముని నమ్ముకొని ఆయన మీద కీర్తనలు అల్లి పాడుకుంటూ జీవిస్తున్న వ్యక్తి. ఇంట్లో తగినన్ని దినుసులు లేవని చింతిస్తూ శ్రీ రాముణ్ణి ధ్యానిస్తున్నాడు. ఇంతలో తలుపు ఎవరో కొట్టిన చప్పుడయింది. లేచి తలుపు తీసేడు శ్రీ త్యాగయ్య. ఒక అయిదుమంది పురుషులూ ఒక స్త్రీ కొన్ని మూటలతో నిలబడి ఉన్నారు. అందులో ఒకతను,.🌺

🌺'అయ్యా! మేం యాత్రలో ఉన్నాం. మాదగ్గర వండుకోవడానికి దినుసులున్నాయి. అయితే పాత్ర సామగ్రి లేదు..కాబట్టి మీ ఇంట్లో వండుకోనిస్తారా?' అనడిగేడు. త్యాగయ్య చాలా సాదరంగా అనుమంతించేడు! వారు తమ వస్తువులతో అక్కడున్న వారందరికీ వండి వడ్డించి త్యాగయ్యగారి దగ్గర శెలవు తీసుకోడానికి వచ్చేరు. నాద బ్రహ్మకి అనుమానం వచ్చింది! నిలదీసేడు! అంతే...వారంతా తమ స్వస్వరూపాలతో శ్రీ హన్మత్సమెత సీతారామ భరత, లక్ష్మణ, శత్రుఘ్నులుగా దర్శనం ఇచ్చేరు. త్యాగయ్య పొంగిపోయేడు!🌺

🌺అదీ ఈపటం

ఏవండీ ఇలా ఎక్కడయినా జరుగుతుందా?...అనడిగితే సమాధానం ఒక్కటే...జరుగుతుంది. తన్ను నమ్మిన భక్తుని సమస్య తీర్చటానికి భగవానుడు వస్తాడు. అది తన కర్తవ్యమని ఆయనే రామాయణంలో చెప్పుకున్నాడు.


 మంగళం మహత్.🌺

పంచాంగం 31.01.2026 Saturday, పంచాంగం 31.01.2026 Saturday,

  ఈ రోజు పంచాంగం 31.01.2026 Saturday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస శుక్ల పక్ష త్రయోదశి తదుపరి చతుర్దశి తిథి స్థిర వాసర పునర్వసు నక్షత్రం నిష్కంభ యోగః తైతుల తదుపరి గరజి తదుపరి వణిజ కరణం.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు. 

  


శ్రాద్ధ తిథి: చతుర్దశి


 

నమస్కారః , శుభోదయం

ఆర్యా శతకం - 1*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 15*


*అంకితశంకరదేహామంకురితో రోజకంకణాశ్లేషైః ।*

*అధికాంచి నిత్యతరుణీమద్రాక్షం కాంచిదద్భుతాం బాలామ్ ||*


*భావము :*


*ఒక నిత్య యౌవన యైన బాలా స్వరూపము శంకరుని దేహమును తన అంకిత సీమగా చేసుకున్నపుడు, ఆమె కౌగిలింతల అంకములు ఈశ్వరుని శరీరముపై ఏర్పడినవి. అటువంటి జగన్మాతను నేను కాంచీపురములో తిలకించాను.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా ।

సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి ।। 53 ।।


ప్రతిపదార్థ:


శృతి-విప్రతిపన్నా — కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా; తే — నీ యొక్క; యదా — ఎప్పుడైతే; స్థాస్యతి — ఉండునో; నిశ్చలా — నిశ్చలంగా; సమాధౌ — భగవంతుని యందు; అచలా — స్థిరముగా; బుద్ధిః — బుద్ధి; తదా — అప్పుడు; యోగం — యోగము; అవాప్స్యసి — నీవు పొందెదవు.


 తాత్పర్యము :


కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగ స్థితిని పొందెదవు.


  

 వివరణ:


సాధకులు ఆధ్యాత్మిక పథంలో పురోగమించేటప్పుడు తమ మనస్సులో వారికి భగవంతునితో సంబంధం బలపడుతూ ఉంటుంది. ఆ సమయంలో, తాము పూర్వం చేసే వైదిక కర్మలు ప్రతిబంధకంగా, సమయం తీసుకునేవిగా అనిపిస్తాయి. తమ భక్తితో పాటుగా ఇంకా పూజలు మొదలగునవి చేయాలా అని అనుకుంటారు మరియు పూజాది కార్యాలను వదిలి పూర్తిగా సాధనలో నిమగ్నమైతే ఏదైనా తప్పు చేసినట్టవుతుందా అని సంశయ పడతారు. ఇలాంటి వారు తమ సందేహానికి ఈ శ్లోకంలో జవాబు తెలుసుకొంటారు. కోరికలను తీర్చే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా సాధన లోనే నిమగ్నం అవటం తప్పు కాదని, పైగా అది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.


మాధవేంద్ర పూరి అనే ప్రఖ్యాత 14వ శతాబ్ద ముని చాలా దృఢంగా ఈ భావాన్ని వ్యక్తం చేస్తాడు. అతను ఒకప్పుడు విస్తృతమైన కర్మకాండ ఆచారాలు పాటించే ఒక వేద బ్రాహ్మణుడు, కానీ సన్యాసం తీసుకుని, పరిపూర్ణంగా శ్రీ కృష్ణభక్తిలో నిమగ్నమైపోయాడు. తన జీవిత తదుపరి దశలో, ఇలా అన్నాడు:


సంధ్యా వందన భద్రమస్తు భవతే


భోః స్నాన తుభ్యం నమః

భో దేవాః పితరశ్చతరపణ విధౌ


నహం క్షమః క్షమ్యతాం


యత్ర క్వాపి నిషద్య యాదవ కులోత్


తాస్య కంసద్విషః

స్మారం స్మారమఘం హరామి తదలం


మన్యే కిమన్యేన మే


 


‘అన్ని వైదిక ఆచారాలకి నా క్షమార్పణ అర్పిస్తున్నాను, ఎందుకంటే వాటిని పాటించటానికి ఇక నావద్ద సమయం లేదు. కాబట్టి ఓ ప్రియమైన, సంధ్యా వందనము (ఉపనయనం జరిగి యజ్ఞోపవీతం పొందినవారు రోజుకు మూడు సార్లు చేసే వైదిక ప్రక్రియ), పుణ్య స్నానాలు, యజ్ఞయాగాదులు, పితృకర్మలు వంటివి, దయచేసి నన్ను క్షమించండి. ఇప్పుడు, నేనెక్కడ కూర్చున్నా, కంస విరోధి అయిన శ్రీ కృష్ణ పరమాత్మనే ధ్యానిస్తున్నాను, అది చాలు నన్ను ఈ భౌతిక బంధాల నుండి విడిపించటానికి.’


శ్రీ కృష్ణుడు 'సమాధౌ-అచలా' అన్న పదాన్ని, భగవంతుని ధ్యాసలో ఉండే దృఢ సంకల్పాన్ని సూచించటానికి, ఈ శ్లోకంలో ఉపయోగించాడు. 'సమాధి' అన్న పదం 'సమ్' (సమత్వము) మరియు 'ధి' (బుద్ధి) అన్న మూలధాతువుల నుండి ఏర్పడింది, అంటే 'పరిపూర్ణ సమత్వ బుద్ధి స్థితి'. ఉన్నతమైన చైతన్యంలో స్థిర బుద్ధి కలిగి, ప్రాపంచిక భౌతిక ప్రలోభాల పట్ల మోహితుడు కానివాడు, ఆ యొక్క 'సమాధి' అంటే సంపూర్ణ యోగ స్థితిని పొందుతాడు.

31-01-2026 శనివారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

31-01-2026 శనివారం రాశి ఫలితాలు


మేషం


ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నూతన వస్తు వాహనాలు చేస్తారు. ఇంటాబయట నూతన ప్రణాళికలను అమలు పరుస్తారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది.

---------------------------------------


వృషభం


ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులను మరింత మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు కలసి వస్తాయి. ఉద్యోగమున అధికారులతో సమస్యలు కలుగుతాయి.

---------------------------------------


మిధునం


ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో మీ శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు వివాదాలు తీరి ఊరట చెందుతారు.

---------------------------------------


కర్కాటకం


రాజకీయ సంబంధిత సమావేశాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ యత్నాలు కలసి వస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగమున మీ పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు.

---------------------------------------


సింహం


దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. సోదరుల నుండి ధన పరమైన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------


కన్య


ముఖ్యమైన వ్యవహారాలలో పరిస్థితులు అనుకూలించవు. వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు.

---------------------------------------


తుల


గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమ ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో చికాకులు అధిగమించి ముందుకు సాగుతారు.

---------------------------------------


వృశ్చికం


చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి.

---------------------------------------


ధనస్సు


దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి.

---------------------------------------


మకరం


ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. చేపట్టిన పనులలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. నిరాశ కలుగుతుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి.

---------------------------------------


కుంభం


కీలక వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించి మీ మాటకు విలువ పెంచుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వ్యాపారాలలో నూతన నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. 

---------------------------------------


మీనం


దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. అధిక శ్రమతో స్వల్ప ఫలితం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

---------------------------------------

31జనవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🍁శనివారం🍁*

*🌹31జనవరి2026🌹*   

 *దృగ్గణిత పంచాంగం* 

                 

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - శుక్ల పక్షం*


*తిథి  : త్రయోదశి* ‌ఉ 08.25 *చతుర్దశి* రా.తె 05.52 వరకు

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : పునర్వసు* రా 01.34 వరకు ఉపరి *పుష్యమి*

*యోగం : విష్కుంబ* మ 01.33 వరకు ఉపరి ప్రీతి

*కరణం  : తైతుల* ఉ 08.25 *గరజి* రా 07.07 ఉపరి  

*వణజి* రా.తె 05.52 వరకు ఆపైన *భద్ర*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 11.00 - 01.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : రా 11.21 - 12.49

అభిజిత్ కాలం  : ప 11.58 - 12.44

*వర్జ్యం    : మ 02.30- 03.59*

*దుర్ముహూర్తం  :ఉ 06.39-08.10*

*రాహు కాలం   :ఉ 09.30-10.55*

గుళికకాళం      : *ఉ 06.39- 08.04*

యమగండం    : *మ 01.47 - 03.12*

సూర్యరాశి : *మకరం*                      

చంద్రరాశి : *మిధునం/కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 06.48*

సూర్యాస్తమయం :*సా 06.11*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం         :*ఉ 06.39- 08.55*

సంగవ కాలం         :*08.55 - 11.12*

మధ్యాహ్న కాలం    :*11.12 - 01.29*

అపరాహ్న కాలం    : మ *01.29-03.46*

*ఆబ్ధికం తిధి  :మాఘ శుద్ధ చతుర్దశి*

సాయంకాలం    :*సా 03.46- 06.03*

ప్రదోష కాలం      :*సా 06.03- 08.34*

రాత్రి కాలం         :*రా 08.34- 11.56*

నిశీధి కాలం       :*రా 11.56 - 12.46*

బ్రాహ్మీ ముహూర్తం : తె *04.58-05.48*

******************************

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏శ్రీ వేంకటేశ్వర స్తోత్రం🙏*


*కమలా కుచ చూచుక కుంకుమతో* 

*నియతారుణితాతుల నీలతనో*

*కమలాయతలోచన లోకపతే* 

*విజయీ భవ వేంకటశైలపతే*


*!!.ఓం నమో వెంకటేశాయ నమః.!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️


        *🍁శ్రీ ఆంజనేయ🍁*

*🍁సహస్రనామ స్తోత్రమ్.!!🍁*


*అనాదిగర్భగవాన్ దేవో* 

*విశ్వ హేతుర్జనాశ్రయః*

*ఆరోగ్యకర్తా విశ్వేశో*

*విశ్వనాధో హరీశ్వరః.!!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం - త్రయోదశి & చతుర్దశి - పునర్వసు -‌‌ స్థిరవాసరే* (31.01.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*