8, మే 2025, గురువారం

గురువారం🪷* *🌹08 మే 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🪷గురువారం🪷*

     *🌹08 మే 2025🌹*

     *దృగ్గణిత పంచాంగం*   

                

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*వైశాఖ మాసం - శుక్లపక్షం*


          *ఈనాటి పర్వం*

              *సర్వేషాం*     

         *మోహిన్యేకాదశి*  


*తిథి      : ఏకాదశి* ప 12.29 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం    : గురువారం* ( బృహస్పతివాసరే )

*నక్షత్రం   : ఉత్తర* రా 09.06 వరకు ఉపరి *హస్త*

*యోగం : హర్షణ* రా 01.57 వరకు ఉపరి *వజ్ర* 

*కరణం   : భద్ర* ప 12.29 *బవ* రా 01.41 ఉపరి *బాలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 08.00 - 09.30 & 11.00 - 12.00*

అమృత కాలం  : *మ 01.03 - 02.51*

అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.30*


*వర్జ్యం            : ఈరోజు లేదు*

*దుర్ముహూర్తం  : ఉ 09.56 - 10.47 మ 03.04 - 03.55*

*రాహు కాలం    : మ 01.40 - 03.16*

గుళికకాళం       : *ఉ 08.52 - 10.28*

యమగండం     : *ఉ 05.39 - 07.16*

సూర్యరాశి : *మేషం*

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 05.47*

సూర్యాస్తమయం :*సా 06.38*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.39 - 08.13*

సంగవకాలం         :*08.13 - 10.47*

మధ్యాహ్న కాలం    :     *10.47 - 01.21*

అపరాహ్న కాలం    : *మ 01.21 - 03.55*


*ఆబ్ధికం తిధి         : వైశాఖ శుద్ధ ద్వాదశి*

సాయంకాలం        :  *సా 03.55 - 06.29*

ప్రదోష కాలం         :  *సా 06.29 - 08.43*

రాత్రి కాలం           :*రా 08.43 - 11.41*

నిశీధి కాలం          :*రా 11.41 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.10 - 04.54*

--------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీ దత్తాత్రేయ అష్టచక్రబీజ స్తోత్రం*


*బ్రహ్మానందం బ్రహ్మముకుందం భగవంతం*

*బ్రహ్మజ్ఞానం జ్ఞానమయం తం స్వయమేవ |*


*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

తెలుగు సామెతలు

 🔴-తెలుగు సామెతలు -🔴

🚩🚩

సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. . "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.

           సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. 

ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు

 ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). 

పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు 

("ఊరక రారు మహానుభావులు"). 

సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును

 ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). 

ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును

 ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", 

"కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). 

ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును 

("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది").

 వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును 

("మనసుంటే మార్గముంటుంది")

 ప్రమాదమును హెచ్చరించవచ్చును

 ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). 

వాదనకు ముక్తాయింపు పాడవచ్చును

 ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). 

హాస్యాన్ని పంచవచ్చును 

("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").[

♦అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు

అర్ధం

సాధారణంగా అల్లుడంటేనే విశేష గౌరవ మర్యాదలు చూపడం మన సంప్రదాయం. ఇక విందు భోజనాలకి చెప్పనవసరం లేదు కాని ఎన్ని చేసిన ఏదోకారణంగా అల్లుడు తినలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే కొంతమందికి అన్నీ అందుబాటులో ఉన్నా అనుభవించటానికి ఏదో కారణంగా ఆటంకాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఈ సామెతని వాడుతుంటారు. 

మన దేశంలో అన్ని వనరులూ పుష్కలంగా ఉన్నాయి. కాని లంచగొండితనం వలన దేశం అభివృద్ధి కావడం లేదు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది

♦అక్కర వున్నంతవరకూ ఆదినారాయణ - అక్కఱ తీరిన తర్వాత గూదనారాయణ

దీనికి సమానర్థంలో మరికొన్ని సామెతలు: 

1. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం.

 2. ఏరు దాటునంత వరకు ఓడ మల్లయ్య గారు..... ఏరు దాటాక బోడి మల్లయ్య.

♦పండగ నాడు కూడా పాత మొగుడేనా?

సామెతను మార్చేసి పలుకుతున్నారు.

 పండగ పూట పాత "మడుగేనా" అన్నది అసలైన సామెత. మడుగు అంటే వస్త్రం అని అర్థం. పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకోవడం మన ఆనవాయితీ. ఆ అర్థంలో పుట్టిన సామెత పండగ పూట పాత బట్టలు కాదు కొత్త బట్టలు కట్టుకోవాలి అని.

ఇకపై ఈ సామెతకు తప్పుడు ప్రచారం మనం చేయకూడదు. సరైన రీతిలో నే పలుకుదాం, పలికిద్దాం.

♦పట్టు చీర అరువిచ్చి పీట పట్టుకొని వెనకాలె తిరిగినట్టుంది

మొగ మోటానికి పోయి ఒకామె మరొకామెకు పట్టు చీర అరువిచ్చిందట. ఆమె ఎక్కడన్నా కూర్చుంటే తన చీరకు మట్టి అంటుతుందని ఒక పీట తీసుకొని ఆమె ఎక్కడ కూర్చుంటుందో అక్కడ పీట వేసేదట.

 మొగమాటానికి పోయి కష్టాలు తెచ్చుకునే వారి గురించి ఈ సామెత పుట్టింది.

7, మే 2025, బుధవారం

సంతోషాన్ని నిర్ణయించగల హార్మోన్లు

 మనుష్యుల సంతోషాన్ని నిర్ణయించగల హార్మోన్లు నాలుగు ఉన్నాయి..


అవి..


1.ఎండార్ఫిన్స్

2.డోపమైన్

3.సెరొటోనిన్

4.ఆక్సిటోసిన్


ఈ హార్మోన్లని అర్థం చేసుకోవడం మనకి చాలా అవసరం..ఎందుకంటే మన సంతోషానికి ఇవి కారణం కాబట్టి ...


మొదటి హార్మోన్ ఎండార్ఫిన్స్ గురించి తెలుసుకుందాం..


మనము వ్యాయామం(exercise) చేసినప్పుడు మన శరీరం ఈ హార్మోన్ ని విడుదల చేస్తుంది ..


ఈ హార్మోన్ మనం వ్యాయామం చేసినపుడు కలిగే నొప్పిని తట్టుకునేందుకు సహకరిస్తుంది...అందుకే మనం మన వ్యాయామాన్ని ఉల్లాసంగా తీసుకోగలము ఎందుకంటే ఎండార్ఫిన్స్ మనకి ఆనందాన్ని కలిగిస్తాయి..


నవ్వితే కూడా ఎండార్ఫిన్స్ చాలా చక్కగా విడుదల అవుతాయి..


మనం రోజుకి కనీసం 30 నిముషాల వ్యాయామం చేయాలి..హాస్యసంబంధిత విషయాలను చదవటం కానీ చూడటం కానీ చేస్తే రోజుకి సరిపడా ఎండార్ఫిన్స్ లభిస్తాయి..


రెండవ హార్మోన్ డోపమైన్..


మనం మన జీవితంలో చిన్నవైనవో పెద్దవైనవో అయిన లక్ష్యాలను సాధిస్తూ ఉంటాము..ఆయా సందర్భాలకు తగినంత డోపమైన్ లభిస్తూ ఉంటుంది..


మనకి ఇంటి దగ్గరనో ఆఫీసులోనో ప్రశంసలు దొరికినప్పుడు సంత్రృప్తిగా అనిపిస్తుంది..అది ఈ డోపమైన్ విడుదల అవటం వలననే ..


ఇదే కారణం ఎక్కువ మంది ఇల్లాళ్ళు(housewives) ఆనందంగా ఉండలేకపోవటానికి కారణం తాము చేసే శ్రమకు తగిన గుర్తింపు ప్రశంసలు దొరకక పోవటమే వారి అసంతృప్తికి కారణం ...


ఒకసారి మనకు ఉద్యోగం దొరికాక..

కారు

ఇల్లు 

కొత్త కొత్త అధునాతన వస్తువులు ..

కొంటాము..

ఆయా సందర్భాలలో ఈ డోపమైన్ విడుదల అవుతుంటుంది, మనం ఆనందపడుతాము..


ఇప్పుడర్ధమైంది కదా మనం షాపింగ్ చేసినప్పుడు మనకి ఆనందంగా ఎందుకనిపిస్తుందో...


మూడో హార్మోన్ సెరెటోనిన్ మన వల్ల వేరొకరు ఆనందపడినప్పుడు, మనం వేరొకరికి ఉపకారం చేసినప్పుడు విడుదల అవుతుంది...


మనం సాటివారకి గానీ ప్రకృతికి గానీ సమాజానికి గానీ మంచి చేయగలిగినప్పుడు సెరిటోనిన్ విడుదల అవుతుంది..


అంతేకాదు..ఒకరి సమస్యలకు, ప్రశ్నలకు ..సలహాలు, సమాధానాలు బ్లాగ్స్ రూపంలోనో ఫేస్‌బుక్ గ్రూపు ల రూపంలోనో ఇవ్వగలిగినప్పుడు కూడా ఈ సెరిటోనిన్ విడుదల అయ్యి ఆనందంగా అనిపిస్తుంది...


అలా ఎందుకంటే మన విలువైన సమయాన్ని మరొకరికి సాయం చేసేందుకు ఉపయోగించడం మనకి సంతోషాన్ని ఇస్తుంది..


చివరి నాలుగవ హార్మోన్ ఆక్సిటోసిన్..మనం తోటివారితో అనుబంధాన్ని పెంచుకుని వారికి దగ్గర అయినప్పుడు విడుదల అవుతుంది..


మనం మన స్నేహితులనో కుటుంబసభ్యులనో ఆలింగనం (hug) చేసుకున్నప్పుడు ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది...మున్నభాయ్ అనే హిందీ సినిమాలో చెప్పినట్టు నిజంగా, ఒక ఆత్మీయఆలింగనం మంత్రం వేసినట్లుగా మాయ చేసి మనసుని కుదుటపరుస్తుంది...

అదేవిధంగా కరచాలనం, భుజాల చుట్టూ చేయి వేసి భరోసా ఇవ్వటం కూడా చాలా ఆక్సిటోసిన్ ని విడుదల చేయగలదు...


కాబట్టి ..

రోజూ వ్యాయామం ఎండార్ఫిన్స్ కోసం...

చిన్ని చిన్ని లక్ష్యాలను సాధిస్తూ డోపమైన్ కోసం..

తోటివారితో స్నేహంగా ఉంటూ సెరొటోనిన్ కోసం...

మన పిల్లలను ఆలింగనం చేసుకుంటూ ఆత్మీయులను దగ్గరకు తీసుకుంటూ ఆక్సిటోసిన్ కోసం..

జీవించే పద్ధతి ని అలవాటుచేసుకుంటూ ఉంటే ఆనందంగా జీవించగలమ

మనం సంతోషంగా ఉంటేనే మనం మన సమస్యలను సవాళ్ళను బాగా పరిష్కరించుకోగలము..


ఇప్పుడర్ధమైందా పిల్లలు చిరాకుగా ఉన్నప్పుడు వారిని దగ్గరకు తీసుకుని లాలించాలి...


అప్పుడు రోజురోజుకి మీ బిడ్డ సంతోషంగా హుషారుగా ఉండగలరు..


1.* ఆరుబయట ఆడుకునేలా ప్రోత్సహించాలి...ఎండార్ఫిన్స్


2.బిడ్డల చిన్న పెద్ద విజయాలకు ప్రశంసించాలి...డోపమైన్


3.సాటివారిని కలుపుకుంటూ వారితో సంతోషాలు పంచుకుంటూ జీవించే అలవాటుని మీరు పాటిస్తూ పిల్లలకూ అలవాటు చెయ్యాలి...సెరొటోనిన్


4. మీ బిడ్డ ను దగ్గరకు హత్తుకోండి...ఆక్సిటోసిన్...


జీవితాన్ని ఆనందమయం చేసుకోండి...🙂

ఆ రోజులే ఎంతో హాయి!

 శీర్షిక.. ఆ రోజులే ఎంతో హాయి!


ఆరోజులె ఎంతో హాయి

ఇది కాదనలేని నిజం 


కారంతో మండే పచ్చడి మెతుకులు తిన్నా

చల్దన్నం తిన్నా .. మారాం గారం 

అలుకలతో.. అమ్మ గుమ్మపాలు త్రాగి గడిచిన బాల్యం 

భీమునిలా బలవంతుని చేసిన పౌష్టిక ఆహారం

ఈనాడు డబ్బా పాలతో అవుతుంది పీలగా.. బలహీనంగా 


కొండలు ఎక్కుతూ, చెట్టూ చేమలపై ఎగబ్రాకుతూ

పొలాల గట్లపై గెంతుతూ.. చెరువుల్లో ఈదుతూ 

చెట్లెక్కిన ఆ బాల్యం ఎంతో అపూర్వం 

నాన్న తెచ్చిన తాజా తాజా బుట్టెడు మామిడి పండ్ల

రసాలు జుర్రుతూ.. ఆస్వాదించిన తీయని మమతల 

మాధుర్యం బాల్యం గుండె గుడిలో దాగింది..దొంగాటలు ఆడుతుంది 

నేను మళ్లీ నీకు కనిపించనంటూ..


బ్రహ్మ ముహూర్తం లో ఎక్కాల లెక్కల

చదువుతూ.. శతక పద్యాలు బట్టీ బెట్టింగులతో 

స్వర రాగాల పల్లకిలో..హల్లుల తైతక్కలతో 

చిలుకల పలుకుల పదాల పదనిసలతో 

సరస్వతీ నమస్తుభ్యం.. గురువే దైవంగా 

భావించిన విద్యాధనం పొందిన ఆరోజులే ఎంతో హాయి 


 కష్ట సుఖాల్లో కలిసీ మెలిసీ ఒకరికి ఒకరై అండగా 

తోడు నీడగా.. నిలిచిన ఉమ్మడి కుటుంబం 

ఆకలిని తీర్చే దయా గుణంతో 

వినయం శాంతీ సహనంతో వర్ధిల్లిన ఆ రోజులే ఎంతో హాయిగా..


వృద్ధాప్యంలో తీయని స్మృతులు 

ఆలపించాయి.. మది వెన్నెల కంటె చల్లగా సేదలు తీర్చాయి 

మమతలు వెల్లువగా 

ఆనాటి ఆ రోజులే ఎంతో హాయి కదా!!


°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

ఇది నా స్వీయ కవిత

దయాసముద్ర తరంగాలు*

 🌸 *దయాసముద్ర తరంగాలు*


(శృంగేరి శారదా పీఠం 36వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి జీవిత విశేషాలు)


శ్రీచరణులు నిరంతర పఠనశీలి. ఎన్నో గ్రంథాలను అవలోకిస్తుంటారు. కొన్ని పుస్తకాలను సంపాదించి శృంగేరికి వెళ్లినప్పుడు శ్రీచరణులకు సమర్పిద్దామని ఒక భక్తుడు అనుకుని పుస్తకాలను అమ్మే కొట్టుకువెళ్లాడు. అక్కడ పుస్తకాలను పరిశీలిస్తుంటే ఒకపుస్తకం పై అర నుండి క్రింద పడింది. అతను దానిని తీసి పైన పెట్టాడు. కాస్సేపటికి ఆ పుస్తకం మళ్లీ క్రిందపడింది. ఆ భక్తుడు తిరిగి దానిని పై అరలో పెట్టాడు. కొన్ని పుస్తకాలను ఎంచుకుని వాటిని డబ్బుకట్టే చోటికి తీసుకువెళ్తుంటే, రెండుసార్లు తాను పై అరలో పెట్టిన పుస్తకం మళ్లీ నేలమీదపడి ఉండటం చూసాడు. అప్పుడు ఆపుస్తకాన్ని కూడ కొన్నాడు.


శృంగేరికి వెళ్లి శ్రీచరణులను దర్శించిన తరువాత భక్తుడు తన సంచీనుండి తాను కొన్నపుస్తకాలను బయటికి తీసి శ్రీచరణులకు సమర్పించాడు అయితే మూడుసార్లు నేలమీద పడిన పుస్తకాన్ని మాత్రం సమర్పించలేదు.


శ్రీజగద్గురువులు : (ఆ పుస్తకాన్ని చూస్తూ) ఆపుస్తకమేమిటి?


భక్తుడు : యితరపుస్తకాలను వెదుకుతున్నప్పుడు దీనిని కొనాలనిపించింది.


శ్రీజగద్గురువులు : అలాగా! మేము దానిని ఒక్కసారి చూడవచ్చా?


భక్తుడు : తప్పక (పుస్తకాన్ని సమర్పిచాడు)


శ్రీజగద్గురువులు : (పుస్తకం పై అట్టను చూసి) ఆశ్చర్యంగా ఉంది. చాలా కాలంనుండి ఈ పుస్తకాన్ని మేము చదవాలనుకుంటున్నాము.


భక్తుడు : ఈవిధంగా ఈ పుస్తకాన్ని నేనెందుకు కొన్నానో నాకిప్పుడు అర్ధమైంది.


శ్రీచరణులు చిరునవ్వుతో యిలా అన్నారు "ఆ గొప్పతనం మాది కాదు. ఇలా. జరగాలని అమ్మవారి సంకల్పం. అలా జరిగింది."


ఆంగ్లమూలం:

కె.సురేష్ చందర్ గారు

https://chat.whatsapp.com/LbYrKf7JokM6lc6MEhj5if

తెలుగు అనువాదం : 

తుమ్మలపల్లి హరిహరశర్మ గారు.


🌸 *శారదే పాహిమాం శంకర రక్షమాం* 🙏

గోధుమగడ్డి రసం ఉపయోగాలు

 గోధుమగడ్డి రసం ఉపయోగాలు - సంపూర్ణ వివరణ.


       గోదుమగడ్డి రసం అనునది వైద్యంలో చాలా ప్రముఖపాత్ర కలిగి ఉంది. చాలా మందికి దీనియొక్క ఉపయోగాలు తెలియక నిర్లక్ష్యం చేస్తున్నారు . గత కొంతకాలంగా దీనిపైన కొంతపరిశోధన చేసి దీని ఉపయోగాలు తెలుసుకున్నాను. ఈ గోధుమగడ్డి రసం కేన్సర్ చికిత్సలో కూడా చాలా అద్బుతఫలితాలు ఇచ్చింది. ఇది జలుబు , దగ్గు లాంటి చిన్నచిన్న వ్యాధులనే కాక బ్లడ్ కేన్సర్ , కేన్సర్ వంటివాటిలో కూడా చక్కని ఫలితాలు ఇస్తుంది.


             డాక్టర్ థామస్ అనే పరిశోధకుడు కూడా ఈ గడ్డిపైనా చాలా అద్భుతపరిశోధనలు చేశాడు . ఈ గడ్డిలో జీవమున్న ఖనిజాలు , విటమిన్లు , ఇతర పోషకాలు అనేకం ఉన్నాయి అని కనుగొనినాడు. ఒక ఆరోగ్యవంతుడి రక్తములో ఉండే అన్ని రకాల పదార్ధాలు ఈ గోధుమగడ్డి రసములో ఉండును. ఈ గోధుమగడ్డి రసానికి "ఆకుపచ్చ రక్తం " అనికూడా పేరు కలదు. కేన్సర్ తో బాధపడువారు ఒక గ్లాసు నిండా గోదుమగడ్డి రసాన్ని రోజుకి నాలుగుసార్లు తీసుకొనవలెను . ఇలా రోజుకి నాలుగు గ్లాసుల చొప్పున గోదుమగడ్డి రసాన్ని తీసికొనవలెను .


              ఈ గోధుమగడ్డికి జీవమున్న ఆహారం అని పేరు కలదు. దీనిలో ఉండే "క్లోరోఫిల్" రక్తాన్ని శుద్దిచేస్తుంది. పేగుల్లోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది . గోదుమగడ్డి రసంలో ఉండు క్లోరోఫిల్ పార్టికల్స్ హిమోగ్లోబిన్ ని పోలి ఉంటాయి. అందువల్ల రక్తహీనతకు ఐరన్ లా పనిచేయును . ఈ క్లోరోఫిల్ గుండె పనితీరును మెరుగుపరుచును. శరీరవ్యవస్థను , పేగులను , మూత్రకోశం , ఊపిరితిత్తులను బాగుగా ప్రభావితం చేయును . దీనిలో విటమిన్ A , B , ఈ మరియు K పెద్దమొత్తంలో ఉంటాయి. గోధుమ కంటే 600 శాతం అధికంగా విటమిన్ B ను గోధుమగడ్డి కలిగి ఉంటుంది. గోధుమగడ్ది లో కేన్సర్ నివారణకు ఉపయోగపడు B17 పెద్దమొత్తంలో ఉన్నది. గోధుమల కంటే గోధుమగడ్డిలో 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 


                శరీరంలో 30 రకాల ఎంజైములను చురుకుగా ఉంచడానికి అవసరం అయిన మెగ్నీషియం ఖనిజాలు గోధుమగడ్డి రసములో తేలికగా లభ్యం అగును. ఇప్పుడు మీకు గోధుమగడ్డి రసం వాడటం వలన నయం అయ్యే కొన్నిరకాల వ్యాధుల గురించి తెలియచేస్తాను . అవి 


     చర్మవ్యాధులు , మానసిక , శారీరక వ్యాధులు , మూత్రకోశ సంబంధ వ్యాధులు , మూత్రపిండాలలో రాళ్లు , మలబద్దకం , కడుపువ్యాధులు , మధుమేహం , గుండెవ్యాధి , కీళ్లు , కండరాల వ్యాధులు , ఆస్తమా , వంధత్వము , కన్ను , చెవి సంబంధ వ్యాధులు , కంపవాతం , దీర్ఘకాలిక జలుబు , అగ్నిమొలలు , వయస్సుకు ముందే జుట్టు నెరవడం , స్త్రీ గర్భసంబంధ వ్యాధులు , నిద్రలేమి , రక్తహీనత , కేన్సర్ వంటి వ్యాధులు 


             పైన చెప్పిన సమస్యలతో బాధపడువారు రోజుకు నాలుగు గ్లాసుల చొప్పున తక్కువలోతక్కువ 21 రోజులపాటు తీసుకొనవలెను .


    

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

నిమిత్త మాత్రులం

 *🙏🏻🙏🏻🙏🏻జై శ్రీ సంతోషిమాత 🙏🏻🙏🏻🙏🏻*


💎 *ఒక రోజు హనుమంతుడు శ్రీరాముణ్ణి కలుసుకున్నాడు. తన మనసులో కదులుతున్న ఆలోచనలను విన్నవించుకున్నాడు. "ప్రభూ! ఒక వేళ నేను లంకకు వెళ్ళకపోతే నా జీవితంలో ఎంతో పెద్ద లోపం మిగిలిపోయేది. అన్నిటికంటే ముందు విభీషణుడి ఇంటిని నేను చూశాను "ఈ రావణ లంకలో సాధువులు కూడా ఉంటారా" అనుకున్నాను. నేను లంకలో సీతాదేవిని వెతక లేకపోతే విభీషణుణ్ణి కలిసినప్పుడు ఉపాయం చెప్పాడు.*💎


              *నేను ఎంత ప్రయత్నించినా తెలియని విషయం లంకలో ఉన్న ఆ సాధువు ద్వారానే నాకు తెలిసింది ప్రభూ! బహుశా ఈ దృశ్యం చూపించడానికే ఇక్కడకు నన్ను పంపిచారేమో! అశోక వాటికలో రావణుడు వచ్చినప్పుడు ఆయన క్రోధంతో కత్తి దూసి సీతమ్మను చంపబోతుంటే, నాకు ఒక్కసారిగా దూకి, ఆ కత్తిని లాక్కొని, అతని తల ఖండించా లనిపించింది.*💎


        🔔 *కాని మరుక్షణమే మండోదరి రావణాసురుని చెయ్యి పట్టుకుని ఆపింది. ఆ దృశ్యం చూసి నేను పులకరించిపోయాను. ఓ తండ్రీ! మీరు ఎంతమంచి పాఠాన్ని నేర్పించారు! ఒకవేళ నేను సీతమ్మను రక్షించి ఉంటే "నేను లేకపోతే ఏమయ్యేది" అనే భ్రమ ఏర్పడేది. చాలమందికి "నేను లేకపోతే ఎలా?" అనే ఇలాంటి భ్రమ ఏర్పడుతుంది. నాకు కూడా అదే జరిగేది. ప్రభూ!*🔔


            *మీరు సీతమ్మను రక్షించడమే కాదు, ఆ పనిని రావణుడి భార్యకే అప్పగించారు. సీతమ్మకు ఏమవుతుందనే చింత, భయం నాకు తొలగిపోయాయి. అలాగే, త్రిజట లంకలోకి కోతి వచ్చిందని చెప్పింది. నాకు త్రిజట కూడా ఒక గొప్ప సాధ్విని అనిపించింది. ఈ కోతి లంకను తగుల బెడుతుందని చెప్పింది. కాని మరి "నా శ్రీరాముడు లంకను తగుల బెట్టమని చెప్పలేదు కదా? ఎలా?" అని ఆలోచనలో పడిపోయాను.*🔔


       🤔 *రావణాసురుడి సభలో నేను బంధితుణ్ణి అయితే ఎలా ఉంటుందో చూడ్డానికి బందీని అయ్యాను. రావణుడి సైనికులు నన్ను చంపడానికి వచ్చినప్పుడు నన్ను రక్షించుకోవడానికి నేను ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. కాని దూతను చంపడం సరికాదని విభీషణుడు చెప్పాడు. నన్ను రక్షించడానికి ఈ ఉపాయం మీరే చేశారని నాకు అర్థమయింది.*🙂


            *ముందు విభీషణుణ్ణి నాకు చూపి నా భ్రమను తొలగించారు. సీతమ్మను రక్షించడానికి మండోదరిని నియమించారు. నన్ను రక్షించడానికి రావణుడి తమ్ముణ్ణి పంపించారు. ప్రభూ! అన్నింటి కంటే ఆశ్చర్యకరమైన విషయం...రావణుడు " కోతిని చంపకూడదు. కాని దాని తోకకు నూనెలో ముంచిన వస్త్రాన్ని చుట్టి నిప్పు అంటించవచ్చు" అన్నాడు. ఆ విధంగా లంకలో త్రిజట చెప్పిన మాట సత్యమయింది. "లంకను తగులబెట్టడానికి నూనెనూ, నిప్పునూ నేను ఎక్కడినుంచి తీసుకురాగలను" అనుకున్నాను. కానీ ఆ ఏర్పాట్లు కూడా రావణాసురుడే చేశాడు. రావణుడితో కూడా మీరు పని చేయించు కున్నప్పుడు నాతో చేయించు కోవడం పెద్ద విషయమేమీ కాదు" అన్నాడు వినయంగా.*


          *అందుకే ఈ ప్రపంచంలో ఏది జరుగుతున్నా అది కర్మసిద్ధాంతం ప్రకారమే, దైవ సంకల్సం తోనే. మనం కేవలం "నిమిత్త మాత్రులం" అని గుర్తుంచుకోవాలి*👍🏼🔔🙏🏼🙏🏼.. *ఆంధ్ర ఫోకస్✍️*సర్వేజనా సుఖినోభవంతు🙏🏻🙏🏻*

జై గణేష్

 జై గణేష్

ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః

శుభోదయం.


శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే


ఓం గం గణపతయే నమః


అగజానన పద్మార్కం గజానన మహర్నిశం

అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా


సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః 

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః 


ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః 

వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః 


షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి 

విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా 

సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య


శ్రీ గురుభ్యోన్నమః


గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।

గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ।।


సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం

అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం


పూజ్యాయ రాఘవేంద్రాయ, సత్య ధర్మ రతాయచ, భజతాం కల్పవృక్షాయ, నమతాం కామధేనువే.


లోకాః సమస్తాః సుఖినోభవంతు ॥

శుభమస్తు, 

ఓం శాంతి.. శాంతి.. శాంతిః

ఇద్దరే బలవంతులు

 *ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు. వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను అంటుంది🌲*


*కాళిదాసు*


*🌻మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు. మిట్టమధ్యాహ్న సమయానికి ఒక గ్రామానికి చేరుకున్నాడు. బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు.*


*🌻ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది. ఆమెను చూసి బాలికా! నాకు దాహంగా ఉంది. నీళ్లు ఇవ్వమని అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక,‘మీరెవరో నాకు తెలియదు నీళ్లు ఎలా ఇచ్చేదను’అని బదులిచ్చింది.*


*🌻కాళిదాసు ‘నేను ఎవరో తెలియకపోవడం ఏంటి? పెద్ద పండితుడను ఎవరిని అడిగినా చెబుతారు’అని అన్నాడు. అహంకార పూరితమైన ఆ మాటలు విని బాలిక నవ్వి,మీరు అసత్యమాడుతున్నారు. ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు. వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను’ అంటుంది.*


*🌻అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి. ‘నాకు తెలియదు గొంతు ఎండిపోతోంది ముందు నీళ్లు ఇవ్వమ’ని బతిమాలుకుంటాడు. అయినా ఆ బాలిక కనికరించదు. ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి, దాహం.*


*🌻ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు? అని అడుగుతుంది బాలిక. ‘నేను బాటసారి’ని అన్నాడు కాళిదాసు. మళ్లీ అసత్యమాడుతున్నారు. బాటసారి అంటే ఒకచోటి నుంచి మరోచోటికి బడలిక లేకుండా వెళ్లాలి.*


*🌻మీరేమో అలిసిపోయారు కదా, ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు. వారే సూర్యచంద్రులు! అని చెప్పి గుడిసెలోకి వెళ్లింది బాలిక.*


*🌻దాహానికి తట్టుకోలేక ఆ గుడిసె ముందే నిలబడి, ‘మాతా నీళ్లు ఇవ్వండి దాహంతో చనిపోయేలా ఉన్నాను’ అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు. లోపలి నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి ‘మీరెవరో సెలవివ్వండి నీళ్లిస్తాను’ అంది. కాళిదాసు దీనంగా ‘నేను అతిథిని!’ అని బదులిచ్చాడు.*


*🌻మీరు అసత్యం చెబుతున్నారు. ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు. ఒకటి ధనం, రెండోది యవ్వనం. ఈ రెండూ ఎప్పుడు వెళ్లిపోతాయో ఎవరికీ తెలియదు అంటుంది. కాళిదాసు ‘నేను సహనశీలిని నీళ్లు ఇవ్వండ’ని వేడుకుంటాడు. కానీ ఆమె మీరు మళ్లీ అసత్యమే చెబుతున్నారు. ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు ఉన్నారు. ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు నీవెవరు? అని అడిగింది.*


*🌻ఓపిక నశించిన కాళిదాసు, ‘నేను మూర్ఖుడను ఇప్పుడైనా నీళ్లివ్వండ’ని అడిగాడు. ఆ అవ్వ నవ్వుతూ, ఇదీ అసత్యమే. ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు, అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు అని అంటుంది.*


*🌻ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు. ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది. ‘కాళిదాసా! విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ, అహంకారం కాదు నాయనా! కీర్తిప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష’ అని జలమును అనుగ్రహిస్తుంది.*


*🌻విద్య, అధికారం, ధన బలముతో మనిషికి అహంకారం పెరగకుండా చూసుకోవాలి.*


🙏ఓంనమఃశివాయ హరహరమహదేవశంభోశంకర🙏

6, మే 2025, మంగళవారం

వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు

 అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు


ఇంట్లో వంట ఆగిపోవడంతో అమెరికాలో ఏం జరిగింది?


1980ల నాటి ప్రఖ్యాత అమెరికన్ ఆర్థికవేత్తలు, కుటుంబంలో బయటి నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేస్తే, దేశంలో కుటుంబ వ్యవస్థ క్రమంగా అంతరించిపోతుందని అమెరికన్ ప్రజలను హెచ్చరించారు.


కుటుంబ సభ్యులకు బదులు బయటి నుంచి వచ్చే పిల్లల పెంపకానికి ఏర్పాట్లు చేస్తే పిల్లల మానసిక వికాసానికి, కుటుంబానికి కూడా ప్రాణాపాయం తప్పదని రెండో హెచ్చరికతో పాటు.


కానీ చాలా తక్కువ మంది మాత్రమే అతని సలహాను పాటించారు. ఇంట్లో వంట చేయడం దాదాపు ఆగిపోయింది మరియు ఆర్డర్ చేయడం (ఇది ఇప్పుడు ఆచారం) అమెరికన్ కుటుంబం అంతరించిపోయేలా చేసింది, నిపుణులు హెచ్చరించారు.


ఇంట్లో వంట చేయడం అంటే కుటుంబ సభ్యులతో ప్రేమగా కనెక్ట్ అవ్వడం.


వంట అంటే కేవలం ఆహారాన్ని వండడమే కాదు. బదులుగా, కుటుంబ సంస్కృతి కేంద్ర బిందువు.


ఇంట్లో కిచెన్ లేదు, ఒకే బెడ్ రూమ్ ఉంటే అది ఇల్లు కాదు, హాస్టల్.


ఇప్పుడు తమ వంటగదిని మూసివేసి, పడకగది ఒక్కటే సరిపోతుందని భావించిన అమెరికన్ కుటుంబాలు ఎలా ఉంటాయి?


1971-72లో, దాదాపు 72% అమెరికన్ కుటుంబాలు భార్యాభర్తలు, వారి పిల్లలతో నివసిస్తున్నారు.


2020 నాటికి, ఈ సంఖ్య 22%కి తగ్గింది.


2-ఇంతకుముందు సహజీవనం చేసిన కుటుంబాలు ఇప్పుడు వృద్ధాశ్రమంలో (వృద్ధాశ్రమం) నివసిస్తున్నాయి.


3- అమెరికాలో, 15% మహిళలు అణు కుటుంబాలలో నివసిస్తున్నారు.


4-12% మంది పురుషులు కూడా న్యూక్లియర్ కుటుంబాలుగా జీవిస్తున్నారు.


USలో 5-19% కుటుంబాలు ఒకే తండ్రి లేదా తల్లికి చెందినవి.


ప్రస్తుతం అమెరికాలో పుట్టిన పిల్లల్లో 6- 38% మంది పెళ్లికాని మహిళలకు జన్మించారు.వారిలో సగం మంది బాలికలు, కుటుంబ రక్షణ లేకుండా చిన్నవయసులోనే శారీరక వేధింపులకు గురవుతున్నారు.


యునైటెడ్ స్టేట్స్లో దాదాపు 52% మొదటి వివాహాలు విడాకులతో ముగుస్తాయి.


8- 67% రెండవ వివాహాలు కూడా సమస్యాత్మకమైనవి.


వంటగది మరియు పడకగది మాత్రమే లేకపోతే అది పూర్తి ఇల్లు కాదు.


వివాహ వ్యవస్థ విచ్ఛిన్నానికి యునైటెడ్ స్టేట్స్ ఒక ఉదాహరణ.


మన ఆధునికవాదులు కూడా అమెరికాలో లాగా దుకాణాల నుండి లేదా ఆన్‌లైన్‌లో ఆహారాన్ని కొనుగోలు చేయడాన్ని సమర్థిస్తున్నారు మరియు మేము వంట సమస్య నుండి విముక్తి పొందామని సంతోషిస్తున్నారు. దీనివల్ల భారత్‌లోని కుటుంబాలు కూడా అమెరికా కుటుంబాల మాదిరిగానే మెల్లమెల్లగా నాశనమవుతున్నాయి.


కుటుంబాలు నాశనం అయినప్పుడు, మానసిక మరియు శారీరక ఆరోగ్యం రెండూ క్షీణిస్తాయి. అనవసరమైన ఖర్చుతో పాటు, బయటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరం లావుగా మారి ఇన్‌ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.


ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా శారీరక ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యం చాలా అవసరం.


అందుకే బయట తిండికి దూరంగా ఉండమని మా ఇంటి పెద్దలు సలహా ఇచ్చేవారు.


అయితే ఈరోజు మనం నా కుటుంబంతో కలిసి రెస్టారెంట్‌లో తింటాము...",


Swiggy మరియు Zomato ద్వారా తెలియని వ్యక్తులు (వివిధ రసాయనాలతో) వండిన ఆహారాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం మరియు తినడం ఉన్నత విద్యావంతులు, మధ్యతరగతి ప్రజలలో కూడా ఫ్యాషన్‌గా మారుతోంది.


ఈ అలవాటు దీర్ఘకాలిక విపత్తుగా మారుతుంది.


ఈ రోజు మనం మన ఆహారాన్ని నిర్ణయించడం లేదు, దీనికి విరుద్ధంగా ఆన్‌లైన్ కంపెనీలు మనం ఏమి తినాలో మానసికంగా ప్రకటనల ద్వారా నిర్ణయిస్తాయి.


మన పూర్వీకులు ఆరోగ్యంగా మరియు దీర్ఘకాలం జీవించారు ఎందుకంటే వారు ప్రయాణానికి వెళ్ళే ముందు కూడా వండిన తాజా ఆహారాన్ని ఇంటికి తీసుకెళ్లేవారు.


అందుకే ఇంట్లోనే తయారు చేసుకొని కలిసి తినండి. పౌష్టికాహారం కాకుండా, ప్రేమ మరియు ఆప్యాయత ఉంటుంది.


ఈ సందేశాన్ని కనీసం 5 గ్రూపులకు పంపాలి


కొంతమంది పంపరు కానీ మీరు ఖచ్చితంగా పంపుతారని నేను నమ్ముతున్నావ


(వాట్సప్ సేకరణ)

దేవుని మరువ రాదు*

 *దేవుని మరువ రాదు*

మనం ఎంత తెలివైన వారమైనా, భగవంతుని దయ లేకుండా మనము చేపట్టిన పని విజయవంతం కాదని మనం అంటాము.  అందుకే, మన పూర్వీకులు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు.  

 వ్యక్తి జీవితం రథం లాంటిది.రథానికి రెండు వైపులా రెండు చక్రాలు అవసరం.ఆ చక్రాలలో ఏదైనా ఒకటి లేకపోయినా, రథం కదలదు. అలాగే, మానవ జీవిత రథానికి రెండు చక్రాలు ఏమిటని మనం అడిగితే, ఒకటి మన ప్రయత్నం, మరొకటి భగవంతుని దయ. మన జీవిత రథం ఈ రెండు చక్రాలపైనే కదులుతుంది. మనం మన రథాన్ని ఒకే చక్రంతో నడపాలని చూస్తాము.  అది సాధ్యం కాదు.  

అందుకే కొంతమంది అదృష్టాన్ని నమ్మరు, "నేను మనసు పెడితే ఏదైనా సాధించగలను" అనే అహంకారం కలిగి ఉంటారు.ఇది తప్పు, కొంతమంది ఆలోచిస్తారు, "నాకు దేవుని దయ ఉంటే, ప్రతిదీ జరుగుతుంది, నేను దాని కోసం ఎందుకు కష్టపడాలి?"  జాత్యం (జడత్వం) అనే స్వభావం ఉంటుంది.

ఇది కూడా తప్పు.  మీరు ప్రయత్నం చేస్తే, దేవుని కృప మీకు తోడుగా (సహాయకుడిగా) ఉంటుంది, కానీ మీరు ప్రయత్నమే చేయకుండా దేవుని కృప మాత్రమే సరిపోతుందని చెప్పకుండా మీరు కూర్చుంటే, ఆ పని జరగదు.  కాబట్టి, మనం ఎంత తెలివైన వారమైనా, దేవుడిని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఆయనను నిత్యం స్మరిస్తూ, ఆరాధిస్తూనే ఉండాలి.ఆయన కృపకు పాత్రులు కావాలి.

*— జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు*

4, మే 2025, ఆదివారం

జానపదసాహిత్యం

 జానపదసాహిత్యం ----స్త్రీల పాటలు

   🙏🙏🙏 మొదటి భాగము 

జానపద సాహిత్యంలో స్త్రీల పాటలకు విశేష ప్రాధాన్యం కలదు.జానపద సాహిత్యం అంటేనే స్త్రీల పాటలు అనే అర్ధం స్థిర పడింది.

జీవిత ప్రవాహంలో ప్రతి సందర్భంలోను స్త్రీల పాటలు చోటు చేసుకున్నాయి. జానపదుల జీవితమే సాహిత్యం అయింది.

జానపద సాహిత్యమున గేయ, వచన, రూపకము అను మూడు ప్రధాన శాఖలున్నవి. గేయశాఖ కథా సహితమనియు, కథారహిత మనియు రెండు విధములు. కథా సహితమైన గేయములను కథాగేయములనియు, కథా రహితమైన గేయములను జానపద గేయములని, పల్లె పాటలని అంటారు. ఒకప్పుడు రేడియో లో రోజూ పల్లెపాటలు అనీ జానపద గేయాలని వినిపిస్తూ ఉండేవారు. ఇప్పుడు టీవీలు వచ్చిన తరువాత సంవత్సరానికి ఏదో ఒక్క రోజు మొక్కుబడి వినిపిస్తున్నారు.జానపద కవిత్వంలో గేయానిదే అగ్రస్థానం . గేయరూపంలో భావ ప్రధానంగా వెలువడే ఆశురచన జానపద గేయం.

. బ్రతుకులోని ఆనందాన్ని , విషాదాన్ని జానపదుడు తన జానపద గేయంగా రూపొందించాడు . ఒకరి చెవి నుండి మరొకరికి మౌఖిక ప్రసరంలో వ్యాపించిన సామాన్య ప్రజాసమూహ గీతాలే జానపదగేయాలు. సంగీత సాహిత్యాలతో కూడిన నిరక్షరాస్యుని భావగీతం జానపద గేయం. జానపదులు పనులు చేసేటప్పుడు కష్టము కనబడకుండా ఉండడము కోసం అప్రయత్నముగా కూనిరాగాలు తీయడం ఏవో ఏవో మాటలు లయతో అనడము సంభవిస్తుంది. పొలాల దగ్గర పనిచేసేవాళ్ళు, బండ్లు లాగేవాళ్ళు, కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళు పాటలు పాడటం వింటూనే ఉంటాం. అలా ఏర్పడినవే జానపద గేయాలు. వేట ఆదిమానవుని ప్రధాన వృత్తి. వేటాడిన తర్వాత వేట ద్వారా కలిగిన భావోద్వేగంతో నృత్యాలు చేస్తూ మాట్లాడిన భాష లయబద్ధంగా వుండేదని ఊహించవచ్చు. ఆదిమానవులు తమ సుఖదుఃఖాలను మానవాతీత శక్తులకు విన్నవించు కునేటప్పుడు లయాత్మక గీతాలు ఆలపించి ఉండవచ్చు.

మహాభారతంలో నన్నయ వాడిన సీసము, గీతము, మధ్యాక్కర, తరువోజులను జానపద గేయాలుగా పేర్కొనవచ్చు. నన్నెచోడుడు కుమారసంభవంలో గౌడు గీతములు, రోకటి పాటలు, అంకమాలికలు, మొదలగువాటిని పేర్కొన్నాడు. పాల్కురికి సోమన బసవపురాణంలో అతీత బసవపురాతన భక్తగీతార్థ సమితియే మాతృకగా రచించినట్లు చెప్పాడు. పండితారాధ్య చరిత్రలో తుమ్మెద పదములు, పర్వత పదములు, వ్రాలేశు పదములు, వెన్నెల పదములు, నివాళి పదములు, రోకటి పాటలు మొ||వాటిని పేర్కొన్నారు.

సీతమ్మ వారి సమర్త పాట మరియు రోకటి పాట

 

సువ్వి రామచంద్ర సువ్వి సువ్వి కీర్తిసాంద్ర సువ్వి

సువ్వి సీతమ్మ మాకు శుభములిమ్మా॥


సృష్టిలో సీతమ్మ సమర్త కొట్నాలు దంచ

వేడ్కతో పేరంటాండ్రు వేగవచ్చిరీ ॥సు॥


పసిడిరోకళ్ళు బట్టి పద్మకుఖులు సువ్విదంచ

కనుల పండుగాయె కౌసల్య కప్పుడు

ఘల్లు ఘల్లుమనుచు హస్త కంకణమ్ము లెల్ల కదల

కొబ్బరీ బెల్లమ్ము కోరిదంచిరీ॥


నువ్వులా పప్పుదంచి నూటికీ పంచిబెట్ట

ఘనముగా పేరంటాండ్రు కలసి దంచిరీ॥


చిమిలి పళ్ళెరముల సమ్మతిగా దోడుకొని

ఇమ్ముగ నుండలు చేసిరి కొమ్మలు॥


కౌసల్యపుడు వచ్చి కాంతలందరిని బిలిచి

బంగరూ తబుకులతో పంచిబెట్టెను॥


తెలుగు వారి పండగలలో సంక్రాంతి పండగకి ఒక ప్రత్యేకత ఉంది . తెలుగు వారికి పెద్ద పండగ . సంక్రాంతి ముందు ఆడపిల్లలు గుంపులుగా వచ్చి గుండ్రంగా తిరుగుతూ గొబ్బి,’ పాటలు పాడతారు .

గొబ్బి యెల్లో గొన్ని గొన్ని పాడరమ్మా /గొబ్బాలి లాల యో /చందమామ , చందమామ ఓ చందమామ / చందమామ కూతుళ్ళు నీలగిరి కన్నెలు

/నీలగిరి కన్నెలకు నిత్య మల్లె తోట /నిత్య మల్లె తోటలో నిమ్మల్ల బావి

/నిమ్మల్ల బావికి గిళ కల్ల తాడు /గిళ కల్ల తాడుకు బుడిగి బుడిగి చెంబు” అంటూ సాగుతుంది .

సీతమ్మ వేవిళ్ళు , జానపదుల కల్పనలో సిరి మంతు లయ్యేది చక్రవర్తులయ్యేది . జానపదుల మాటలే వాడతారు .🪀

ఓ యమ్మ సీతకి యెన్నమ్మ నెలలు ?

/ఒకటాయే , రెండాయే మూడు నెల లాయె /మూడు నెలలకు సీత కేమి మనసాయె

/పులిపాలు తెమ్మని పురుషునితో జెప్పు /తన మరిది లక్ష్మన్న పులి వేటగాడు

/పుట్ట మీద బొనోగ్గి పులిని బడగొట్టి /పులి జలపి పులి పాలు దొన్నెల్ల

/యిదిగోను వదినమ్మ నీ కోరికల్లు /ఇంకొక్క కోరి కుంది మరిది లక్ష్మన్న

/నట్టేట సముద్రాన నది దిబ్బ మీద /టేకి చెట్టుల మీద తేనె మనసాయె “ఈ పాట ద్వారా జానపదుల కల్పనలు తెలుస్తాయి .

అల్లుళ్ళకు అత్త దగ్గర చనువు ఎక్కువ . నవ మాసాలు మోసి కని పెంచి పెద్ద వారిని జేసిన కూతుళ్ళను అల్లునికి కాళ్లు గడిగి కన్యాదానము చేయుటచే గదా !

“అల్లుడల్లూడంటే ఒళ్లు మండేను /అల్లు డత్తకు తెచ్చె అద్దాల రైక

అల్లుడత్తకు తెచ్చె అద్దాల రైక /యిప్పూట తోడగ బోతే నిప్పుల్లు రాలె….నిప్పుల్లు రాలె

మరగేసి తోడగ బోతే మల్లెల్లు రాలె/ ఇది ఏమి అల్లుడా ఇంక సోద్యాము 

కాదత్తానే సేబుతా నువ్వాలకించు /నిత్తె మల్లెలు రైక నీకు అందమ్ము

నువు కన్న కూతురూ నాకు అందమ్ము “ అంటూ అత్తా , అల్లుళ్ళ మధ్య చనువు , వెతకారం తెలియజేసారు .

పుట్టింటిలో తన మాటకు గల చెల్లుబడిని గూర్చి ఈమె చెప్పుచున్నది . పుట్టింటికి అత్తింటికి మధ్య గల ఆటంకాల అరల పొరలను తొలగించినందుకు తిరుపతి తిమ్మప్ప నూటొక దీవెనలతో తిరు పూజలయినవి .

“అక్కలను చెల్లెండ్ల నొకూరి చిచ్చ/ వొక్కడే అన్నయ్య వచ్చెనన పోతూ

పచ్చెన్న పోతుంటే యేరడ్డమాయే /తీగాకీ తిరుపతీ కొండడ్డమాయే”అత్తింటికి , పుట్టింటికి మధ్య గల వ్యత్యాసాన్ని వివరించారు .

తాళి గట్టిన మగడు వినా , ఎందరున్నను ఆ సోఖ్యము , సౌభాగ్యము రావని ఈ క్రింది విసురు రాతి పాట చాటుచున్నది .

“రాగల్ల యిసిరేటి వొ రామ చిలుకా /మొగుడెందు బోయెనే మొగము కళ దప్పె

నాగలోకము బోయి నరుడయ్యి నిలిచి /దేవలోకము బోయి దేవుడై నిలిచె

చింతల నీలమ్మ చెల్లె లున్నాది /చేతి గాజులు పోయే చెల్లె లేవరమ్మా

యేడోద్దు నీలమ్మ తల్లి వున్నాది /తల మింద నీడ బోయె తల్లి ఎవరమ్మా “ స్త్రీ తన భర్త సుఖ శాంతులు గురించి ఏ విధంగా ఆలోచిస్తుందో తెలియజేసిన జానపద గేయం .

“పుట్టింటి పై గల మమకార మొక యువతీ మనసులో లేపిన తీయని కోరికలు ఈ పాటలో ఉన్నవి .

“సూర్యుని చేతికి సులగె కానైతు /పసులోవి చేతికి పరిగె శానైతు

నా తల్లి శ్రీలక్ష్మి చల్ల జెయ్యంగ /చిల్లి పోయి కవ్యాన రిలుకగా నైదు

నా యేడుగు రాన్నలు నాగలి దున్నంగ /నాగాల్లో నేనొక్క నాగాలన్న నైదు

నా యేదుగురు వదినెలు నాలె దియ్యంగ /నాలెలో నే వొక్క మొగలి పువునైదు “.

అత్తల ఆరళ్లు ప్రసిద్ధము . చీటికి మాటికి కోడలిపై నేరములు మూపు అత్తగారి బాధలు పడజాలక ఒక కోడలు విరక్తితో వేదన ఈ పాటలో కన్పిస్తుంది .

మొదటి అయిదు పంక్తులు అత్తగారి ప్రశ్నల పరంపరలు . తరవాత పంక్తులు కోడలి హృదయపు గాయాలు …..

కోడలా కోడలా కొలికి ముత్యామా /పచ్చి పాలా మీది మీగడేమాయే

వేడి పాల మీది వెన్న లేమాయె /తేనె కుండల మీది తెప్ప లేమాయే

నూనె కుండల మీది నురుగు లేమాయే /అత్తనువు బెట్టిన ఆరళ్ళ వలన

అట్లుపోయి అడవిలో మాను గానైతి /మానన్న గానైతి మంచెలేతూరు

చెట్టన్న గానైతి చెలగి వేతూరు /ఆకన్న గానైతి మేక లారగించు

కాయన్న గానైతి కాకు లారగించు “ కోడల మీద అత్త గారి సాధింపులకి నిదర్శనం ఈ గేయం .

అన్నదమ్ముల నుండి వేరు పడుటకై , తన భర్తను ప్రోత్సహించుచున్న దొక యుపాయశాలిని . వేరు బడినచో తన ప్రజ్ఞ చూపించి సంసారము అభివృద్ధి చేతుననియు మొగనికి మొలత్రాడు చేయింతు ననియు ముఖములు చూరలిత్తు ననియు పురి కొల్పుచున్నది .

“ ఎరు బడితేనే మేలు మొగడా ..మనము /పొత్తు లుంటేనే పోరు మొగడా

ఎరు బడ్డ తెల్లారి ఏకమై మన ముండి /ఏకించి పీకించి నెలకొక్క పోగొడికి

మోట దండెడ దొడ్డు మొలతాడు చేయిస్తు /మొక్క జొన్న చెను మన పాలికే వస్తే

నక్క బెదురూ బెట్టినా ప్రజ్ఞ చూపించి /యిద్దూము పండేది నల్తూము పండిస్తూ “

ఈ విధంగా స్త్రీలు తమ నిత్య వ్యవహారంలోని ప్రతి సంఘటనని పాట కింద మలచి పాడుకోవడం జరుగుతుంది . జానపద గేయాలలో స్త్రీల పాటలు వారి జీవన స్థితి గతులను తెలియజేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు .

                     సశేషం 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

సుఖాన్ని పొందగలరు

 యే చ మూఢతమా లోకే యే చ బుద్ధిః పరం గతాః|


తే నరాః సుఖమేధంతే క్లిశ్యత్యంతరితో జనః||


లోకంలో మరీ మూర్ఖులు, మహాజ్ఞానులు మాత్రమే సుఖాన్ని పొందగలరు. మధ్యస్థాయిలోని వారు బాధపడుతూనే ఉంటారు.


నిత్యం ప్రముదితా మూఢాః దివి దేవగణా ఇవ! అవలేపేన మహతా పరిభూత్వా విచేతసః ||


మూర్ఖులు దేవలోకంలోని దేవతలవలె ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. వారి మనస్సులు ఏదో ఒక అనవసర అసక్తులలో కూరుకొని పోవటం వలన వ్యామోహితులై ఉంటారు.


సుఖం దుఃఖాంతమాలస్యం దుఃఖం దాక్ష్యం సుఖోదయమ్! భూతిస్త్యేవం శ్రియా సార్ధం దక్షే వసతి నాలసే!|


సోమరితనం, బద్దకం మొదట సుఖంగా కనిపించినా కడకు దుఃఖాన్నే కలిగిస్తుంది. సామర్థ్యప్రదర్శనం కష్టంగా కనిపించినా కడకు సుఖాన్నే కలిగిస్తుంది.


ఐశ్వర్యలక్ష్మి అనేది సమర్థునిలో నివసిస్తుంది. కానీ బద్ధకస్తులలో నిలువదు.

3, మే 2025, శనివారం

రామం స్కందం హనూమంతం

 రామం స్కందం హనూమంతం

 వైనతేయం వృకోదరం 

శయనే యః స్మరేన్నిత్యం 

దుస్వప్న-స్తస్యనాశ్యతి


అర్థం: ప్రతిరోజూ నిద్రపోయే ముందు రాముడు, స్కందుడు, హనుమంతుడు, గరుడుడు మరియు భీముడిని ప్రార్థించడం వల్ల కలలు కలగకుండా ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది.


ఈ శ్లోకం చెడు కలలు మరియు పీడకలల నుండి రక్షణ పొందడానికి పఠించబడే శక్తివంతమైన శ్లోకం. ఇది పూజనీయమైన దేవతలైన శ్రీరాముడు, కార్తికేయుడు (స్కందుడు), హనుమంతుడు, గరుడుడు మరియు వృకోదరుడు (భీముడు) ల ఆశీస్సులు లభిస్తాయి.నిద్రపోయే ముందు ఈ   పేర్లను స్మరించే మరియు జపించే వారు చెడు కలల ప్రభావాల నుండి విముక్తి పొందుతారని ఈ శ్లోకం నొక్కి చెబుతుంది.


వాల్మీకి ఆదికావ్యం శ్రీమద్రామయణం అనుష్టుప్ ఛందస్సులో ఉన్నది. 

అనుష్టుప్ వృత్త ఛందస్సుల కన్నాపురాతనమైనది.

 అనుష్టుప్ శ్లోకం వృత్త ఛందస్సు కాదు. ఇది వేద ఛందస్సు. కాని కావ్యాదులలో శ్లోకానికి, వేదాలలో వలె స్వరభేదం  భేదం నిర్దేశం లేదు.

 అనుష్టుప్ శ్లోకానికి ప్రతి శ్లోకానికి 8 అక్షరాలు కలిగి నాలుగు పాదాలు ఉంటాయి.

  

 అనుష్టుప్ శ్లోక ఛంధమున ప్రతి చరణము నందును 5వ అక్షరము లఘువు, 6వ అక్షరము గురువు;   ప్రధమ, తృతీయ చరణములందును దీర్షముగాను; ద్వితీయ,చతుర్ధ చరణములందు హ్రస్వముగాను కూడా ఉండును.

అన్ని అనుష్టుప్ శ్లోకాలకి ఈ నియమం లేదు. అక్షర సంఖ్య మాత్రమే ప్రధానము.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

సోరియాసిస్ వ్యాధి గురించి

 సోరియాసిస్ వ్యాధి గురించి సంపూర్ణ వివరణ -


      మనుష్యులకు వచ్చు అత్యంత తీవ్రమైన మరియు అంత సులభముగా  లొంగని ఒక వ్యాధి గురించి మీకు వివరిస్తాను. దాని పేరు  "సిద్మ కుష్టు"  దీనిని " సోరియాసిస్ " అంటారు. ఇది ఒక రకమైన కుష్టు వ్యాథిగా ఆయుర్వేదం పరిగణించినది . 18 రకాల కుష్టు వ్యాధులలో ఇది ఒకటి. ముఖ్యంగా దీని లక్షణాలు చర్మం పైన పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడి పొట్టు రాలడం . అదే విధముగా కీళ్ల భాగములో సోరియాసిస్ వచ్చినపుడు "సోరియాసిస్ ఆర్థరైటిస్ "

వచ్చును. ఇది అత్యంత మొండి వ్యాధి . 


             ఇది రావడానికి ప్రధానమైన కారణం . విరుద్దమైన ఆహారాలు భుజించటం వలన శరీరం నందలి రక్తం దోషం పొందటం వలన , తీవ్రమైన మానసిక ఒత్తిడి వలన ఈ వ్యాధి సంప్రాప్తించును. దీనికి చికిత్స చేయడం అత్యంత సవాలుతో కూడుకుని ఉన్నది. అల్లోపతి వైద్యవిధానము నందు దీనికి సంపూర్ణమైన చికిత్స లేదు . ఒక్క ఆయుర్వేదం మాత్రమే దీనికి సంపూర్ణ పరిష్కారం చూపించగలదు. ఈ సమస్యని నేను నయం చేయుటకు ఎంతో పరిశోధించి కొన్ని ఔషధ మిశ్రమాలను తయారుచేశాను . వీటితో అత్యంత సులభముగా " సోరియాసిస్ " సమస్యను నిర్మూలించవచ్చు. మొదటి 2 నుంచి 3 నెలలలో మీకు మార్పు వస్తుంది . 6 నెలలపాటు ఆపకుండా వాడవలెను .  


       పైన చెప్పిన విధముగా ఒక వ్యక్తికి నేను చేసిన చికిత్స ఫలితాన్ని ఫొటో రూపంలో మీకు చూపిస్తాను. ఇది కేవలం 15 రోజుల్లొ వచ్చిన మార్పు మాత్రమే . మరికొన్ని రోజుల్లొ ఆ వ్యక్తి ఆ పరమేశ్వరుడి దయవలన సంపూర్ణముగా సమస్య నుంచి బయటపడతాడు . ఇది తధ్యం . 


          నేను చెప్పిన విధముగా ఔషధ సేవన చేస్తూ పథ్యం పాటించగలిగిన వారు మాత్రమే చికిత్స కొరకు నన్ను సంప్రదించండి. 


                     కాళహస్తి వేంకటేశ్వరరావు 


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                          9885030034