24, జులై 2025, గురువారం

శ్రీమద్భాగవత కథలు*```

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🌹గురువారం 24 జూలై 2025🌹*

                         🔟

                 *ప్రతిరోజూ*

 *మహాకవి బమ్మెర పోతనామాత్య*


   *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```

``

*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``


          *వ్యాస మహర్షి*

             *భాగవతం*

       *ఎందుకు రాశాడు*               

```

మహర్షి వేదవ్యాసకృతమైన శ్రీమద్భాగవతం 'జన్మాద్యస్య యతో' అనే శ్లోకంతో ప్రారంభం అవుతుంది. అలాగే పోతనగారి తెలుగు భాగవతం 'విశ్వజన్మస్థితివిలయంబు లెవ్వని వలన' అనే పద్యంతో మొదలవుతుంది. జగత్తు సృష్టి, స్థితి, లయలు ఆ పరమాత్ముడి తోనే ఏర్పడ్డాయన్న అర్థంతో రాయడం జరిగింది వీటిని. పరమాత్మ ఉనికితోనే సృష్టికి ఉనికి ఏర్పడిందని దీని భావన. అందువల్ల ఆ పరమ సత్యమైన పరమాత్మను రచయితలు (సంస్కృతంలో వ్యాస మహర్షి, తెలుగులో బమ్మెర పోతనామాత్యుడు) ధ్యానించారు. 

వ్యాస మహర్షి శ్లోకం, బమ్మెర పోతన పద్యం ఇవే:```


*శ్లో: జన్మాద్యస్య యతో న్వయాదితరతశ్చార్థెష్వభిజ్ఞః స్వరాట్*

 *తేనే బ్రహ్మ హృదా య ఆదికవయే ముహ్యన్తి యత్సూరయః*

 *తేజోవారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గోమృషా*

 *ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి*


*సీ: విశ్వజన్మస్థితివిలయంబు లెవ్వని వలన నేర్పడు ననువర్తనమున*

 *వ్యావర్తనమునఁ గార్యములం దభిజ్ఞుడై తాన రాజగుచుఁ జిత్తమునఁజేసి*

 *వేదంబు లజునకు విదితముల్ గావించె నెవ్వఁడు బుధులు మోహింతురెవ్వ*

 *నికి నెండమావుల నీటఁ గాచాదుల నన్యోన్యబుద్ధి దా నడరునట్లు*


*ఆ: త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము, భంగిఁదోఁచు స్వప్రభానిరస్త*

 *కుహకుఁడెవ్వఁడతని గోరి చింతించెద, ననఘు సత్యుఁబరుని ననుదినంబు*```


అరణ్యాలన్నింటిలోకి నైమిశారణ్యం ప్రశస్తమైనది. ఆ నైమిశారణ్యంలోని విష్ణు క్షేత్రంలో శౌనకాది మహామునులు సత్రయాగాన్ని చేయడం మొదలు పెట్టారు. వారంతా సూతమహామునిని తమకు హరికథలు వినిపించమని కోరారు. వారి కోరికను అర్ధం చేసుకున్న సూతమహాముని నరనారాయణులకు నమస్కారం చేసి, భారతీదేవికి మొక్కి, వ్యాస భగవానుడి పాదాలకు ప్రణామం చేసి చెప్పడం ప్రారంభించాడు. దాని సారాంశమే ఇది...


ఈ విశ్వానికి పరమ పురుషుడు ఒక్కడే! ఆయనే పుట్టించడం, పాలించడం, నాశనం చెయ్యడం అనే పనులను బ్రహ్మ, విష్ణు, శివుడు అనే పేర్లతో చేస్తూ ఉంటాడు. ఆ ముగ్గురిలోనూ హరి చరాచర కోటికి శుభాలను ఇస్తాడు. భగవంతుడు 21 అవతారాలను ఎత్తాడు. 

ఈ కలియుగ- కృతయుగ సంధిలో 22 వ అవతారంలో విష్ణుయశుడు అనే బ్రాహ్మణుడికి కల్కి అనే పేరుతో అవతరిస్తాడు. ఈ అవతారాలన్నీ విష్ణువు అంశతో జన్మించిన వారే. శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా, వామనుడైనా, నృసింహస్వామి అయినా అంతా ఆయన అవతారాలే. ఆయన అవతారాల చరిత్ర సమస్తాన్ని భాగవత గ్రంథ రూపంలో వేదవ్యాస మహర్షి చెప్పాడు. శుకుడు అనే తన కొడుకుతో చదివించాడు. సకల వేదాల సారభూతమైనదీపురాణం. దీనిని శుక మహర్షి పరీక్షిన్మహారాజుకు చెప్పాడు.


అవే విషయాలను తనకు వచ్చిన రీతిలో శౌనకాది మహామునులకు చెప్తానన్నాడు సూతుడు. సూతమహాముని ఈ విషయం చెప్పగానే, భాగవత రచనలోని అంతరార్థం, ఎలా వ్యాసుడు భాగవత రచన చేశాడు, ఎందుకు చేశాడు, ప్రేరణ ఎవరిదీ, ఎందుకీ పురాణ గాథను పరీక్షిత్తుకు శుకుడు చెప్పాడు, అని అడిగారు వారంతా. 


ఆ విషయాలను చెప్తూ ఇలా అన్నాడు:


ఒకనాడు సకల లోకసంచారి నారద మహర్షి అశాంతితో వున్న వేదవ్యాసుడి దగ్గరకు వచ్చాడు. యధావిధిగా పూజలు అయిన తరువాత వారు సంభాషించారు. తన అశాంతికి కారణం తెలియడంలేదన్నాడు వ్యాసుడు. వ్యాసుడు సకల ధర్మాలను చెప్పినప్పటికీ, విష్ణు కథలను కొంచెమే చెప్పాడనీ, కేవలం ధర్మాలు చెప్తే సరిపోదనీ, గుణవిశేషాలు కూడా చెప్పాలనీ, శ్రీమహావిష్ణువును పొగడక పోవడమే ఆయన అశాంతికి కారణమనీ అన్నాడు నారదుడు. తెలియనివాడికి తెలిసేట్లుగా ఈశ్వరలీలలు గురించి వివరించమని చెప్పాడు. తన జన్మ వృత్తాంతాన్నీ, తానూ ముల్లోకాలు విష్ణు కథా గానం చేస్తూ తిరుగుతున్న వైనాన్నీ వివరించి నారదుడు వెళ్ళిపోయాడు.


నారదుడు వెళ్ళిపోయిన తరువాత ఆయన మాటలు అర్ధం చేసుకున్న వ్యాస మహర్షి, ఆ తరువాత, ఏం చేశాడో ఇలా చెప్పాడు సూతుడు శౌనకాది మహామునులకు.


సరస్వతీ నది పడమటి తీరంలో ఋషులు యాగాలు చేసుకోవడానికి వీలుగా బదరీ వృక్షాలతో కూడిన 'శమ్యాప్రాసం' అనే ప్రసిద్ధమైన ఆశ్రమం ఉన్నది. అక్కడ కూర్చుని వేదవ్యాసుడు జలాలను వార్చి, తన మనస్సును స్థిరం చేసుకుని, భక్తితో పూర్ణుడైన ఈశ్వరుడిని చూశాడు. నారాయణుడి మీద భక్తి మినహా తనకు వేరే ఉపశమనం లేదని నిశ్చయించుకున్నాడు.


ఈ భూమండలం మీద ఏ మహా గ్రంథాన్ని విన్న మాత్రం చేతనే లోకాలకు ఆధారభూతుడైన మాధవుడి మీద భక్తి విశేషాలు పుడతాయో, అలాంటి, ద్వాదశ స్కంధ భాగవతం అనే మహా గ్రంథాన్ని వ్యాస మహర్షి నేర్పుతో వ్రాశాడు. రాసి, దాన్ని నిర్మించి, మోక్షార్థి అయిన శుక మహర్షితో చదివించాడు. శ్రీహరి గుణాలను వర్ణించడం అంటే ఆసక్తికలవాడు, ఆయనమీద అమితమైన భక్తి కలవాడైన శుక మహర్షి ముల్లోకాలకు మంగళకరమైన భాగవత సంహితను పఠించాడు. వేదాలు వేయి సార్లు చదివినా ముక్తి లభ్యం కాదు కాని, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది.

```

                *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


          *రచన:శ్రీ వనం* 

   *జ్వాలా నరసింహారావు*

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

               🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

ప్రశ్న పత్రం సంఖ్య: 43

 ప్రశ్న పత్రం సంఖ్య: 43                             

కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

ఈ ప్రశ్న పత్రం సర్వ జన ప్రయోజనకరంగా వుండే విషయాలను తీసుకొని తయారు చేయబడినది. కాబట్టి అందరు దీనిని కూలంకుషంగా చదివి జవాబులు ఇవ్వ ప్రయత్నించండి.  ప్రతి ప్రశ్నకు నాలుగు సమాదానాలు ఇవ్వబడ్డయ్యి అందులో సరైనది ఎంచుకోండి. 

1) _____ లక్షల జీవరాసులలో మానవ జన్మే ఉత్కృష్టమైనదిగా దైవజ్ఞులు చెపుతారు 

i)   64

ii) 66

iii)84

iv) 94 

2) మానవ శక్తితో నడిచే వాహనము ఇది 

i)  సైకిలు 

ii) మోటారు సైకిలు    

iii) కారు   

iv) స్కూటరు 

3)పురాణాలు ఎన్ని 

i)  28

 ii) 19

 iii) 18

iv) 32

4) మానవ శరీరంలో ఇది నిత్యం పెరిగే ఒక నిర్జీవ కణజాలం 

i)   కాలు 

ii) వేలు 

iii) గోరు

 iv) కళ్ళు 

5) రెటీనా అనునది ఈ అవయవానికి సంబందించినది 

i)  కాలు 

ii) ముక్కు 

iii) కన్ను 

iv) నాకు తెలియదు 

6) ఇది ప్రస్థాన త్రయంలో లేదు 

i)  బ్రహ్మ సూత్రాలు 

ii) రామాయణం 

iii) భగవత్ గీత 

iv) ఉపనిషత్తులు 

7) భగవత్ గీతలో ప్రతి అధ్యాయంలో ఈ పదము ఉంటుంది 

i)  వియోగము 

ii) సంయోగము 

 iii) యోగము 

iv) అన్నీ 

8) సంక్రాంతి తప్ప మిగిలిన పండగలు ప్రతి ఏడు ఒకే తారీఖు నాడు రావు ఎందుకంటె 

i)   మన పంచాంగము చంద్రమానము కాబట్టి 

ii)   మన పంచాంగము సౌర మానము కాబట్టి 

iii)  మన పంచాంగము బృహస్పతి మానము కాబట్టి 

iv) నాకు మానవమానాల గురించి తెలియదు 

9) "ముదితల్ నేర్వగా రాని విద్య గలదె ముద్దర నేర్పించినన్" అని అన్నది ఎవరు  

i) పానుగంటి లక్ష్మి నరసింహారావు సాక్షి సంపుటిలో

ii) చిలకమర్తి లక్ష్మీనరసింహం  "ప్రసన్న యాదవమ్" నాటకంలో 

iii) శ్రీ శ్రీ  మహాప్రస్థానంలో 

iv)  అల్లసాని పెద్దన మనుచరిత్రలో 

10) నిత్యాగ్నిహోత్రుడు అని ఎవరిని అంటారు 

i) రోజు గుడికి వెళ్లే వానిని

ii) రోజు గృహంలో అగ్నికార్యాన్ని (యజ్ఞము) చేసే బ్రాహ్మణుడిని

iii) రోజు దీపారాధన చేసే బ్రాహ్మణుడిని

iv) గుడిలో అర్చకత్వం చేసే బ్రాహ్మణుడిని 

11) స్వచ్ఛమైన నీరు ఒక 

i) ఆమ్లాద్రావణము

ii) తటస్థ ద్రావణము

iii) క్షార ద్రావణము 

iv)  కొన్ని సార్లు ఆమ్లంగా కొన్ని సార్లు క్షరంగా ఉంటుంది. 

12) ఇది ఒక ఇంద్రియము కాదు 

i) కళ్ళు,

ii) ముక్కు,

iii) మెదడు

iv)  చెవులు

12) ప్రతి బ్రాహ్మడు ప్రతి రోజు విధిగా ఈ కార్యం చేయాలి  

i) గాయత్రి జపం చేయాలి

ii) రామకోటి వ్రాయాలి

iii) దీపారాధన చేయాలి

iv)  పరనింద చేయాలి 

13) రాశిచక్రంలో రాహువు ఉన్నఇంటికి సరిగా వ్యతిరేక ఇంట్లో ఈ గ్రాహం ఉంటుంది 

i) గురు గ్రాహం

ii) చంద్ర గ్రాహం

iii)శని గ్రాహం

iv)  కేతు గ్రాహం 

14) వేదాంతం అంటే 

i) రామాయణంలో వివరించింది

ii) భారతంలో వివరించింది

iii) ఉపనిషత్తులలో వివరించింది

iv)  స్వామీజీలు భోదించేది 

15) ఈయన ఒక ప్రబంధ కావి కాదు

i) అల్లసాని పెద్దన్న

ii) రామరాజ భూషణుడు (భట్టుమూర్తి )

iii) ముక్కు తిమ్మన

iv)  రామకృష్ణుడు 

16)  ఆరోగ్యవంతుడైన మానవుని శరీర ఉష్ణోగ్రత యెంత ఉంటుంది 

i) 98.3 డిగిరీల ఫారెన్ హీట్

ii) 98.6 డిగిరీల ఫారెన్ హీట్

iii) 98.8 డిగిరీల ఫారెన్ హీట్

iv) 98.9 డిగిరీల ఫారెన్ హీట్

 


 


 ,


 


వానాకాలము

 


**వానాకాలము**


పొద్దు నియమాల పరీక్ష కాలం 

పొద్దు కనుపడక పొయ్యే కాలం


చెరువులు గుంటలు నిండే కాలం

 కప్పలు బెకబెక అరిచే కాలం


పక్షుల రెక్కలు నానే కాలం 

ఆకట డొక్కలు ఎండే కాలం


ఆగక వానలు కురిసేకాలం

 పిండిన బట్టలు ఆరని కాలం


పుస్తకాలనూ చించే కాలం

 పడవలు ఎన్నో చేసే కాలం


పిల్లలు జెల్లుల తడిసే కాలం

 దగ్గులు జలుబులు పట్టే కాలం


దారుల ఏరులు సాగే కాలం

 బడులకు సెలవలు యిచ్చేకాలం


దాచిన గొడుగులు తెరిచే కాలం

 వేసుక బయటను తిరిగే కాలం


ఆకలి మెండుగ వేసే కాలం వేడిగ పకోడి మెక్కే కాలం


బామ్మ ప్రక్కనా దూరే కాలం వెచ్చగ నిద్దుర పొయ్యే కాలం


వానాకాలం వానాకాలం మనసుకు ప్రీతిని తెచ్చే కాలం

23, జులై 2025, బుధవారం

ప్రాయశ్చిత్తం

 తెలియకుండా చేసిన పాపాలకు ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోగలం?


మొదటి యజ్ఞం: - మనం తెలియకుండానే ఏదైనా పాపం చేస్తే, దానికి ప్రాయశ్చిత్తంగా, ప్రతిరోజూ ఆవుకు ఒక రోటీని దానం చేయాలి. ఇంట్లో రోటీ తయారు చేసినప్పుడల్లా, మొదటి రోటీని ఆవు కోసం పక్కన పెట్టాలి.


రెండవ యజ్ఞం ఏమిటంటే: - చీమల కోసం చెట్ల వేర్ల దగ్గర ప్రతిరోజూ బియ్యపు పిండిని చల్లాలి.


మూడవ యజ్ఞం ఏమిటంటే :- పక్షులకు ప్రతిరోజూ ఆహారం (అన్ని రకముల ధాన్యాలు మరియు నీరు) ఇవ్వాలి.


నాల్గవ యజ్ఞం ఏమిటంటే :- గోదుమపిండి పంచదార కలిపి బంతులను తయారు చేసి, వాటిని ప్రతిరోజూ జలాశయంలోని చేపలకు తినిపించండి.


ఐదవ యజ్ఞం ఏమిటంటే :- ఆహారాన్ని తయారు చేసి అగ్నికి అర్పించడం, అంటే రోటీ (రొట్టె) తయారు చేసి, దానిని ముక్కలుగా చేసి, దానికి నెయ్యి మరియు చక్కెర వేసి అగ్నికి అర్పించడం.


ఈ ఐదు యజ్ఞాలు చేసే యజమాని ఇంట్లో ఉపద్రవాలు

వచ్చినా గట్టెక్కేస్తారు 


ఆచరించిన కుటుంబాలు 

ఉన్నతి స్థాయి లో ఉన్నారు


సర్వే జనాః సుఖినోభవంతు 

లోకా సమస్తా సుఖినోభవంతు 


🌹💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐🌹

క్షమ - పగ*

 *క్షమ - పగ*


*మన మనసులో రెండు వైరుధ్య భావా లుంటాయి. ఒకటి క్షమించడం, రెండోది పగ తీర్చు కోవడం. ఈ రెంటికీ సదా సమరం జరుగుతూ ఉంటుంది. క్షమ గెలిస్తే హృదయం ఆనంద మయం అవుతుంది. మనసులో అంతు లేని సంతోషం కలుగుతుంది. మనలో ఉండే ప్రేమ ఎప్పుడూ 'క్షమించు క్షమించు' అని చెబుతూనే ఉంటుంది. ప్రేమిస్తే ప్రేమను పొందుతాం. ద్వేషిస్తే ద్వేషాన్నే తిరిగి పొందుతాం.*


*”గుండె లో పగ దాచుకోవడం అంటే 'పామున్న ఇంటి లో ఉండటమే!' అంటుంది భారతం. పగ వల్ల పగ పోదనీ.. ఏ విధంగా చూసినా పగని అణచడం లెస్స అనీ..భారత మహేతి హాస ఉద్బోధ...!!!*


*'నా కన్ను నువ్వు పొడిస్తే..నీ కన్ను నేను పొడుస్తా' అని 'కన్ను'కు కన్ను... పన్నుకు పన్ను' సిద్ధాంతం తో అందరూ ముందుకు దూకితే- లోకం అంతా..గుడ్డి వాళ్ల తో..బోసి నోటి వాళ్ల తో నిండి పోతుంది.*


*ప్రతీకారం అనే విష చక్రం నుంచి బయట పడాలంటే "క్షమించడం" ఒక్కటే ఉపాయం. ఇందు వల్ల రెండు లాభాలున్నాయి.*

*ఒకటి- క్షమించే వారు, ఆదర్శ వ్యక్తులుగా గౌరవం పొందుతారు. రెండోది- క్షమ పొందేవారు, తమ జీవితాలను సరిదిద్దు కుంటారు.*


*క్షమాగుణం శత్రువును సైతం మిత్రుడి గా... మార్చేస్తుంది.*


*'పొరపాటు' అనేది మానవ సహజ గుణం. క్షమ దైవ విశిష్ట గుణం' అని ఆంగ్ల సామెత.*


*మహా భక్తుల జీవితాలన్నీ...ప్రేమ మయాలు.*


*’ఏక నాథుడు’ పాండు రంగడి భక్తుడు. ప్రశాంత చిత్తుడు. సదా స్వామి సేవలో, భజనలో కాలం గడిపే వాడు. ప్రజలందరూ ఆయన్ని ప్రశంసించడం చూసి కొందరు ఈర్ష్య పడ్డారు. ఎలాగైనా ఏక నాథుడికి కోపం తెప్పించాలని ప్రయత్నించ సాగారు. ఒక దుష్టుడికి డబ్బు ఆశచూపి, ఆ పనికి నియోగించారు.*


*ఏక నాథుడు రోజూ తెల్లవారు జామునే నది లో స్నానం చేసి వచ్చేవాడు. ఆ సమయంలో ఆ దుష్టుడు ఏక నాథుడిపై ఉమ్మి వేశాడు. ఏక నాథుడు ప్రశాంత చిత్తంతో చిరునవ్వు చెరగనీయకుండా మళ్ళీ... వెనక్కి వెళ్లి నదీ స్నానం ఆచరించాడు..*


*ఇలా మొత్తం నూట ఏడు సార్లు జరిగింది.*


*ఏక నాథుడు ఏమాత్రం నిగ్రహం వీడకుండా మందస్మిత వదనంతో అన్ని సార్లూ మరల మరల స్నానం చేసి వస్తున్నాడు.*


*దీంతో ఆ కుటిలుడి హృదయం చలించి పోయింది!*


*ఆయన ఏక నాథుడి కాళ్లపై పడ్డాడు. 'స్వామీ, మీరు నిజంగా దైవస్వరూపులు. మీ నిగ్రహం చెడగొట్టి, ఎలా గైనా మీకు కోపం తెప్పించాలని కొందరు నన్ను పురమాయించారు. మీకు ఆగ్రహం తెప్పించగలిగితే నాకు ధనం ఇస్తామని ఆశ చూపారు. "మీ క్షమాగుణం" తెలియక నేను ఈ నీచ కృత్యానికి అంగీకరించాను!' అన్నాడు ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో.*


*ఏక నాథుడు అతడికి నమస్కరిస్తూ ఇలా అన్నాడు. 'నాయనా, నీవు నా కెంతో మేలు చేశావు. నా చేత నూట ఎనిమిది సార్లు పవిత్ర నదీ స్నానం చేయించిన మహానుభావుడివి నువ్వు! నేను నీ మేలు ఎన్నటికీ మరచి పోను!'*


*ఏక నాథుడి పలుకులు విని అవతలి వ్యక్తి నిర్విణ్ను డయ్యాడు.*


*ఆ భక్తా గ్రేసరుడి ‘క్షమాగుణం' ఆ ఉమ్మి వేసిన వ్యక్తి హృదయాన్ని ప్రక్షాళనం గావించింది. పశ్చాత్తాపంతో అతడు కన్నీరు కార్చాడు.*


*క్షమ అంటే భూమి. భూమి ఓర్పు గల తల్లి కనుకనే మనం ఎంత బాధ పెట్టినా భూ మాత మనపై పగ తీర్చు కోవాలనుకోదు. క్షమించే గుణం ఉన్నది కదా అని మనం భూమాతను అదే పనిగా హింసించ కూడదు.*

*క్షమా గుణానికీ హద్దులుంటాయని గుర్తుంచు కోవాలి!*

*క్షమాగుణం పురాణాలకు, ప్రాచీన ఇతి హాసాలకే పరిమితం కాదు.*

*ఇటీవలి చరిత్రలో క్షమాగుణంతో చరితార్థు లైన మహాపురుషు లెందరో ఉన్నారు.*


*ఆర్య సమాజ స్థాపకులైన మహర్షి దయానంద నిష్కాపట్యం, నిర్భయత్వం సమాజంలో అనేకులకు కంటగింపైంది.*


*ఆయన వద్ద వంట వాడికి లంచం ఇచ్చి, ఆహారంలో విషం పెట్టించారు.*


*దయానందులు మృత్యుశయ్యపై ఉన్నారు.*


*తన వంట వాడిని దగ్గరకు పిలిచారు. కొంత డబ్బు అతడి చేతిలో పెట్టి ఇలా అన్నారు. 'వెంటనే నువ్వు నేపాల్‌కి వెళ్లిపో! నా శిష్యులకు నువ్వు చేసిన పని తెలిస్తే నిన్ను బతక నీయరు!'*


*తనకు ప్రాణ హాని కలిగించిన వ్యక్తిని సైతం క్షమించి, అతడికి ప్రాణ దానం చేసిన మహర్షి దయానంద చరితార్థులయ్యారు.*

*క్షమాగుణం మానసిక రుగ్మతలకు మంచి మందు.*

*పగ తీర్చు కుంటే ప్రశాంతత చిక్కుతుందను కోవడం కేవలం భ్రాంతి మాత్రమే!*


*నిజానికి అభద్రత మిగులు తుంది. చిత్త వికారం ఏర్పడుతుంది. చివరకు జీవితం విషాదాంతం అవుతుంది.*

*ఒక అరబ్బీ సామెత ఇలా చెబుతుంది-*

*ఇతరులు మనకు చేసిన అప కారాలను ఇసుక పై రాయాలి. ఇతరులు మనకు చేసిన ఉప కారాలను చలువ రాయి పై చెక్కు కోవాలి!'*

.🙏🙏🌄🙏🙏

మేధస్సు

 *ఇదండీ మనవారి మేధస్సు*


తృటి =సెకండ్ లో 1000 వంతు

100 తృటులు =1 వేద

3 వేదలు=1 లవం

3 లవాలు=1 నిమేశం.రెప్ప పాటుకాలం

3 నిమేశాలు=1 క్షణం,

5 క్షణాలు=1 కష్ట

15 కష్టాలు=1 లఘువు

15 లఘువులు=1 దండం

2దండాలు=1 ముహూర్తం

2 ముహూర్తాలు=1 నాలిక

7 నాలికలు=1 యామము,ప్రహారం

4 ప్రహరాలు=ఒక పూట

2 పూటలు=1 రోజు

15 రోజులు=ఒక పక్షం

2 పక్షాలు=ఒక నెల.

2 నెలలు=ఒక ఋతువు

6 ఋతువులు=ఒక సంవత్సరం.

10 సంవత్సరలు=ఒక దశాబ్దం

10 దశాబ్దాలు=ఒక శతాబ్దం.

10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది

100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు


4లక్షల 32 వేల సంవత్సరాలు= కలియుగం

8లక్షల 64 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం

12లక్షల 96 వేల సంవత్సరాలు=త్రేతా యుగం

17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం

పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం)

71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం

14 మన్వంతరాలు=ఒక కల్పం

200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు

365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సరం

100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి

ఒక బ్రహ్మసమాప్తి=విష్ణుపూట

మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట


భాగవతాదారితం 🕉🕉


అందరికీ తెలియాల్సిన విషయం తప్పకుండా షేర్ చేయగలరు .


ఎంతో గర్వంగా చెప్పుకునే హిందువులకే సొంతం ఈ లెక్కలు మరేదైనా మతం లో కానరాదు.  విదేశీయులు మాత్రమే కనుగొన్న ట్లుగా చెప్పుకనేటటువంటి ఎన్నో విషయాలు మన యోగులు మునులు ఏనాడో కనుగొనినారు. అందుకు మనమందరము గర్వరడాలి. 

నా దేశం గొప్పది. 🕉️🚩🕉️

🌹🌹జై శ్రీ రామ్🌹🌹

ధర్మ చంద్రిక -

 మానవ ధర్మ చంద్రిక -


 * ఆవునేతి దీపారాధన జ్ఞానసిద్ధి. నువ్వులనూనె దీపారాధన సంపద వృద్ది. కీర్తి.


 * ధర్మ మార్గమున సంపాదించిన ధనం ఇచ్చి కొన్న పూలతో దేవ పూజ చేసిన తన పూర్వులను, ఏడు తరాల వారిని తరింపచేయును.


 * తులసి దళాలు సుర్యాస్తమయం తరువాత కోయరాదు.

 

* చాతుర్మాస వ్రతం - ఆషాడ శుద్ద ఏకాదశి నుండి కార్తీక శుద్ద ఏకాదశి వరకు జరుగునని నిర్ణయ సింధు తెలియచేస్తుంది. ఆ కాలం నందు తులసి మొక్క పెట్టరాదు.


 * ఇంట్లో పూజించు విగ్రహాలు 2 లేక 3 అంగుళాల ఎత్తు ఉండవచ్చు.


 * ధర్భాసనం గాని , వేడి చర్మం గాని , నూతన వస్త్రం గాని వేసుకొని కుర్చుండాలి . కుశాసనము - పౌష్టికం. కంబలాసనం - దుఃఖ విమోచనం. ఎర్రని ఆసనం - వశ్యధికమ్ . చిత్రాసనము - సర్వార్ధములు .

తెల్లని ఆసనములు - శాంతి. కృష్ణ జిననము - జ్ఞాన సిద్ది. పులి చర్మము - మోక్ష సిద్ది. ఏ ఆసనము లేకున్నను ఒక దర్భ నయినా వేసుకొని కూర్చుండ వలెను.


 * పచ్చటి పట్టుబట్ట ( పీతాంబరం ) పూజకు శుభం. తెల్లని పట్టుబట్ట  శుభప్రదము. రంగులవి. బొమ్మలవి మానసిక చాంచల్యం. అంచుగలవి ధరించాలి. నారపట్టు చాలా మంచిది. ఉత్తమమైన విధావలి దీనికి ఎలాంటి దోషాలు లేవు .

 

* తమలపాకులు 5,7,10,12 మంచివి. ఒక వక్క తాంబూలంలో పెట్టిన ఆరొగ్యం, 3 వక్కలు శ్రేష్టం .

 

* నందికి ఏ పక్కనుండి వెళతారో, ఆ పక్కనుండే వెనకకు రావలెను. శివలింగం, నందికి మద్య నుండి రాకుడదు. అలా వచ్చినచో పూర్వ జన్మలో పుణ్యం కుడా పొతుంది.

 

* శివాలయంలో ప్రదిక్షణలు చేసే విధానం -

 

 చండీ స్వరుడు ఉన్న చోటును అనగా 

( చండీ స్వరుడు లేకున్నను ) శివాబిషేక జలం బయటకు వచ్చు సోమసుత్రం నుండి ప్రారంబించి ధ్వజస్తంభం వద్దకు, ధ్వజస్థంభము నుండి తిరిగి ప్రదిక్షనముగా సోమసుత్రం వద్దకు ,  2.అక్కడనుండి వెనకకు తిరిగి ద్వజస్థంభం వద్దకు. 3. ద్వజస్థంభం నుండి ముందుకు సోమసుత్రం వద్దకు. 4. తిరిగి వెనుకకు ధ్వజం వద్దకు, 5. ద్వజం నుండి ముందుకు సోమాసుత్రం వద్దకు 6. తిరిగి సోమసుత్రం నుండి వెనకకు ద్వజం వద్దకు 7. ద్వజం నుండి ముందుకు సోమసుత్రం వద్దకు ,8. సోమసుత్రం నుండి ద్వజం వద్దకు 9. అక్కడనుండి శివాలయంలో ద్వజం ఎడమపక్కనుండి వెళ్లాలి . దీనినే చండ ప్రదిక్షణ అంటారు. ఇలా ఒకసారి చేస్తే శివునికి 30 వేల ప్రదిక్షణలు చేసిన పుణ్యము.

 

* మొదట నందీశ్వరుని అనుమతితో శివున్ని దర్శించుకోవాలి. నందీశ్వరుని కొమ్ముల మీద ఎడమచేయి ఉంచి వెనక బాగమున కుడి చేయి ఉంచి " ఓం హర హర శివ శివ " యంటూ శివుని దర్శించి ఆలయంలో ప్రవేశించాలి.

 

* రుద్రాక్ష దారణ వలన పునర్జన్మ ఉండదు. ఆరొగ్యం కలుగును. రుద్రాక్ష ముఖము నందు రుద్రుడు , పుచ్ఛము నందు విష్ణువు అధి దైవతములు , ఏకాదశ ముఖములు గల రుద్రాక్ష ఏక ముఖముతో సమానము .

 

* విబుతి దారణ వలన మానసిక ప్రశాంతత , ధైర్యము, ఆరోగ్యము, గ్రహపీడ, అకాల మరణములకు రక్షణ, రుద్రత్వం లబిస్తుంది.

 

* రుద్రునికి అబిషేక ద్రవ్యములు - 

 

 ఆవుపాలతో అభిషేకించిన సర్వ సౌఖ్యములు , ఆవు పెరుగుతో ఆరొగ్యం, సర్వసౌఖ్యములు, ఆవు నెయ్యితో ఐశ్వర్య వృద్ది, పంచదారతో దుఖ నాశనం,తేనెతో తెజోవ్రుద్ది, భస్మ జలంతో మహాపాపహరం, గందోధకంతో పుత్రలాభం, పుష్పోధకంతో భులాభం, బిల్వజలంతో బోగాబాగ్యాలు, దుర్వోధకం ( పారే నీరు ) తొ నష్టశ్రవ్య ప్రాప్తి, నువ్వులనూనెతో అపంరుత్యుహారం రుద్రాక్షోధకంతో మహావైశ్వర్యమ్, సువర్ణ జలంతో ధరిద్రనాశనం , అన్నంతో రాజ్యప్రాప్తి, ఆయుర్వృద్ధి, ఆయుర్వృద్ధి, సుఖజీవనం, ద్రాక్షరసంతో సకల కార్యసిద్ది, ఖర్జురఫలంతో శత్రువులకు హాని , కస్తూరి జలంతో చక్రవర్తిత్వం, నవరత్నజలంతో ధాన్యం , గృహం, గోప్రాప్తి, మామిడిపండ్ల రసంతో ధీర్గవ్యాధి నాశనం, పసుపునీళ్ళతో మంగళ ప్రధం . ఆయాద్రవ్యములతో శివుని అభిషేకించిన ఆయాఫలములు లభించును.

 

* విభూతితో శివుని అభిషేకించిన అష్టైశ్వర్యములు కలుగును.

 

* నల్లనువ్వులచే అర్చించిన శివుడు శత్రు నాశనం కలగచేయును .

 

* శ్వేత ( తెలుపు ) అక్షతలతో శివుని అర్చించిన మోక్షప్రాప్తి - శివపాదోధకం తాగిన మోక్షము కలుగును.


 * దేవుడు ఊరేగింపుకు వచ్చినపుడు , పెద్దలు ను నడిపించుకు వస్తున్నప్పుడు స్వాగతం చెప్పుటకు ప్రతి ఇంటి ముందర బిందెడు నీళ్లు నిలువుగా పొయాలి.

 

* ప్రతి గురువారం ఉదయం పాలు, నీళ్లు కలిపి తులసి చెట్టుకి పొస్తే లక్ష్మి నిలయం.

 

* గురువారం రావి చెట్టుకి సాయంత్రం పాలు , నీళ్లు కలిపి పొస్తే కార్యసిద్ధి.


 * వరాన్వేషణకు మృగశిర నక్షత్రం మంచిది.

 

* శ్రీ శివాబిషేకం చేసిన నీళ్లు పోను గొట్టము నుండి బయటకు వచ్చిన తీర్థం మనము తాకి నెత్తిన చల్లుకోరాదు. అది చండీ స్వరునికి మాత్రమే అర్హత.

 

* యాగంటి బసవన్న దర్శనం - శని భాధ నివారణం.


 * చైత్రమాసంలో సర్వ దేవతలకు " ధవనంతో " పూజ మంచిది అని ధర్మ సింధు చెప్తుంది.

 

* స్త్రీలు ఎల్లవేళలా పాపిట సింధూరం ధరించడం వలన అక్షయ సౌబాగ్యం కలుగుతుంది.


 * మధురలో జననం వలన, శ్రీకాళహస్తి లొ అర్చన వలన , శ్రీశైలం లొ శిఖరదర్శనం వలన , కాశిలో మరణం వలన, అరుణాచలం లొ స్మరణ వలన వీటిలో ఏ ఒక్కటి ఆచరించినా మోక్షర్హత పొందుతారు. మంచి బుద్ధితో సన్మార్గాన్ని పొందండి. మంచి ఆలోచనలతో ముందుకు సాగండి.

 

* ఉత్తర దిక్కుకి ప్రయాణం చేస్తున్నప్పుడు 

 " ఓం ఖడ్గీ నమః " అను నామస్మరణతో సాగండి. అరిష్టాలు తోలుగుటకు 

" ఓం నమో నారాయణాయా నమః " అను మంత్రము జపించండి.

 

* అప్పు పుచ్చుకొనుట - అప్పు ఇచ్చుట . బుదవారం చేయరాదు . మంగళవారం సంక్రమణ దినం. హస్తా  నక్షత్రం రోజున అప్పులిచ్చుట వలన తిరిగి రావడం చాలా కష్టం. ఆ రొజులలొ అప్పు చేయకుండా ఉండటం చాలా ఉత్తమం .


 * జీవితం తొ కాలమే అదృష్టాన్ని కలిగిస్తుంది. శుభకార్యాలకు అదే మూలం . జీవితం లొ నిత్య వసంతుడే కాలం.


 * పాలు కారే చెట్లు, ముండ్ల చెట్లు, చింత, మునగ,కుంకుడు మొదలగునవి చెట్లు ఇంట్లో ఉండకూడదు . 


 * బియ్యం లేక గొధుమ నూకలు ప్రతి మంగళవారం గుప్పెడు పెరటిలో చల్లి భూతదయ చూపిన ధాన్యలక్ష్మి అనుగ్రహం కలుగును.

 

* విష్ణు సహస్రనామం ప్రతిధ్వనించిన చోటు దుష్ట శక్తులకు అది నిర్మూలనము.

 

* ఆయా నక్షత్రాల వారు ఇంటి ఆవరణలో గాని , రోడ్డు పైన గాని వృక్షము నాటి పోషిస్తే చాలా మంచిది.

 అశ్వని  -  జీడి మామిడి.

 భరణి   -  దేవదారు .

 కృత్తిక   - మేడి చెట్టు.

 రోహిణి  - నేరేడు .

 మృగశిర  - మారేడు .

  ఆర్ద్ర     - చింత చెట్టు.

 పునర్వసు - గన్నేరు .

 పుష్యమి  - పిప్పిలి ( రావి చెట్టు ).

 ఆశ్లేష     -  భోప్పాయి.

 మాఘ   -  మర్రి.

 పుబ్బ  -  మొదుగ .

 ఉత్తర  - జువ్వి .

 హస్త   -  కుంకుడు.

 చిత్త   -  తాడి చెట్టు.

 స్వాతి  - మద్ది.

 విశాఖ  - మొగలి.

 అనురాధ  - పొగడ.

 జైష్ట    - కొబ్బరి.

 మూల  - వేగిస .

 పూర్వా షా డ  - నిమ్మ .

 ఉత్తరాషాడ  - పనస.

 శ్రవణం  -  జిల్లెడు.

 ధనిష్ట  -  జమ్మి 

 శతబిషం  -  అరటి.

 పుర్వాబాద్రా  -  మామిడి.

 ఉత్తరాబాద్రా  -  వేప .

 రేవతి  -  విప్పచెట్టు.


 * శివుణ్ణి గరికతో పూజిస్తే ఆయుషు , ఉమ్మెత్త పులతో పుజ చేస్తే సంతానం. అవిసె పూలతో పూజ చేస్తే కీర్తి. తులసి దళాలతో పూజిస్తే భుక్తి, ముక్తి . జిల్లెడు పూలతో పూజిస్తే శత్రుజయం. కరవీర 

( గన్నేరు ) పూలతో పూజిస్తే రోగాశాంతి, మంకెన. పూలతో పూజిస్తే అలంకారములు జాజిపులతో పూజిస్తే వాహనలాభం కలుగుతాయి.


 * విష్ణువును అవిసె పూలతో పూజిస్తే పదివేల యజ్ఞఫలం . కదంభ పూలతో పూజిస్తే స్వర్గసుఖం.


 * గణపతిని ఎరుపు రంగు  పూలతో పూజిస్తే మంచిది . గరికతో పూజిస్తే అన్ని కష్టములు తీరును 


 * సర్వ వాస్తు దోషాలకు తెల్ల జిల్లెడు వినాయకుని  పూజా మందిరం లొ ఉంచాలి.


 * సిద్ది యొగములు : 

 

మంగళవారం తదియ, త్రయోదశి బుధువారం విదియ, సప్తమి : గురువారం పంచమి, దశమి : శుక్రువారం పాడ్యమి, ఏకాదశి కార్యనుకులత, విశేష ఫలప్రధయకత.

 

* ముఖ్యంగా ప్రయాణానికి పనికి రానివి.:

 విదియ మంగళవారం , సప్తమి సొమవారం, చవితి ఆదివారం, పంచమి గురువారం, తదియ శుక్రవారం షష్టి శనివారం.

 

* బూడిద గుమ్మడికాయ మంగళవారం ఇంటి సింహద్వారానికి కట్టిన సకల ద్రుష్టిదోషాలు పొతాయి.

 

* మారేడు చెట్టుకి తొమ్మిది సార్లు ప్రదిక్షణ చేస్తే శివానుగ్రహం లభిస్తుంది.

 * తొమ్మిది గురువారములు సుర్యొదయం కాగానే శివ దర్శనం చేసుకుంటే గ్రహాల బాధలు తోలుగుతాయి.


 * ఇంట్లో పెళ్లి కి వచ్చిన అమ్మాయి ఉంటే ఆమెకి అనుకూలమైన వరుడు లభించుటకు తరచు లక్ష్మి దేవి పూజ చేయాలి . శ్రీ మహాలక్ష్మి స్తోత్రమే , 

శ్రీ సుక్తం పటించాలి .


 * శనివారం నాడు ఆంజనేయ స్వామిని 108 తమలపాకులతో సేవిస్తే న్యాయ సమ్మతమైన కొరికలు నెరవేరును.

 

. * గురు, శుక్ర వారాలలో చేతి , కాలి గోళ్లు తీయరాదు. ఆ రెండు రోజులు లక్ష్మీదేవికి ఇష్టమైనవి.


 * శివాలయానికి వెళ్లి 108 ప్రదక్షిణలు చేసి , తొమ్మిది కొబ్బరిబొండాలు సమర్పిస్తే త్వరలో ఋణ విముక్తులు అవుతారు.


 * ధన విషయం లొ సంపత్తార, ప్రయాణికులకు క్షేమతార, కార్యజయానికి సాధనతార, వివాహానికి మిత్రతార. వైద్య విషయానికి పరమ మిత్రతార లు మంచివి. శుభప్రదం.

 

* గృహప్రవేశ సమయంలో గాని , గృహ ప్రవేశం అయిన 27 రోజులలోపు గాని  శ్రీ సూక్త పారయణం 

విష్ణు సహస్రనామ పారయణం తప్పనిసరిగా చేయాలి . అప్పుడా ఇల్లు దేవతానిలయం అవుతుంది.

 

* కుజదోష నివారణకు , నొప్పులకు, సంతతికి , అన్యోన్యతకు శ్రీ సుబ్రమణ్య స్వరుని ఆరాధన చేయాలి .


 * దేవుని పూజకు ఏ గదిలో వీలైతే ఆ గదిలో ఈశాన్య తూర్పు దిశ లేక ఉత్తర దిశలొ అమర్చుకోవాలి.

 

* పిత్రు కార్యముల రోజు కుంకుడు కాయలతో తల స్నానం చేయ రాదు.



.మరింత విలువైన సమాచారం మరియు అనేక రోగాలకు సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


గమనిక  -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

.        నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

.         ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

.    ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

.       

.        కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

.   అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

.                 9885030034

గౌట్ గురించి

 గౌట్ గురించి సంపూర్ణ వివరణ  - 

   

.     ఈ వ్యాధిలో కాలిబాటన వ్రేళ్లు వాచి ఉంటాయి. నడిచినప్పుడు నొప్పిని కలిగించును. ఈ వ్యాధి కొంతకాలం ఉండి ఆ తరువాత దానంతట అదే తగ్గిపోవును . మరలా వస్తుంది. రక్తములో యూరిక్ ఆసిడ్ మోతాదు పెరగటం వలన ఈ సమస్య ఎక్కువుగా వచ్చును. 

 

•. ఈ సమస్య రావడానికి గల కారణాలు  - 

          

.  అధిక పరిమాణం ప్రొటీన్స్ గల పదార్ధాలలో "ప్యూరిన్స్ " అనబడు పదార్థాలు ఉంటాయి. ఇది జీర్ణం అగునప్పుడు యూరిక్ ఆమ్లం తయారగును. సాధారణముగా ఇది మూత్రములో విసర్జించబడుతుంది. కాని కొన్ని సందర్భాలాలో ఇది పూర్తిగా విసర్జించబడదు . ఇది రక్తములో నిలువ ఉండిపోతుంది. ఈ విధముగా విసర్జించబడని యూరిక్ ఆమ్లం స్పటిక రూపములో ముఖ్యముగా కాలిబాటన వ్రేలి కీలు వద్ద నిక్షిప్తమై ఉంటుంది . కావున బ్రొటన వ్రేలు వాచి నొప్పి కలిగించును. 

              

.         ఈ యురిక్ ఆమ్లము ఎక్కువుగా ఉత్పత్తి అగుటకు కారణాలు  -

   

  *  ప్యూరిన్ ఎక్కువ గల ఆహార పదార్థాలు అయిన మాంసము విపరీతముగా తినటం . 

 

*  నీరు తక్కువుగా తాగుతూ మద్యము , కాఫీ , టీ మొదలైన వాటిని అధికంగా సేవించుట . 

 

*  విపరీతమైన మానసిక సంఘర్షణ . 

 

*  వంశపారంపర్యముగా రావడం . 

            

  

       మరింత విలువైన సమాచారం మరియు అనేక రోగాలకు సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


గమనిక  -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

.        నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

.         ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

.    ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

.       కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

.               9885030034

నామాలను ఎందుకు పెట్టుకుంటారు

 *🔱శివుడు అడ్డ నామాలను, విష్ణువు నిలువు నామాలను ఎందుకు పెట్టుకుంటారు.? దీని వెనుక కారణమేంటి.?*


*🌾పరమేశ్వరుడు అడ్డనామాల వాడని మనందరికీ తెలుసు... శివుడు అడ్డ నామాలు పెట్టుకుంటాడు. అలాగే... విష్ణువు నిలువు నామాలు పెట్టుకుంటారు.*


*⚜️శివ కేశవుల్లో బేధం లేనపుడు... ఈ నామాల్లో మాత్రం భేదం ఎందుకు.? ఇంతకీ శివుడు అడ్డ నామాలను, విష్ణువు నిలువు నామాలను ఎందుకు పెట్టుకుంటారో ఈ ఆర్టికల్ లో చూద్దాం.*


*🌾మానవ శరీర నిర్మాణం ప్రకారం... కనుబొమ్మల మధ్యన షట్చక్రాలలో ఒకటైన ఆజ్ఞా చక్రము ఉంటుంది. దీన్నే మూడవ కన్ను అని భావిస్తారు. ఇది బయటకు కనపడకపోయినా... దీని ప్రభావం చాలానే ఉంటుంది. అందుకే ఇది ఉండే స్థానం లో బొట్టు పెట్టుకోవాలి అని హిందూ సాంప్రదాయం చెబుతుంది.*


*⚜️ఈ స్థానాన్ని పదిలం గా ఉంచుకోవడం ద్వారా ఆధ్యాత్మికతను పెంచుకోవచ్చని హిందువులు నమ్ముతారు.*


*🌾ఈ ఆజ్ఞాచక్రాన్ని సక్రమం గా ఉంచడం కోసం, ఇక్కడ ఉండే ఇడ, పింగళ, సుషుమ్న నాడులను చల్లబరచడంకోసం కోసం తద్వారా రక్త ప్రసరణ నిరాటంకంగా జరగటం కోసం తిలకం లేదా విబూది లేదా కుంకుమ ధరిస్తారు.*


*⚜️హిందూ మతం లోని వారు రకరకాలుగా ఈ అలంకరణ చేసుకుంటారు. శివుడు కూడా విభూధిని మూడు అడ్డ నామాలు గా పెట్టుకుంటాడు.*


*🌾ఈ మూడు అడ్డ గీతాలు పెట్టుకోవడానికి కారణం ఉంది. సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీకగా శివుడు అలా ధరిస్తాడట. అలాగే శివుడికి మూడు నేత్రాలు ఉంటాయి కాబట్టి వాటికి గుర్తు గా మూడు అడ్డనామాలు ధరిస్తాడు.*


*⚜️పరమ శివుడిని మనం కాలుడు అని పిలుస్తాం. అంటే... భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు ఆయన అధీనం లో ఉంటాయి కనుక వాటికి సింబాలిక్ గా ఆయన మూడు అడ్డనామాలను ధరిస్తాడు. అలానే శివ భక్తులు కూడా విబూది ని ధరిస్తూ ఉంటారు.*


*🌾అలాగే వైష్ణవులు ధరించే బొట్టు వేరుగా ఉంటుంది. రెండు తెల్లని గీతలు నిలువుగా ధరించి మధ్యలో ఒక ఎర్రటి గీతని ధరిస్తారు.*


*⚜️ఈ రెండు తెల్ల గీతలు శ్రీ మహా విష్ణువు పాద పద్మాలుగా వైష్ణవులు భావిస్తారు. మధ్య లో ఉండే ఎర్రని గీతను శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తారు. అలా వారిద్దరిని తమ బొట్టులోనే ఉన్నట్లు భావించి ధరిస్తారు.*


*|| నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర ||*

*☸️I ఓం నమో నారాయణాయ I☸️* 

🪸🌾🪸 🌾🪸🌾 🪸🌾🪸


*┈┉┅━❀꧁ హరి ఓం꧂❀━┅┉┈*

         *SPIRITUAL SEEKERS*

🍁🪷🍁 🙏🕉️🙏 🍁🪷🍁

ఉన్నదానితో సంతృప్తి చెందకుండా*

 🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹

*ఉన్నదానితో సంతృప్తి చెందకుండా*





ఒక సాధువు ఊళ్లు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు. 


అక్కడి వీధులలో నడుస్తూ ఉంటే.. నేలపై పడి ఉన్న నాణెం ఒకటి అతడి కంట పడింది. వంగి, చేతుల్లోకి తీసుకున్నాడు. 


కానీ ఆ నాణెం వల్ల అతడికేం ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోవడం కాదు, అవసరం లేదు. తన దగ్గర ఉన్నవేవో ఉన్నాయి. అవి చాలు. 


ఆ నాణెం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించడం లేదు. అందువల్ల ఆ నాణేన్ని ఎవరికైనా ఇవ్వాలనుకున్నాడు. 


దాని అవసరం ఉన్నవాళ్ల కోసం రోజంతా వెతికాడు. ఎవరూ కనిపించలేదు! 


చివికిన బట్టలతో కొందరు ఎదురైనా వాళ్లూ సంతోషంగానే ఉన్నారు తప్ప, ఎవరినీ చెయ్యి చాచడం లేదు. సాధువుకు సంతోషం వేసింది. 


ప్రజలు సంతృప్తిగా ఉండడం, అతడికి సంతోషాన్నిచ్చింది. ఆ రాత్రి అక్కడే ఒక చోట విశ్రమించాడు. 


తెల్లారి సాధువు నిద్ర లేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు, తన సైన్యంతో పక్కరాజ్యంపై దండెత్తేందుకు వెళుతూ కనిపించాడు. 


అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే, రాజు వారికి ఆగమని సైగ చేసి, రథం నుంచి కిందికి దిగి సాధువుకు నమస్కరించాడు.


ఓ సాధు పుంగవా.. రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళుతున్నాను.


నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి’’ అని కోరాడు. సాధువు తనకు దొరికిన నాణేన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు. 


రాజు ఆశ్చర్యపోయాడు. ‘ఏమిటి దీనర్థం’ అన్నట్లు సాధువు వైపు చూశాడు. సాధువు చిన్నగా నవ్వి, ‘ఓ మహారాజా.. ఈ నాణెం మీ రాజ్యంలోనే నాకు దొరికింది. 


దీని అవసరం నాకు లేకపోవడంతో, అవసరం ఉన్నవాళ్లకు ఇవ్వాలని నిన్నటి రోజంతా వెతికాను. 

అలాంటి వాళ్లు ఒక్కరూ కనిపించలేదు. అంతా సంతృప్తిగా కనిపించారు. 


ఉన్నదానితో సంతృప్తి చెందకుండా, ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే కనిపిస్తున్నారు. అందుకే ఈ నాణెం మీకు ఇచ్చాను’’ అని చెప్పాడు. 


రాజు అంతరార్థం గ్రహించాడు. దండయాత్ర ఆలోచనను విరమించుకుని వెనుదిరిగాడు. 


నిరంతరం.. లేనిదాని కోసం ఆరాటపడుతూ ఉంటే, ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం. 


*ఆ భాగ్యం లేని వాడు.. ఎంత ఉన్నా.. ఏమీ లేనివాడే!*




🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

*సర్వేజనా సుఖినోభవంతు*

*లోకా సమస్త సుఖినోభవంతు*

*శుభం భూయాత్*

*ఓం శాంతి శాంతి శాంతిః*

*స్వస్తి*



🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸

ఏది స్వర్గం....?

 ఏది స్వర్గం....?  

ఏది నరకం......? 

    

ఒక శిష్యుడికి

ఏది స్వర్గం? 

ఏది నరకం? 

అన్న విషయమై ఎప్పుడూ సందేహంగానే ఉండేది. 

తన సందేహం గురించి గురువుగారిని ఎప్పుడు అడిగినా కూడా ఆయన ఓ చిరునవ్వు నవ్వేసి ఊరుకునేవారు. 


చివరికి ఓ రోజు ‘గురువుగారూ! 

మీరు ఇవాళ నాకు స్వర్గ నరకాల గురించి చెప్పి తీరాల్సిందే!’ అంటూ పట్టుపట్టాడు శిష్యుడు. 


దానికి గురువుగారు ‘సరే! నీకు ఓ అనుభూతిని కలిగిస్తాను. దాన్ని బట్టి నీకు స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో తేలిపోతుంది’ అన్నారు.

 

శిష్యుడు ఆ అనుభూతిని స్వీకరించేందుకు సిద్ధంగా తన కళ్లని మూసుకున్నాడు. శిష్యుడు కళ్లు మూసుకోగానే ఒక వింత దృశ్యం అతనికి కనిపించింది. ఆ దృశ్యంలో ఒక పెద్ద గది, ఆ గది మధ్యలో ఒక పెద్ద బల్ల ఉంది. ఆ బల్ల మీద రకరకాల ఆహార పదార్థాలు కనిపిస్తున్నాయి. తాజా పండ్లు, ఘుమఘుమలాడే కూరలు ఇలా ఒకటీ రెండూ కాదు మనిషి జిహ్వను రెచ్చగొట్టే సర్వపదార్థాలూ ఆ బల్ల మీద ఉన్నాయి. కానీ ఏం లాభం! ఆ బల్ల చుట్టూ ఉన్న జనాలకీ, బల్లకీ మధ్య అయిదేసి అడుగుల దూరం ఉంది. మనుషులు ఎంత గింజుకుంటున్నా ఆ బల్లని సమీపించలేకపోతున్నారు. అలాగని ఆ ఆహారపదార్థాలను అందుకునేందుకు ఏ ఉపాయమూ లేదా అంటే లేకనేం! ఒక అయిదు అడుగుల గరిటె వారికి అందుబాటులో ఉంది. కాకపోతే ఉన్న ఒకే ఒక్క గరిటె కోసం గదిలోని జనాలంతా కొట్టుకోవడమే సరిపోతోంది. ఒకవేళ ఎవరన్నా బలవంతుడు ఆ గరిటెను చేజిక్కించుకున్నా, దాంతో ఆహారాన్ని నోటి దాకా తెచ్చుకునేసరికి అందులోని పదార్థాలు నేలపాలై పోతున్నాయి.


శిష్యుడు ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నంతలో అది మాయమైపోయి మరో దృశ్యం కనిపించింది. 


అందులోనూ ఇదే పరిస్థితి. గది మధ్యలో పెద్ద బల్ల. ఆ బల్ల చుట్టూ అయిదేసి అడుగుల దూరంలో జనం. ఆ జనాలందరికీ ఒకటే గరిటె. కానీ వాళ్లంతా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. వారి ఆకలి తీరినట్లే ఉంది. గదిలో ఎలాంటి కొట్లాటలూ లేవు. ఎలాంటి హడావుడీ లేదు. అదెలా సాధ్యమా అని ఆశ్చర్యంగా చూసిన శిష్యుడికి, ఆ ప్రశాంతత వెనుక ఉన్న విషయం బోధపడింది. గదిలో ఉన్న ఒకే ఒక్క గరిటెనీ ఒకరి తరువాత ఒకరు అందుకుంటున్నారు. దాంతో ఆహారాన్ని నింపుకుని అవతలివారికి పెడుతున్నారు. గరిటె తమదాకా వచ్చేదాకా, తమ ఆకలి తీరేదాకా అంతా సహనంతో ఉన్నారు.


తనకు కనిపించిన రెండు దృశ్యాలనూ తల్చుకుంటూ శిష్యుడు తన కళ్లని తెరిచాడు. కంటి ఎదురుగా గురువుగారు ఎప్పటిలాగే చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. ‘ఇప్పుడు అర్థం అయ్యిందా స్వర్గానికీ, నరకానికీ ఉన్న తేడా ఏమిటో!’ అన్నారు గురువుగారు. శిష్యుడు తలవంచుకున్నాడు.

 

‘నీకు కనిపించిన రెండు దృశ్యాలలోనూ పరిస్థితి ఒక్కటే! కానీ ఒకదానిలో మనిషి తాను సుఖపడటం లేదు, ఎదుటివాడికీ అవకాశాన్ని ఇవ్వడం లేదు. ఎంతసేపూ తన కడుపే నిండాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి నరకమే ఏర్పడుతుంది. మనిషి సంఘజీవి అని తెలుసుకుని, ఒకరికొకరు సాయపడినప్పుడు ఎదుటివాడి ఆకలీ తీరుతుంది, మన కడుపూ నిండుతుంది. స్వర్గం, నరకం ఎక్కడో కాదు మన దృక్పథాలలోనే ఉన్నాయని ఇప్పటికైనా బోధపడిందా!’ అన్నారు గురువుగారు.

చంద్రునికొక నూలుపోగు

 *“చంద్రునికొక నూలుపోగు" అంటే ఏమిటి? చంద్రునికి ఇవ్వవలసినది నూలు పోగేనా?*


ప్రతి మాసమూ వృద్ధి క్షయాలు పొందేవాడు చంద్రుడు. స్త్రీలలో చంద్రుడే ఋతు చక్ర భ్రమణానికి, సంతానోత్పత్తి, ప్రతి మాసమూ జరిగే అండోత్పత్తికి కారకుడు. చంద్రుడు దాంపత్యంలో భార్యా భర్త సంబంధాల అనుకూలతికూ, సౌగాభ్యానికి కూడా కారకుడు. చంద్రునికి ఆధిదేవత గౌరీదేవి. ఆ దేవత మాంగల్య సౌభాగ్యానికీ, అన్యోన్య ద్యాంపత్యానికీ, సంతాన సౌభాగ్యానికి అధిదేవత. 


గ్రహాలను తృప్తిపరచే విధానంలో ఏయే గ్రహాలకు ప్రీతికరమైన ద్రవ్య ధాన్యాదులచేత ఆయా గ్రహాలను తృప్తిపరచే విధానం ఉన్నది. వానిలో చంద్ర గ్రహానికి ప్రీతికరమైనదీ, చంద్రుని కారకత్వంలోనిదీ అయిన ధాన్యం - బియ్యం. ఆ బియ్యపు పిండిలో తయారుచేసిన తీపి వంటకమైన చలిమిడిని - చంద్రుని ఆరాధనలో గాని, గౌరీపూజలో గాని ఆర్పిస్తారు. అది విధానం. ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళే సమయంలో కూడా, చంద్రునికీ, గౌరిదేవికి ప్రీతిపాత్రమైన ఈ చలిమిడినే ఆయా దేవతలకు నైవేద్యం చేసి- కుమార్తెకు సౌభాగ్యమూ, కడుపు చలువా కలగాలని - ఆమెకు ఆ చలిమిడిని ఇచ్చి పంపే ఆచారం ఉంది. 


ఆ విధంగానే చంద్రుడు వస్త్ర కారకుడు కనుక - కుమార్తెకు కొత్తబట్ట కట్టబెట్టి వంపుతారు. వస్త్రం అనేది చంద్రుని కారకత్వాలలోనిది. మానవ జీవితానికి అభిషణీయములైన అనేక ముఖ్య ప్రాథమిక అంశాలు చంద్రుని ఆధిపత్యంలొ ఉండడం వల్ల - ఆ చంద్రుని ఆర్చించడం, చంద్రునికి ప్రీతికరాలైన వస్తు విశేషాలను అర్పించడం శుభప్రదమవుతుందనే విశ్వాసానికి అనుగుణంగా ఈ విధంగా ఆచరిస్తారు. 


ఏదైనా ఒక శుభకార్యం కాని, ఆశుభకార్యం కాని జరిగినప్పుడు ఆయా కర్తలకు వారి తల్లి వైపు బంధువులు - నూతన వస్త్రాలను బహూకరించే ఆచారం మనకుంది. దానికి కారణం - మాతృ కారకుడు కూడా చంద్రుడే కావడం గమనార్హం. ఆయా శుభాశుభ కార్యాలను నిర్వర్తించే స్త్రీ పురుషులకు - అశుభాలు తొలగిపోయి శుభం కలగాలని శుభాశంసలతోను, చంద్రభగవానుని ఆశీస్సులు వారికి కలగాలనీ, చంద్ర గ్రహ సంబంధమైన శుభఫలాలను వారు పొందాలనీ- ఇటువంటి సందర్భాలలోని భావన. ఇదే విధంగా వ్యాధిగ్రస్తులై, తిరిగి ఆరోగ్యాన్ని పొందిన వారికి కూడా తల్లి లేదా తల్లికి సంబంధించిన వారు అన్న దమ్ములు మేనమామలు ఇత్యాదులు, ఎవరు జీవించి ఉంటే వారు - నూతన వస్త్రాలను బహూకరిస్తారు. ఈ సందర్భంలో కూడా ఇదే విధమైన శుభ మనకు కారణం - చంద్రుడు ఓషధీ కారకుడు, మనః కారకుడు, మాతృ కారకుడు - కూడా కావడమే. ఇత్యాదిగా ఇంకా ఈ సందర్భంలో అనుప్రాసక్తంగా చెప్పదగిన ఉన్నాయి.


ప్రతిమాసారంభంలోనూ ప్రధమ చంద్ర దర్శనం రోజున- చంద్రరాథనోన్ముఖంగా, ఒక వస్త్ర ఖండాన్ని చంద్ర దేవతా ప్రీత్యర్థంగా అర్పించడమే చంద్రునికొక నూలుపోగు నీయడం. దాని ద్వారా చంద్రగ్రహుయొక్క అనుగ్రహాన్నీ, చంద్రగ్రహ కారకత్వంలో ఉన్న శుభఫలాలనూ పొందగోరడమే 


చండ్రునికొక నూలుపోగు అనేది మరొక అర్థంలో కూడా ఉపయోగిస్తారు. అదేమంటే - కొండంత దేవునికి కొండండ పత్రి ఇచ్చుకోలేము. జగచ్చక్షువు, కర్మసాక్షిణన చంద్రునికి స్వల్పమైన నూలుపోగునివ్వడం అల్పాతి అల్పమైన కానుక. స్వీకరించేవాని అర్హతనుబట్టి కాక - ఇచ్చేవాని శక్తినిబట్టి అధికునికి స్వల్పమైన కానుక ఇచ్చినప్పడు చంద్రునికొక నూలు పోగుగా ఇస్తున్నామని చెప్పడంతా పరిపాటి.

గొప్పవాడు

 *వినయశీలుడే, అందరికన్నా గొప్పవాడు...!!*

వినయాన్ని మించిన ఆభరణం ఏమున్నది...

కార్యసిద్ధి కీర్తి లభించినప్పుడు, కొంతమంది మరింత పరిపక్వతతో అణకువగా ఉంటారు...

అయితే మరికొందరు వారి దృక్కోణాన్ని కోల్పోతారు...


ఒక సాధారణ మానవుడు, తన గొప్పలను సదా చెప్పుకుంటూ ఉంటే మహనీయులు, తమ ప్రతిభలు జయాపజయాలు సుఖదుఃఖాల ద్వారా భగవంతుడే వ్యక్తీకరింప బడుతున్నాడని భావిస్తారు...

సకల అనుభవాల ద్వారా వారు సత్యాన్ని మాత్రమే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు...

దైవేచ్ఛ మన ఆలోచనల ద్వారా నెరవేరుతుందని తెలుసుకోవటమే ఆ పరమసత్యం..🙏🌺

ఆత్మనివేదన

 *ఆత్మనివేదన...*


పండుగలప్పుడో, పర్వదినాల్లోనో, లేకపోతే తమకు ప్రత్యేకమైన పెళ్లి రోజో, పుట్టిన రోజో... గుడికి వెళ్తుంటారు చాలామంది. ముందుగా అనుకుని ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించుకునేందుకు వెళ్లడమూ చేస్తుంటారు. 

అలా వెళ్లొచ్చాక తమ సన్నిహితులతో అక్కడి విషయాలను పంచుకుంటూ ఫలానా సందర్భంలో మేం అక్కడికి వెళ్లాం, ఆ దేవుణ్ని దర్శించుకున్నాం, ఆయనకి కిరీటాన్ని సమర్పించాం, అమ్మవారికి బంగారు నగలు చేయించాం లేకపోతే అన్నదాన నివేదన చేశాం, మొక్కు చెల్లించాం... అంటూ చెబుతుంటారు. 

తమ స్వయంకృషితో సంపాదించిన సంపదనుంచి ఇవన్నీ చేస్తున్నట్లుగా భావిస్తారు భక్తులు. 

నిజానికి ఇదంతా భగవంతుడి అనుగ్రహంతో తమకు కలిగిందనీ, ఆయన సృష్టించిన సంపదేననీ తెలుసుకోలేరు.


_🍁అసలు నివేదన అంటే ఏంటి? దేనిని అంటారు?_

సాధారణంగా భక్తులు భగవంతుడికి సమర్పించే వాటిలో పాలు, పండ్లు, చక్కెర మొదలైన ద్రవ్యాలు ఉంటే దాన్ని సామాన్య నివేదన అంటారు. 

పంచ భక్ష్య పరమాన్నాలు నైవేద్యంగా సమర్పిస్తే దాన్ని మహానివేదన అంటారు. 

కానీ ఈ ద్రవ్యాలన్నీ ప్రకృతి ద్వారా భగవంతుడు మనకిచ్చినవే, అవే తిరిగి మనం ఆయనకే సమర్పిస్తున్నాం. 

వాస్తవానికి నివేదన అంటే భక్తితో, ప్రీతితో భగవంతుడికి సమర్పించడం లేదా అర్పించడం. 

భగవంతుడికి ఏం సమర్పించాలి? ఏం అర్పించాలి? అని మళ్లీ ప్రశ్నించుకుంటే... నీ దగ్గర ఉన్నది, నీకు మాత్రమే చెందినది నివేదన చెయ్యాలి.

 మరి మన దగ్గర ఉన్నది అంతా ఆ పరమాత్ముడికి చెందిందే, ఆయన ఇచ్చిందే అయినప్పుడు ఇక నివేదన చెయ్యడానికి మన దగ్గర ఏం మిగిలింది... అన్న ప్రశ్న తలెత్తుతుంది. 

*దానికి సమాధానమే ఆత్మనివేదన.*


🍁నవవిధ భక్తి మార్గాల్లో తొమ్మిదోది, చివరిది, పవిత్రతను కలిగించేది... ఆత్మనివేదనా భక్తి. 

అంటే, భక్తుడు భగవంతుడి దారిలో నడవడం. తనని తాను భగవంతుడికి సమర్పించుకోవడం. 

మిగిలిన ప్రాణం లేని పదార్థాల మాదిరిగా మనిషి శరీరం ఒక జడపదార్థం కాదు కదా. పంచేంద్రియాలతో, కర్మేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో నిర్మితమైన ఈ శరీరాన్ని భగవంతుడికి సమర్పించుకోవడం ఎలా సాధ్యం అంటే... 'నాదేమీ లేదు... అంతా నీదే, అన్నింటా నువ్వే, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ని.... నువ్వు ఇచ్చిన ఈ శరీరంతో నువ్వు సూచించిన మార్గంలో నడుస్తూ నీ సేవ చేస్తాను...' అనుకోవాలి. 

శారీరక మానసిక వాంఛలను, ఆకాంక్షలను, బంధాలను తృణప్రాయంగా భావించాలి, ఎటువంటి కర్మఫలాపేక్ష లేకుండా త్రికరణశుద్ధిగా కర్మలను ఆచరించాలి, నిరంతరం పరమాత్ముణ్నే స్మరిస్తూ, సేవిస్తూ, తనని తాను తెలుసుకుంటూ తనలోని ఆత్మను తెలుసుకోవాలి. 


ఆ ఆత్మ ద్వారా పరమాత్మ ఉనికిని గ్రహిస్తూ, ఆయనకు దగ్గరవుతూ, సకల చరాచర సృష్టిలో దైవాన్ని దర్శిస్తూ అందరి హితాన్ని కోరుతూ జీవించడమే భక్తుడు భగవంతుడికి సమర్పించే ఆత్మనివేదన.🙏

శ్రీ జయంతి శక్తి పీఠం (నర్తియాంగ్ దుర్గ ఆలయం)

 🕉 మన గుడి : నెం 1181


⚜ మేఘాలయ : జైంటియా హిల్స్


⚜  శ్రీ జయంతి శక్తి పీఠం (నర్తియాంగ్ దుర్గ ఆలయం)




💠 మేఘాలయలోని జైటియా కొండలలో ఉన్న నార్టియాంగ్, దీనిని ఏకశిలాల తోట అని పిలుస్తారు, ఎందుకంటే ఈ ప్రదేశం అనేక చెల్లాచెదురుగా ఉన్న ఏకశిలాలతో (రాతి స్తంభాలు) కూడి ఉంటుంది.


💠 నార్టియాంగ్ 600 సంవత్సరాల పురాతన దుర్గా ఆలయాన్ని చూపిస్తుంది, ఈ ఆలయం మాతా సతి యొక్క 51 శక్తి పీఠాలలో ఒకటి.


💠 సంస్కృతంలోని 51 అక్షరాలకు అనుసంధానించబడిన 51 శక్తి పీఠాలు ఉన్నాయి. 

ప్రతి ఆలయంలో శక్తి మరియు కాలభైరవునికి మందిరాలు ఉన్నాయి. నార్టియాంగ్ దేవి మందిరంలోని "శక్తి"ని "జయంతి" అని మరియు "భైరవ"ని "క్రమాదీశ్వర్" అని పిలుస్తారు. 



💠 హిందూ పురాణాల ప్రకారం 51 శక్తి పీఠాలలో ఒకటిగా ఉన్న ఈ ఆలయం హిందూ మతంలోని శక్తి శాఖ భక్తులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి.


💠 పురాణాల ప్రకారం దక్ష యజ్ఞం మరియు సతీ మాత స్వీయ దహనం ప్రకారం, ఇది సతీ దేవి ఎడమ తొడ పడిపోయిన పవిత్ర స్థలం మరియు అప్పటి నుండి ఈ ప్రదేశం పవిత్రమైనది. 


💠 నార్టియాంగ్ దేవి మందిరంలో, శక్తిని జయంతి రూపంలో 

జైనేశ్వరి అనే పేరుతో పూజిస్తారు మరియు ( శివుడిని) భైరవుడిని కామాదీశ్వరుడిగా పూజిస్తారు.



💠 ఇది ధ్యానం కోసం ఉత్తమమైన - ప్రశాంతమైన మరియు నిశ్శబ్ద ప్రదేశంగా పరిగణించబడుతుంది.


💠 ఆలయ పురాణం ప్రకారం ఇది 600 సంవత్సరాలకు పైగా పురాతనమైనది.

జైంతియా రాజు జాసో మాణిక్ (1606–1641) కుమార్తె లక్ష్మీ నారాయణను వివాహం చేసుకున్నాడు. జయంతియా రాయల్టీని హిందూ మతంలోకి స్వీకరించడానికి లక్ష్మీ నారాయణ కారణమని నమ్ముతారు. 


💠 రాజు ధన్ మాణిక్ సుమారు 600 సంవత్సరాల క్రితం నార్టియాంగ్‌ను జయంతియా రాజ్యానికి వేసవి రాజధానిగా చేశాడు. 

ఒక రాత్రి, దేవత అతనికి కలలో కనిపించి, ఆ ప్రదేశం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి, తన గౌరవార్థం ఒక ఆలయాన్ని నిర్మించమని కోరింది. దీని తరువాత, నార్టియాంగ్‌లోని జైంతేశ్వరి ఆలయం స్థాపించబడింది. 


💠 ఆలయం యొక్క వ్యూహాత్మక స్థానం మరియు ఫిరంగులు వంటి ఆయుధాల ఉనికి ఈ ఆలయం జయంతియా రాజుల కోటలో భాగంగా ఉండి ఉండాలని సూచిస్తుంది.


💠 ఈ ఆలయంలో ఆచారాలు మైదానాల్లో మాదిరిగా సాంప్రదాయ పద్ధతిలో జరగవు, కానీ ప్రత్యేకమైన రీతిలో జరుగుతాయి. 

హిందూ మరియు పురాతన ఖాసీ సంప్రదాయాల మిశ్రమం. 


💠 స్థానిక అధిపతి లేదా సయీమ్ ఆలయానికి ప్రధాన పోషకుడిగా పరిగణించబడతాడు. 

నేటికీ, దుర్గా పూజ సమయంలో, సయీమ్ దేవత గౌరవార్థం మేకలను బలి ఇస్తారు. 

గతంలో, ఆలయంలో నరబలి అర్పించేవారు, కానీ ఆ ఆచారాన్ని బ్రిటిష్ వారు ఆపేశారు. 


💠 గర్భగుడి నుండి క్రింద ప్రవహించే మైంట్డు నదికి ఒక సొరంగంలో మానవ తల దొర్లేది. నేడు, మేకలు మరియు బాతులను బలి ఇస్తారు. 

కానీ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మేకలకు మానవ ముసుగులు ధరించి, తరువాత బలి ఇస్తారు. 


💠 దుర్గా పూజ ఈ ఆలయంలో అతి ముఖ్యమైన పండుగ. దుర్గా పూజ సమయంలో, ఒక అరటి మొక్కను దేవతగా అలంకరించి పూజిస్తారు. నాలుగు రోజుల ఉత్సవాల ముగింపులో, ఆ మొక్కను మైంట్డు నదిలో ఉత్సవంగా ముంచుతారు. 

ఈ సందర్భంగా దేవతకు తుపాకీ వందనం కూడా చేస్తారు.


💠 ప్రస్తుతం, మేఘాలయలోని హిందూ సమాజం యొక్క అధికారిక ప్రతినిధి అయిన సెంట్రల్ పూజ కమిటీ ఈ ఆలయ సంరక్షకురాలిగా ఉంది.


💠 ఈ ఆలయం మేఘాలయలోని జయంతియా హిల్స్‌లో ఉంది, నార్టియాంగ్ దుర్గా మందిర్ రాజధాని నగరం షిల్లాంగ్ బస్ స్టాప్ నుండి 60 కి.మీ దూరంలో ఉంది.


రచన

©️ Santosh Kumar