14, ఆగస్టు 2025, గురువారం

అనగనగా

 🔔 *అనగనగా...* 🔔


ఒక కవి ఇంట్లో

దొంగలు పడ్డారు!

ఆరు వారాల నగలు

మూడు లక్షల నగదు

ఐదు పుస్తకాలు పోయాయి!!


పుస్తకాలది ఏముందయ్యా...నగలు నగదు చోరీ జరిగిందని కేసు నమోదు చేసుకున్నాడు పోలీసు.


పోలీసుల దర్యాప్తు జరుగుతోంది..నెలలు గడుస్తున్నా జాడలేదు...ఇక వడిసెను సుమతీ అనుకున్నాడు కవి....


ఐదు నెలల తర్వాత ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది.. అందులో నగలు నగదు భద్రంగా పంపించారెవరో...కవి గారి భార్య పిల్లలు వాటిని కళ్ళకు అద్దుకుని ఆనందించారు...


పుస్తకాలు పోతేపోయినయి.. సొమ్ము దొరికింది అంతేచాలు అన్నారు భార్యాపిల్లలు..


ఆ పుస్తకాలు నా పంచప్రాణాలు అన్నాడు కవి...

" పోద్దురు బడాయి "


" పదేళ్లు కష్టపడి ఐదు పుస్తకాలు రాశానే...అవి నా పంచప్రాణాలు... పంపించినవాడు పుస్తకాలు పంపించి...నగదు నగలు పంపించకపోయినా బాధపడక పోయేవాడిని...కష్టపడితే సొమ్ము సంపాదించగలను..మళ్ళీ ఆ పుస్తకాలు రాయలేనే...అవి సరస్వతీ దేవి అమ్మవారు "... ఎడ్వడం మొదలెట్టాడు.


https://youtu.be/LAFG_ujf6BU


" నీ పుస్తకాలు సరస్వతీదేవీ ఐతే.. నా నగలు నగదు సాక్షాత్తు లక్ష్మీదేవి.. ఆ దొంగేవడో పిచ్చోడు " ఆనంద పడింది.ఇంతలో ఆ పార్సిల్లో ఒక కవర్ కనిపించింది.దాన్ని చించి అందులోని చీటి ఆసక్తిగా చదవడం ప్రారంభించింది ఆవిడ.


కవి గారికి

నమస్కారములు...

బీరువా తాళాలు పగులగొట్టి చూశా..నగలు నగదు పక్కన పుస్తకాలు కనిపించగానే ఇవేవో ఖరీదైనవని భావించి దోచుకెళ్లా..బీరువాలో ఎందుకు దాచారు...వీటిలో నిధి రహస్యాలు ఏమైనా ఉన్నాయేమోనని ఓపిగ్గా వాటిని చదివా..నగదు నగలుకన్నా గొప్ప నిధి దొరికింది.. అది జ్ఞాన నిధి..తప్పుచేశానని తెలుసుకున్నా..

ఈ లోగా నాభార్య పాతికవేలు ఖర్చుచేసింది.. చమటోడ్చి సంపాదించి కొద్దినెలల్లో మనియార్థర్ చేస్తా..డబ్బుతో పాటు పుస్తకాలు పంపిస్తా.. ఐతే వాటి జిరాక్స్ ప్రతులు మాత్రం తీసుకుని నావద్ద ఉంచుకుంటా... వాటిని మా పిల్లలతో పాటు తోటివారితో చదివిస్తా.. ఒకవేళ పుస్తకాలు దొంగిలించకపోతే నగలు నగదు తిరిగి పంపించేవాడినికాదు.. ఇప్పుడు నా దృష్టిలో నగలు నగదు కన్నా పుస్తకాలే విలువైనవిగా కనిపిస్తున్నాయి...ఈ రోజు నుంచి దొంగతనాలు మానేస్తున్నా... పుస్తకాలు అచ్చేసుకునేందుకు తోచిన డబ్బుకూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తా...

                     ఇట్లు

          దొంగతనాలు మానిన దొంగ


ఇప్పుడు కవి ముఖంలో ఆనందం..

ఆయన భార్య ముఖంలో ఆలోచనలు

లక్ష్మీదేవి గొప్పదా?

సరస్వతీ దేవి గొప్పదా?   


ప్రతి విద్యార్థికి ఈ కథ ఒక పాఠం కావాలి


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

వర్షధారల కురిపించి

 తే.గీ.

వర్షధారల కురిపించి వసుధలోని 

తెలుగు నేలల మురిపించి చలువబరచి 

జలనిధిగజేసె వరుణుండు క్షమనెల్ల 

వలదు వలదంచు వేడగా వరుణవిభుడు 

*~శ్రీశర్మద*

ఆదిపర్వము

 🔯🌹🌷🏹🕉️🏹🌷🌹🔯

*🪷బుధవారం 13 ఆగస్టు 2025🪷*


*శ్రీమదాంధ్ర మహాభారతం*

         *ఆదిపర్వము*

     *మహా భారత కథ* 

      *ప్రారంభం(1 -6)* 


ఇంక భారత కధను మొదలు పెడతాను వినండి. పంచపాండవులలో

అర్జునుడు ప్రముఖుడు. అతడే శ్రీకృష్ణునికి బావ. అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు మహారాజు. ఆ పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమేజయుడు. ఆ జనమేజయుడు ఒకసారి ఒక మహా యజ్ఞము చేస్తున్నాడు. సరమ అనే దేవతల కుక్క కుమారుడు సారమేయుడు. ఆ సారమేయుడు ఆ యజ్ఞము చేసే చోటికి వచ్చి ఆడుకుంటున్నాడు. జనమేజయుని తమ్ముళ్లు అది చూచారు. వారు ఆ కుక్క పిల్లను కొట్టి తరిమేసారు.

సారమేయుడు అనే కుక్క పిల్ల ఏడుస్తూ పోయి తన తల్లి సరమకు

జరిగిన విషయం చెప్పింది. సరమ కోపంతో జనమేజయుని వద్దకు వచ్చింది. “ఓ జనమేజయ మహారాజా! నీ తమ్ములు ఏ మాత్రం వివేకము, కరుణ లేకుండా నా కొడుకు సారమేయుని కొట్టారు. ఓ రాజా! యుక్తా యుక్త వివేచన విచక్షణ లేకుండా మంచి వారికి, సాధువులకు అపకారం చేసే వారికి అకారణంగా ఆపదలు వచ్చి మీద పడతాయి.” అని పలికి ఆ సరమ అనే కుక్క వెళ్లి పోయింది.

తరువాత కొన్నాళ్లకు జనమేజయుడు తాను చేయుచున్న యాగము

పూర్తి చేసాడు. తన రాజధాని హస్తినా పురమునకు పోయి సుఖంగా ఉన్నాడు. ఇంతలో జనమేజయునికి సరమ మాటలు గుర్తుకు వచ్చాయి. చేసిన తప్పుకు శాంతి చేయిద్దాము అనుకున్నాడు. తగిన ఋత్విక్కు కోసరం అన్వేషిస్తున్నాడు. ఆ క్రమంలోశ్రుత శ్రవసుడు అనే మునిని కలుసుకున్నాడు. అతనికి నమస్కరించి ఇలా అన్నాడు. “తమరి కుమారుడు సోమశ్రవసుని నాకు పురోహితునిగా పంపండి." అని అర్థించాడు. దానికి తండ్రి సమ్మతించాడు. జనమేజయుడు సోమశ్రవసుని పురోహితునిగా స్వీకరించాడు. సోమశ్రవసుని

ఆధ్వర్యంలో అనేక పుణ్యకార్యములు చేసాడు. పైలుడి శిష్యుని పేరు ఉదంకుడు. ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వశిత్వం, కామానసాయిత, అనే ఎనిమిది సిద్ధులు పొందాడు. ఒక రోజు గురువు గారి భార్య ఉదంకుని పౌష్యుడు అనే మహారాజు భార్య వద్దనున్న కుండలములు తీసుకురమ్మని పంపింది. ఉదంకుడు ఆ పని మీద పౌష్యు మహారాజు వద్దకు వెళుతుండగా దారిలో ఒక దివ్య పురుషుని చూచాడు. అతని కోరిక మేరకు గోమయము ( ఆవు పేడ) భక్షించాడు. ఆ దివ్య పురుషుని అనుగ్రహం పొందాడు. 


తరువాత పౌష్యమహారాజు వద్దకు వెళ్లాడు. “మహారాజా! నేను నా గురుపత్ని ఆజ్ఞ మేరకు నీ వద్దకు వచ్చాను. నీ భార్య వద్దనున్ను కుండలములు

ఇప్పిస్తే అవి తీసుకొని పోయి మా గురుపత్నికి ఇస్తాను. త్వరగా ఇప్పించండి.” అని అడిగాడు. "మహాత్మా! ఆ కుండలములు నా భార్య వద్ద ఉన్నవి. ఆమెను అడిగి తీసుకోండి.” అని అన్నాడు.

ఉదంకుడు పౌష్యమహారాణి వద్దకు వెళ్లాడు. కాని ఆమె ఉదంకునికి

కనిపించలేదు. మరలా రాజు వద్దకు వచ్చి “రాజా! మహారాణి నాకు

కనిపించలేదు. మీరే ఆ కుండలములు తెప్పించి ఇవ్వండి." అని అడిగాడు. "మహాత్మా! నా భార్మ మహా పతివ్రత. చాలా పవిత్రురాలు. ఆమె అపవిత్రులకు కనపడదు.” అని అన్నాడు. అప్పుడు ఉదంకునికి గుర్తుకు వచ్చింది. తాను గోమయ భక్షణము చేసి ఆచమనము చేయలేదు అని. ఆ అపవిత్రత వలన రాణి తనకు కనపడలేదు అని అనుకున్నాడు.


సశేషం


తంగిరాల చంద్రశేఖర అవధాని, కపిలేశ్వరపురం


                 *సేకరణ* 

 *న్యాయపతి నరసింహారావు* 

🔯🌹🚩🏹🛕🏹🚩🌹🔯

మహా భారత కథ*

 🔯🌹🌷🏹🕉️🏹🌷🌹🔯

*🪷బుధవారం 13 ఆగస్టు 2025🪷*


*శ్రీమదాంధ్ర మహాభారతం*

         *ఆదిపర్వము*

     *మహా భారత కథ* 

      *ప్రారంభం(1 -6)* 


ఇంక భారత కధను మొదలు పెడతాను వినండి. పంచపాండవులలో

అర్జునుడు ప్రముఖుడు. అతడే శ్రీకృష్ణునికి బావ. అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు మహారాజు. ఆ పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమేజయుడు. ఆ జనమేజయుడు ఒకసారి ఒక మహా యజ్ఞము చేస్తున్నాడు. సరమ అనే దేవతల కుక్క కుమారుడు సారమేయుడు. ఆ సారమేయుడు ఆ యజ్ఞము చేసే చోటికి వచ్చి ఆడుకుంటున్నాడు. జనమేజయుని తమ్ముళ్లు అది చూచారు. వారు ఆ కుక్క పిల్లను కొట్టి తరిమేసారు.

సారమేయుడు అనే కుక్క పిల్ల ఏడుస్తూ పోయి తన తల్లి సరమకు

జరిగిన విషయం చెప్పింది. సరమ కోపంతో జనమేజయుని వద్దకు వచ్చింది. “ఓ జనమేజయ మహారాజా! నీ తమ్ములు ఏ మాత్రం వివేకము, కరుణ లేకుండా నా కొడుకు సారమేయుని కొట్టారు. ఓ రాజా! యుక్తా యుక్త వివేచన విచక్షణ లేకుండా మంచి వారికి, సాధువులకు అపకారం చేసే వారికి అకారణంగా ఆపదలు వచ్చి మీద పడతాయి.” అని పలికి ఆ సరమ అనే కుక్క వెళ్లి పోయింది.

తరువాత కొన్నాళ్లకు జనమేజయుడు తాను చేయుచున్న యాగము

పూర్తి చేసాడు. తన రాజధాని హస్తినా పురమునకు పోయి సుఖంగా ఉన్నాడు. ఇంతలో జనమేజయునికి సరమ మాటలు గుర్తుకు వచ్చాయి. చేసిన తప్పుకు శాంతి చేయిద్దాము అనుకున్నాడు. తగిన ఋత్విక్కు కోసరం అన్వేషిస్తున్నాడు. ఆ క్రమంలోశ్రుత శ్రవసుడు అనే మునిని కలుసుకున్నాడు. అతనికి నమస్కరించి ఇలా అన్నాడు. “తమరి కుమారుడు సోమశ్రవసుని నాకు పురోహితునిగా పంపండి." అని అర్థించాడు. దానికి తండ్రి సమ్మతించాడు. జనమేజయుడు సోమశ్రవసుని పురోహితునిగా స్వీకరించాడు. సోమశ్రవసుని

ఆధ్వర్యంలో అనేక పుణ్యకార్యములు చేసాడు. పైలుడి శిష్యుని పేరు ఉదంకుడు. ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వశిత్వం, కామానసాయిత, అనే ఎనిమిది సిద్ధులు పొందాడు. ఒక రోజు గురువు గారి భార్య ఉదంకుని పౌష్యుడు అనే మహారాజు భార్య వద్దనున్న కుండలములు తీసుకురమ్మని పంపింది. ఉదంకుడు ఆ పని మీద పౌష్యు మహారాజు వద్దకు వెళుతుండగా దారిలో ఒక దివ్య పురుషుని చూచాడు. అతని కోరిక మేరకు గోమయము ( ఆవు పేడ) భక్షించాడు. ఆ దివ్య పురుషుని అనుగ్రహం పొందాడు. 


తరువాత పౌష్యమహారాజు వద్దకు వెళ్లాడు. “మహారాజా! నేను నా గురుపత్ని ఆజ్ఞ మేరకు నీ వద్దకు వచ్చాను. నీ భార్య వద్దనున్ను కుండలములు

ఇప్పిస్తే అవి తీసుకొని పోయి మా గురుపత్నికి ఇస్తాను. త్వరగా ఇప్పించండి.” అని అడిగాడు. "మహాత్మా! ఆ కుండలములు నా భార్య వద్ద ఉన్నవి. ఆమెను అడిగి తీసుకోండి.” అని అన్నాడు.

ఉదంకుడు పౌష్యమహారాణి వద్దకు వెళ్లాడు. కాని ఆమె ఉదంకునికి

కనిపించలేదు. మరలా రాజు వద్దకు వచ్చి “రాజా! మహారాణి నాకు

కనిపించలేదు. మీరే ఆ కుండలములు తెప్పించి ఇవ్వండి." అని అడిగాడు. "మహాత్మా! నా భార్మ మహా పతివ్రత. చాలా పవిత్రురాలు. ఆమె అపవిత్రులకు కనపడదు.” అని అన్నాడు. అప్పుడు ఉదంకునికి గుర్తుకు వచ్చింది. తాను గోమయ భక్షణము చేసి ఆచమనము చేయలేదు అని. ఆ అపవిత్రత వలన రాణి తనకు కనపడలేదు అని అనుకున్నాడు.


సశేషం


తంగిరాల చంద్రశేఖర అవధాని, కపిలేశ్వరపురం


                 *సేకరణ* 

 *న్యాయపతి నరసింహారావు* 

🔯🌹🚩🏹🛕🏹🚩🌹🔯

గురువారం🪷* *🌹14 ఆగస్టు 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🪷గురువారం🪷*

  *🌹14 ఆగస్టు 2025🌹*      

     *దృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః* 

*శ్రావణమాసం - కృష్ణపక్షం*


*తిథి  : షష్ఠి* రా 02.07 వరకు ఉపరి *సప్తమి* 

*వారం    : గురువారం* ( బృహస్పతివాసరే )

*నక్షత్రం   : రేవతి* ఉ 09.06 వరకు ఉపరి *అశ్విని*

*యోగం : శూల* మ 01.12 వరకు ఉపరి *గండ*

*కరణం  : గరజి* మ 03.15 *వణజి* రా 02.07 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు:*

 *ప 11.00 - 12.00 సా 04.00 - 06.30*    

అమృత కాలం  : *ఉ 06.50-08.20 & రా 12.51-02.21*

అభిజిత్ కాలం  : *ప 11.47 - 12.38*

*వర్జ్యం      : రా 03.51 - 05.21*

*దుర్ముహూర్తం  : ఉ 10.05 - 10.56 మ 03.10 - 04.00*

*రాహు కాలం   : మ 01.47 - 03.22*

గుళికకాళం       : *ఉ 09.02 - 10.37*

యమగండం     : *ఉ 05.51 - 07.25*

సూర్యరాశి : *కర్కాటకం* 

చంద్రరాశి : *మీనం/మేషం*

సూర్యోదయం *ఉ 05.59*

సూర్యాస్తమయం :*సా 06.43*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.51 - 08.23*

సంగవ కాలం         :     *08.23 - 10.56*

మధ్యాహ్న కాలం    :     *10.56 - 01.28*

అపరాహ్న కాలం    : *మ 01.28 - 04.00*


*ఆబ్ధికం తిధి         : శ్రావణ బహుళ షష్ఠి*

సాయంకాలం        :*సా 04.00 - 06.33*

ప్రదోష కాలం         :  *సా 06.33 - 08.49*

రాత్రి కాలం           :*రా 08.49 - 11.49*

నిశీధి కాలం          :*రా 11.49 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.06*

******************************

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీదత్త నవరత్నమాలికా స్తోత్రం*


*కోకబన్ధుసమవేక్ష్య*

*మహస్కం దత్తదేవ* 

*మనిశం కలయామి ॥*


       *జై దత్తాత్రేయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

కేదారనాథ్

 *కేదారనాథ్*


అక్కడెలా నిర్మించగలిగారు… కేదారనాథ్ అంటేనే ఓ మార్మిక స్థలి

```

ఏదో ఉంది కేదారనాథ్ గుడిలో… ఆ నిర్మాణంలో, ఆ సన్నిధిలో… మనకు అర్థం కాని మిస్టరీ…!


ఎస్, భారతీయ వాస్తు పరిజ్ఞానం మన గుళ్ల నిర్మాణంలో ఉంది… వందలేళ్లు అలా చెక్కుచెదరకుండా ఉన్న బృహదాలయాలు ఎన్నో… ఎన్నెన్నో…


ప్రత్యేకించి కేదారనాథ్… ఎవరు నిర్మించారనే వివరాలే సరిగ్గా తెలియవు… 8వ శతాబ్దం అంటుంటారు… అంటే ఈ గుడి వయస్సు 1200 ఏళ్లు దాటి… చెక్కుచెదరకుండా నిలిచిన మన ఓల్డ్ ఆర్కిటెక్చర్ నాలెడ్జికి శిఖరమెత్తు ప్రతీక…


అసలు ఆ గుడి నిర్మాణస్థలమే ఓ మిస్టరీ… దాన్ని ఎందుకు ఎంచుకున్నారు అప్పటి నిర్మాణ స్థపతులు అనేది మిస్టరీ… ఈరోజుకూ అది గుడి నిర్మాణానికి ప్రతికూలమైనదే… ఒకవైపు 22,000 అడుగుల ఎత్తులో కేదార్‌నాథ్ కొండ… మరోవైపు 21,600 అడుగుల ఎత్తులో కరచ్‌కుండ్…


మూడో వైపు 22,700 అడుగుల ఎత్తులో భరత్‌కుండ్ ఉన్నాయి.. ఈ మూడు పర్వతాల గుండా ప్రవహించే ఐదు నదులు మందాకిని, మధుగంగ, చిర్గంగ, సరస్వతి, స్వరందరి…


చలికాలంలో విపరీతమైన మంచు కురిసే చోటు… వర్షాకాలంలో నీరు అతి వేగంతో ప్రవహించే ప్రదేశం… అది ప్రవాహ స్థలి… ఈరోజుకూ మనం అక్కడికి వాహనాల్లో వెళ్లలేం…


మరి అంతటి ప్రతికూల పరిస్థితుల్లో ఎలా కట్టారు…? కేదారనాథ్ దేవాలయంలోని రాళ్లపై లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్షను నిర్వహించినప్పుడు… దానిలో 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్యకాలం వరకు ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉందని పరీక్షలో తేలిందట…


ఐనా సరే గుడి చెక్కుచెదరలేదు… 2013లో కేదారనాథ్‌ను తాకిన విపత్కర వరద చూశాం కదా, సగటుకంటే 375% ఎక్కువ వర్షపాతం నమోదైంది… చాలా మంది మరణించారు… పలు పరిసర గ్రామాలు దెబ్బతిన్నాయి…


మన ఎయిర్‌ఫోర్స్ దాదాపు లక్ష మందిని రక్షించింది.,. అంతా అతలాకుతలం… ఆ వరదలు తగ్గిన తరువాత చూస్తే… 1200 సంవత్సరాల తరువాత, ఆ ప్రాంతం లోనికి బయటి నుండి తరలించబడిన ప్రతిదీ తుడుచుకుపెట్టుకు పోయింది… ఒక్క నిర్మాణం కూడా నిలబడలేదు…కానీ ఈ ఆలయం మాత్రం ఓ స్థిరశిఖరంలా నిలబడే ఉంది…


అంత దృఢమైన కట్టడం మన వాస్తు జ్ఞానం… కేదార్‌నాథ్ ఆలయాన్ని “ఉత్తర- దక్షిణ”గా నిర్మించారు… దేశంలోని దాదాపు అన్ని దేవాలయాలు “తూర్పు- పశ్చిమ” దిశలో ఉంటాయంటారు… అన్ని గుళ్లలాగే దీన్నీ నిర్మించి ఉంటే ఇలా ఉండేది కాదేమో…


అందరికీ ఆశ్చర్యం ఏమిటంటే… గుడి నిర్మాణానికి ఉపయోగించిన రాయి అక్కడ లభ్యమయ్యేరకం కాదు… ఎక్కడి నుంచో తెచ్చారు… అక్కడికి ఎలా తెచ్చారు..? ఎలా పేర్చారు అనూహ్యం.,. సిమెంట్ అప్పటికి లేదు సరే, కానీ అనేక గుళ్లకు వాడిన పద్ధతి గాకుండా ‘ఆష్టర్’ పద్ధతి వాడినట్టు చెబుతారు…


పుష్కరం క్రితం వరదల్లో ఓ మహత్తు తెలిసిందే కదా… ఓ పెద్ద బండరాయి (భీమశిల) ప్రవాహంలో కొట్టుకొచ్చి, సరిగ్గా గుడి వెనుక ఆగిపోయి, వరద ప్రవాహం గుడికి తగలకుండా అడ్డుపడింది… తనను తాకి వరద ఇరువైపులా చీలి, గుడికి ఏ నష్టం రాకుండా కాపాడింది… అందుకే అనేది, కేదారనాథ్‌లో ఏదో ఉంది… మనకు అంతుపట్టనిది… మనం నమ్మనిది..!

13, ఆగస్టు 2025, బుధవారం

శ్రీమద్భాగవత కథలు*```

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🪷బుధవారం 13 ఆగస్టు 2025🪷*


                       3️⃣0️⃣

                  *ప్రతిరోజూ*

*మహాకవి బమ్మెర పోతనామాత్య*


      *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```


*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``


        *పంచమ స్కంధం*              

```

శ్రీ మహాభాగవతం అనే ఈ మహా పురాణాన్ని సహజ పాండిత్యుడు, బమ్మెర పోతనామాత్యుడు రచించాడు. వాస్తవానికి పంచమ స్కంధాన్ని పోతన శిష్యుడు గంగానార్యుడు తెనిగించాడు. డాక్టర్ టి రాజగోపాలబాలం గారు అనువదించారు. ఇది రెండు అశ్వాసాలుగా రాయబడింది ప్రథమాశ్వాసం, ద్వితీయాశ్వాసం పంచమ స్కంధం ప్రథమాశ్వాసంలో ప్రియవ్రతుడి చరిత్ర దగ్గరనుంచి, భరతుడి బోధతో రహగణుడి సంశయ నివృత్తి వరకు 12 అంశాలు: 


ద్వితీయాశ్వాసంలో మహారాజు సుమతి వంశ క్రమం దగ్గరనుండి నరలోక విషయాల వరకు మొత్తం ఆరు అంశాలు ఉన్నాయి. 

క్లుప్తంగా ఆ మొత్తం 18 అంశాల వివరాలు:


ప్రథమాశ్వాసం: ప్రియవ్రతుడి చరిత్ర, ప్రియవ్రతుడి సుజ్ఞాన దీక్ష, బ్రహ్మ దర్శనం, అగ్నిధారల జననం, ఉత్తమ తామస రైవత మనువుల జన్మం, ప్రియవ్రతుడు వనాలకు పోవడం, అగ్నీధ్రుడి కథ. అగ్నీధ్రుడు అప్సర స్త్రీని చేపట్టడం వర్షాధిపతుల పుట్టుక, అగ్నీధ్రుడు అడవికి వెళ్ళడం, నాభి ప్రముఖుల రాజ్యం, నాభి యజ్ఞం, ఋషభావతార గాథ, ఋషభుడి కుమారుడైన భరతుడి పేరుమీద "భరత వర్షం" అనే పేరు ప్రసిద్దికెక్కడం, ఋషభుడి జన్మవృత్తాంతం, అతడి రాజ్యాభిషేకం, భరతుడి జననం, పుత్రులకు ఋషభుడి బోధ-కొడుకులకు సాటిలేని విజ్ఞానాన్ని ఉపదేశించడం. భరతుడి పట్టాభిషేకం, ఋషభుడి తపస్సు, భరతోపాఖ్యానం, భరతుడు అరణ్యానికి వెళ్ళడం, భరతుడు జింకపిల్లగా జన్మించడం, తిరిగి బ్రాహ్మణుడిగా పుట్టడం, కాళీబలికి భరతుడిని తీసుకునిపోవడం, బతికి బయటపడడం, భరతుడు పల్లకీ మోయడం, సింధురాజుకు బ్రాహ్మణుడికి (భరతుడు) జరిగిన సంవాదం, భరతుడు బోధతో రహగణుడి సంశయ నివృత్తి ఉన్నాయి.


ద్వితీయాశ్వాసం: భరతుడి కొడుకైన సుమతికి రాజ్యాభిషేకం, మహారాజు సుమతి వంశక్రమం. పాషండ దర్శనం, సుమతి పుత్రుల జన్మ వివరణ, మహాపురుషుడు గయుడి చరిత్ర, శుకయోగిభునైసర్గిక స్వరూపాన్ని వివరించడం. భూమండలం, ద్వీపాలు, వర్షాలు, నదులు, పర్వతాలు, అంతరిక్షం, ఖగోళ విషయ విస్తారం, సముద్రాలు, పాతాళ లోకాల వివరణ, దిక్కులు, నక్షత్రాలు, నరలోక విషయాలు ఉన్నాయి.


'అగ్నీధ్రాదుల జననం' అన్న అంశంలో అగ్నీధ్రాదుడి రథచక్ర తాకిడికి భూమిమీద ఎలా గోతులు ఏర్పడ్డాయో వివరించడం జరిగింది. అవే సప్త సముద్రాలయ్యాయి. ఆ సముద్రాల మధ్య భాగం ద్వీపాలయ్యాయి. ఆ సప్త ద్వీపాలు: జంబూ ద్వీపం, ప్లక్ష ద్వీపం, శాల్మలి ద్వీపం, కుశద్వీపం, క్రౌంచ ద్వీపం, శాక ద్వీపం, పుష్కర ద్వీపం. ఇక సప్త సముద్రాలు: లవణ సముద్రం, ఇక్షు సముద్రం, సురా సముద్రం, ఘృత (నేతి) సముద్రం, పాల సముద్రం, దధి (పెరుగు) సముద్రం,జల సముద్రం. సముద్రాలు ద్వీపాలకు అగడ్తలలాగా ఉన్నాయి. సముద్రాలు, ద్వీపాలు ఒకదానితో ఒకటి కలిసి పోకుండా. సరిహద్దులు పెట్టినట్లు వరస తప్పకుండా వేర్పడడం చూసి జీవులు విస్తుపోయాయని పేర్కొనడం జరిగింది.


ఈ విషయాలతో పాటు మరెన్నో ఆసక్తికరమైన విషయాలు పంచమ స్కందంలో ఉన్నాయి. ఇవన్నీ చదవగలగడం పూర్వజన్మ సుకృతం.


                  *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


          *రచన:శ్రీ వనం*

   *జ్వాలా నరసింహారావు*

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷``


 *🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

బుధవారం🌷* *🪷13 ఆగస్టు 2025🪷*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🌷బుధవారం🌷*

 *🪷13 ఆగస్టు 2025🪷*  

    *దృగ్గణిత పంచాంగం* 


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః* 

*శ్రావణమాసం - కృష్ణపక్షం*


*తిథి  : చవితి* ఉ 06.35 *పంచమి* రా.తె 04.23 వరకు 

*వారం    : బుధవారం* ( సౌమ్యవాసరే )

*నక్షత్రం   : ఉత్తరాభాద్ర* ఉ 10.32 వరకు ఉపరి *రేవతి*

*యోగం : ధృతి* సా 04.05 వరకు ఉపరి *శూల*

*కరణం  : బాలువ* ఉ 06.35 *కౌలువ* సా 05.30 ఉపరి

*తైతుల* రా.తె 04.23 వరకు *ఆపైన గరజి* 


*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 09.00 - 10.00 సా 04.30 - 05.30*    

అమృత కాలం  : *ఉ 06.00 - 07.31*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*


*వర్జ్యం      : రా 09.49 - 11.19*

*దుర్ముహూర్తం  : ప 11.47 - 12.38*

*రాహు కాలం   : మ 12.12 - 01.47*

గుళికకాళం       : *ఉ 10.37 - 12.12*

యమగండం     : *ఉ 07.26 - 09.02*

సూర్యరాశి : *కర్కాటకం*  

చంద్రరాశి : *మీనం*

సూర్యోదయం :*ఉ 05.59*

సూర్యాస్తమయం :*సా 06.43*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.51 - 08.23*

సంగవ కాలం         :     *08.23 - 10.56*

మధ్యాహ్న కాలం    :     *10.56 - 01.28*

అపరాహ్న కాలం    : *మ 01.28 - 04.01*


*ఆబ్ధికం తిధి         : శ్రావణ బహుళ పంచమి*

సాయంకాలం        :*సా 04.01 - 06.33*

ప్రదోష కాలం         :  *సా 06.33 - 08.49*

రాత్రి కాలం           :*రా 08.49 - 11.50*

నిశీధి కాలం          :*రా 11.50 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.06*

******************************

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌷శ్రీ సరస్వతీ కవచం🌷*


*ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై* 

*స్వాహేతి దంతపంక్తిం* 

*సదాఽవతు* 


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

శిరా వేధ పద్ధతి

 శిరా వేధ పద్ధతి  - ప్రాచీన చికిత్సా పద్దతి . 1

      

.        ఈ శిరావేధ చికిత్స మన ఆయుర్వేదము నందు తప్ప ఏ ఇతర వైద్యము నందు లేదు . ఈ శిరావేధ పద్దతి ద్వారా అసాధ్యవ్యాధులను పోగొట్టవచ్చు . ఇప్పుడు ఈ ప్రాచీన చికిత్స గురించి మీకు సంపూర్ణముగా వివరిస్తాను. 

              

. మానవ శరీరం నందు మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం 700 శిరలు కలవు . ఈ శిరలు శరీరమంతటా వ్యాపించి చిన్నచిన్న నీటికాలువలు తోటలోని అన్ని చెట్లకు నీటిని ఎలా అందచేయునో అదేవిధముగా శరీరంలోని అన్ని భాగములకు మనము తినిన ఆహారపదార్ధము వలన జనించు రసాధి ధాతువులను అందచేసి శరీరంను పోషించుచున్నవి. శరీరంలో అవయవములు ముడుచుకొనుట , చాచుట వంటి కార్యక్రములకు తోడ్పడుచున్నవి. శరీరంలోని వాత,పిత్త,కఫములు రక్తమునందు చేరి శరీరము అంతటా ప్రసరించుచున్నవి. శరీరము నందలి వాతాదులు అధికంగా వహించు శిరలకు వెఱువేఱు రంగులు , పనులు ఉండును. హస్త, పాదముల యందు 400 శిరలు కలవు. ఉదరము నందు 136 , శిరస్సు నందు 164 ఇలా మొత్తం 700 శిరలు కలవు. వీటిలో హస్తము , పాదముల యందు 16 శిరలు , ఉదరము నందలి 32 శిరలు , మెడకు పైభాగము వేధింపతగినవిగా గుర్తించవలెను. ఇక్కడ వేధింపడం అనగా శిరకు రంధ్రం చేసి దుష్టరక్తం తీయటం ఇది చేయు పద్ధతిని తరువాత వివరిస్తాను . 

           

.      శిరావేధ చేయు వైద్యుడు మర్మలకు సన్నిహితముగా ఉండు శిరలను వేధించరాదు . శిరల గురించి వాటి స్థానము గురించి సంపూర్ణ అవగాహన ఉన్న వైద్యుడు మాత్రమే చికిత్స చేయవలెను . మర్మలకు సన్నిహితముగా ఉన్న శిరలను వేధించిన కొత్తరోగములు వచ్చుట , అంగవైకల్యము సంప్రాప్తిచుట జరుగును . ఒక్కోసారి ప్రాణములు పోవటం కూడా జరుగును. సరిగ్గా చికిత్స చేసిన అసాధ్యరోగములు పోగొట్టవచ్చు . ఈ శిరావేధనము బాలలు , వృద్దులు , క్షీణించినవారు , తాత్కాలిక కారణాల వలన నీరసించినవారు మొదలగువారికి నిషిద్దం . ఒకవేళ పాముకాటుకు గురైన నిషేధింపబడిన వారికి కూడా శిరావేదన చికిత్స చేయవచ్చు . అలా చేసిన బ్రతకగలరు . ఇప్పుడు మీకు ఈ శిరావేదన పధ్ధతి గురించి సంపూర్ణముగా వివరిస్తాను. 

                     

.       శిరలను వేధించుటకు ముందుగా శిరస్సు , పాదములు , హస్తములు , ఉదరము , పార్శ్వములు మొదలగు స్థానములందలి శిరలు స్పష్టముగా కనపడేలా గుడ్డతో కట్టిన పిమ్మట వ్రీహిముఖము అను ఒక శస్త్రముతో ఆయాస్థానములు అనుసరించి యవగింజ ప్రమాణము , అర్ధయావగింజ అంత లోతుగా వేధించవలెను . వేధ చేయవలసిన కాలములను సరిగ్గా గుర్తించవలెను . వేధ చేసిన పిమ్మట సువిద్ద ,దుర్విద్ధ లక్షణములు , దుష్టరక్త స్వరూపము , మంచి రక్తస్వరూపము , రక్తము వేధన చేసినను రాకుండా ఉండటం , లేక అధికరక్తస్రావం అగుట , ఎట్టివారికి ఎంత రక్తము తీయవలెను ఇత్యాది లక్షణములను , విధులను బాగుగా గుర్తించి రక్తమోక్షణము చేయవలెను . 

                 

.          తరవాతి పోస్టు నందు ఏయే వ్యాధులకు ఎక్కడెక్కడ రక్తమోక్షణము చేయవలెనో వివరిస్తాను .  


. మరింత విలువైన సమాచారం మరియు అనేక రోగాలకు సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


గమనిక  -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

.        నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

.         ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

.    ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

.       కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

.               9885030034

అభిజ్ఞానశాకుంతలం

 🙏అభిజ్ఞానశాకుంతలం కవికుల గురువు కాళిదాసు🙏

ముందుగాఅభిజ్ఞానశాకుంతలం నాటకం బోధించిన మా గురువర్యులు బ్రహ్మశ్రీ కొంపెల్ల సత్యనారాయణ గారికి పాదాభివందనం.


కాళిదాసు రచనల్లో ఇది బాగుంది, ఇది బాలేదు అని చెప్పడానికేమీ లేదు (అలా చెప్పడానికి నాకున్న జ్ఞానం సరిపోదు) కానీ ఈ అభిజ్ఞాన శాకుంతలం నన్ను ఎక్కువగా ఆకర్షించింది. ఇది "శృంగార రస" ప్రధానమయిన నాటకం. ఈ కథ అందరికీ బాగా తెలిసినదే కనుక సూక్ష్మంగా చెప్పుకుంటే: హస్తినాపుర రాజయిన దుష్యంతుడు వేటకు వెళ్ళినపుడు కణ్వ మహర్షి ఆశ్రమంలో శకుంతలని కలిసి, ప్రేమించి, గాంధర్వ వివాహం చేసుకుంటాడు. కొంతకాలం ఆమెతో ఉన్నాక రాజ్యానికి తిరిగివెళుతూ రాజముద్రికను గుర్తుగా ఇస్తాడు. భర్త గురించిన తలపులతో, విరహంలో ఉన్న సమయంలో ఆశ్రమానికి వచ్చిన దూర్వాస మునిని సరిగా ఆదరించక పోవడంతో ఎవరిగురించయితే ఆలోచిస్తూ నన్ను అశ్రద్ధ చేసావో వారు నిన్ను పూర్తిగా మర్చిపోతారనీ, ఏదయినా గుర్తు చూసినప్పుడే గుర్తువస్తావనీ శకుంతలని శపిస్తాడు. నిజానికి ఈ శాప విషయం కూడా ఆమె వినకుండా భర్త గురించే ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటుంది. ఇవన్నీ కణ్వ మహర్షి ఆశ్రమంలో లేని సమయములో జరిగినందున తిరిగివచ్చిన మహర్షి జరిగినదంతా తెలుసుకుని శకుంతలను అత్తవారింటికి పంపుతాడు. రాజు వద్దకు వెళ్తున్న శకుంతల నదిలో ఈ రాజముద్రికని కోల్పోవడం, రాజు ఈమెను గుర్తించక నిరాకరించడం, మేనక ఆమెను తీసుకెళ్ళిపోవడం, కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో చేరటం, ఇలా చాలా జరిగి ఒక చేపలవాని వలలో చిక్కిన ఈ రాజముద్రికని రాజు వద్దకు తీసుకెళ్లడం, అప్పుడంతా గుర్తువచ్చిన దుష్యంతుడు శకుంతలని తన వద్దకు తీసుకుని వచ్చి వారి కుమారుడైన భరతునికి పట్టాభిషేకం చేయటం జరుగుతాయి.ఇది సంక్షిప్త కథ


ఈ నాటకంలో నాకు శృంగారం కన్నా ధార్మిక సూత్రాలు ఎక్కువగా కనిపించాయి (పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నారు కదా!). ప్రతీ రచనా శ్రీకారానికి ప్రోద్బలం ఉంటుంది అన్నట్టుగా ఒక రోజున భోజమహారాజు కాళిదాసుని శాకుంతలాన్ని రచించమని అడుగగా ఈయన "శాకుంతలంలోని నాయకుడయిన దుష్యంతుడు ధీరోదాత్తుడు కానందున నేను వ్రాయను" అంటారు. ఇక్కడ మనకు కాళిదాసు రచనలో పాత్రలకి కూడా ఎంత చక్కని గుణాలని ఆపాదించాలని చూస్తాడో అనిపిస్తుంది. తన భార్యాబిడ్డల్ని ఎక్కడ లోకం అనుమానిస్తుందో, అవమాన భారం మొయ్యాల్సివస్తుందో అన్న భయంతో (లోకానికి వారు నిజంగా తనవారే అని అశరీరవాణితో చెప్పించడానికి అలా చేశాడు అని కొందరి సమర్ధన) తన వారు కాదని చెప్పిన దుష్యంతుడిని నాటకంలో నాయకుడిని చేయలేను. అయినా రాజు అడిగినందున ఆయన ముచ్చట తీర్చడానికి తను రాజీ పడలేక ఒక శాపం పొందినట్టు, ముద్రిక చూడటం వలన అంతా మళ్ళీ గుర్తుకు వచ్చినట్టు కల్పించి, నాయకుని లక్షణాలను ఆపాదించి, అభిజ్ఞాన శాకుంతలం అని నామకరణం చేశాడు. అభిజ్ఞానం అనగా ఒక గుర్తు (ఇక్కడ కథలో రాజ ముద్రికే గుర్తు). అందువలననే దీనిని కేవలం శాకుంతలం అని కాక అభిజ్ఞాన శాకుంతలం అనాలి.

ఈ నాటకంలో నాకు శృంగారం కన్నా ధార్మిక సూత్రాలు ఎక్కువగా కనిపించాయి (పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నారు కదా!). ప్రతీ రచనా శ్రీకారానికి ప్రోద్బలం ఉంటుంది అన్నట్టుగా ఒక రోజున భోజమహారాజు కాళిదాసుని శాకుంతలాన్ని రచించమని అడుగగా ఈయన "శాకుంతలంలోని నాయకుడయిన దుష్యంతుడు ధీరోదాత్తుడు కానందున నేను వ్రాయను" అంటారు. ఇక్కడ మనకు కాళిదాసు రచనలో పాత్రలకి కూడా ఎంత చక్కని గుణాలని ఆపాదించాలని చూస్తాడో అనిపిస్తుంది. తన భార్యాబిడ్డల్ని ఎక్కడ లోకం అనుమానిస్తుందో, అవమాన భారం మొయ్యాల్సివస్తుందో అన్న భయంతో (లోకానికి వారు నిజంగా తనవారే అని అశరీరవాణితో చెప్పించడానికి అలా చేశాడు అని కొందరి సమర్ధన) తన వారు కాదని చెప్పిన దుష్యంతుడిని నాటకంలో నాయకుడిని చేయలేను. అయినా రాజు అడిగినందున ఆయన ముచ్చట తీర్చడానికి తను రాజీ పడలేక ఒక శాపం పొందినట్టు, ముద్రిక చూడటం వలన అంతా మళ్ళీ గుర్తుకు వచ్చినట్టు కల్పించి, నాయకుని లక్షణాలను ఆపాదించి, అభిజ్ఞాన శాకుంతలం అని నామకరణం చేశాడు. అభిజ్ఞానం అనగా ఒక గుర్తు (ఇక్కడ కథలో రాజ ముద్రికే గుర్తు). అందువలననే దీనిని కేవలం శాకుంతలం అని కాక అభిజ్ఞానశాకుంతలం అనాలి


కాళిదాసు ప్రజ్ఞకు అభిజ్ఞాన శాకుంతలంలోని చతుర్దాకములోని శ్లోక చతుష్టయాన్ని ఉదాహరణకు చెప్పాలనుకుంటున్నాను

"కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు చ శకుంతలా

తస్యాంచ చతుర్ధ్వాంకః తస్మిన్ శ్లోక చతుష్టయం"

.

కావ్యాలకంటే నాటకాలు రమ్యంగా ఉంటాయి.

నాటకాలలో శాకుంతలం, అందులో మళ్ళీ నాల్గవ అంకము, 

అందులో కూడా శ్లోక చతుష్టయం 

అద్భుతమయినవి. శ్లోక చతుష్టయం అంటే నాలుగు శ్లోకాలు.

ఈ నాలుగూ కూడా కణ్వ మహర్షి చెప్పిన సందర్భంలోవే. 

ఏమిటా శ్లోకాలు? ఎందుకవి అంత గొప్పవి అంటే వాటిని చదవ వలసినదే:

.

పాతుం న ప్రధమం యవస్యతిజలా యుష్మాస్వపీ తేషుయా

నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహే నయా పల్లవం

ఆజ్యేవః కుసుమ ప్రసూతి సమయే యస్యాభవత్యుత్సవః

సేయం యాతి శకుంతలా పతిగృహం సర్వైరనుజ్ఞాయతాం

.

మనిషికీ ప్రకృతికీ ఉండే బంధాన్ని ఎంత చక్కగా చెప్పాడో కదా కాళిదాసు! 

.

మొక్కలకి నీళ్ళు పోయకుండా తను మంచినీళ్ళు కూడా త్రాగేది కాదు, చిగురుటాకులను అలంకరించు కోవటం ఎంత ఇష్టమయినా సరే తుంచేది కాదు, తాను పెంచిన మొక్కకి పువ్వు పూస్తే పిల్లలు పుట్టినంత ఆనందించి ఉత్సవం చేసేది, 

అటువంటి శకుంతల అత్తవారింటికి వెళుతోంది కనుక మీరు అనుజ్ఞని ఇవ్వండి అంటాడు కణ్వ మహర్షి. ఈ శ్లోకంలో మొక్కలని సాటి మనిషిగా, అతిధిగా, సన్నిహితులుగా, బంధువులుగా చూపటం జరిగింది. 

వృక్షో రక్షతి రక్షితః అని మనం అనడమే తప్ప ఏనాడయినా 

ఇంత మమకారం చూపించామా? అనిపిస్తుంది నాకయితే.

.

యాస్యత్యజ్య శకుంతలేతి హృదయం సంస్పృష్ట ముత్కంఠయా

కంఠస్థంబిత బాష్పవృత్తి కలుషశ్చింతా జడం దర్శనం

వైక్లవ్యం మమతావదీ దృశ మిదం స్నేహాదరణ్యౌ కసః పీడ్యంతే గృహిణః కథంనుతనయా విశ్లేష దుఃఖైర్నవైః

.

నా కూతురయిన శకుంతల అత్తవారింటికి వెళుతుంటే బాధతో కంఠం పట్టేసి నోట మాట రావటం లేదు, కంటిలో నీరు చేరి చూపు కనిపించటం లేదు, అంతా జడంగా, నిర్జీవంగా అనిపిస్తోంది. 

మునివృత్తిలో ఏ బంధాలూ లేకుండా ఉండే నాకే ఇంత బాధగా, మనసంతా ఏదోలా ఉంటే అదే గృహస్థులకి కూతురిని అత్తవారింటికి పంపేటప్పుడు ఇంకెంత బాధాకరంగా ఉంటుందో కదా! అని ఆలోచిస్తాడు కణ్వ మహర్షి.

ఒక ప్రక్కన తను బాధపడుతూనే వేరే వారి పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన కూడా కణ్వ మహర్షిలో కలిగినట్టు చూపెడతాడు కాళిదాసు. ఒక తండ్రికి అత్యంత బాధ కలిగే సమయం ఇదే అంటారు అందుకేనేమో!

.

అస్మాన్ సాధు విచింత్య సంమ్యమధనాన్ ఉచ్ఛైః కులంచాత్మనః

త్వైయస్యాః కథమప్యబాంధవ కృతాం స్నేహ ప్రవృత్యించతాం

సామాన్య ప్రతిపత్తి పూర్వక మిదం దారేషు దృశ్యాత్వయా

భాగ్యా యత్త మతః పరం నఖలుత ద్వాత్యం వధూబంధుభిః

.

కూతురితో రాజయిన అల్లుడికి కణ్వ మహర్షి పంపే సందేశమే ఈ శ్లోకం. 

నేను సారెలు, కట్నకానుకలు ఇవ్వలేదు. ముని వృత్తిలో ఉన్న మాకు తపస్సు, నీతి నియమాలే ధనం. రాజువయిన నీకు ఇంతకన్నా గొప్ప ధనాన్ని (నీ తాహతుకు తగ్గట్టు) మేము ఇవ్వలేము. 

కావున అవేమీ ఇవ్వలేదని మా అమ్మాయిని సాధించకు, డబ్బు,నగలు లేవని తృణీకార భావంతో చూడకు. మీది పెద్దలు కుదిర్చిన పెళ్లి కూడా కాదు. స్నేహభావంతో, అనురాగంతో మీరిరువురూ గాంధర్వ వివాహం చేసుకున్నారు కనుక మా అమ్మాయి నచ్చలేదు అని ఏ నాడూ అనకు. 

నీకు చాలా మంది భార్యలున్నా (బహు భార్యత్వం ఆ కాలంలో సహజమే) వారితో సమానంగా చూడు. వారికన్నా బాగా చూసుకుంటాను అంటే అది శకుంతల భాగ్యం కానీ నేను మాత్రం వారికన్నా బాగా చూడమని చెప్పకూడదు అని ఈ శ్లోక సారాంశం. 

నన్నెంతగానో కదిల్చింది. ఎంత ముందుచూపు ఆ తండ్రికి? నీతి నియమాలు, సత్ప్రవర్తనకి మించిన ధనం ఉంటుందా? ఈ విషయం ఈ కాలం వారు గ్రహించి ఆచరిస్తే ఎంతో మంది స్త్రీలు కట్న పిశాచికి బలి కాకుండా ఉండేవారేమో కదా! అనిపించింది.

ఇక్కడ శ్లేష కూడా ఉంది.

అస్మాన్ సాధు విచింత్య 

మమ్ములను సాధువులని (తపస్సాలులమని ) తెలుసుకో.నీ దగ్గర ఎంత ధనమైన ఉండవచ్చు మాకు సంమ్యమధనాన్. తపస్ శక్తియే ధనం. మా తపోధనము ముందు నీ ఐహిక సంపదలు నిలవవు. ఈమె ఉన్నత వంశములో పుట్టినది..

.సా -- మాన్య ప్రతిపత్తి పూర్వక మిదం దారేషు దృశ్యాత్వయా ఆమెను మాన్య అంటే ఇతర స్త్రీ గా చూడవద్దు అని హెచ్చరించారు చాలా గొప్ప శ్లోకం కాళిదాసు దివ్య చరణాలకు నా నమస్కారాలు.

 

సుశ్రూషస్వ గురూన్ ప్రియసఖీ వృత్తిం సపత్నీజనే

భర్తుర్విప్ర కృతాపి రోషణతయా మాస్మం ప్రతీ పంగమః

భూయిష్ఠం భవ దక్షిణా పరిజనే భాగ్యేష్వనుత్సేకినీ

యాంత్యేవం గృహిణీ పదం యువతయో వామాః కులస్యాధయః

.

ఇంతకు ముందు చెప్పిన శ్లోకంలో అల్లుడు కూతురిని ఎలా చూసుకోవాలో చెప్పిన కణ్వ మహర్షి ఈ శ్లోకంలో ఆడపిల్ల అత్తవారింట ఎలా ఉండాలో చెప్పాడు. 

పెద్దలకి (అత్తమామలకీ, మొ..వారికి) సేవ చెయ్యి, సవతులతో స్నేహంగా ఉండు, భర్త కోపంలో ఒక మాట అన్నా రోషం తెచ్చుకోకుండా అతనితో సామరస్యంగా ఉండు, 

సేవకుల యందు దయకలిగి ఉండు వారిని ఏ నాడూ తక్కువగా చూడకు, భోగ భాగ్యాలున్నాయి అన్న ఉద్వేగంతో గర్వం దరిచేరకుండా చూసుకో. ఇలా ఉన్నప్పుడే యువతులు గృహిణీ స్థానం పొందుతారు లేదా చెడ్డ పేరు తీసుకువస్తారు అని చెప్తాడు. 

ఒక్కో మాట ఒక్కో ఆణిముత్యం. తప్పక ప్రతీ ఒక్కరూ ఇవన్నీ పాటిస్తూ ఆచరణలో పెట్టగలిగితే (?) ఈ కాలంలో విడాకులు అనేవి ఉండేవి కావేమో! అనిపిస్తుంది.

ఈ నాలుగు శ్లోకాలూ అమోఘం. 

కాళిదాసు ఇవన్నీ ఈ కాలంలో పరిస్థితులు ఇలా ఉంటాయన్న ముందుచూపుతో ఇవన్నీ వ్రాశాడో, లేక మామూలుగానే వ్రాశాడో తెలియదు కానీ ప్రపంచం ఎంతగా మారిపోయినా ప్రతీ ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవలసిన మాటలు కదూ! 

అందుకేనేమో ఇవి శ్లోక చతుష్టయం అంటూ అంతటి గొప్ప స్థానాన్ని పొందాయి.

ఈ నాటకమంతటిలో నాకు కాళిదాసు జనాలకి ఎక్కువ ఉపదేశాలు చేశారనిపిస్తుంది. ఎన్నో ధర్మాలకి అక్షర రూపం ఈ నాటకం. ప్రతీ శ్లోకంలోనూ ఒక్కో ధర్మాన్ని చూడచ్చు. వాటిల్లో అన్నీ వ్రాయలేను కానీ కొన్ని ముఖ్యమయినవి, ఆలోచించ తగినవి (నా ఉద్దేశ్యంలో):


ప్రాణానామనిలేన వృత్తి రుచితా సత్కల్ప వృక్షేవనే

తోయే కాంచన పద్మరేణుకపిశే ధర్మాభిషేక క్రియా

ధ్యానం రత్న శిలాతలేషు విభుధస్త్రీ సన్నిధౌ సంమ్యమః

యత్కాంక్షంతి తపోభిరన్య మునయః తస్మిన్ తపస్యంత్యమీ


ఇది దుష్యంతుడు కశ్యప ప్రజాపతి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితిని వర్ణించిన సందర్భంలోనిది. అక్కడ ఉన్న జనాలు కల్పవృక్షం క్రింద కూర్చుని ప్రాణాయామం చేస్తున్నారు, ఆకాశగంగలో బంగారు తామరపూల మధ్యన స్నానం చేస్తున్నారు, రత్నాలతో చేసిన వేదిక పైన కూర్చుని తపస్సు చేస్తున్నారు, చుట్టూ అప్సరసలు తిరుగుతున్నా పట్టించుకోకుండా ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. అసలు సాధారణ మానవులు ఏవయితే కోరుకుంటారో వాటికి మించి ఉన్నా కూడా మోక్షం కోసం ఇవన్నీ చేస్తున్నారు. అంటే దీనిని బట్టీ కాళిదాసు ఈ భోగభాగ్యాలు శాశ్వతం కాదు ఆత్మసాక్షాత్కారం, మోక్షం మాత్రమే శాశ్వతం అని చెప్తున్నాడా (?) అనిపిస్తుంది. కానీ వారిలో వేటికీ చలించకుండా ఉన్న చిత్తశుద్ధి, చేస్తున్న పని మీద ఏకాగ్రత మనకు ఉంటే అబ్బో! ఎన్ని సాధించే వాళ్ళమో!   


తన వద్దకు వచ్చిన శకుంతలని నిరాకరించిన దుష్యంతునికి ఒక పాట వినిపిస్తుంది. దాని భావం "తుమ్మెదా! నువ్వు ఒక పువ్వు మీద వాలి మకరందాన్ని స్వీకరించావు, తరువాత దీనిని వదిలేసి ఇంకొక పువ్వు మీద వాలతావు" అని ఉంటుంది. అది వినేసరికి దుష్యంతునికి మనసులో అల్లకల్లోలం. మనసుకి బాగా పట్టేసినది ఏదయినా విన్నా, దాని గురించి ఏం తెలిసినా అదంతా గత జన్మ భావన అనుకోవటమే కాక మనసు చలించిపోయి ఉద్వేగానికి గురవుతారు. అందుకే ""భావస్థిరాణి జననాంతర సౌహృదాని"" అంటారు. ఇక్కడ దుష్యంతుని ఆ తుమ్మేదని నేనే ఎవరినో వదిలేసాను అన్న భావన గత జన్మలోదని భావించాడు కానీ ఈ జన్మలోదే అని శాప ప్రభావం చేత తెలుసుకోలేకపోయాడు. మనసుకి బాగా దగ్గరయినవి ఎన్నటికీ మర్చిపోలేము అన్న మాట మనందరికీ అనుభవమే కదా!


ఒక పౌర్ణమి తరువాతి రోజు సూర్యోదయాన్ని వర్ణిస్తూ ఒకరు (చంద్రుడు) అంతమవుతుంటే ఒకరు (సూర్యుడు) పుడుతున్నాడు అంటారు కాళిదాసు. ఇది మనందరం చూసే విషయమే కదా ఇందులో వింతేముంది అనుకోకండి. ఆలోచిస్తే ఒక మనిషి చనిపోతుంటే వేరొక మనిషి పుడుతున్నాడు అన్న అంతరార్థం ఉంది కదా. అది చెప్పేందుకే ఇలా చూపించాడా అనిపిస్తుంది.


వాస్తవానికి రాజయిన దుష్యంతునికి మునికుమార్తె శకుంతల మీద ప్రేమ భావం కలుగకూడదు. కానీ కలుగుతోంది అంటే ఇది నిజంగా తప్పు కాదు అనుకుంటాడు (నిజానికి ఈమె విశ్వామిత్రుని కుమార్తె కదా). సతాంహి సందేహ పదేషు వస్తుషు ప్రమాణ మంతః కరణ ప్రవృత్తయః అన్నట్టు సందేహంగా ఉన్నప్పుడు మనసు ఏది చెప్తే అదే చేయమని అంటాడు కాళిదాసు. సత్పురుషులకీ, గొప్పవారికి మనస్సే ప్రమాణం. అందుకే కదా మనస్సాక్షికి మాత్రమే భయపడాలి అంటారు.


అత్తవారింటికి వెళ్తున్న శకుంతల తండ్రయిన కణ్వ మహర్షిని మళ్ళీ పుట్టింటికి ఎప్పుడు రాను? అని అడుగుతుంది పుట్టింటి మీద మమకారంతో. అది విన్న ఆయన వానప్రస్థానికి రమ్మంటాడు. దీనిని బట్టీ పెళ్ళయిన ఆడపిల్ల అస్తమానూ పుట్టింటికి రాకూడదు అన్న విషయం చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తుంది.


ఇలా చెప్పుకుంటూ పోతే నాటకమంతా చాలా చాలా ఆలోచనలను రేపింది. కాళిదాసు రచనలన్నింటిలోనూ అభిజ్ఞానశాకుంతలం ఎంతో కీర్తి సంపాదించుకుంది. వేరే భాషలలో కూడా ఎక్కువగా అమ్ముడయిన పుస్తకం ఇదే. ఎన్నో భాషలలోకి తర్జుమా చేసినా సంస్కృతంలో మాత్రమే చదవాలని కేవలం ఈ నాటకం ఆస్వాదించడం కోసమే కొంతమంది సంస్కృతం నేర్చుకున్నారు అంటే అతిశయోక్తి కాదు

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ.

Panchaag

 


12, ఆగస్టు 2025, మంగళవారం

శ్రీమద్భాగవత కథలు*```

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🍁మంగళవారం 12 ఆగస్టు 2025🍁*


                      2️⃣9️⃣

                  *ప్రతిరోజూ*

*మహాకవి బమ్మెర పోతనామాత్య*


      *శ్రీమద్భాగవత కథలు*```


(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```


*వేదాలు వేయి సార్లు చదివినా లభ్యం కాని ముక్తి, భాగవతాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి లభిస్తుంది..!*``



*నారదుడు ప్రాచీనబర్హికి చెప్పిన పురంజనోపాఖ్యానం*

                 

```

ఒకనాడు, ఏదైనా గొప్ప మహత్కార్యం చేయాలన్న తలంపుతో వున్న మహారాజు ప్రాచీనబర్హి దగ్గరికి నారదుడు వచ్చాడు. వచ్చి, ఏ శుభాన్ని కోరి మహత్కార్యం చేయాలనుకుంటున్నాడని ప్రాచీనబర్హిని ప్రశ్నించాడు. మోక్షస్థితిని తెలుసుకోవడానికి తనకు జ్ఞానోపదేశం చేయమని నారదుడిని అడిగాడు ప్రాచీనబర్హి. సంసార చక్రంలో పరిభ్రమించే తన లాంటివాడు మోక్షపదాన్ని పొందలేడు అని కూడా అంటాడు. 


అప్పుడు నారదుడు, యజ్ఞాలలో ఆయన చంపిన జంతువులు వేలసంఖ్యలో వున్నాయనీ, అవన్నీ ఆయన కసాయితనాన్ని స్మరిస్తూ, ఆయన ఎప్పుడైతే పరలోకం చేరుతాడో అప్పుడు ఆయన్ను హింసించడానికి ఎదురుచూస్తున్నాయనీ, ఆ ఆపద నుండి దాటడానికి ఒక ఇతిహాసాన్ని చెప్తాననీ అంటూ పురంజనోపాఖ్యానం చెప్పాడు.


పూర్వకాలంలో పురంజనుడనే రాజుండేవాడు. అతడికి జ్ఞానంతో కూడిన ప్రవర్తన కల విజ్ఞాతుడనే స్నేహితుడున్నాడు. తనకు అనుకూలమైన పురం కొరకు స్నేహితుడితో కలిసి పురంజనుడు భూమండలమంతా తిరిగాడు. భోగవతి లాంటి ఒక పురాన్ని చూశాడు ఒకనాడు. అది గోపురాలతో, ప్రాకారాలతో, బురుజులతో, కందకాలతో... ఇలా రకరకాల సౌకర్యాలతో, సర్వలక్షణాలు కల నాగుల నివాస పట్టణమైన భోగవతి లాగా వున్నది. ఆ పురానికి వెలుపల అందమైన ఒక ఉద్యానవనం వున్నది. అందులో సరస్సులున్నాయి. ఆ ఉద్యానవనంలో పురంజనుడు ఒక అందమైన యువతిని అనుచరగణంతో సహా చూశాడు. ఆమె ఎవరని, ఆమె పేరేమిటని, తండ్రి ఎవరని, ఆమెను అనుసరిస్తున్న పదకొండు మంది సేవకులు ఎవరని, ఆమె ఈ వనంలోకి రావడానికి కారణం ఏమిటని, ఆమె ముందు నడుస్తున్న పాము ఎవరని ప్రశ్నించాడు పురంజనుడు. తనను ప్రేమించమని కూడా అడిగాడు.


తనకు తన తండ్రి ఎవరో, తన కులం ఏమిటో, పేరేమిటో, తానున్న ఈ పురం పేరేమిటో, దాన్ని నిర్మించిన వాడెవరో తెలియదనీ, తన వెంట వున్నవాళ్లు తన సఖులని, చెలికత్తెలని, ఆ పాము తను నిద్రించేటప్పుడు పురాన్ని పాలిస్తుందని అన్నది ఆ యువతి జవాబుగా. తన భాగ్యవశాన పురంజనుడు అక్కడికి వచ్చాడని, ఆ పురాన్ని స్వీకరించి పాలించమని, తాను సమకూర్చే కోరికలన్నిటినీ నూరేళ్లు అనుభవించమని అన్నది. పురంజనుడు లాంటివాడిని తనలాంటి కన్య తప్పక వరిస్తుందని చెప్పింది. ఆ పద్మాక్షిని పురంజనుడు తక్షణమే వరించాడు. ఆ పురంలోకి ప్రవేశించి ధన్యుడయ్యాడు. వంద సంవత్సరాలు సమస్త సౌఖ్యాలను అనుభవించాడు. ఆ పురానికి వున్న మొత్తం తొమ్మిది ద్వారాల అధిపతులకు, తూర్పున వున్న అయిదు ద్వారాల అధిపతులకు మహాధిపతి పురంజనుడే. ఆయా ద్వారాల ద్వారా రకరకాల విషయాలను పొందుతాడు.


అతడి నగరంలో నిర్వాక్కు, పేశస్కరుడు అనే ఇద్దరు గుడ్డివాళ్లున్నారు. వాళ్ల సాయంతో ఆయన గమనం, కరణం అనే పనుల్ని నెరవేర్చుకుంటాడు. అంతఃపురంలోకి వెళ్లేటప్పుడు విషచి అనే ఆమెతో కలిసి భార్యాపుత్రుల వల్ల కలిగే మోహప్రసాద హర్షాలను పొందుతాడు. ఇలా పురంజనుడు కామాసక్తుడై, 'బుద్ధ' అనే పట్టమహిషి వల్ల సంచించ బడ్డాడు. ఆమె పురంజనుడు ఏది చేస్తే అది చేస్తుంది. తింటే తింటుంది. తాగితే తాగుతుంది. నడిస్తే నడుస్తుంది. అలా పురంజనుడు తన నిజస్వరూపాన్ని ఎడబాసి, పట్టమహిషి వల్ల మోసపోయి, జ్ఞానం కోల్పోయి, 

ఆ పురంలో కాపురం వున్నాడు. అలా కొన్నాళ్లు గడిచాక ఒకనాడు ధనస్సు, బాణాలు ధరించి సైన్యంతో కలిసి వేగంగా బయల్దేరి, పురాన్ని వదిలి, పంచవ్రస్తం అనే అడవికి వెళ్లి, పట్టమహిషిని విడిచి, మదంతో సంచరించాడు. మృగాలను దయాహీనుడై వధించాడు. వేటాడింది తన ఆహారం కోసం కాదు. కేవలం వినోదం కోసం చేసిన రాక్షస క్రీడ. జ్ఞానియైన విద్వాంసుడు చేయతగని హింసను చేసి, నియమాన్ని ఉల్లంఘించి, దుస్సహంగా వేటాడి అలసిపోయి మందిరానికి వెళ్లాడు. బడలిక తీరేదాకా నిద్రపోయాడు పురంజనుడు.


మళ్లీ తన ప్రియురాలైన పట్టమహిషి మీద మనసుపడ్డాడు. భార్య కనిపించక పోయేసరికి అంతఃపుర స్త్రీలను ఆమె గురించి అడిగాడు. కిందపడి పొర్లాడుతూ, ప్రణయ కోపం నటిస్తూ పడుకున్న భార్యను చూపించారు వారు. ఆమెను దగ్గరికి తీసి ఓదార్చాడు. అనునయించాడు. ఆమె కోపాన్ని వీడి అలంకరించుకుని భర్తను చేరింది. ఇద్దరూ శృంగారంలో రాత్రిపగలు అనే తేడా లేకుండా, విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి గడిపి, ఆయువు క్షీణిస్తున్నదన్న సంగతి కూడా తెలుసుకోలేకపోయారు. పురంజనుడు ఒళ్లు మరిచిపోయి జీవితాన్ని గడిపాడు. అతడి నవయవ్వన కాలమంతా అరక్షణం లాగా గతించి పోయింది. పదకొండు వందలమంది కొడుకులను, నూటపదిమంది కూతుళ్లను కన్నారు. వారిద్దరు.. అతడి ఆయుష్షులో సగభాగం తరిగిపోయింది. కుమారులకు, కుమార్తెలకు వివాహం చేశాడు. వారికి ఒక్కొక్కరికి వందమంది చొప్పున కొడుకులు పుట్టి వంశాభివృద్ధి చెందింది.


ఆ తరువాత నిష్ఠగా యజ్ఞదీక్ష వహించి, అనేక యజ్ఞాలు చేశాడు పురంజనుడు. ప్రాచీనబర్హి లాగానే యజ్ఞాలకోసం వేలాది పశువులను చంపాడు. తనకు హితాన్ని కలిగించే కర్మల పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించలేదు. అప్పుడు చండవేగుడు అనే గంధర్వ రాజు పురంజనుడి పురాన్ని చుట్టుముట్టాడు. అతడు ఏమీ చేయలేక చింతాక్రాంతుడై పోయాడు. ఇదిలా వుండగా కాలపుత్రిక అనే ఒక కన్య మైత్రేయుడు తనను వరించడానికి ఒప్పుకోకపోవడంతో కోపించి శపించింది. యవన దేశాధిపతైన భయుడు కూడా అమెను తిరస్కరించాడు. ఆమెకు భర్త ఎవరో చెప్తానని అంటూ, తమ్ముడు ప్రజారుడుతో కలిసి పురంజనుడి పురాన్ని ముట్టడించాడు. కాలకన్యక పురంజనుడి పురాన్ని అనుభవించింది.


పురంజనుడు ఇష్టం లేకపోయినా ఆ పురాన్ని విడిచి వెళ్లడానికి సిద్ధపడ్డాడు. శక్తిహీనుడైపోయాడు. తన సంతానాన్ని తలచుకుని తపించాడు. తాను మరణిస్తే భార్య అనాధై తన కుమారులను ఎలా కాపాడుతుందో అని దుఃఖించాడు. అలా దుఃఖిస్తున్న పురంజనుడిని తీసుకుపోవడానికి భయుడు వచ్చాడు. అతడిని పశువును కొట్టినట్లు కొట్టి ఈడ్చుకుపోయాడు. అనుచరులంతా ఆయన వెంట వెళ్లారు. ఆయన వున్న పురం పంచభూతాలలో కలిసిపోయింది. చనిపోయి పరలోకం చేరిన పురంజనుడిని యజ్ఞపశువులు మహాకోపంతో వచ్చి గొడ్డళ్లతో నరికాయి. చాలాకాలం పరలోక బాధలు అనుభవించాడు. మరుజన్మలో విదర్భరాజు ఇంట్లో స్త్రీగా జన్మించాడు.


మలయకేతనుడనే పాండ్యరాజు విదర్భ రాకుమారిని వీర్యశుల్కంగా పొంది వివాహమాడాడు. వారిద్దరికి ఒక కూతురు. ఏడుగురు కొడుకులు జన్మించారు. కొడుకులు ద్రావిడ దేశాధిపతులయ్యారు. ఒక్కొక్కరికి కోటానుకోట్ల కొడుకులు పుట్టారు. మలయకేతుడి కుమార్తె అగస్త్యుడిని పెళ్లిచేసుకుంది. మలయకేతు భూమండలాన్ని తన కొడుకులకు ఇచ్చి భార్య వైదర్భి సమేతంగా కులపర్వతానికి వెళ్లి వెయ్యి దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. చివరకు ప్రాణాలు త్యజించాడు. వైదర్భి విలపించింది. సహగమనం చేయడానికి సిద్ధపడింది.


అప్పుడొక విజ్ఞానస్వరూపుడైన బ్రాహ్మణుడు వచ్చి, ఆమెతో, పూర్వ జన్మలో తామిద్దరం హంసలమని, స్నేహితులమని చెప్పాడు. భౌతిక సుఖాల పట్ల ఆసక్తికలిగి వైదర్భి కామినీ నిర్మితమై అయిదు ఆరామాలు, తొమ్మిది వాకిళ్లు, ఒకే పాలకుడు, మూడు చావళ్లు, ఆరు గుంపులు, అయిదు అంగళ్లు, పంచ ప్రకృతులు, స్త్రీయే నాయికగా కలిగిన ఒక పురాన్ని చూశావని చెప్పాడు. అలాంటి పురంలో ప్రవేశించినవాడు స్త్రీలమీద ఆధారపడే అజ్ఞాని అనీ, దాంట్లో వైదర్భి ప్రవేశించి, కామినికి చిక్కి, ఆమెతో ఆనందిస్తూ, ఈశ్వరుడిని విస్మరించి, చివరకు వైదర్శిగా పుట్టి దుఃఖాలను అనుభవిస్తున్నాడని చెప్పాడు. ఇలా చెప్పి ఆ బ్రాహ్మణుడు ఇదంతా తన మాయతో కలిపించబడిందని, తామిద్దరం పూర్వం హంసలమని, అతడి తేజోరూపాన్ని తెలుసుకోమని అన్నాడు.


ఇదంతా చెప్పిన నారదుడు పురంజనుడి కథ అనే మిషతో ఆధ్యాత్మ తత్త్వాన్ని ప్రాచీనబర్హికి తెలియచెప్పాను అని అన్నాడు. ప్రాచీనబర్హి దర్భలను భూమండలమంతా పరచి, అహంకారంతో, అవినయంతో ఎన్నో పశువులను చంపాడని, కానీ, కర్మస్వరూపాన్ని, విద్యాస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాడని అదేంటో చెప్తాను వినమని అన్నాడు. 'ఆ సర్వేశ్వరుడి పట్ల మనస్సును లగ్నం చేసేది ఏదయితే వుందో అదే విద్య. ఆ పరమాత్మయే దేహధారులకు ఆత్మ. ఈశ్వరుడు. కాబట్టి క్షేమకరమైన ఆశ్రయం నారాయణుడి పాదమూలాలే. ఆ శ్రీమహావిష్ణువే ప్రియాతిప్రియమైన వాడు, సేవించతగ్గవాడు. ఆయనను ఆశ్రయించి సేవించే వారికి అణుమాత్రమైనా దుఃఖం కలగదు. ఆ భగవత్ స్వరూపాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు విద్వాంసుడు. అతడే గురువు. అతడే హరిస్వరూపం. కాబట్టి సకల జీవులకు ఆశ్రయమైన ఈశ్వరుడిని భజించు. సర్వ విధాలా విరక్తిని పొందు. మనస్సే జీవులందరికీ సంసార కారణం. అటువంటి కర్మ వశం వల్ల ఇంద్రియాలలో సంచరించడం జరుగుతుంది. దాన్నే అవిద్య అంటారు. అవిద్య వల్లే అనేక జన్మలు, కర్మ బంధాలు కలుగుతున్నాయి. కాబట్టి అలాంటి అవిద్య తొలగేందుకు లక్ష్మీపతిని భజించు. సృష్టిస్థితిలయకారకుడైన పరమేశ్వరుడిని, పద్మనేత్రుడిని, ఈశ్వరుడిని ధ్యానించు, సర్వజగత్తును భగత్ స్వరూపంగా అర్ధం చేసుకుని అతడి పాదపద్మాలను ఆరాధించు'.


ఈ విధంగా, జీవుడు ఈశ్వరుడిని చేరే మార్గాన్ని తెలిపి నారదుడు తన దారిన వెళ్లిపోయాడు. 


ఆ తరువాత ప్రాచీనబర్హి కొడుకులకు రాజ్యాన్ని అప్పగించి తపస్సు చేసుకునేందుకు కపిల మహాముని ఆశ్రమానికి వెళ్లాడు. అవ్యయానందమైన విష్ణుపదాన్ని పొందాడు.


                  *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*


           *రచన:శ్రీవనం* 

   *జ్వాలా నరసింహారావు*

  *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*                            

             🌷🙏🌷``


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

శ్రీమదాంధ్ర మహాభారతం* *ఆదిపర్వము*

 🔯🌹🌷🏹🕉️🏹🌷🌹🔯

*🕉️సోమవారం 11 ఆగస్టు 2025🕉️*


*శ్రీమదాంధ్ర మహాభారతం*

         *ఆదిపర్వము*

 *గ్రంథ ప్రారంభము (1 -4)*


ఆ మహా భారతమును ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రము అనియు, ఆధ్యాత్మవిదులు వేదాంత గ్రంధనుని, నీతి విచక్షణులు నీతి శాస్త్రమని, కవీంద్రులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణ గ్రంధమని, ఐతిహాసికులు ఇతిహాసమని, పౌరాణికులు అన్ని పురాణముల సముదాయమనీ, ప్రశంశించారు.


వ్యాసభారతంలో మొత్తం 100 సర్వములు ఉన్నవి. అవి


1. పౌష్యము 2. పౌలోమము, 3. ఆస్తీకము, 4. ఆదివంశావతారము,


5.సంభవసర్వము, 6.జరుగృహదాహము, 7. పండింబము, 8. బకవధ,


9.చైత్రరథము, 10.ద్రౌపదీస్వయంవరము, 11. వైవాహికము;


12. నిదురాగమనము, 13. రాజ్యార్థలాభము, 14, అర్జున తీర్ధయాత్ర,


15. సుభద్రా కల్యాణము,

 16.హరణ హారిక, 

 17. ఖాండవదహనము,


18.సయదర్శనము, 

19. సభాపర్వము, 

20, మంత్రపర్వము,


21.జరాసంధవధ, 22. దిగ్విజయము, 23. రాజసూయము,


24. బర్హ్యాభిహరణము, 25, శిశుపాలవధ, 26. ద్యూతము, 27. అనుద్యూతము,


28. ఆరణ్యము, 29 కిమ్మీరవధ, 30, కైరాతం, 31. ఇంద్రలోకాభిగమనము,


32. ధర్మజతీర్థయాత్ర, 33. జటాసుర వధ, 34. యక్షయుద్ధం, 35. అజగరము,


36.మార్కండేయోపాఖ్యానము, 37. సత్యా ద్రౌపదీసంవాదము,


38. ఘోషయాత్ర, 39.ప్రాయోపవేశము, 40.వ్రీహిద్రోణకాఖ్యానము,


41,ద్రౌపరీహరణము, 42. కుండలాహరణము, 43. ఆరణీయము,


44.పైరాటము, 45. కీచకవధ, 46. గోగ్రహణము, 47. అభిమన్యువివాహం,


48. ఉద్యోగము, 49.సంజయయానము, 50. ధృతరాష్ట్ర ప్రజాగరణము,


51. సానత్సుజాతము, 52. యానసంధి, 53. భగవద్యానము, 54, సేనానిర్యాత,


55. ఉలూకదూతాభిగమనము, 56. సమరథ, అతిరథ సంఖ్యానము,


57.కర్ణభీష్మ వివాదము, 58. అంబోపాఖ్యానము, 59. జంబూఖండవినిర్మాణము,


60.భూమి పర్వము, 61. భీష్మాభిషేకము, 62. భగవద్గీత, 63. భీష్మవధ,


64.ద్రోణాభిషేకము,65,సంశర్షిక వధ, 66. అభిమన్యు వధ,


67.ప్రతిజ్ఞాపర్వము, 68. జయద్రధ వధ, 69. ఘటోత్కవవధ, 70,ద్రోణ వధ,


71. నారాయణాస్త్ర ప్రయోగము, 72. కర్ణపర్వము, 73. శల్యపర్వము,


74.హ్రదప్రవేశము, 75. గదాయుద్ధము, 76. సారస్వతము, 77. సౌప్తికపర్వము,


78. వైషీకము, 79. జలప్రదానము, 80, స్త్రీపర్వము, 81. శ్రాద్ధ పర్వము,


82. రాజ్యాభిషేకము, 83. చార్వాక విగ్రహము, 84.గృహప్రవిభాగము,


85.శాంతిపర్వము, 86, రాజధర్మానుకీర్తనము, 87. ఆపద్ధర్మము,


88, మోక్షధర్మము, 89, అనుశాసనికము, 90. భీష్మస్వర్గారోహణము,


91.ఆశ్వమేధికము, 92లనుగీత, 93. ఆశ్రమవాసము,


94. పుత్రసందర్శనము, 95. నారదాగమనము, 96. మౌసలము,


97. మహాప్రస్థానికము, 98. స్వర్గారోహణము, 99, హరివంశము, 100.భవిష్యత్పర్వము,


18 సర్గల వివరాలు:


 * ఆది సర్గము: 18 సంపుటములు, 9,984 శ్లోకములు, 8 అశ్వాసములు, 2,084 పద్యగద్యములు.


 * సభాపర్వము: 9 సంపుటములు, 4,311 శ్లోకములు, 2 అశ్వాసములు, 618 పద్యగద్యములు.


 * అరణ్యపర్వము: 16 సంపుటములు, 13,664 శ్లోకములు, 7 అశ్వాసములు, 2,894 పద్యగద్యములు.


 * విరాటపర్వము: 4 సంపుటములు, 3,500 శ్లోకములు, 5 అశ్వాసములు, 1,624 పద్యగద్యములు.


 * ఉద్యోగపర్వము: 11 సంపుటములు, 6,998 శ్లోకములు, 4 అశ్వాసములు, 1,562 పద్యగద్యములు.


 * భీష్మపర్వము: 5 సంపుటములు, 5,884 శ్లోకములు, 3 అశ్వాసములు, 1,171 పద్యగద్యములు.


 * ద్రోణపర్వము: 8 సంపుటములు, 10,919 శ్లోకములు, 5 అశ్వాసములు, 1,860 పద్యగద్యములు.


 * కర్ణపర్వము: 1 సంపుటములు, 4,900 శ్లోకములు, 3 అశ్వాసములు, 1,124 పద్యగద్యములు.


 * శల్యపర్వము: 4 సంపుటములు, 3,220 శ్లోకములు, 2 అశ్వాసములు, 827 పద్యగద్యములు.


 * సౌప్తికపర్వము: 3 సంపుటములు, 2,874 శ్లోకములు, 2 అశ్వాసములు, 376 పద్యగద్యములు.


 * స్త్రీపర్వము: 5 సంపుటములు, 1,775 శ్లోకములు, 2 అశ్వాసములు, 376 పద్యగద్యములు.


 * శాంతిపర్వము: 4 సంపుటములు, 14,525 శ్లోకములు, 6 అశ్వాసములు, 3,093 పద్యగద్యములు.


 * అనుశాసనిక: 2 సంపుటములు, 12,000 శ్లోకములు, 5 అశ్వాసములు, 2,148 పద్యగద్యములు.


 * అశ్వమేధ: 2 సంపుటములు, 4,420 శ్లోకములు, 4 అశ్వాసములు, 976 పద్యగద్యములు.


 * ఆశ్రమవాస సర్గము: 3 సంపుటములు, 1,106 శ్లోకములు, 2 అశ్వాసములు, 362 పద్యగద్యములు.


 * మౌసల సర్గము: 1 సంపుటములు, 300 శ్లోకములు, 1 అశ్వాసము, 226 పద్యగద్యములు.


 * మహాప్రస్థానీక సర్గము: 1 సంపుటములు, 120 శ్లోకములు, 1 అశ్వాసము, 79 పద్యగద్యములు.


 * స్వర్గారోహణ సర్గము: 1 సంపుటములు, 200 శ్లోకములు, 1 అశ్వాసము, 97 పద్యగద్యములు.


 * హరి వంశపర్వము, భవిష్యపర్వము: -- సంపుటములు, -- శ్లోకములు, -- అశ్వాసములు, -- పద్యగద్యములు.


మొత్తం:

 * సంపుటములు: 100

 * శ్లోకములు: 1,00,500

 * అశ్వాసములు: 63

 * పద్యగద్యములు: 21,507


మహాభారతమును వ్యాసుడు మూడు సంవత్సరములు రచించాడు. ఈ మహా భారతమును స్వర్గలోకంలో చెప్పడానికి నారద మహా మునిని, పితృ లోకంలో చెప్పడానికి దేవలుడిని, గరుడ గంధర్వయక్షరాక్షస లోకములలో చెప్పడానికి తన కుమారుడైనశుక మహర్షిని, సర్పలోకములో చెప్పడానికి సుమంతుడిని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయనుడిని నియమించాడు. వ్యాసుడు.


సశేషం


తంగిరాల చంద్రశేఖర అవధాని, కపిలేశ్వరపురం


                 *సేకరణ* 

 *న్యాయపతి నరసింహారావు* 

🔯🌹🚩🏹🛕🏹🚩🌹🔯

అభిజ్ఞానశాకుంతలమ్

 🙏అభిజ్ఞానశాకుంతలమ్ నామౌచిత్యం 🙏

                  మొదటి భాగం 

( అందరు చదవడానికి వీలుగా కొన్ని భాగాలుగా అందిస్తాను. గ్రూపులో సభ్యులు ఒకరు( పేరు తెలియదు ) ఈ విషయం గురించి అడిగారు. )


సాహిత్య ప్రక్రియల్లో నాటకానికి విశిష్ట స్థానం ఉంది. అందుకే మహాకవి కాళిదాసు ‘నాటకాంతంహి సాహిత్యం’ అన్నారు. అనగా అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకం అని అర్థం. నాటకం, బాణ, ప్రకరణ, ప్రహసన, డిమ, వ్యాయోగ, సమవాకార, వీథి, అంక, ఈహామృగ వంటి దశ రూపకాలలో నాటకం ఉత్తమమైనది.

.అభిజ్ఞానశాకుంతలము మహాకవి కాళిదాసు విరచిత సంస్కృత నాటకములన్నిటిలోనూ అత్యంత ప్రాచుర్యము నొందిన నాటకము. ఇందు ఏడు అంకములు గలవు. వసంత ఋతు వర్ణన చేయబడింది.శాకుంతలము ఒక గొప్ప శృంగార రస భరిత నాటకము

అభిజ్ఞానశాకుంతలమ్ అనేది సంస్కృతం పేరు. తెలుగులో అభిజ్ఞానశాకుంతలము అవుతుంది. దీనిని ఒక్క పదంగానే వ్రాయాలి. విడదీసి రెండు పదాలుగా (అభిజ్ఞాన శాకుంతలము అని వ్రాయకూడదు).

కవికుల గురువు కాళిదాసు తన నాటకానికి శాకుంతలం అని పేరు పెట్టవచ్చు కదా అభిజ్ఞానశాకుంతలమ్ అని ఎందుకు పేరు పెట్టినారు 

అభి అంటే మొగ్గు చూపడం అని అర్థం 

అభిమానం అంటే మానం మీద మొగ్గు చూపడం

అభిజ్ఞానం అంటే జ్ఞానం మీద మొగ్గు చూపడం


శకుంతలకు సంబంధించిన ఈ నాటకానికి కీలకమైన అంశం అంగుళీయము (అంగులీయకము / అంగుళీయకము) రూపంలో ఉన్న గుర్తింపు ముద్ర ద్వారా మరచిపోయినది గుర్తుకురావడం.


దుష్యంతమహారాజు దుర్వాసుని శాపంతో మరచిపోయిన శకుంతలను అంగుళీయము ద్వారా గుర్తుతెచ్చుకుంటాడు. అంగుళీయము ద్వారా గుర్తింపబడి స్వీకరింపబడిన శకుంతలకు సంబంధించిన (శంకుంతల వృత్తాంతాన్ని వర్ణించే) నాటకం కాబట్టి అభిజ్ఞానశాకుంతలమ్ అని పేరు పెట్టబడినది.

శాకుంతలం అంటే శకుంతలకు సంబంధించినది.

ఇది పాణిని రచించిన అష్టాధ్యాయి అనే సంస్కృత వ్యాకరణంలో "తస్యేదమ్"’ అనే సూత్రం ద్వారా ‘సంబంధించిన’ అనే అర్థాన్ని సూచించడానికి శ-మీద ఉన్న హ్రస్వ అకారమునకు దీర్ఘం వచ్చి శా .అయింది ఎలాగంటే, గంగ యొక్క పుత్రుడు గాంగేయుడు అయినట్లుగా.


‘జ్ఞాపకం’ అనే అర్థాన్నిసూచించే ‘జ్ఞా’ అనే ధాతువుకు ‘చెయ్యడం’ అనే అర్థంలో ‘అభి’ అనే ప్రత్యయం చేరి ‘అభిజ్ఞానం’ అనే పదం ఏర్పడింది. అభిజ్ఞాన ప్రధానమైన శకుంతల విషయకమైనది కథ కాబట్టి ‘అభిజ్ఞానశాకుంతలమ్’ అని పేరు పెట్టడం జరిగింది.

దేవలోకములో నర్తకి అయిన మేనక, విశ్వామిత్రుడు చేయుచున్న ఘోర తపస్సును భగ్నము చేయుటకు దేవేంద్రునిచే పంపబడి, ఆ కార్యము సాధించు క్రమములో విశ్వామిత్రుని వలన ఒక బాలికకు జన్మనిచ్చి, ఆ బాలికను అడవిలో వదలి దేవలోకమునకు వెడలిపోవును. ఆ బాలిక అడవిలోని ఆకులపై పడిన నీటి బిందువులను ఆహారముగా ఒక హంస ద్వారా గ్రహించి ప్రాణము నిలుపుకొనును. అటుపై, ఆ బాలికను మహర్షి కణ్వుడు మార్గమధ్యమున చూసి జాలితో పెంచుకొనుటకు తన ఆశ్రమమునకు తీసుకొని వెళ్ళి, ఆమెకు శకుంతల అని నామకరణము చేయును. శాకుంతలములచే కాపాడబడి, పెంచబడినది కావున శకుంతల అయినది

.

భరతుడి జననానికి సంబంధించిన కథ అత్యంత ప్రాచుర్యం పొందింది.నాటక లక్షణాలలో ఇతివృత్తం ప్రసిద్ధమైయుండాలి. మహాభారతంలోని కథ. ఈ ఇతివృత్తం వ్యాసుడు మహాభారతంలో వ్రాయగా, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలములో మరింత విపులీకరించి దృశ్య కావ్యంగా రచించారు.

దుర్వాస శాప వృత్తాంతం ఎందుకు కల్పించాడో అనకూడదు. ఆయన ఋషి కనుక.ఎందుకు ప్రవేశ పెట్టేడో అనాలి. దానికి కారణం తెలుసుకునే ముందు 

మహాభారతంలోని కథను పరిశీలించాలి. కథ పరిశీలిద్దాం. చూడండి 


 విశ్వామిత్రుడు మేనక వల్ల జన్మించిన శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమములో పెరుగుచుండగా ఒకరోజు ఆ మార్గములో అప్పటి రాజు దుష్యంతుడు వెళ్తుండగా, దుష్యంతుడు శకుంతలని చూసి ఆకర్షితుడై ఆమెని గాంధర్వ వివాహం చేసుకొని ఆమెను రాజ్యానికి వెళ్ళి రాజ్యసంస్కారాలతో ఆహ్వానిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో శకుంతల భరతుడిని ప్రసవిస్తుంది. కణ్వ మహర్షి దివ్య దృష్టితో జరిగింది గ్రహించి శకుంతలని దుష్యంతుని రాజ్యానికి పంపుతాడు. మొదట శకుంతల తన భార్య కాదు భరతుడు తన కుమారుడు కాదు అని అన్న దుష్యంతుడు, ఆకాశవాణి పలుకులతో జరిగిన వృత్తంతం గుర్తు తెచ్చుకొని భరతుడిని కుమారుడిగా అంగీకరిస్తాడు.

మహాభారతంలోని ఆది పర్వము-చతుర్థాశ్వాసము

ఒక్కసారి పరిశీలిద్దాము.

కణ్వ మహాముని శకుంతలను దుష్యంతుపాలికిం బంపుట 

అనఘుఁడు వంశకరు డై , పెనుపున నీ సుతుఁడు వాజపెయంబులు నూ

ఱొనరించు నని సరస్వతి, వినిచె మునులు వినఁగ నాకు వినువీది దెసన్. 


యీ నీ కొడుకు పుణ్యాత్ము ఢై వంశోద్దరకుడు అగునని, నూఱశ్వమేధాల్ని చేస్తాడనీ సరస్వతి మునుపు మునులందరూ వింటూండగా నాకు ఆకాశవాణి ద్వారా చెప్పినది.

గొప్ప గుణవంతుడు, కులాన్ని విస్తరించేవాడూ, బాలుడూ, ఉదారుడు, ధర్మప్రియుడు ఐన ఈ బాలుడిని ఆనాటి నీ సత్యవాక్యమును పాటించకుండా తప్పచూడటం , ఓ సారమతీ! నీకు చెల్లునా?

చ.

నుతజల పూరితంబు లగు నూతులు నూఱిటికంటె సూనృత

వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిటికంటె నొక్క స

త్క్రతు వది మేలు తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు త

త్సుత శతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్.


తియ్యటి నీటితో నిండివున్న నూఱు నూతులకంటె ఒక దిగుడుబావి మేలు, అట్టి బావులు నూఱిటికంటె ఒక సత్క్రతువు మేలు, అట్టి నూఱు క్రతువులకంటె ఒక కుమారుడు మేలు, అట్టి నూర్గురు కుమారులకంటె కూడా, ఓ సూనృతవ్రతుడ వైన రాజా ! ఒక సత్యమైన మాట మేలయ్యా. అని అంటూ ఇంకా సత్యాన్ని గురించిన గొప్పదనాన్ని ఇలా వర్ణన చేసి చెబుతుంది 

వెయ్యి అశ్వమేధ యాగాల ఫలాన్నిఒకవేపు, సత్యవాక్యాన్ని ఇంకోవేపు త్రాసులో ఉంచి తూస్తే త్రాసు యొక్క ముల్లు సత్యం వైపే మొగ్గును చూపిస్తుంది సత్యము యొక్క భారాతిశయము చేత.

అన్ని తీర్థాలను సేవించగా వచ్చే ఫలితం, సర్వవేదాల్ని పొందుట కూడా సత్యముతో సరిగావు. అన్ని ధర్మాలలోకెల్లా సత్యమే పెద్ద అని ధర్మజ్ఞులైనవారు చెప్తారు, తెలుసుకో.

క్షత్త్రియు డైన విశ్వామిత్త్రునకు పవిత్రమైన మేనకకు పుట్టినదానను, అలాంటి దానిని - ఓ రాజా! అబద్ధమాడటానికి అంత ధర్మేతరనా? అని అంటపొడుస్తుంది.


అనిన శకుంతలపలుకులు అంగీకరించక దుష్యంతుం డిట్లనియెను 

ఏ నెట నీ వెటసుతుఁ డెట, యే నెన్నఁడుఁ దొల్లి చూచియెఱుఁగను నిన్నున్

మానిను లసత్యవచనలు, నా నిట్టు లసత్యభాషణం బుచితంబే. 


నే నెక్కడ? నీ వెక్కడ? సుతు డెక్కడ? నే నెప్పుడూ నిన్ను చూడనే లేదు. ఆడవారు అబద్ధాలాడేవారు అనేలా ఈ విధంగా నీ వబద్ధం చెప్పటం న్యాయమేనా?

క.

వనకన్యకయఁట నే నఁట; వనమున గాంధర్వమున వివాహంబఁట నం,

దనుఁ గనెనఁట మఱచితినఁట; వినఁగూడునె యిట్టి భంగి విపరీతోక్తుల్ --(పాఠాంతరము)


ఈవిడ వనకన్యక యట! నేనట వనంలో కలిసానట! గాంధర్వ వివాహం కూడా చేసుకొన్నానట!! కొడుకును కూడా కన్నానట! మఱచిపోయానట! ఇలాంటి విపరీతములైన మాటలు వినతగినవేనా?


పొడవుగా వయసులో ఉండి బలవంతు డైన వానిని నీ కొడుకని వ్యత్యాసముగ యిందరూ నవ్వేట్లుగా చూపించటానికి తీసుకువచ్చావా?


ఇటువంటి లోకవిరుద్ధమైన పలుకులకు మేమెలా అంగీకరిస్తాం. అందుచేత యుక్తంకాని పలుకులు పలుకక నీ ఆశ్రమమునకు పొమ్మనిన శకుంతల అత్యంత దుఃఖితయై

తడయక పుట్టిననాఁడ తల్లి చే దండ్రి చే విడువఁ

బడితి నిప్పుడు పతిచేతను విడువఁబడియెదనొక్కొ

నుడువులు వేయు నిం కేల యిప్పాటినోములు దొల్లి

కడఁగి నోఁచితిని గా కేమి యనుచును గందె డెందమున. 


పుట్టినప్పుడే తల్లి చేతను తండ్రి చేతను విడిచిపెట్ట బడ్డాను. ఇప్పుడు భర్త చేతను కూడా విడిచిపెట్ట బడ్డానుకదా ఇంక వేయి మాటలనుకోనేల యీపాటి నోములే తొల్లిటి జన్మలో నోచుకొన్నానేమో లేకపొతే ఇలా గెందుకవుతుంది అంటూ ఆ మహా సాధ్వి హృదయంలో తల్లడిల్లిపోయింది.

ఈ మధ్యాక్కర పద్యాన్ని చదువుతున్నా వ్రాస్తున్నా కండ్లనుంచి ధారాపాతంగా ఆగకుండా కన్నీళ్ళు కారుతూనే ఉంటున్నాయి. ఆడకూతురికి ఎంత రాకూడని కష్టం. ఈ ఘట్టాన్ని ఇంత బాగా వ్రాసిన నన్నయ్య గారికి శత సహస్ర కోటి వందనాలందించకుండా వుండలేము కదా. నన్నయ్యగారు స్త్రీ మనస్సును ఆవాహన చేసుకొన్నవారై ఆమె దుఃఖాన్ని పూర్తిగా ఆవిష్కరించారు. ఇటువంచి రమ్యాతి రమ్యమైన కథలకోసం మనందరం భారతాన్ని పఠించాలి.

వ.

ఇట్లు దద్దయు దుఃఖించి విగతాశయై బోరనఁ దొరఁగు బాష్పజలంబు లందంద యొత్తికొనుచు నింక దైవంబ కాని యొండు శరణంబు లే దని యప్పరమపతివ్రత తనయుం దోడ్కొని క్రమ్మఱి పోవ నున్న యవసరంబున. 

చ.

గొనకొని వీఁడు నీకును శకుంతలకుం బ్రియనందనుండు సే

కొని భరియింపు మీతని శకుంతల సత్యము వల్కె సాధ్వి స

ద్వినుత మహాపతివ్రత వివేకముతో నని దివ్యవాణి దా

వినిచె ధరాధినాధునకు విస్మయమందఁగఁ దత్సభాసదుల్. 

ఆకాశవాణి భరతుడు శకుంతలకూ దుష్యంతునకు కలిగిన సంతానమని శకుంతల మహా సాధ్వి అని సభాసదులందరూ వినుచుండగా పలికి కథకు ముగింపును పలుకుతుంది. ఇది భారతములోని కథ. దీనిని యథాతథముగా నాటకంగా వ్రాస్తే నాటక లక్షణాలకు విరుద్ధం.నాయకుడు అసత్యవాది అవుతాడు. సత్యమునే నాయకుడు పలకాలి.

                        సశేషం

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

11, ఆగస్టు 2025, సోమవారం

మర్మశాస్త్ర విజ్ఞానం

 మర్మశాస్త్ర విజ్ఞానం - వివరణ . 

       

 మానవ శరీరం నందు ప్రాణాధారములు అగు కొన్ని ముఖ్యస్థానములు కలవు. వీటినే మర్మస్థానములు అని అంటారు. ఈ మర్మస్థానముల గురించి తెలుసుకొనుట వైద్యులకు , వైద్యేతరలకు కూడా చాలా అవసరం . విద్రది వంటి శారీరక వ్రణములు మరియు కొన్నిరకాల వ్యాధులు ముందు ఈ మర్మస్థానములకు కొంతదూరమున పుట్టి అవి మర్మస్థానములకు చేరగానే ప్రాణములు హరించుచున్నవి. శస్త్రాల వలన తగిలిన దెబ్బలు , అనుకోకుండా మర్మస్థానముల యందు దెబ్బలు తగలడం వలన నేత్రములు , చెవులు , ముక్కు మొదలగు జ్ఞానేంద్రియములు చెడి గుడ్డితనం , చెముడు మొదలగునవి కలుగుట , హస్తములు , పాదములు మొదలగు కర్మేంద్రియాలు చెడి సొట్ట , కుంటి మొదలగు దుష్ఫలితాలు కలుగుట , తీవ్రవేదన కలుగుట , కొన్ని అసాధ్యవ్యాధులు సంభవించి చివరకి ప్రాణములు పోవుట సంభవించును . 

            

. వైద్యుడు ప్రధానంగా మర్మవిజ్ఞానం కలిగి ఉండవలెను . ప్రమాదకరమగు వ్యాధి మర్మస్థానము నందు జనించినదా ? లేక మర్మస్థానమునకు చేరనున్నదా ? ప్రాణములు హరించుటకు ఎంత వ్యవధి ఇంకనూ ఉన్నది ? అని తెలుసుకుని శీఘ్రముగా ఫలితాలను ఇచ్చు ఔషధాలను ఉపయోగించి వ్యాధి మర్మప్రదేశమునకు చేరక మునుపే చికిత్స చేసి రోగిని మృత్యువు దరిచేరకుండా కాపాడవచ్చు . కావున వైద్యుడు తప్పకుండా మర్మవిజ్ఞానం తెలుసుకుని ఉండవలెను 

                  

. ఈ మర్మవిజ్ఞానం ప్రధానంగా శస్త్రచికిత్సకు అవసరము . శస్త్రచికిత్స చేయునపుడు మర్మస్థానములను గుర్తెరిగి చేయవలెను . లేనిచో యావజ్జీవితము అంగవైకల్యము లేదా కొద్దిరోజులకు ప్రాణములను హరించు వ్యాధులు , అసాధ్యవ్యాధులు చివరికి మరణమును కలిగించును. ఇవి వెంటనే జరగకపోవటం చేత మరియు మర్మవిజ్ఞానం లేకపోవుట చేత ఈ శస్త్రకర్మ వలన లేక దెబ్బతగులుట వలన లేక పుండు పుట్టుట వలన మరణం సంభవించింది అని వైద్యులు గాని రోగులు గాని భావిస్తారు. నిజానికి అది మర్మస్థాన సంబంధ మరణం అని గుర్తించరు . 

              

. మర్మశాస్త్ర ప్రకారం అకస్మాత్తుగా హస్తపాదములందున్న , అంగుష్ట మధ్యముల యందలి క్షిప మర్మములకు , అరికాలు , అరచేయి మధ్యమము నందు ఉండు తల , హృదయ మర్మములకు దెబ్బ తగిలిన యెడల ఈ 8 మర్మలును కొంతకాలం పిదప ప్రాణాలను హరించును . 15 నుంచి 30 రోజులలో దెబ్బ యొక్క తీవ్రతనుబట్టి ప్రాణాలను తప్పక తీయును . కావున తెలిసిన వైద్యుడు వెంటనే చేతి మర్మకు దెబ్బ తగిలిన మణిబంధము వద్ద , పాదములోని మర్మలకు దెబ్బ తగిలిన చీలమండ వద్దను హస్తపాదములను తీయవలెను అలా చేసిన మాత్రమే కనీసం ప్రాణం అయినను దక్కును . 

           

. మర్మలకు దెబ్బతగలని యెడల ఎంత పెద్దపెద్ద దెబ్బలు పాదములు , తొడలు , భుజములు , పొట్ట , శిరస్సు వంటి వాటికి తగిలినను ప్రాణాపాయం ఉండదు. కాని మర్మకు దెబ్బ తగిలినను దెబ్బ పైకి కనపడనంతటి చిన్నది అయినను ప్రాణములను తీయును . కావున మర్మల పైన దెబ్బ తగలకుండా జాగ్రత్త వహించవలెను . చికిత్స చేయు వైద్యుడు మర్మలకు సన్నిహితముగా ఉండు వ్యాధులను గుర్తించి రోగులను కాపాడవలెను . 

       

. శరీరంలో మొత్తం 107 మర్మలు ఉండును. వీటి గురించి మరొక పోస్టు నందు వివరిస్తాను. నా తరువాతి పోస్టు నందు ఆయుర్వేదం నందు గల "శిరావేధ " అనే ఒక గొప్ప చికిత్స గురించి వివరిస్తాను ఇది ప్రపంచములో ఏ వైద్యవిధానములో లేదు . ఈ వైద్యవిధానము గురించి అత్యంత విలువైన , అరుదైన సమాచారం మీకు సంపూర్ణముగా వివరిస్తాను. 


మరింత విలువైన సమాచారం మరియు అనేక రోగాలకు సులభ చిట్కాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


గమనిక -

     

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

           

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

    

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

 

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

        

. 9885030034