30, ఆగస్టు 2025, శనివారం

శ్రీ రామేశ్వర ఆలయం

 🕉 మన గుడి : నెం 1218


⚜  ఒడిస్సా : భువనేశ్వర్


⚜  శ్రీ రామేశ్వర ఆలయం



💠 ఒరిస్సాలోని ప్రశాంతమైన మరియు సాంస్కృతిక వాతావరణంలో ఉన్న రామేశ్వర్ డ్యూలా, దాని ప్రసిద్ధ సమకాలీన లింగరాజ ఆలయం కంటే తక్కువగా తెలిసినా భువనేశ్వర్‌లోని ఒక గొప్ప ఆలయంగా మిగిలిపోయింది .

 ఇది అద్భుతమైన కళింగ నిర్మాణ శైలిని సూచిస్తుంది మరియు చరిత్ర ప్రియులను మరియు భక్తులను ఆకర్షించే ప్రసిద్ధ శివుని ఆలయాలలో ఒకటి.



💠 రామేశ్వర్ ఆలయం భువనేశ్వర్‌లోని ఒక పురాతన ఆలయం. దీనిని లింగరాజ ఆలయంలోని మౌసి మా అని పిలుస్తారు. ఇది లింగరాజ ఆలయం నుండి 2 కి.మీ దూరంలో ఉంది. 


💠 రావణుడిపై విజయం తర్వాత రాముడు లంక నుండి తిరిగి వస్తున్నప్పుడు సీత శివుడిని పూజించమని కోరినట్లు పురాణాలు చెబుతున్నాయి. 

కాబట్టి రామచంద్రుడు ఆ ప్రయోజనం కోసం ఒక లింగాన్ని నిర్మించాడు. 


💠 సాంప్రదాయకంగా చైత్రంలో రామనవమికి ఒక రోజు ముందు వచ్చే అశోకాష్టమి సమయంలో లింగరాజ స్వామి రకుణ రథం అని పిలువబడే పెద్ద రథం ద్వారా ఈ ఆలయానికి వచ్చి నాలుగు రోజులు ఉంటాడు. చారిత్రాత్మకంగా ఈ ఆలయం 9వ శతాబ్దం నాటిది.


💠 భువనేశ్వర్‌లోని దాదాపు అన్ని పాత దేవాలయాలు శివుడికి అంకితం చేయబడ్డాయి. గర్భగుడి లోపల దుర్గాదేవి ప్రతిమ ఉంది.


💠 ఆలయం ముందు, రోడ్డుకు ఎదురుగా రాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడి ముగ్గురు సోదరులకు అంకితం చేయబడిన మూడు ఆలయాలు ఉన్నాయి. ఈ మూడు ఆలయాలు భువనేశ్వర్‌లో నిర్మించిన పురాతన ఆలయాలు. 



💠 ఈ ఆలయాన్ని 'మౌసి మా' ఆలయం అని కూడా పిలుస్తారు.  రుకున రథ జాత్ర అనేది ప్రతి సంవత్సరం మార్చి/ఏప్రిల్ నెలలో (చైత్ర మాసంలో 8వ రోజు) ఈ ఆలయంలో నిర్వహించబడే ఒక ప్రధాన పండుగ, ఇక్కడ లింగరాజు (చంద్రశేఖర్ కాంస్య విగ్రహం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తాడు), రుక్మిణి మరియు బసుదేవులతో కలిసి లింగరాజ ఆలయం నుండి రామేశ్వర్ ఆలయానికి అత్యంత రంగురంగుల ఊరేగింపులో తీసుకువెళతారు.


💠 ఈ పండుగను అశోకాష్టమి అని కూడా పిలుస్తారు మరియు దేవతలు రామేశ్వర్ ఆలయంలో నాలుగు రోజులు ఉండి, ఐదవ రోజు వారి స్వస్థలమైన లింగరాజ ఆలయానికి తిరిగి వస్తారు. 

రథం దాని ప్రయాణంలో మలుపు తీసుకోదు కాబట్టి ఈ పండుగను అనలూత రథ జాత్ర అని పిలుస్తారు 


💠 లింగరాజు ఏకామ్ర క్షేత్రంలో కొద్దిసేపు ఉండటానికి తన వనవాస కాలంలో రాముడిని స్వాగతించాడని పురాణం చెబుతుంది. 

రాముడు నివసించిన ప్రదేశం మౌసిమా ఆలయం లేదా రామేశ్వర్. 


💠 తన కొద్దిసేపు బస సమయంలో లింగరాజ స్వామి రాముడిని పలకరించడానికి దేవి పార్వతితో పాటు రామేశ్వర ఆలయానికి వెళ్లాడు.  

ఆ సందర్భాన్ని గుర్తుచేసుకునేందుకు అశోకాష్టమి రథజాత్ర జరుపుకుంటారు.


💠 రామేశ్వర్ ఆలయం యొక్క అత్యంత అద్భుతమైన లక్షణాలలో ఒకటి దాని సంక్లిష్టమైన శిల్పాలు. ఆలయ గోడలు రామాయణం మరియు మహాభారతం సహా హిందూ పురాణాల దృశ్యాలను వర్ణించే వివరణాత్మక శిల్పాలతో అలంకరించబడ్డాయి. 

ఈ చెక్కడాలు అలంకారంగా ఉండటమే కాకుండా భారతదేశ గొప్ప పౌరాణిక వారసత్వాన్ని వివరించే కథన సాధనంగా కూడా పనిచేస్తాయి.


💠 ఆలయ ప్రవేశ ద్వారం చుట్టూ రెండు భారీ రాతి సింహాలు ఉన్నాయి, ఇది కళింగ దేవాలయాలలో ఒక సాధారణ లక్షణం, ఇది రక్షణ మరియు బలాన్ని సూచిస్తుంది. 


💠 గర్భగుడి లోపల, ప్రధాన దేవత శివుడిని లింగం రూపంలో పూజిస్తారు. ఈ లింగం క్లోరైట్‌తో తయారు చేయబడిన వృత్తాకార యోనిపిట్టలో పవిత్రం చేయబడింది, ఇది ఆలయ నిర్మాణ ప్రాముఖ్యతను పెంచే ప్రత్యేక లక్షణం.

గర్భగుడిలో దుర్గాదేవి చిత్రం కూడా ఉంది, ఇది ఆలయ ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచుతుంది.



💠 ప్రసిద్ధ లింగరాజ ఆలయం నుండి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామేశ్వరాన్ని తరచుగా మౌసిమా  ఆలయం అని పిలుస్తారు, ఇది పెద్ద లింగరాజ మందిరంతో దాని సంబంధాన్ని సూచిస్తుంది.


రచన

©️ Santosh Kumar

నెమలీకలు - జైనులు

 నెమలీకలు - జైనులు


ఢిల్లీకి చెందిన ఆర్.కె. రంగన్ పరమాచార్య స్వామికి పెద్ద భక్తుడు. దర్శనానికి వచ్చిన ప్రతిసారీ, నెమలీకలతో చేసిన విసనకర్రను తెచ్చి స్వామికి సమర్పించేవాడు. మహాస్వామివారు అప్పుడప్పుడు దోమలను ఈగలను తోలడానికి ఉపయోగించేవారు. రంగన్ ఒకసారి ఒక డజను నెమలీక విసనకర్రలను తీసుకుని వచ్చాడు. స్వామివారు వాటిని తీసుకొని మేనాలో పెట్టుకున్నారు. శిష్యులు ఈ విషయం చూసి ఆశ్చర్యపోయారు. తమకోసం వస్తువులను అలా దాచుకోవడం మహాస్వామివారు ఎప్పుడూ చెయ్యరు. 


ఒకరోజు ఉదయం మహాస్వామి వారు మేనాలో కూర్చుని జపం చేసుకుంటుండగా, పెద్ద ఈగల గుంపొకటి అటుగా వచ్చింది. స్వామివారు నెమలీకల విసనకర్రను వాడుతున్నారు వాటిని పారదోలడానికి. అప్పుడు కొంతమంది జైన సాధువులు వచ్చారు. వారి సంప్రదాయం ప్రకారం నోటి చుట్టూ తెల్లని గుడ్డ చుట్టుకొని ఉన్నారు. చాలా విషయాలపై స్వామివారు మాట్లాడుకున్నారు. 


సంస్కృత పదకోశమైన అమరకోశం రాసినవారు జైన రాజైన అమరసింహుడు. జైనులకు సంబంధించిన చాలా పుస్తకాలు సంస్కృతంలోనే ఉన్నాయి. వీటన్నిటిని విని ఆ సాధువులు చాలా సంతోషించారు. 


“మీరు ఉదయం నిద్ర లేవగానే ‘విప్రక్షయం’ ప్రార్థన చేస్తారా?” అని అడిగాఅరు మహాస్వామివారు. 


“లేదు. మా గురువుగారు ఇక దానితో పనిలేదని చెప్పారు” అని వారు బదులిచ్చారు. 


అక్కడ ఉన్న శిష్యులకి పరమాచార్య స్వామివారు అడిగిన ప్రశ్న కాని, ఆ సాధువులు చెప్పిన సమాధానం కాని ఏమీ అర్థం కాలేదు. 


మహాస్వామివారే దాని గురించి ఇలా చెప్పసాగారు. “వైదిక క్రతువులు, అగ్ని సంస్కారాలు చాలా బాగా జరుగుతున్న కాలంలో, శాస్త్రం చెప్పిన విధంగా వైదిక యజ్ఞాలలో జంతు బలులు జరిగేవి. అహింసా సూత్రం మూల సూత్రంగా గల జైన మతం ఉధృతిలోకి వచ్చాక రోజూ ఉదయం ‘విప్రక్షయం’ లేదా ‘బ్రాహ్మణులు క్షయించుగాక’ అని పఠించేవారు వైదిక మతం సమసిపోవాలని”


బహుశా స్వామివారి ఆంతర్యం గ్రహించారేమో ఆ జైన సాధువులు, “అవును, అవును. ఇప్పుడు దాదాపు బ్రాహ్మణులందరూ అగ్నికార్యం వదిలేశారు. కాబట్టి యాగాలలో జంతుబలులు జరగటం లేదు. కనుక మా గురువులు ‘విప్రక్షయం’ పఠించవలసిన అవసరం లేదని సెలవిచ్చారు” అని చెప్పారు. 


మహాస్వామివారు వారందరికి ఒక్కొక్క నెమలీక బహుమానంగా ఇచ్చారు. నెమలిని హింసించకుండా అవి వదిలిపెట్టినప్పుడు కిందపడినవి కావున వారు సంతోషంతో వాటిని స్వీకరించారు. బహుశా ఈ జైన సన్యాసులు వస్తారనే వారికి వీటీని బహుమానంగా ఇవ్వొచ్చనే మహాస్వామివారు ఆ నెమలీకలను మేనాలో దాచుకున్నారేమో. ఏమో! నెమలిపై ఎక్కి విహరించే ఆ స్మామినాథునికే తెలుసు


--- మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

దైవకార్యమే

 *ప్రతి పని దైవకార్యమే*

ప్రాచీన గ్రంథాలన్నీ పనిని దైవస్వరూపంగా చూడమన్నాయి. పని దైవారాధనతో సమానమని ఉపదేశించాయి. నిష్కామ భావనతో, భక్తిశ్రద్ధలతో చేసే కార్యాలన్నీ మంచి పనులేనని భగవద్గీత బోధించింది. మన సంకల్పాలన్నీ కల్యాణదాయకంగా ఉండాలని యజుర్వేదం ఆకాంక్షించింది.


మంచి పనిని వాయిదా వేయకూడదు, చెడు పనిని తలపెట్టనేకూడదని రామాయణం వివరించింది. అందుకే ఒక పని చేసేముందు వేయిసార్లు ఆలోచించాలి. పని మొదలు పెట్టాక వేయి అడ్డంకులు వచ్చినా దాన్ని నెరవేర్చాలి. శ్రద్ధాసక్తులతో కర్తవ్యాన్ని నిర్వర్తించడమే నిజమైన ఈశ్వరారాధన అంటారు స్వామి వివేకానంద. అందుకే ప్రతి వృత్తీ పవిత్రమైందిగా భావించాలి. లోకహితం కోసం చేసే పనులకు దైవమే మనిషి రూపంలో వచ్చి సహాయం చేస్తాడని పెద్దలు చెబుతారు. కానీ చేసే పని ఎంత చిన్నదైనా అది సమాజానికి మేలు చేసేటట్లుగా ఉండాలి. చేస్తున్న పనిపట్ల అవగాహన, ఆలోచన లక్ష్యసిద్ధికి దారితీస్తాయి. నిజానికి ఎవరికైనా మనసుకు నచ్చిన పని మీదే ఆసక్తి, మమకారం ఉంటాయి. అవే మనిషికి ప్రోత్సాహాన్నిస్తాయి. అసలు ఇష్టపడి పని చేయాలే కాని ఏదీ కష్టంగా అనిపించదు. ఇష్టం లేకుండా చేసే ఏ పనైనా మనసుకు తృప్తినివ్వదు. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నాడు వేమన. ఏ విజయానికైనా మూలం సాధన. నిరంతర సాధన వల్లే మనం కోరుకున్న పనులు పూర్తి చేయగలుగుతాం.

మనిషి ఒంటరిగా జీవించలేడు. నిత్యం పదిమందితో కలసి మెలసి ఉండక తప్పదు. అందుకే ఎవరైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు అనుభవజ్ఞులను సంప్రదించి మంచీ, చెడులను విచారించాలి. అప్పుడే పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. మనిషి గొప్పతనం అతడు చేసే పనిని బట్టి ఉంటుంది. ఎంత ఉన్నతుడైనా పని చేయకపోతే అతడికి విలువ ఉండదని భారతం చెబుతోంది. అందుకే ఒక పనిని సంకల్పించినప్పుడు దాన్ని పూర్తి చేసేవరకు విశ్రమించకూడదు. ఎవరు విమర్శించినా, ఎన్ని రకాల అవాంతరాలు ఎదురైనా.. సమయస్ఫూర్తితో వాటిని అధిగమించి శ్రద్ధతో పనిని పూర్తి చేయాలి. అప్పుడు అది తప్పక విజయవంతమవుతుంది. ఈ సృష్టిలో ప్రతి జీవి ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. అలాగే మనిషి కూడా నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. అప్పుడే తగిన వ్యాయామం లభించి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. అంకితభావంతో పనిచేసిన మనిషిలో అనవసరపు ఆలోచనలు ప్రవేశించవు. పనిలో ఆనందాన్ని ఆస్వాదించే అతడు కష్టసుఖాలకు అతీతంగా వ్యవహరిస్తాడు. 


చిత్తశుద్ధితో చేసే మంచి పనులకు దైవానుగ్రహం తప్పక ఉంటుంది. మంచి పనులంటే దానధర్మాలు, పరోపకారం. అనాథలకు, అభాగ్యులకు దానధర్మాలు చేస్తూ, వారి ఉన్నతికి కృషి చేసిన వ్యక్తి చిరస్మరణీయుడవుతాడు. పరోపకారం వల్ల మానసిక ఆనందంతో పాటు మనిషి జీవితం కూడా ధన్యమవుతుంది. 

~విశ్వనాథ రమ

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: పదకొండవ అధ్యాయం

విశ్వరూపసందర్శనయోగం:అర్జున ఉవాచ


అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః

సర్వే సహైవావనిపాలసంఘైః 

భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ

సహాస్మదీయైరపి యోధముఖ్యైః (26)


వక్త్రాణి తే త్వరమాణా విశంతి

దంష్ట్రాకరాలాని భయానకాని 

కేచిద్విలగ్నా దశనాంతరేషు

సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః (27)


ఎంతోమంది రాజులతోపాటు ఈ ధృతరాష్ట్రుడి పుత్రులు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అలాగే మనపక్షానికి చెందిన ప్రముఖయోధులూ వాడికోరలతో భయంకరాలైన నీ నోళ్ళలోకి వడివడిగా ప్రవేశిస్తున్నారు. వాళ్ళలో కొంతమంది నీ పళ్ళసందులో ఇరుక్కుపోయి పొడి అయిపోతున్న తలలతో కనిపిస్తున్నారు.

నిను నర్థింతును సత్యధర్మముల మన్నింపంగ న్యాయమ్ము గా

 నిను నర్థింతును సత్యధర్మముల మన్నింపంగ న్యాయమ్ము గా 


నినునెల్లప్పుడు సంచరింపగను సన్మార్గంబులన్ జూపుమా 


యనుమానించుట యేల నన్ను శివ న్యాయంబౌన లోకంబునన్ 


మనగానిమ్మిక నీదె భారమిక సాంబా ! అర్ధనారీశ్వరా !

అమర చైతన్యం"*

 *"అమర చైతన్యం"* 

*( శ్రీ రమణ మహర్షి బోధనలు )*



🕉🌞🌎🌙🌟🚩


*ప్రశ్న: నేను ఆత్మనే అయితే నాకెందుకు తెలియడం లేదు.*


*జవాబు: నీ ప్రస్తుత జ్ఞానము అహానికి సంబంధించినది. సాపేక్షికమైనది. సాపేక్షజ్ఞానానికి ద్రష్ట, దృశ్యము ఉండాలి. కాని ఆత్మజ్ఞానమునకు ద్రష్ట, దృశ్యము అవసరం లేదు. ఎందుకంటే అవి పూర్ణము. జ్ఞాపకం చేసుకోవడం కూడా సాపేక్షికమైనది. జ్ఞాపకం చేసుకునే వ్యక్తి, జ్ఞాపకం చేయబడే వస్తువు ఉండాలి. రెండవ వస్తువే లేనపుడు ఎవరు ఎవరిని గుర్తు చేసుకోవాలి. జ్ఞానానికి అజ్ఞానానికి అతీతమైనది ఆత్మ.*




*ప్రశ్న: నేను ఎంతవరకు ఆత్మ విచారం చేయాలి.*


*జవాబు: నీ చివరి సందేహం కూడా (తప్పు అభిప్రాయము) పొయ్యేంత వరకు చేయాలి. ఆత్మ సాక్షాత్కారం అయ్యేంత వరకు చెయ్యాలి.*


*సముద్రగర్భంలోనే ముత్యాలున్నాయి. వాటిని వెలికి తీయాలంటే సముద్రపు లోతుల్లోకి వెళ్ళాలి...... అలాగే ఆత్మకూడా నీలోపలికి, ఇంకాలోలోపలికి వెళితేనే, బాగా లోపలికి మునిగితేనే అనుభవానికి వస్తుంది.*

https://chat.whatsapp.com/I9GuM11QcSYCmHyQXHO5cQ?mode=ac_t

🕉🌞🌎🌙🌟🚩

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 *కర్మణా జాయతే భక్తిః,*

         *భక్త్యా జ్ఞానం ప్రజాయతే l*

         *జ్ఞానాత్ ప్రజాయతే ముక్తిః*

         *ఇతి శాస్త్రార్థ సంగ్రహః ll*

            

తా𝕝𝕝 *చిత్తశుద్ధితో చేసే సత్కర్మలవలన భక్తి కలుగుతుంది, నిష్కామభక్తి వలన జ్ఞానము కలుగుతుంది. ఆధ్యాత్మికజ్ఞానం వలన మోక్షము సిద్ధిస్తుంది. ఇది శాస్త్ర నిర్ణయము.*


 ✍️🌸🌹💐🙏

రాశి ఫలితాలు

 29-08-2025 శుక్రవారం రాశి ఫలితాలు


మేషం

సన్నిహితుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహ పరుస్తుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగమున చికాకులు తప్పవు.

---------------------------------------

వృషభం

ఆకస్మిక ధన లాభసూచనలున్నవి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సోదరులతో స్థిరస్థి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి పొందుతారు.

---------------------------------------

మిధునం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. అవసరానికి ఇతరులకు ధన సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

కర్కాటకం

ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందికి గురి అవుతారు. దూరప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.

---------------------------------------

సింహం

ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది ఋణగ్రస్థుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో చేతికందు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు .ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------

కన్య

సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు సానుకూలమవుతాయి.

---------------------------------------

తుల

చిన్న నాటి మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంబించి లాభాలు అందుకుంటారు. 

---------------------------------------

వృశ్చికం

గృహ నిర్మాణ పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఇంటాబయటా పరిస్థితుల్లు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారమున నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత ఇబ్బంది కలిగిస్తుంది.

---------------------------------------

ధనస్సు

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు పెరిగి నూతన రుణాలు చేస్తారు. బందు మిత్రులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యం తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

---------------------------------------

మకరం

నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్న నాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

కుంభం

వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ భారం పెరుగుతుంది. ఇంటా బయటా ఊహించని సమస్యలు కలుగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. సంతాన అనారోగ్యం విషయంలో జాగ్రతః వ్యవహరించాలి. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

---------------------------------------

మీనం

ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. ఆప్తులతో శుభాకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విద్యార్థులు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు స్వల్ప లాభలు అందుకుంటారు. దైవ చింతన పెరుగుతుంది.

---------------------------------------

నిజం

 *శ్రీ కాళహస్తి శ్రీ దక్షిణా మూర్తి అద్భుత అభిషేక దర్శనం*🙏☝️


🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹


                   *నిజం*


*ఎలుక రాతిది అయితే పూజిస్తాం, మూషిక రాజా అంటూ కీర్తిస్తాం, అదే ఎలుక ప్రాణాలతో మన ఇంట్లో తిరుగుతూ ఉంటే తరిమేస్తాం.*


*పాము రాతిది అయితే నాగరాజా అంటూ పూజలు చేస్తాం, పాలు పోస్తాం.. అదే పాము ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం .*

*తల్లిదండ్రులు ఫోటోల్లో ఉంటే దండవేసి దండం పెడతాం, ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో ఒదిలేస్తం .. బ్రతికున్నప్పుడు పట్టేడన్నం పెట్టడానికి ఒంతులు వేసుకుంటాము, చనిపోయాక పంచభక్ష్య పరమన్నాలు ఫోటోల ముందు పెట్టి తిను, తిను అంటూ ఏడుస్తాం.. కాదు, కాదు నటిస్తాం..*


*తోడబుట్టినోడు చనిపోతే ఈ రోజు దినం ఖర్చు నాది అని ఒకరు, పాడే ఖర్చు నాది అని ఇంకొకడు పోటీపడతారు.. అదే తోడబుట్టినోడు హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఈ రోజు హాస్పిటల్ బిల్లు నాది, నేను భరిస్తా అని ఒక్కడూ అనడు..*

*చనిపోయిన వాడికి ( శవానికి ) భుజాన్ని అందించడానికి పోటీ పడతాం, బ్రతికి ఉన్న వాడికి చేయూతను మాత్రం ఇవ్వం .*

*రాయిలో దైవత్వం వుందని తెలుసుకున్నాం . కానీ మనిషి లో మానవత్వాన్ని గుర్తించలేక పోతున్నాం . జీవం లేనివాటిపై భక్తి ఎందుకు..? ప్రాణంతో ఉంటే ద్వేషం ఎందుకు..? నాకైతే అర్ధం కావడం లేదు..*

*సాటివాడిపై ప్రేమని పంచలేని నువ్వు దేవుడిని ఏం పూజిస్తావ్ నేస్తమా... దేవుడు ఆలయంలోనే ఉంటాడనుకునేవాడు మూర్ఖుడు.. వాడు ఏనాటికీ దైవాన్ని చూడలేడు, ఆయన కృపకి పాత్రులు కాలేడు...*


🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹


*ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, ఆ పరమాత్ముడికి నైవేద్యం నివేదించడం కన్నా ఎన్నో రెట్లు గొప్పదని గ్రహించితే మంచిది*


🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹

28, ఆగస్టు 2025, గురువారం

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: పదకొండవ అధ్యాయం

విశ్వరూపసందర్శనయోగం:అర్జున ఉవాచ


నభఃస్పృశం దీప్తమనేకవర్ణం

వ్యాప్తాననం దీప్తవిశాలనేత్రమ్ 

దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా

ధృతిం న విందామి శమం చ విష్ణో (24)


దంష్ట్రాకరాలాని చ తే ముఖాని

దృష్ట్వైవ కాలానలసన్నిభాని 

దిశో న జానే న లభే చ శర్మ

ప్రసీద దేవేశ జగన్నివాస (25)


ఆకాశాన్ని అంటుతూ, అనేకరంగులతో ప్రకాశిస్తూ, నోళ్ళు విప్పి, ఉజ్జ్వల విశాల నేత్రాలతో వున్న నిన్ను చూసి ఎంతో భయపడిపోయిన నేను ధైర్యం, శాంతి పొందలేకపోతున్నాను. కోరలతో భయంకరంగా ప్రళయకాలంలోని అగ్నిలాగ కానవస్తున్న నీ ముఖాలు నాకు దిక్కుతోచకుండా చేశాయి. దేవేశా.. జగన్నివాసా.. దిగులు పడివున్న నన్ను అనుగ్రహించు.

చింత చిగురు...*

 ;

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀```ఆరోగ్య చింతలను తీర్చే…```



                *చింత చిగురు...*

                   ➖➖➖✍️

తింటే మీకే తెలుస్తుంది...,



```

సీజన్‌లో దొరికే చింత చిగురును ఆహారంలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. 


ఈ కాలంలో విరివిగా లభ్యమయ్యే చింతచిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. 



*చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 

*దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్‌గా పని చేస్తుంది. 

*ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో చింతచిగురు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. 

*ఈ చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతునొప్పి, మంట, వాపు తగ్గుతాయి. 

*యాంటీ ఇన్‌ఫ్లేమటరీ గుణాలు చింత చిగురులో ఉండటమే ఇందుకు కారణం. 


*కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. 

*జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. ఈ చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. 

*ఇవి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పటిష్ఠపరుస్తాయి. 


*తరచూ చింత చిగురును తింటే ఎముకలు ధృడత్వాన్ని సంతరించుకుంటాయి. 

*థైరాయిడ్‌తో బాధపడేవారు చింత చిగురును తమ ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

*గుండె జబ్బులను చింత చిగురు దరిచేరనీయదు. 

*శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అవసరమైన పోషకాలను అందించడమే గాక, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. 

*చింత చిగురును పేస్ట్‌లా చేసి కీళ్ళపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

జగన్నాథ స్వామి ఆలయం

 🕉 మన గుడి : నెం 1217


⚜  ఒడిస్సా : పూరీ 


⚜  శ్రీ క్షేత్రం - జగన్నాథ స్వామి ఆలయం



💠 మన భారతదేశంలో ఎన్నో ప్రాముఖ్యం , విశిష్టత , అద్భుతం కలిగిన దేవాలయాలు ఎన్నో వున్నాయి. అలాంటి దేవాలయాలు జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించాలని అంటుంటారు. అలాంటి మహా అద్భుత ఆలయాలలో ఎంతో ప్రసిద్ధిచెందిన పూరీ జగన్నాథ ఆలయం.



💠 జగన్నాథ ఆలయాన్ని శ్రీకృష్ణుడు తన సోదరుడు మరియు సోదరితో జగన్నాథుడిగా ప్రధాన దైవంగా నిర్మించినప్పుడు, పూరీని ఒకప్పుడు పురుషోత్తమ పురి , పురుషోత్తమ క్షేత్ర , పురుషోత్తమ ధర్మ , నీలాచల , నీలాద్రి , శ్రీక్షేత్ర , శంఖక్షేత్ర వంటి అనేక పేర్లతో పిలేచేవారు.



🔆 స్థలపురాణo 


💠 కృష్ణుడి అవతారం అయిన జగన్నాథుడు.. ఒకనాడు ఒక అత్తిచెట్టు కింద ఇంద్రనీలం రూపంలో మెరుస్తూ ధర్మరాజుకు కనిపించాడు.

అది చూసిన అతను... ఒక విలువైన రాయి అని భావించి.. నేలమాళిగలో ఎవరికంటా పడకుండా నిక్షిప్తం చేశాడు.


💠 ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్నుడు అనే రాజు దానిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఆశతో వెదకడం మొదలుపెడతాడు.

అయితే అది ఎక్కడుందో కనిపెట్టలేక భూమంతా తవ్వి వెదికాడు. 

అయినా అధి లభించకపోవడంతో నిరాశతో నీరసించిపోతాడు.

అక్కడే కొద్దిసేపటివరకు సేద తీర్చుకోవాలని నిద్రపోతాడు.


💠 ఇంద్రద్యుమ్నుడు నిద్రిస్తున్న సమయంలో అతని కలలోకి విష్ణువు కనిపించి నదీ తీరానికి ఒక కొయ్య కొట్టుకు వస్తుందనీ దాన్ని విగ్రహాలుగా మలచమనీ ఆజ్ఞాపించాడట. 

కానీ అలా నదీతీరంలో 

లభ్యమైన దారువును విగ్రహాలుగా మలిచేందుకు ఎవరూ ముందుకు రాలేదట. 


💠 అప్పుడు దేవశిల్పి విశ్వకర్మ రాజువద్దకు మారువేషంలో వచ్చి ఆ కొయ్యను తాను విగ్రహాలుగా మలచగలనన్నాడట. 

కానీ తాను తలుపులు మూసుకుని ఈ పని చేస్తాననీ తన పనికి మధ్యలో ఆటంకం కలిగించకూడదనీ షరతు పెడతాడు. 


💠 కానీ పదిహేను రోజుల తర్వాత... ఉత్సుకతను ఆపుకోలేని రాజు తలుపులు “తెరిపించాడట. అప్పటికి విగ్రహాల నిర్మాణం పూర్తికాలేదు. 

అందువల్లే కృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలకు చేతులు వుండవు.


💠 దాంతో వాటిని అలాగే ప్రతిష్ఠించారనీ ఇప్పటికీ జగన్నాధుడు అదే రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడనీ స్థలపురాణం


💠 విమల ఆలయం (బిమల ఆలయం) శక్తిపీఠాలలో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది . 

ఇది ఆలయ సముదాయంలోని రోహిణి కుండ్ సమీపంలో ఉంది . జగన్నాథుడికి సమర్పించిన ఆహారాన్ని విమల దేవతకు సమర్పించే వరకు దానిని మహాప్రసాదంగా పరిగణించరు.


🔆 రథయాత్ర


💠 ద్వాపరయుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ యాత్ర జరుపుతారని ఒక కథనం. 

ద్వారకకు వెళ్లాలన్న సుభద్రాదేవి కోరిక తీర్చే ముచ్చటే ఈ రథయాత్ర అని మరికొందరు చెబుతారు. 


💠 ఇక గుండీచాదేవి మందిరం విషయానికొస్తే... 

పూరీ జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన ఇంద్రద్యుమ్న మహారాజు భార్య గుండీచా. ఆవిడ జగన్నాథ బలభద్రుల కోసం ప్రధానాలయానికి 3 కి.మీ. దూరంలో ఒక మందిరం నిర్మించింది. అదే గుండీచా ఆలయం. 


💠 రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకువెళ్లిన మూడు విగ్రహాలనూ ఈ గుడిలోని రత్నసింహాసనంపై కూర్చుండబెట్టి గుండీచాదేవి పేరిట ఆతిధ్యం ఇస్తారు. ఒకరకంగా చెప్పాలంటే గుండీచా మందిరం జగన్నాధుడి అతిథిగృహం అన్నమాట!


💠 ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు పూరీ జగన్నాథాలయం. 


💠 సుభద్రా బలభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. 

అందుకే జగన్నాథుడి రతయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు.


💠 జగన్నాథుని కన్నుల పండువగా రథయాత్రను నిర్వహిస్తారు.

ఈ యాత్రను ఆషాడశుక్ల విదియనాడు ప్రారంభం అవుతుంది. అంటే జూన్ లేదా జూలై నెలల్లో జరుగుతుంది.


💠 శ్రీ జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 

బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. 

సుభద్ర రథాన్ని దర్పదళన అంటారు.


💠 ఇక్కడ భగవంతుడికి 56 రకాల ప్రసాదాలు కట్టెల పొయ్యి మీద వండి భగవంతుడికి ప్రతినిత్యం నివేదిస్తారు. 

ఆ ప్రసాదాలన్నీ నిలువునా పేర్చిన 6 కుండలలో వండుతారు, కట్టెల పొయ్యికి దగ్గరగా ఉండే కుండలో ఎంత నాణ్యతతో ప్రసాదం తయారు అవుతుందో చివరి కుండలో కూడా అంతే నాణ్యతతో ప్రసాదం తయారవడం ఇక్కడి భగవంతుడి లీలగా పరిగణిస్తారు.


💠 అలా నివేదించబడిన ప్రసాదాలను ఆనంద్ బజార్ అని ప్రదేశంలో భక్తుల కోసం సరసమైన ధరలకు విక్రయిస్తారు. 

అలా భగవంతుడికి నివేదించి భక్తులకు వితరణ చేసే ప్రసాదాన్ని " అబడా" అంటారు.

పూరీ క్షేత్రంలో భగవంతుడి దర్శనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో దానికి సరి సమానంగా ఈ ప్రసాదం స్వీకారానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది.



💠 ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరంలో ఉంది. 



రచన

©️ Santosh kumar

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శాంతి పర్వము ప్రథమాశ్వాసము*


*482 వ రోజు*


*సృంజయుడి వృత్తాంత*


తరువాత కథను నారదుడు చెప్పసాగాడు " ధర్మరాజా ! అలా నేను పర్వతుడితో కొంతకాలం సృంజయుడి ఇంట్లో ఉండి కొన్నిసంవత్సరాల అనంతరం తిరిగి స్వర్గలోకం పోవానని అనుకున్నాము. వెళ్ళే సమయాన మా పట్ల గౌరవాభిమానాలు చూపించిన సృంజయుడికి ఏదైనా మేలు చేయాలన్న తలంపుతో నేను అతడికి దేవతలకన్నా ఉన్నతుడైన కుమారుడు కలగాలని వరం ఇచ్చాను. పర్వతుడు సృంజయుడికి కలుగబోయే కుమారుడి వలన ఇంద్రుడికి ఏదైనా కీడు కలుగకలదన్న తలంపుతో " సృంజయా ! ఆ కుమారుడు అర్ధాయుష్కుడు కాగలడు " అన్నాడు. అమాటలకు నాకు కోపంవచ్చి " సృంజయా ! ఆ కుమారుడిని నీకు చేతనైనంత కాపాడుకో. నీ శక్తికి మించి నీకుమారుడికి మరణం సంభవించిన వెంటనే నన్ను తలచిన నేను వచ్చి అతడికి ప్రాణదానం చేస్తాను. అలాగే నేను నీకు ఇంకొక వరం ఇస్తున్నాను. నీ కుమారుడి శరీరంలోని విసర్జితాలు అన్నీ స్వర్ణ మయం ఔతాయి. అందు వలన అతడు సువర్ణష్టీవి అని పిలువబడతాడు " అని అన్నాను. నా మాటలకు సృంజయుడు ఆనందపడ్డాడు. తరువాత మేము వెళ్ళి పోయాము. నా వరంవలన సృంజయుడికి ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడి మలమూత్రములు, శ్వేదం మిగిలిన విసర్జితాలన్నీ బంగారంగా మారసాగాయి. సృంజయుడి ఇల్లంతా బంగారంతో నిండిపోయింది. ఈ విషయాన్ని పసికట్టిన కొందరు దొంగలు సువర్ణష్టీవివిని అపహరించి తీసుకు వెళ్ళి అతడి నోట్లో గుడ్డలుకుక్కి సమీపంలోని అడవిలోకి తీసుకు వెళ్ళారు. అతడి శరీరమంతా శోధించి ఎక్కడా సువర్ణం లభ్యంకాక వారు సువర్ణష్టీవిని చంపి అక్కడే పారవేసి వెళ్ళారు. సృంజయుడు తన కుమారుడు కనిపించక అంతటా వెతికి చివరకు నారదుడిని తలచుకున్నాడు. నేను అతడి వద్దకు వెళ్ళి జరిగిన విషయం తెలుసుకుని సువర్ణష్టీవి మరణ వృత్తాంతం చెప్పాను. సృంజయుడు సువర్ణష్టీవి మరణానికి ఎంతో దుఃఖించాడు. నేను " సృంజయా ! నీ కుమారుడు యమలోకంలో ఉన్నాడు. నీ కుమారుడిని నేను తీసుకు వస్తాను " అని చెప్పి సువర్ణష్టీవిని పునరుజ్జీవితుడిని చేసాను. సృంజయుడు చాలా సంతోషించాడు. నాను సృంజయుడితో " సృంజయా ! ఇంద్రుడు నీ కుమారుడిని చంపడానికి ఎదురు చూస్తున్నాడు. జాగ్రత్తగా ఉండు " అని చెప్పి వెళ్ళాను. దేవేంద్రుడికి సువర్ణష్టీవి వలన తనకు ఆపద కలుగకలదన్న భయం పట్టుకుంది. ఒకరోజు సృంజయుడు తన భార్యాబిడ్డలతో గంగా నదీతీరాన విహరిస్తున్న సమయంలో ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని వ్యాఘ్ర రూపంలో అతడి మీద ప్రయోగించాడు. వజ్రాయుధం తగిన సమయం చూసి వ్యాఘ్రరూపం ధరించి సువర్ణష్టీవిని చీల్చిచంపి మాయం అయింది. సువర్ణష్టీవి మరణానికి దుఃఖిస్తూ సృంజయుడు నన్ను తలచుకున్నాడు. నేను వెళ్ళి సువర్ణష్టీవిని సజీవుడిని చేసి తిరిగి వెళ్ళిపోయాను. సువర్ణష్టీవి దీర్ఘాయుష్కుడై వేలాది సంవత్సరములు రాజ్యపాలన చేసాడు.ధర్మరాజా ! నీవు కూడా నీ పట్టు వదిలి రాజ్యభారం వహించు.

*వ్యాసుడి హితవు*


నారదుడి మాటలు విన్న తరువాత కూడా ధర్మరాజు మౌనం వీడలేదు. అది చూసి వ్యాసుడు " ధర్మజా ! క్షత్రియులకు రాజ్యపాలన కంటే వేరే ధర్మంకలదా ! అందువలన వేదవిహితమైన విప్రకర్మలు ఆచరించబడతాయి. విప్రకర్మలు ఆచరించని ఎడల సమాజముకు నష్టం వాటిల్లగలదు. వేదవిహిత విప్రకర్మలు ఆచరించని ఎడల రాజుకు పాపంసంక్రమించి ఉత్తమలోక ప్రాప్తికి ఆటంకంకలుగుతుంది. కనుక ప్రజాపాలనయే నీధర్మం " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

పాదములతో తాకరాదు.*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝      *పాదాభ్యాం న స్పృశేత్*

          *అగ్నిం గురు బ్రాహ్మణమేవ చ|*

          *నైవ గాం న కుమారీం చ*

         *న వృద్ధం న శిశుం తథా||*


తా𝕝𝕝  *అగ్నిని, గురువును, బ్రాహ్మణుని, ఆవును, కన్యను,వృద్ధుని, శిశువును పాదములతో తాకరాదు.*


✍️🌸🌹💐🙏

గురువారం🪷* *🌹28 ఆగస్టు 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🪷గురువారం🪷* 

  *🌹28 ఆగస్టు 2025🌹* 

     *దృగ్గణిత పంచాంగం* 

                  

*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్షఋతౌః* 

*భాద్రపద మాసం - శుక్లపక్షం*


*తిథి  : పంచమి* సా 05.56 వరకు ఉపరి *షష్ఠి*

*వారం    : గురువారం* ( బృహస్పతివాసరే )

*నక్షత్రం   : చిత్త* ఉ 08.43 వరకు ఉపరి *స్వాతి*


           *ఈనాటి పర్వం*

      *ఋషి పంచమి వ్రతం*


*యోగం : శుక్ల* మ 01.18 వరకు ఉపరి *బ్రహ్మ*

*కరణం  : బాలువ* సా 05.56 *కౌలువ పూర్తిగా రాత్రంతా*


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 11.00 - 12.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *రా 01.46 - 03.34*

అభిజిత్ కాలం  : *ప 11.43 - 12.33*

*వర్జ్యం      : మ 03.00 - 04.48*

*దుర్ముహూర్తం  : ఉ 10.03 - 10.53 మ 03.03 - 03.53*

*రాహు కాలం   : మ 01.42 - 03.16*

గుళికకాళం       : *ఉ 09.01 - 10.35*

యమగండం     : *ఉ 05.54 - 07.27*

సూర్యరాశి : *సింహం*              

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 06.02* 

సూర్యాస్తమయం :*సా 06.33*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.54 - 08.24*

సంగవ కాలం         :     *08.24 - 10.53*

మధ్యాహ్న కాలం    :     *10.53 - 01.23*

అపరాహ్న కాలం    : *మ 01.23 - 03.53*


*ఆబ్ధికం తిధి         : భాద్రపద శుద్ధ పంచమి*

సాయంకాలం        :*సా 03.53 - 06.23*

ప్రదోష కాలం         :  *సా 06.23 - 08.41*

రాత్రి కాలం           :*రా 08.41 - 11.46*

నిశీధి కాలం          :*రా 11.46 - 12.32*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.22 - 05.08*

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*శ్రీదత్త నవరత్నమాలికా స్తోత్రం*


*ఏకవస్తుపరిబోధయితారం*

 *దత్తదేవమనిశం కలయామి*


         *జై దత్తాత్రేయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


           🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹